breaking news
room number 50
-
పార్లమెంట్ భవన్లో అగ్నిప్రమాదం
-
పార్లమెంట్ భవన్లో అగ్నిప్రమాదం
ఢిల్లీ: పార్లమెంట్ భవన్లో అగ్నిప్రమాదం సంభవించడం కలకలం రేపింది. మంగళవారం రాత్రి పార్లమెంట్ భవన్ రూమ్ నెంబర్ 50లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. 12 ఫైరింజన్ల సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని కొన్ని నిమిషాల్లో మంటలను అదుపులోకి తెచ్చారు. దీనిపై అధికారులను మీడియా సంప్రదించగా.. సాంకేతిక సమస్య కారణంగానే మంటలు చెలరేగి ఉండొచ్చునని వారు అభిప్రాయపడుతున్నారు. అగ్ని మాపక సిబ్బంది త్వరగా రావడంతో ప్రమాదం తప్పిందని తెలిపారు. మరుసటిరోజు కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెట్టునున్న నేపథ్యంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.