breaking news
Ritu Chowdary
-
బిగ్బాస్ కిర్రాక్ సీత, రీతూపై సంచలన ఆరోపణలు చేసిన గౌతమి
సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సర్, సినీ నటుడు ధర్మమహేశ్ సతీమణి గౌతమి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. బిగ్బాస్ రీతూ చౌదరి రాత్రి సమయంలో తన భర్తతో పాటుగా ఫ్లాట్కు వచ్చేదని ఆమె చెప్పిన విషయం తెలిసిందే. అలాంటి సమయంలో వాళ్లు కలిసి ఏం చేస్తారో చెప్పలేనని పేర్కొంది. అయితే, తాజాగా బిగ్బాస్-8 కంటెస్టెంట్, బేబీ సినిమా ఫేమ్ కిరాక్ సీత గురించి ఆమె సంచలన ఆరోపణలు చేసింది.డ్రింకర్ సాయి సినిమాలో తన భర్త ధర్మమహేశ్తో కిరాక్ సీత, రీతూ చౌదరి కలిసి నటించినట్లు గౌతమి గుర్తుచేసింది. ఆపై ఈ మూవీలో హీరోయిన్గా కనిపించిన ఐశ్వర్య శర్మ కూడా ఒక పనికిమాలిన వ్యక్తి అంటూ చెప్పుకొచ్చింది. అయితే, ఈ ముగ్గురు తన భర్తకు చాలా దగ్గరగా ఉంటారని చెప్పింది. ఈ క్రమంలో కిరాక్ సీత గురించి గౌతమి ఇలా చెప్పింది. ' నాకు ఇప్పటికే 15 రెస్టారెంట్లు ఉన్నాయి. 16వ బ్రాంచ్ని గౌలిదొడ్డి వద్ద ఓపెనింగ్ కోసం ఏర్పాట్లు చేసుకుంటున్నాను. ఆ సమయంలో ఐపీఎల్ ఉంది.. ఓపెనింగ్ కోసం ఒక క్రికెటర్ను తీసుకురావలని నేను చూస్తున్నాను. ఒక పెద్ద క్రికెటర్ను కూడా కలిశాను. కానీ, కొన్ని కారణాల వల్ల కుదరలేదు. అయితే, సడెన్గా కిరాక్ సీత నాకు మెసేజ్ చేసింది. నువ్వు చేయలేని పని నేను చేస్తానంటూ చెప్పుకొచ్చింది. నీకు కావాలంటే చెప్పు ఎవరినైనా ఒక సెలబ్రిటీని సెట్ చేస్తానని మెసేజ్ పెట్టింది. నా వ్యాపారంలోకి నా ప్రమేయం లేకుండా సీత రావడం ఏంటి.. ఆమె వెనుక నా భర్త ఉన్నాడని అర్థం అయింది. ఒక క్రికెటర్ కోసం వెతుకుతున్నట్లు నీకు ఎలా తెలుసు అంటే దానికి సమాధానం చెప్పదు. నీవు రెస్టారెంట్ ఎలా ఓపెన్ చేస్తావో చూస్తాం అంటూ సీత వార్నింగ్ ఇచ్చింది. 15 రెస్టారెంట్స్ నడుపుతున్నాను.. నాకే వ్యాపారం గురించి చెబుతుంది. అసలు సీతతో నాకు పరిచయమే లేదు. కానీ, నాకు మెసేజ్లు చేయడం ఎందుకు.. మా ఇంటికి రావడం ఎందుకు..?' అని ఆమె ప్రశ్నించింది. అయితే, కిరాక్ సీత, ధర్మమహేశ్ మధ్య ఎలాంటి బంధం ఉందో తనకు తెలియదని ఆమె చెప్పింది.13 ఏళ్ల బంధం.. రీతూ వల్ల పోయిందిఒక ఇంటర్వ్యూలో గౌతమి మాట్లాడుతూ బిగ్బాస్ రీతూ చౌదరి గురించి మరోసారి పలు వ్యాఖ్యలు చేసింది.. 'నేను, ధర్మమహేశ్ 13 ఏళ్లు ప్రేమించుకున్నాం. 2019లో పెళ్లి చేసుకున్నాం. అయితే, మా బంధానికి రీతూ చౌదరి అడ్డుకట్ట వేసింది. పెళ్లి తర్వాత చాలా అన్యోన్యంగా ఉన్నాం. అయితే, 2023లో నేను గర్భం దాల్చాను. దీంతో కాస్త బరువు పెరిగిపోయాను. దీంతో దర్మమహేశ్కు నేను నచ్చలేదు. నువ్వు చాలా బరువు పెరిగిపోయావు.. నీపై నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదనే విధంగా నా ముఖం మీద చెప్పేవాడు.. అలా చెప్పేసరికి తట్టుకోలేకపోయాను. సరిగ్గా అలాంటి సమయంలోనే నా భర్తకు రీతూ చౌదరి పరిచయమయ్యింది. మొదట్లో అప్పుడప్పుడు మాత్రమే మా ఫ్లాట్కు వచ్చేది. తర్వాత రెగ్యూలర్గా రావడం జరిగేది.. ఒక్కోసారి నన్ను కూడా ఇంటి నుంచి బయటకు పంపాడు. ముఖ్యంగా రీతు చౌదరి నా పర్సనల్ లైప్లో ఇన్వాల్వ్మెంట్ అయింది. ఎక్కువగా రాత్రి సమయంలో మాత్రమే ఆమె మా ఫ్లాట్కి వచ్చేది. అసలు నా ఫ్లాట్కి రావాల్సిన అవసరం ఆమెకు ఏముంది..? అంటూ గౌతమి ప్రశ్నించింది. -
నా భర్తతో బిగ్బాస్ రీతూ ఎఫైర్.. వీడియో విడుదల చేసిన నటుడి భార్య
సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సర్ గౌతమి(31) కొద్దిరోజుల క్రితమే తన భర్త సినీ నటుడు ధర్మమహేశ్(30) వరకట్నం కోసం వేధిస్తున్నాడని, మరో యువతితో సంబంధం కొనసాగిస్తున్నాడని పోలీసులను ఆశ్రయించిన విషయం తెలిసిందే. అయితే, ఆ సమయంలో ఆమె ఆ యువతి పేరును చెప్పలేదు. కానీ, ఇప్పుడు కొన్ని వీడియోలు, ఫోటోలు విడుదల చేసి షాక్ ఇచ్చింది. అందులో బిగ్బాస్ రీతూ చౌదరి కనిపించడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. తన భర్తతో రిలేషన్లో ఉండింది రీతూ చౌదరి అనే అర్థం వచ్చేలా వీడియో, ఫోటోలను ఆమె పంచుకుంది. 2023 నాటి సీసీ కెమెరా ఫోటోలు, వీడియోలను గౌతమి షేర్ చేసింది. రీతూ చౌదరి ప్రస్తుతం బిగ్బాస్-9లో ఉన్న విషయం తెలిసిందే.గౌతమి 2023లో ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు బిగ్బాస్ ఫేమ్ రీతూ చౌదరి వల్ల తన భర్త ధర్మమహేశ్తో గొడవ పడినట్లు కొన్ని సాక్ష్యాలను ఆమె షేర్ చేసింది. రీతూ గురించి అడగటం వల్లే తనను దూరం పెడుతున్నావ్ అంటూ ఆమె పంపిన మెసేజ్లు ఉన్నాయి. ఆపై రీతూ చౌదరి, ధర్మమహేశ్ కలిసి ఒకే ఫ్లాట్లోకి వెళ్లిన వీడియోలను ఆమె విడుదల చేసింది. అయితే, వారిద్దరి మధ్య నిజంగా అక్రమ సంబంధం ఉందా.., లేక డ్రగ్స్ తీసుకునేందుకే వారిద్దరూ కలిసారా అనే చర్చ మొదలైంది. అయితే, ఒక యువతి వల్ల తన జీవితం నరకంలోకి నెట్టవేయబడిందని గౌతమి చెప్పింది. తన కుమారుడి సంతోషంతో పాటు తన జీవితాన్ని ఆ యువతి లాగేసుకుంది అంటూ ఆమె ఒక నోట్ రాయడంతో రీతూ, ధర్మ ఇద్దరి మధ్య రిలేషన్ నిజమే అనేలా అర్థం వస్తుంది.సింధూరం, డ్రింకర్ సాయి సినిమాల్లో నటించిన ధర్మ కాస్త గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే, 2019లో గౌతమిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2023లో వారికి బాబు జన్మించారు. అయితే, కొద్దిరోజుల క్రితం గౌతమి తన భర్త గురించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ సమయంలో ధర్మ గురించి ఆమె ఇలా చెప్పింది. కొంత కాలంగా ధర్మమహేశ్ జల్సాలు, షికారులకు అలవాటు పడి భార్య, కుమారుడిని పట్టించుకోవడం లేదని.. ఓ యువతితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని పోలీసుల ఫిర్యాదులో ఆమె పేర్కొంది. వారిద్దరి రిలేషన్పై నిలదీస్తే అదనపు కట్నం కావాలంటూ వేధిస్తున్నాడని ఫిర్యాదులో తెలిపింది. అయితే, ఇప్పుడు బిగ్బాస్ రీతూ చౌదరి తన భర్తతో కలిసి అర్ధరాత్రి కలిసి ఉన్న ఫోటోలు, వీడియోలను ఆమె విడుదల చేసింది. దీంతో సోషల్మీడియాలో అవి పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. View this post on Instagram A post shared by Gauthu ch (@gautamy_chowdary) -
బిగ్బాస్లోకి పాపులర్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్
కామెడీ షో జబర్దస్త్ నటి రీతూ చౌదరి బిగ్బాస్-9లో ఎంట్రీ ఇవ్వనుంది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా ఆమెకు భారీగానే ఫాలోవర్స్ ఉన్నారు. ఎప్పటికప్పుడు గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ ఫ్యాన్స్ను షేక్ చేస్తుంది ఈ బ్యూటీ.. బిగ్బాస్ సెప్టెంబర్ 7న ప్రారంభం కానుంది. ఇప్పటికే కంటెస్టెంట్స్ లిస్ట్ రెడీ అయిపోయింది. అందులో రీతూ చౌదరి ఉందని దాదాపు ఖాయమైంది.రీతూ చౌదరి గతంలో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి పోలీసుల విచారణ కూడా ఎదుర్కొంది. ఆపై ఏకంగా రూ. 700 కోట్ల ల్యాండ్ స్కామ్లో ఆమె పాత్ర కూడా ఉందంటూ రూమర్స్ వచ్చాయి. అయితే, అందులో ఎలాంటి నిజం లేదని కావాలనే కొందరు తన పేరును ఇందులోకి లాగుతున్నారని చెప్పుకొచ్చింది. అంతడబ్బులు తన వద్ద ఉంటే ఇలాంటి కష్టాలు ఎందుకు పడుతానంటూ పేర్కొంది. అయితే, బిగ్బాస్ ద్వారా తనపై వచ్చిన నెగటివిటిని కాస్త అయినా తగ్గించుకోవచ్చని ఆమె హౌస్లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు సమాచారం.సుమారు రెండేళ్ల క్రితం తన తండ్రి మరణంతో రితూ చౌదరినే తన కుటంబానికి పెద్ద దిక్కు అయింది. పలు టీవీ కార్యక్రమాల్లో పాల్గొంటూ సంపాదన మొదలుపెట్టింది. ఆపై సోషల్మీడియా ద్వారా కూడా తన ఫ్యామిలీ కోసం కష్టపడుతుండటంతో ఆమె గురించి తెలిసినవాళ్లు మాత్రం ఫ్యాన్స్ అయిపోయారు. అయితే, బిగ్బాస్9 ద్వారా మరికొందరి ప్రేక్షకుల ప్రేమను గెలవచ్చు అనే రితూ చౌదరి ఎంట్రీ ఇస్తున్నట్లు సమాచారం. View this post on Instagram A post shared by Rithu_chowdary (@rithu_chowdhary) -
చీరలో రీతూ చౌదరి ఒయ్యారాలు (ఫొటోలు)
-
యంగ్ హీరోతో రీతూ చౌదరి 'న్యూ బిగినింగ్' (ఫొటోలు)