breaking news
Risiteswari
-
బాధ్యతలు చేపట్టిన ఉదయలక్ష్మి
గుంటూరు: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(ఏఎన్యూ) ఇంచార్జి వైస్ ఛాన్స్లర్ గా ఏపీ సాంకేతిక విద్య, కళాశాల విద్య కమిషనర్ బి. ఉదయలక్ష్మి గురువారం బాధ్యతలు చేపట్టారు. ఉదయలక్ష్మిని ఏఎన్యూ ఇన్చార్జి వీసీగా నియమిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. రిషితేశ్వరి ఆత్మహత్య కేసు నేపథ్యంలో నాగార్జున యూనివర్సిటీ ఇన్చార్జి బాధ్యతల నుంచి ప్రొఫెసర్ సాంబశివరావును ప్రభుత్వం తొలగించడమే కాకుండా.. ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రిన్సిపాల్ బాబూరావును డిస్మిస్ చేసిన సంగతి తెలిసిందే. -
ఏఎన్యూ ఇన్ఛార్జి వీసీగా ఉదయలక్ష్మి
హైదరాబాద్: ర్యాగింగ్కు బలైన రిషితేశ్వరి ఉదంతంతో ఒక్కసారిగా వార్తల్లోకొచ్చిన ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఇన్ఛార్జి బాధ్యతల నుంచి ప్రొఫెసర్ సాంబశివరావును ప్రభుత్వం తప్పించింది. ఆయన స్థానంలో.. కొత్తగా.. సాంకేతిక విద్యా కమిషనర్ ఉదయలక్ష్మికి ఇన్ఛార్జి వీసీగా బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉదయలక్ష్మికి ఉత్తర్వులు జారీ చేసింది.