breaking news
Reza Aslan
-
అఘోరాలపై చిత్రం.. ఇండో అమెరికన్ల వ్యతిరేకత
వాషింగ్టన్: హిందూధర్మ సిద్ధాంతాన్ని వేలెత్తిచూపుతూ అంతర్జాతీయ చానెల్ సీఎన్ఎన్ అమెరికాలో అఘోరాలపై ప్రసారం చేసిన డాక్యుమెంటరీపై భారతీయ అమెరికన్లు వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఆదివారం దాదాపు 600 మందికి పైగా ఇండియన్ అమెరికన్స్ చికాగోలోని సీఎన్ఎన్ కార్యాలయం ఎదుట నిరసన తెలియజేశారు. రేజా అస్లాన్ అనే దర్శకుడు చిత్రించిన 'బిలీవర్' డాక్యుమెంటరీలో హిందు ధర్మశాస్త్ర గౌరవానికి భంగం కలిగేలా సన్నివేశాలు ఉన్నాయని నిరసనకారులు చెప్పారు. దాదాపు 25 లక్షల మంది భారతీయులు అమెరికాలో ప్రశాంతంగా జీవిస్తున్నారని, అస్లాన్ అనే దర్శకుడు హిందూఇజాన్ని తప్పుగా చూపుతూ ఓ డాక్యుమెంటరీ చేశారని విశ్వహిందూ పరిషత్ ఆఫ్ అమెరికా(వీహెచ్పీఏ) అధ్యక్షుడు శాంకాంత్ సేత్ అన్నారు. బిలీవర్ను ప్రసారం చేయెద్దని గతంలోనే సీఎన్ఎన్ను కోరినట్లు వెల్లడించారు. తమ మాటలు ఖాతరు చేయకుండా డాక్యుమెంటరీని ప్రసారం చేసి సీఎన్ఎన్ ఘోరమైన పొరబాటు చేసిందని చెప్పారు. అస్లాన్ వారణాసిలోని అఘోరాలను కలిసిన తర్వాతే ఈ డాక్యుమెంటరీని చిత్రించామని చెబుతున్నారని అన్నారు. కానీ ఆయన కలిసింది అతి కొద్దిమందినేనని చెప్పారు. యోగా, స్పిరిచ్యూవాలిటీ లాంటి గొప్ప విద్యలను ప్రపంచానికి అందించిన హిందూఇజంపై అస్లాన్ ఇలాంటి షో ఎందుకు చేశారో తనకు అర్ధంకావడం లేదని అన్నారు. డాక్యుమెంటరీకి సంబంధించిన కొన్ని కరపత్రాలను నిరసనకారులకు అందజేశారు. కాగా, భారతీయ అమెరికన్ల నిరసనలపై స్పందించిన దర్శకుడు అస్లాన్.. తాను చిత్రించిన డాక్యుమెంటరీ హిందూఇజంపై కాదని, అఘోరాలు వాళ్లు చేసే దారుణమైన ఆచారాల గురించని చెప్పారు. అయితే, డాక్యుమెంటరీలో కులవివక్షపై చూపిన కొన్ని దృశ్యాలు కొంతమందికి బాధ కలిగించి ఉండొచ్చని అన్నారు. -
హిందూ అమెరికన్ల ఆగ్రహం
అఘోరాలపై అసత్య కథనాన్ని ప్రచారం చేశారని సీఎన్ఎన్పై మండిపాటు వాషింగ్టన్: ప్రముఖ వార్తా సంస్థ సీఎన్ఎన్పై అమెరికాలోని హిందువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎన్ఎన్ చానెల్లో ఆదివారం ప్రసారమైన ‘బిలీవర్ విత్ రెజా అస్లాన్’ అనే ఆరు ఎపిసోడ్ల కార్యక్రమంలో అఘోరాల గురించి అసత్యాలు ప్రసారం చేశారని.. అది హిందువుల మనోభావాలకు వ్యతిరేకంగా ఉందని మండిపడ్డారు. ప్రముఖ భారత అమెరికన్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారుడు శలభ్ కుమార్ ఈ కథనంపై తీవ్రంగా మండిపడ్డారు. ‘హిందూయిజంపై జరుగుతున్న దాడి ఇది. అమెరికాలోని మెజారిటీ భారతీయులు, హిందువులు గత ఎన్నికల్లో ట్రంప్కు మద్దతు తెలిపినందుకు ప్రతీకారంగానే ఉద్దేశపూర్వకంగానే హిందూత్వంపై దాడిచేస్తున్నారు’ అని ట్విటర్ వేదికగా విమర్శించారు. అమెరికాలోని పలు హిందూ సంస్థలు, వ్యక్తులు కుమార్ వ్యాఖ్యలకు మద్దతు తెలపాయి. ‘ఇటీవల అమెరికాలోని మైనారిటీల (భారతీయులు)పై దాడులు జరగుతున్న సమయంలో ఇలాంటి విద్వేషపూరిత, అసత్య కథనాలను ప్రసారం చేయటం మరింత ఘర్షణకు దారితీస్తాయి’ అని కాలిఫోర్నియా హిందూ సమాజం నేత ఖండేరావ్ కాంద్ ఆవేదన వ్యక్తం చేశారు. యూఎస్ ఇండియా పొలిటికల్ యాక్షన్ కమిటీ చైర్మన్ సంజయ్ పురీ కూడా ఓ ప్రకటనలో ఈ కథనాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ కార్యక్రమ ప్రసారాన్ని వెంటనే నిలిపేయాలని ఆయన సీఎన్ఎన్ను కోరారు.