-
మావోయిస్టు ఉద్యమం.. ఆసక్తికర సమాచారం
న్యూఢిల్లీ : దేశంలో వామపక్ష తీవ్రవాదానికి సంబంధించి ఇటీవల వెల్లడైన సమాచారం చర్చనీయాంశమైంది. మావోయిస్టు ఉద్యమకారులకు గట్టి పట్టున్న ‘రెడ్ కారిడార్’ క్రమంగా కుచించుకుపోతున్నదని, ఒకప్పుడు 100కుపైగా జిల్లాలను ప్రభావితం చేసిన ఉద్యమం.. నేడు 58 జిల్లాలకు మాత్రమే పరిమితమైందని సీఆర్పీఎఫ్ ధృవీకరించిన నివేదికలో తేలింది. డ్రోన్ల వంటి ఆధునిక పరికరాలు, రియల్టైమ్ ఇంటెలిజెన్స్తో చేపట్టే ప్రతివ్యూహాలు, పగలూ, రాత్రి తేడాలేకుండా సాగించిన ఆపరేషన్లు, ఇన్ఫార్మర్ వ్యవస్థను బలోపేతం చేసుకుంటూ టాప్ లీడర్లను టార్గెట్ చేయడం.. తదితర వ్యూహాలతో బలగాలు సమిష్టిగా పనిచేస్తున్నందునే తీవ్రవాద కార్యకలాపాలు తగ్గుముఖం పట్టాయని నివేదికలో పేర్కొన్నారు. ఈ నివేదికలోని అంశాలపై సీఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ రాజీవ్ రాయ్ భట్నాగర్ మీడియాతో మాట్లాడారు. డౌన్ ఫాల్.. : ప్రస్తుతం ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిశా, బిహార్లలోని అతికొద్ది జిల్లాల్లో మాత్రమే మావోయిస్టుల ప్రభావం ఉందని, హింసకు సంబంధించి నమోదయ్యే కేసుల్లో 90 శాతం ఆ రాష్ట్రాల్లోనే నమోదవుతున్నాయని రిపోర్టులో తెలిపారు. 2015నాటికి 75 జిల్లాల్లో బలంగా ఉండిన మావోయిస్టులు.. 2016 వచ్చేసరికి 67 జిల్లాలకు కుచించుకుపోగా, 2017 చివరినాటికి ఆ సంఖ్య 58 జిల్లాలకు పడిపోయింది. ఉద్యమాన్ని అణిచివేయడంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమైన నేపథ్యంలో దశాబ్ధాల కిందటే కేంద్ర బలగాలు రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. నక్సల్స్ ఏరివేత ఆపరేషన్లలో ప్రస్తుతం సీఆర్పీఎఫ్, ఇండియన్ ఎయిర్ఫోర్స్, బీఎస్ఎఫ్, ఐటీబీపీ బలగాలు పాలుపంచుకుంటున్నాయని, ఆయా శాఖలు పూర్తి సమన్వయంతో పనిచేస్తున్నాయని, అదే సమయంలో ప్రభుత్వాలు.. రోడ్ల నిర్మాణం, కమ్యూనికేషన్ నెట్వర్క్లు, మారుమూల ప్రాంతాల్లో పోలీస్ స్టేషన్ల ఏర్పాటు తదితర పనులను శరవేగంగా చేపడుతున్నాయిన, అందుకే తీవ్రవాదం క్రమక్రమంగా బలహీనపడుతున్నదని సీఆర్పీఎఫ్ డీజీ భట్నాగర్ చెప్పుకొచ్చారు. ఆ మూడు ప్రాంతాలు.. : మావోయిస్టు ఉద్యమాన్ని పారదోలే క్రమంలో కేంద్ర బలగాలకు తోడు రాష్ట్రాల పోలీసులు కూడా క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాయని, బయటి నుంచి ఆయుధాలు చేరకుండా అడ్డుకోగలుగుతున్నామని, నిధుల ప్రవాహం కూడా దాదాపు క్షీణించిందని రిపోర్టులో వెల్లడైంది. ‘‘తీవ్రవాద వ్యతిరేక ఆపరేషన్లకు సంబంధించి 2017లో మేం చాలా సాధించగలిగాం. నక్సల్స్ స్థావరాల్లోకి చొచ్చుకుపోగలిగాం. ప్రస్తుతం మా దృష్టంగా మావోయిస్టు అగ్రనాయకత్వంపైనే ఉంది. 1200 చదరపు కిలోమీటర్ల వైశాల్యమున్న బస్తర్-సుక్మా రీజియన్, 2000చ.కి.మీల ఆంధ్ర-ఒడిశా బోర్డర్(ఏవోబీ), దాదాపు 4500 చ.కి.మీల అబూజ్మడ్ అడవులు.. ఈ మూడు ప్రాంతాల్లో మాత్రమే మావోయిస్టులు మనగలుగుతున్నారని, భద్రతాపరమైన సమస్యల కారణంగా ప్రభుత్వ సిబ్బంది అక్కడికి వెళ్లలేకపోతున్నారు’’ అని భట్నాగర్ తెలిపారు. యాక్షన్ ప్లాన్ 2017-2022? : గత ఏడాది కేంద్ర బలగాలు నిర్వహించిన ఆపరేషన్లలో సుమారు 150 మంది మావోయిస్టులు మరణించారు. వారిలో 30 మంది మహిళలు కూడా ఉన్నారు. ఈ క్రమంలోనే మావోయిస్టుల వ్యూహాలకు సంబంధించి ‘2017-2022 యాక్షన్ ప్లాన్’ పేరుతోఉన్న కీలక పత్రాలు లభ్యమైనట్లు తెలిసింది. -
‘రెడ్ కారిడార్’కు సీఆర్పీఎఫ్ గండి
గుర్గావ్: ఛత్తీస్గఢ్, జార్ఖండ్, బిహార్లోని తమ ప్రభావ ప్రాంతాలను కలుపుకుని పశుపతి (నేపాల్) నుంచి తిరుపతి వరకు రెడ్ కారిడార్ ఏర్పాటుకు చేసిన ప్రయత్నాలను నక్సల్స్ ధ్వంసం చేసినట్లు సీఆర్పీఎఫ్ ప్రకటించింది. సీఆర్పీఎఫ్ను మరింత బలోపేతం చేసేందుకు 2016-17 ఆర్థిక సంవత్సరంలో మరో నాలుగు బెటాలియన్లను ఏర్పాటుచేయటంతోపాటు మౌలిక వసతులను మరింతగా పెంచుకోనున్నట్లు సీఆర్పీఎఫ్ తాజా మాజీ డీజీ ప్రకాశ్ మిశ్రా వెల్లడించారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- అవన్నీ అపోహలే
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
Advertisement