breaking news
Ramaiah Guda
-
పీఎస్లో ‘గాడిద’ పంచాయితీ!
వికారాబాద్ అర్బన్: ఒక గాడిదను ఇద్దరు వ్యక్తులు.. నాదంటే.. నాదేనంటూ పట్టుబట్టడంతో ఎటూ తేల్చలేక వికారాబాద్ పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. దీంతో గాడిదతోపాటు దాని పిల్ల, ఇద్దరు వ్యక్తులు పీఎస్ చుట్టూ తిరుగుతున్నారు. వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని రామయ్యగూడలో నివాసం ఉండే బాణాల ప్రభు గాడిదల పాలను అమ్ముకొని జీవనం సాగిస్తుంటాడు. ఇతని వద్ద 22 గాడిదలు ఉండగా నాలుగు తప్పిపోయాయి. ఈ విషయంపై గతంలో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గాడిదలను వెతికి ఆచూకీ చెబితే పట్టుకొచ్చి ఇస్తామని పోలీసులు చెప్పారు. ఇటీవల మోమిన్పేటలో ఓ వ్యక్తి వద్ద తన గాడిద ఉన్నట్లు గుర్తించిన ప్రభు.. దీనిపై పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో పోలీసులు గాడిదను వికారాబాద్ పీఎస్కు తీసుకొచ్చారు. ఆ గాడిద తనదేనంటూ పద్మ అనే మహిళ తన తండ్రి సత్తయ్యతో కలిసి పీఎస్కు చేరుకుంది. వీరిద్దరూ గాడిద నాదంటే.. నాదే అనడంతో ఏం చేయాలో తోచని పోలీసులు.. మంగళవారం మరోసారి గాడిదను తీసుకొని స్టేషన్కు రావాలని చెప్పి పంపించారు. -
బైక్ కొనివ్వలేదని తల్లిని చంపేశాడు
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా వికారాబాద్ సమీపంలోని రామయ్య గూడలో మంగళవారం దారుణం చోటు చేసుకుంది. బైకు అడిగితే కొనివ్వలేదని ఓ యువకుడు ఆగ్రహించి కన్నతల్లిపై కర్రతో దాడి చేశాడు. ఆ దాడిలో ఆమె తీవ్రంగా గాయపడి రక్తపు మడుగులో పడి మరణించింది. దాంతో ఆమె కుమారుడు అక్కడి నుంచి పరారైయాడు. స్థానికులు ఆ విషయాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్మార్టం నిమిత్తం మృతదేహన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.