breaking news
Rajeshkumar
-
శిశువులు, తల్లులకు ఆసరా!
సాక్షి, హైదరాబాద్: నవజాత శిశువులు, తల్లుల పౌష్టికాహార అవసరాల పర్యవేక్షణకు డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించనున్నట్లు కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి రాజేశ్కుమార్ తెలిపారు. గర్భస్థ మహిళలకు పోషకాహారం అందడం మొదలు నవజాత శిశువులకు సకాలంలో టీకాలు వేయడం.. వారిలోని విటమిన్, పోషకాల లోపాలు, వాటిని సరిచేసేందుకు తీసుకుంటున్న చర్యలు తదితరాలతో రూపొందించిన సాఫ్ట్వేర్ను జనవరి 1 నుంచి దేశంలో ని 315 జిల్లాల్లో అమల్లోకి తేనున్నట్లు పేర్కొన్నారు. ఈ సాఫ్ట్వేర్ సాయంతో ఢిల్లీలోని ప్రధాని కార్యాలయం నుంచే గ్రామాల్లోని బిడ్డలు, తల్లుల ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనించవచ్చన్నారు. జాతీయ పౌష్టికాహార సంస్థ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం అంతర్జాతీయ సదస్సు జరిగింది. ఈ సందర్భంగా రాజేశ్కుమార్ మాట్లాడుతూ.. 2030 నాటికి అగ్రరాజ్యంగా ఎదగాలన్న దేశ ఆకాంక్షలకు నవజాత శిశువుల ఆరోగ్యం కీలకమని స్పష్టం చేశారు. ఐదేళ్లలోపు పిల్లల్లో 38 శాతం మంది ఇప్పటికే పూర్తిస్థాయిలో ఎదగలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్య పరిష్కారానికి జాతీయ పౌష్టికాహార సంస్థ సహకారంతో కేంద్రం యత్నాలు చేస్తోందన్నారు. సగటు ఐక్యూ 82 పాయింట్లే.. పోషకాహార లోపం వల్ల భారతీయ బాలల సగటు మేధో శక్తి (ఐక్యూ) 82 పాయింట్ల స్థాయిలోనే ఉందని.. గర్భిణులు తొలి త్రైమాసికంలో తగినంత ఫోలిక్ యాసిడ్, ఐరన్లను తీసుకుంటే ఈ సమస్యను అధిగమించి సగటు మేధోశక్తిని 8–12 పాయింట్ల వరకూ పెంచవచ్చని చెప్పారు. -
శాంతిభద్రతలు, ట్రాఫిక్ను పరిశీలిస్తా
ఏటీఅగ్రహారం (గుంటూరు): అర్బన్ జిల్లాలో శాంతి భద్రతలు,ట్రాఫిక్ సమస్యలను పరిశీలించి చర్యలు చేపట్టనున్నట్టు అర్బన్ ఎస్పీ రాజేష్కుమార్ స్పష్టం చేశారు. గుంటూరు అర్బన్ జిల్లా ఎస్పీగా రాజేష్కుమార్ బుధవారం సాయంత్రం జిల్లా పోలీస్ కార్యాలయంలో రూరల్ ఎస్పీ పిహెచ్డి రామకృష్ణ నుంచి చార్జి తీసుకున్నారు. అనంతరం ఎస్పీ రాజేష్కుమార్ విలేకరులతో మాట్లాడిన వివరాలు ఆయన మాటల్లోనే... ‘‘ అర్బన్ జిల్లా పరిస్థితులపై అవగాహన పెంపొందించుకొని ప్రాధాన్యం ఇవ్వాల్సిన అంశాలను గుర్తించి తదుపరి చర్యలు చేపడతా. నా భార్య నీతూ ప్రసాద్ 2002లో గుంటూరు జిల్లా ట్రైనీ కలెక్టర్గా పనిచేస్తున్న సమయంలో, విధి నిర్వహణలో భాగంగా బందోబస్తు నిమిత్తం మూ డుసార్లు మాత్రమే గుంటూరు వచ్చాను. అంతకు మించి జిల్లాపై అవగాహన లేదు. అధికారులు, మీడియా, ప్రజాప్రతినిధుల ద్వారా సమాచారం సేకరిస్తా. మీడియా ప్రతినిధులు, విలేకరులు సహకారం అందిస్తూ సమాచారం తెలియజేస్తే వెంటనే చర్యలు చేపడతా.’’ తొలుత గుంటూరులోని పోలీస్క్లబ్కు చేరుకున్న ఎస్పీ రాజేష్కుమార్ సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. కాకినాడలోని 3వ బెటాలియన్ కమాండెంట్గా వున్న ఆయన బదిలీపై ఇక్కడకు వచ్చారు. అధికారుల అభినందనలు.. ఎస్పీ రాజేష్ కుమార్ను ఏఎస్పీలు జానకీధరావత్, బి. శ్రీనివాసులు, ఓఎస్డి కె. జగన్నాథరెడ్డి, డీఎస్పీలు గంగాధరం, టివీ. నాగరాజు, కె. నరసింహ, బి. మెహర్బాబా, ప్రసన్న కుమార్, బిపి. తిరుపాల్, ఎస్ వెంకటేశ్వరరావు, ఎస్పీ పీఆర్ఓ ఎస్. వెంకట బాలసుబ్రహ్మణ్యం, సీఐలు, ఎస్సైలు, ఎస్పీ కార్యాలయంలోని వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది కలసి అభినందనలు తెలిపారు.