-
కాంగ్రెస్కు భవిష్యత్ లేదనే విమర్శలు
► అభివృద్ధి నిరోధకులు కాంగ్రెస్ నేతలు ► ఎంపీలు ప్రొఫెసర్ సీతారాంనాయక్, పసునూరి దయాకర్ ► పాచికగా కోదండరాంను వాడుకుంటున్న కాంగ్రెస్ ► టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కెళ్లపల్లి రవీందర్రావు హన్మకొండ : టీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసి ఎక్కడ తమకు భవిష్యత్ ఉండదేమోననే భయంతో కాంగ్రెస్ నాయకులు ఆయనపై అర్థం లేని విమర్శలు చేస్తున్నారని ఎంపీలు ప్రొఫెసర్ అజ్మీరా సీతారాంనాయక్, పసునూరి దయాకర్ విరుచుకుపడ్డారు. హన్మకొండ రాంనగర్లోని టీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ సీఎం రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేం దుకు కృషి చేస్తున్నారన్నారు. ఈ క్రమంలో తెలంగాణకు రావాల్సిన వాటా నీరు రాకుండా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కోర్టుకు వెళితే, ప్రాజెక్టులు నిర్మించకుండా అడ్డుపడుతూ కాంగ్రెస్ నాయకులు గ్రీన్ ట్రిబ్యునల్కు వెళ్లారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్లో వారిలో వారికే సఖ్యత లేదని, ఆ పార్టీలోని నాయకులు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారన్నారు. గిరిజన నియోజకవర్గానికి ఏనాడైనా వెళ్లారా, ప్రత్యేక నిధులేమైనా ఇచ్చారా అని ప్రశ్నించారు. దేవాలయాల అభివృద్ధికి కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ను విమర్శించడంలో అర్థం లేదన్నారు. రాజకీయ బలం లేని కాంగ్రెస్ రాజకీయంగా బలం లేని కాంగ్రెస్ తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాంను పాచికగా వాడుకుంటుందని టీఆర్ఎస్ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు తక్కళ్లపల్లి రవీందర్రావు విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు ఉద్యమ నేతగా కేసీఆర్ ఎక్కని మెట్టు లేదని, కలువని పార్టీ, నాయకుడు లేడన్నారు. తెలంగాణలో దేశంలోనే అభివృద్ధిలో ముందు నిలి పేందుకు సీఎం కేసీఆర్ శ్రమిస్తున్నారన్నారు. మూడేళ్ళ పాలన చూసి జాతి గర్విస్తుందన్నారు. సమావేశంలో టీఆర్ఎస్ నాయకులు జన్ను జకార్య, బీరవెల్లి భరత్కుమార్రెడ్డి, నయిముద్దీన్, జోరిక రమేశ్, కమరున్నీసాబేగం, కోల జనార్ధన్, పులి సారంగపాణి, కత్తరపల్లి దామోదర్, పద్మ, శ్రీజా నాయక్, పోగు ల రమేశ్, నాగపురి రాజేష్ పాల్గొన్నారు. -
తప్పుదోవ పట్టిస్తున్న చంద్రబాబు: కడియం
వరంగల్: తెలంగాణ బిల్లులోలేని పోలవరం అంశంపై చంద్రబాబు ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు యత్నిస్తున్నారని టీఆర్ఎస్ పొలిట్బ్యూరో సభ్యుడు, వరంగల్ ఎంపీ కడియం శ్రీహరి విమర్శించారు. హన్మకొండలో ఆయన విలేకరులతో మాట్లాడారు. యూపీఏ ఆర్డినెన్స్ తెచ్చినప్పుడే తమ నేత కేసీఆర్ వ్యతిరేకించారని, ఇప్పుడు ప్రధానమంత్రి మోడీపై వెంకయ్య, చంద్రబాబు కలిసి ఒత్తిడి తెచ్చి ఆర్డినెన్స్ తేవడం సిగ్గుచేటన్నారు. రెండు ప్రభుత్వాలతో చర్చించి చేపట్టాల్సిన కార్యక్రమాన్ని రెచ్చగొట్టేందుకు వినియోగించుకుంటున్నారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా నోరు మెదపని చంద్రబాబు ఇప్పుడు సీమాంధ్రకు అన్యాయం జరిగిందనే వాదన తెస్తున్నారని విమర్శించారు. జనాభా ప్రాతిపదికన విద్యుత్ పంపిణీ చేపట్టలేదనే వాదన వెనుక కుట్ర ఉందన్నారు. తాము కేంద్రంతో స్నేహపూర్వకంగా ఉండాలని భావిస్తున్నామని చెప్పారు. మహబూబాబాద్ ఎంపీ ప్రొఫెసర్ సీతారాం నాయక్ మాట్లాడుతూ పోలవరంపై న్యాయపోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. -
నా గుండెల్లో పదిలంగా తెలంగాణ: కేసీఆర్
హైదరాబాద్: ఎవరెన్ని శాపాలు పెట్టినా తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం రావడం ఖాయమని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. కొత్త రాష్ట్రం, కొత్త నాయకత్వం, కొత్త పంథాలో ముందుకు పోవాలని ఆయన పిలుపునిచ్చారు. టీడీపీ నాయకుడు, రాష్ట్ర మాజీ మంత్రి బాబూమోహన్, మల్కాజ్గిరి ఎమ్మెల్యే ఆకుల రాజేందర్, తెలంగాణ జేఏసీ స్టీరింగ్ కమిటీ సభ్యుడు ప్రొఫెసర్ సీతారాం నాయక్, పల్లా రాజేశ్వర్ రెడ్డి... కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ తలరాత మారాలంటే పాత ప్రభుత్వాలతో సాధ్యం కాదన్నారు. తన గుండెల్లో పదిలంగా తెలంగాణ ఉందన్నారు. తెలంగాణలో సకల బాధలకు కాంగ్రెస్, టీడీపీయే కారణమన్నారు. మంచి ప్రభుత్వం కావాలంటే రాజకీయ అవినీతి అంతం కావాలన్నారు. మొదట రాజకీయ అవినీతిని పాతరవేయాలన్నారు. దేశంలో తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా అభివృద్ధి కావాలని కేసీఆర్ ఆకాంక్షించారు.
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
ఎమ్మెల్సీ కవితపై చార్జిషీటు
ఇక ప్రైవేటు డ్రైవింగ్ లైసెన్స్లు
ఆలస్యంగా రైళ్ల రాకపోకలు
దేశంలో మొదటి హైడ్రోజన్ నగరంగా విశాఖ
‘అంగన్వాడీ’ జిల్లా అధ్యక్షురాలి మృతికి సంతాపం
వృద్ధుడికి మెడికవర్లో అరుదైన శస్త్రచికిత్స
సీజనల్ వ్యాధుల కట్టడికి చర్యలు
గోడ కూలి వ్యక్తి మృతి
మద్యం మత్తులో డిగ్రీ విద్యార్థి ర్యాష్ డ్రైవింగ్
మండే ఎండ.. జాగ్రత్తలే అండ..
Advertisement