breaking news
Port Lands
-
ఏపీ మారిటైం బోర్డు ఏర్పాటుకు సీఎం జగన్ కీలక నిర్ణయం
సాక్షి, అమరావతి : ఏపీ మారిటైం బోర్డును ఏర్పాటు చేస్తూ శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. అమరావతిలో ఆయన శుక్రవారం మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇప్పటికే విశాఖ మేజర్ పోర్టుతోపాటు 14 నాన్ మేజర్ పోర్టుల అభివృద్ధి జరుగుతోందని వెల్లడించారు. మరిని పోర్టుల ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. రాష్ట్రంలోని పోర్టుల ద్వారా వ్యాపారాన్ని అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. తీరప్రాంత కారిడార్లో పరిశ్రమలను పెంచి పోర్టుల ద్వారా ఎగుమతి, దిగుమతులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. ప్రపంచంలో ఎగుమతులు, దిగుమతుల రంగంలో రాష్ట్రాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దేలా చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. దీనిలో భాగంగానే ఏపీ మారిటైం బోర్డు ఏర్పాటు చేస్తున్నామని, బోర్డు ద్వారా రాష్ట్రంలో పోర్టుల అభివృద్ధి జరుగుతుందన్నారు. -
‘నవయుగ’ ఎగనామం!
సాక్షి, నెల్లూరు: పారిశ్రామికాభివృద్ధి పేరుతో కృష్ణపట్నం పోర్టు భూములు దక్కించుకున్న ‘నవయుగ’ సంస్థ స్థానిక పంచాయితీకి రూ.400 కోట్లకు పైగా పన్నులు ఎగ్గొట్టింది! పోర్టు ఏర్పాటుతో తమ ప్రాంతం అభివృద్ధి చెంది ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయనే ఆశతో శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరు గ్రామ ప్రజలు తక్కువ ధరకే నవయుగకు భూములు అప్పగించారు. రైతులిచ్చిన భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకున్న పోర్టు యాజమాన్యం స్థానిక పంచాయతీకి మాత్రం మొండిచెయ్యి చూపింది. భూమి, భవనాల విలువ రూ.6,610.08 కోట్లు కృష్ణపట్నం పోర్టు నిర్మాణం జరిగి దాదాపు 11 ఏళ్లు గడుస్తున్నా స్థానిక పంచాయతీకి యాజమాన్యం రూపాయి కూడా పన్ను చెల్లించిన పాపాన పోలేదు. ఏపీ పంచాయతీరాజ్ 1994 చట్టం సెక్షన్ 61 ఐ, ఏ ప్రకారం పంచాయతీ పరిధిలోని వాణిజ్య, నివాస భవనాలకు పన్నులు వసూలు చేసే హక్కు ఉంది. ముత్తుకూరు రెవెన్యూ పరి«ధిలో పోర్టు కోసం సేకరించిన 2,625 ఎకరాల తాజా మార్కెట్ విలువ దాదాపు రూ.6,352 కోట్లుగా అధికారులు నిర్ణయించారు. టీటీటీ పోర్టు ట్రేడ్, ట్రాన్స్పోర్ట్ టెర్మినల్స్, స్టోరేజీ, వేర్హౌస్ భవన సముదాయాల భవనాలతో కలిపి భూమి విలువను మొత్తం రూ.6,610.08 కోట్లుగా ధ్రువీకరించారు. నామమాత్రంగా కూడా చెల్లించని వైనం.. భూములు, భవనాల మార్కెట్ విలువలో స్థానిక పంచాయతీకి రూపాయి చొప్పున పన్నులు చెల్లించాలి. కానీ అధికారులు మాత్రం నామమాత్రంగా రూ.0.50 చొప్పున నిర్ణయించి లెక్కలు కట్టారు. ఆ ప్రకారం చూసినా రూ.6,610.08 కోట్ల విలువ చేసే కృష్ణపట్నం పోర్టు, భూములకు అర్ధ రూపాయి చొప్పున పన్ను వేసినా పంచాయతీకి దాదాపు రూ.33.05 కోట్లు (నెట్ ట్యాక్స్) చెల్లించాలి. ఆపై ప్రభుత్వ వనరులు ఉపయోగించుకున్నందుకు 8 శాతం లైబ్రరీ సెస్కు రూ.2.64 కోట్లు, పది శాతం వాటర్ సెస్కు రూ.3.30 కోట్లు, పది శాతం లైటింగ్ సెస్కు రూ.3.30 కోట్లు, 20 శాతం డ్రైనేజీ సెస్కు రూ.6.61 కోట్లు చొప్పున ఏడాదికి రూ.48.91 కోట్లు ముత్తుకూరు పంచాయతీకి కృష్ణపట్నం పోర్టు యాజమాన్యం చెల్లించాల్సి ఉంది. కొలతలకు అనుమతి నిరాకరణ ముత్తుకూరు పంచాయతీకి కృష్ణపట్నం పోర్టు యాజమాన్యం దాదాపు రూ.400 కోట్లకుపైగా పన్నులు బకాయి పడినట్లు అధికారులు తేల్చారు. పలుమార్లు పంచాయతీ ఆడిటింగ్ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేసి పన్నులు వసూళ్లు చేయాలని ఆదేశించారు. పన్నులు చెల్లించాలని పంచాయతీ కార్యదర్శి పలుమార్లు నోటీసులు జారీ చేసినా స్వీకరించలేదు. ఏటా మారుతున్న విలువల ప్రకారం పోర్టు భవనాల కొలతలు తీసుకునేందుకు కూడా సిబ్బందిని అనుమతించకపోవడం గమనార్హం. విజిలెన్స్ ఆరా.. ముత్తుకూరు పంచాయతీకి కృష్ణపట్నం పోర్టు యాజమాన్యం పన్నులు బకాయి పడటంపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఇటీవల ఆరా తీశారు. స్థానిక పంచాయతీ కార్యాలయంలో రికార్డులను పరిశీలించారు. పన్నుల ఎగవేతపై ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని అధికారులు తెలిపారు. నోటీసులకు స్పందన లేదు.. కృష్ణపట్నం యాజమాన్యం ముత్తుకూరు పంచాయతీకి పన్నులు బకాయి పడింది. పోర్టు ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటి వరకు పన్నులు చెల్లించలేదు. పన్నులు చెల్లించాలని గతంలో పలుమార్లు నోటీసులు జారీ చేసినా ఎలాంటి స్పందన లేదు. – సుస్మితారెడ్డి, ఇన్చార్జి డీపీవో, నెల్లూరు పోర్టుకి పన్ను మినహాయింపు లేదు.. కృష్ణపట్నం పోర్టుకు ప్రభుత్వం నుంచి ఎటువంటి పన్ను మినహాయింపు లేదు. ఇప్పటి వరకు స్థానిక సంస్థలకు పన్నులు చెల్లించలేదు. దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. – షేక్ అబ్దుల్ షఫీఉల్లా, రాష్ట్ర కార్యదర్శి, బీజేపీ మైనార్టీ మోర్చా -
కారు చౌకగా కాకినాడ పోర్టు భూములు
-
నౌకాశ్రయ విధానాన్ని సవరిస్తాం
♦ హోం శాఖ సహాయ మంత్రి రంజిత్ పాటిల్ ♦ అక్రమాలకు అడ్డుకట్ట వేయడానికేనని వెల్లడి ♦ ఆరు నెలల్లో కొత్త పాలసీ అమల్లోకి ముంబై : ఆదాయం కోసం డవలపర్లు ప్రభుత్వ భూములను ఉపయోగించడాన్ని నిరోధించడానికి నౌకాశ్రయ విధానాన్ని (పోర్ట్ పాలసీ) సవరించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ‘పోర్టు భూములను అభివృద్ధి చేస్తామని చెప్పి డవలపర్లు పీపీపీ పద్ధతిన బిడ్లు వేసి, ఏళ్లయినా వాటి గురించి పట్టించుకోవడం లేదు. 15- 20 ఏళ్లపాటు ఆ భూములను అంటిపెట్టుకుని తర్వాత అమ్మేస్తారు. ఇలా చేసి భారీ ఆదాయం సంపాదిస్తారు. కానీ ఎలాంటి అభివృద్ధి చేయరు’ అని హోం శాఖ సహాయ మంత్రి రంజిత్ పాటిల్ అన్నారు. పోర్ట్ పాలసీకి సంబంధించి పలు ఏజెన్సీలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘పోర్ట్ పాలసీని సవరించాలని ప్రభుత్వం భావిస్తోంది. పోర్టు భూములను సొంతం చేసుకున్న డవలపర్లు నిర్ణీత కాల వ్యవధిలోగా వాటిని అభివృద్ధి చేసేలా సవరణ చేస్తాం. ఒక్క సారి పీపీపీ పద్ధతి ద్వారా స్థలం దక్కించుకున్న డవలపర్లు, తర్వాత అభివృద్ధి చేయడానికి మాత్రం కుంటిసాకులు చూపుతున్నారు. కానీ ఇప్పుడు అలాంటివి చెల్లవు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నుంచి ఈ మేరకు అనుమతి తీసుకుంది. భూములను సొంతం చేసుకున్న నిర్ణీత వ్యవధిలోగా అభివృద్ధి చేసి తీరాల్సిందే’ అని పాటిల్ వివరించారు. ప్రస్తుతం ఈ ప్రతిపాదన ప్రారంభ దశలోనే ఉందని, చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. త్వరలోనే డ్రాఫ్టు బిల్లుతో ముందుకొస్తామని పేర్కొన్నారు. ‘ఇప్పటికే భూములను సొంతం చేసుకున్న వారు సైతం వాటి అభివృద్ధి పనులు ప్రారంభించాలి. లేదంటే ఆ భూములను స్వాధీనం చేసుకుంటాం’ అని హెచ్చరించారు. 6 నెలల్లో కొత్త పాలసీ అమల్లోకి తెస్తామని తెలిపారు.