breaking news
Pharmacy Stores
-
నాసిరకానికి మందు
ఫార్మసీలో అడుగు పెట్టగానే మందులు, న్యూట్రాస్యూటికల్స్, కొన్ని రకాల జనరల్ ఐటమ్స్ దర్శనమిస్తాయి. ఇక నుంచి ఓ క్యూఆర్ కోడ్ కూడా ప్రత్యక్షం కానుంది. క్యూఆర్ కోడే కదా అని తీసిపారేయకండి. భారత ఔషధ భద్రతా వ్యవస్థలో ఇదొక పెద్ద ముందడుగు. ఔషధాల వల్ల ఆరోగ్య సమస్య తలెత్తితే ఫిర్యాదులకు క్యూఆర్ కోడ్ విధానానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇక నుంచి దేశవ్యాప్తంగా అన్ని ఫార్మసీలు, హోల్సేల్ మందుల దుకాణాల్లో అందరికీ కనిపించేలా ఫార్మాకోవిజిలెన్స్ ప్రోగ్రామ్ ఆఫ్ ఇండియా క్యూఆర్ కోడ్తోపాటు టోల్ఫ్రీ నంబర్ 1800–180–3024 ప్రదర్శించాలని సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్సీఓ) ఆదేశించింది.ఔషధం వల్ల ఏదైనా సైడ్ ఎఫెక్ట్ అయితే.. ఆ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి వినియోగదారులు ఎదుర్కొన్న ఆరోగ్య సమస్య, ఆ మందు తాలూకా బ్యాచ్, కంపెనీ వివరాలు అందిస్తే చాలు. అడ్వర్స్ డ్రగ్ రియాక్షన్ మానిట రింగ్ సిస్టమ్ ఈ ఫిర్యాదులను స్వీకరించి సదరు బ్యాచ్లో తయారైన ఔషధాల నాణ్యతను పరీక్షి స్తుంది. లోపం ఉందని తేలితే నిబంధనల ప్రకా రం చర్యలు తీసుకుంటారు.నేరుగా ప్రజల నుంచే..మధ్యప్రదేశ్లో కోల్డ్రిఫ్ అనే దగ్గు మందు ఇటీవల 23 మంది పిల్లల ప్రాణాలను బలిగొన్న సంగతి తెలిసిందే. ఔషధ తయారీలో ఫార్మా –గ్రేడ్కు బదులుగా పారిశ్రామిక అవసరాలకు వాడే ముడిపదార్థాలను ఉపయోగించినట్టు ఈడీ తేల్చింది. ఔషధ రంగ పరిమాణంలో ప్రపంచంలో మూడో అతిపెద్ద మార్కెట్ అయిన భారత్లో నాసిరకమైన మందులు, నకిలీలు పెద్ద ముప్పుగా నిలిచాయి. ఔషధాల వల్ల తలెత్తే ప్రతికూల ఫలితాలపై ఫిర్యాదులను నేషనల్ ఫార్మాకోవిజిలెన్స్ ప్రోగ్రామ్ కింద 2010 నుంచి కేంద్ర ప్రభుత్వం స్వీకరిస్తోంది.నకిలీలకు చెక్ పెట్టేందుకు ఇప్పటికే టాప్–300 బ్రాండ్స్ ఔషధాలపై కంపెనీలు క్యూఆర్ కోడ్ ముద్రిస్తున్నాయి. అన్ని టీకాలు, యాంటీమైక్రోబయాల్స్, నార్కోటిక్, సైకోట్రోపిక్ మందులకు దశలవారీగా ఈ విధానం అమలు చేయనున్నారు. అయితే ఈ కోడ్ను స్కాన్ చేస్తే ఉత్పాదన గుర్తింపు సంఖ్య, బ్యాచ్ నంబర్, తయారీ, గడువు తేదీ చూపిస్తుంది. ఈ వివరాలు చూపించలేదంటే నకిలీ అన్నట్టు.ఒక్క ఫిర్యాదు సైతం..ఆరోగ్య రంగంలో ఉన్న నిపుణుల నుంచి ఎక్కువగా ఫిర్యాదులు అందుతున్నాయి. ప్రజల నుంచి పెద్దగా స్పందన లేదు. సీడీఎస్సీఓ తాజా నిర్ణయం వల్ల ప్రజల్లో చైతన్యం వస్తుందని, నేరుగా వారి నుంచే ఫిర్యాదులు అందుతాయని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. మన దేశంలో ఔషధాల వల్ల తలెత్తే హానికర సంఘటనలను ట్రాక్ చేసే విధానంలో క్యూఆర్ కోడ్ ఒక సంచలనం అని చెప్పవచ్చు.‘వాస్తవానికి ప్రాణాలకు హాని జరిగితే తప్ప ఇటువంటివి బయటి ప్రపంచానికి తెలియవు. చాలా మంది రోగులు మందుల వల్ల దుష్ప్రభావాలు సహజమని లేదా తాత్కాలికమైనవని భావిస్తారు. సంబంధిత అధికారులను ఎప్పుడూ అప్రమత్తం చేయరు. దీంతో నాసిరకమైన మందుల గుర్తింపు జరగడం లేదు. సమస్యను ముందుగానే గుర్తించడంలో, వందలాది మందికి ఎదురయ్యే హానిని నివారించడంలో ఒక్క ఫిర్యాదు సైతం సహాయపడుతుంది’ అని సీడీఎస్సీఓ ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు.మూడు గంటలకు ఒకటి..దశాబ్ద కాలంలో దేశవ్యాప్తంగా 32,000 కంటే ఎక్కువ శాంపిల్స్ నాణ్యత పరీక్షల్లో విఫలమయ్యాయి. 2,500కుపైగా శాంపిల్స్ నకిలీ, కల్తీ అయ్యాయని నిర్ధారణ అయింది. సగటున ప్రతిరోజూ ఎనిమిది మందులు స్టాండర్డ్ క్వాలిటీ టెస్టుల్లో విఫలమవుతున్నాయి. అంటే దాదాపు ప్రతి మూడు గంటలకు ఒకటి అన్నమాట.ముప్పు ఉందని భావిస్తే..తయారీ సంస్థలపై తనిఖీలు నిరంతరంచేపడుతు న్నాం. ప్రధానంగా దగ్గు మందుల వంటి ముప్పు ఉండే ఔషధ తయారీ యూనిట్లలో నాణ్యతను పరీక్షిస్తూనే ఉన్నాం. ఫార్మసీల్లో క్యూఆర్ కోడ్ అమలైతే తయారీ సంస్థల్లో జవాబుదారీ, నాణ్యత విషయంలో ప్రజల్లో విశ్వాసం పెరుగుతుంది. అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా జనవరి నుంచి గుడ్ మాన్యుఫాక్చరింగ్ ప్రాక్టీస్ (జీఎంపీ) కొత్త రూల్స్ రానున్నాయి. – పి.రాము, అసిస్టెంట్ డైరెక్టర్, డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్, తెలంగాణప్రజలకే ప్రయోజనం..దేశవ్యాప్తంగా సుమారు 14 లక్షల మందుల దుకా ణాలు ఉన్నాయి. క్యూఆర్ కోడ్ విధానం అమలైతే ప్రజలకే ప్రయోజనం కలుగుతుంది. అసోసియే షన్ తరఫున క్యూఆర్ కోడ్స్ ముద్రించి అన్ని దుకా ణాలకు సరఫరా చేస్తున్నాం. నాసిరకం, నకిలీలకు మేం వ్యతిరేకం. ఔషధాన్ని పరీక్షిస్తేనే నాణ్యత ఏ స్థాయిలో ఉందో తెలుస్తుంది. మందుల తయారీ విషయంలో పటిష్ట జీఎంపీ, లైసెన్సింగ్ విధానాలు అమలు కావాలి. – డాక్టర్ ఘీసూలాల్ జైన్, ప్రెసిడెంట్, తెలంగాణ చాంబర్ ఆఫ్ కెమిస్ట్, డ్రగ్గిస్ట్ -
ఐవీఎఫ్ హార్మోన్ల బదులు అబార్షన్ బిళ్లలిచ్చారు!
న్యూయార్క్: వైద్యపరమైన నిర్లక్ష్యానికి పరాకాష్ట ఈ ఉదంతం. అమెరికాలోని లాస్ ఏంజెలెస్లో సంతానం కోసం ఐవీఎఫ్ పద్ధతిని ఆశ్రయించిన తమికా థామస్ అనే మహిళకు మెడికల్ షాపు ఐవీఎఫ్ హార్మోన్ల బదులు పొరపాటున అబార్షన్ మాత్రలు ఇచి్చంది. ఏకంగా ఇద్దరు గర్భస్థ శిశువుల మరణానికి కారణమైంది! పుట్టబోయే బిడ్డలను పొట్టన పెట్టుకున్నారంటూ మెడికల్ షాప్పై ఆమె స్టేట్ బోర్డ్ ఆఫ్ ఫార్మసీకి ఫిర్యాదు చేసింది. ప్రిస్క్రిప్షన్లోని డాక్టర్ చేతిరాత అర్థం కాకపోవడం ఈ దారుణ పొరపాటుకు దారి తీసినట్టు విచారణలో తేలింది. ‘షాపు సిబ్బంది తప్పు మీద తప్పు చేశారు. ఆ రాతను తమకు తోచినట్టుగా అర్థం చేసుకుని ఈ నిర్వాకానికి పాల్పడ్డారు. పైగా తాము ఏం మందులు ఇస్తున్నదీ, వాటివల్ల ఏం జరుగుతుందన్నది విధిగా చెప్పాల్సి ఉండగా ఆ పని కూడా చేయలేదు’అని బోర్డు తేలి్చంది. మెడికల్ షాప్కు పది వేల డాలర్ల జరిమానా విధించింది. కానీ దీనివల్ల పుట్టక ముందే కన్ను మూసిన తమ బిడ్డలు తిరిగొస్తారా అంటూ థామస్ దంపతులు విలపిస్తున్నారు. వారికి నలుగురు సంతానం. పెద్ద కుటుంబం కావాలనే కోరికతో మళ్లీ పిల్లలను కనాలని నిర్ణయించుకుని ఐవీఎఫ్ పద్ధతిని ఆశ్రయించారు. -
ఫార్మ'ఛీ'
వైఎస్ఆర్ జిల్లా, బద్వేలు: పోరుమామిళ్లకు చెందిన ఒక వ్యక్తి కాళ్లు, చేతులు నొప్పి ఉండటంతో ఔషధ దుకాణానికి వెళ్లారు. దుకాణంలోని వ్యక్తికి తన సమస్య చెప్పి మాత్రలు అడిగారు. అతను ఇచ్చిన మాత్రలు వేసుకున్న తరువాత శరీరమంతా దద్దుర్లు, దురద వచ్చాయి. దీంతో వెంటనే వైద్యుడి దగ్గరకు వెళ్లగా తాను వేసుకున్న మాత్రలు రియాక్షన్ ఇవ్వడంతో ఇలా జరిగిందని ఆయన చెప్పారు. ఫార్మసీ దుకాణంలో ఉన్న వ్యక్తికి సరైన అవగాహన లేకపోవడం, ఫార్మసిస్టు కాకపోవడమే దీనికి కారణం. ఇలాంటి పరిస్థితి చాలా పట్టణాల్లో రోజూ చూడవచ్చు. జిల్లాలోని అధికశాతం ఔషధ దుకాణాల్లో కనీసం ఫార్మసిస్టులు లేకుండానే మందుల విక్రయాలు జరుగుతున్నాయనేది బహిరంగ రహస్యం. డిప్లొమో, బీఫార్మసీ చదువుకున్న వారికిసంబంధించిన సర్టిఫికెట్లు కంట్రాక్టు పద్ధతిన తీసుకుని దుకాణాలు నిర్వహిస్తున్నారు. ఈ దుకాణాల్లో అవగాహన లేని వ్యక్తులను ఉంచి మందుల అమ్మకాలు సాగిస్తున్నారు. అద్దెకు సర్టిపికెట్లు : జిల్లాలోని అధికశాతం ఫార్మసీ దుకాణాల్లో నిబంధనలు పాటించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. అవగాహన ఉన్న వ్యక్తులు మాత్రమే డాక్టరు రాసిన ప్రిస్కిప్షన్కు సరైన మందులు ఇవ్వగలరు. చాలా దుకాణాల్లో కనీస అవగాహన లేని వ్యక్తులు ఉంటున్నారు. జిల్లాలో 1250 పైగా ఫార్మసీ దుకాణాలు, 350 హోల్సేల్ దుకాణాలు ఉన్నాయి. కడప డివిజన్లో 700, ప్రొద్దుటూరు డివిజన్ పరిధిలో 550 ఫార్మసీ దుకాణాలు ఉండగా వీటి ద్వారా రోజుకు రూ.7 కోట్లపైనే లావాదేవీలు జరుగుతున్నాయని అంచనా. సగానికి పైగా దుకాణాల్లో ఫార్మసిస్టులు లేకుండానే అమ్మకాలు సాగుతున్నాయంటే పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో తెలుస్తుం ది. బీఫార్మసీ, ఎం ఫార్మసీ చదువుకున్న వారి సర్టిఫికెట్లను అద్దెకు తీసుకుని లామినేషన్ చేయించి షాపుల్లో తగిలిస్తున్నారు. సరిఫికెట్దారుడు వాస్తవంగా మరోచోట ఉద్యోగం చేసుకుంటూ ఉంటాడు. సర్టిఫి కెట్ ఇచ్చినందుకు డిప్లొమో అభ్యర్థులకు నెలకు రూ.2వేలు, బీఫార్మసీ వారికైతే నెలకు రూ.3 వేల వరకు ఇస్తున్నారు. దుకాణాలు, కార్పొరేట్ స్థాయి మెడికల్ షాపుల్లో కూడా ఇదే పరిస్థితి. ఔషధ నియంత్రణ మండలి అధికారులు మాత్రం తూతూమంత్రంగా పర్యవేక్షణ చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. నిబంధనలు పాటిస్తే ఒట్టు చాలా ఔషధ దుకాణాల్లో ఏసీ సదుపాయం ఉండదు. నిబంధనల ప్రకారం తగిన ఉష్ణోగ్రతలో మందులు దాచిపెట్టి స్టోరేజీ చేయాల్సి ఉన్నా అది ఏ దుకాణంలోనూ కనిపించదు. ఎక్కడ పడితే అక్కడ మందులను సర్దేసి అమ్మకాలు సాగిస్తున్నారు. మెజార్టీ షాపుల్లో సైతం ఇదే దుస్థితి. ఫార్మసీ నిర్వాహకులు, ఔషధ నియంత్రణ మండలి అధికారులకు పట్టవు. మందుల అమ్మకాలు సైతం ఇష్టారాజ్యంగా సాగితున్నాయి. రోగ నివారణకు ఉపయోగించే మందులకు సరైన స్టోరేజీ లేకపోవడంతో అవి విషపూరితంగా మారుతున్నాయి. కొన్ని రకాల క్రీములు, ఇంజక్షన్లు, వ్యాక్సిన్లు, అయింట్మెంట్లు తగిన ఉష్ణోగ్రతలో తప్పనిసరిగా ఉంచాలి. రిప్రిజిరేటర్ ఉష్ణోగ్రత రెండు నుంచి ఎనిమిది డిగ్రీలు, ఫార్మసీలో ఏసీ ఉష్ణోగ్రత 25–30 డిగ్రీల మధ్య ఉండాలి. ఏసీ, రిఫ్రిజిరేటర్ ఉంటేనే అనుమతి ప్రతి ఔషధ దుకాణంలో రిఫ్రిజిరేటర్, ఏసీ ఉండాల్సిందే. అవి ఉంటేనే ఔషధ నియంత్రణ సంస్థ డ్రగ్ లైసెన్స్ ఉండాలి. చాలా ఫార్మసీల్లో ఇవి కనిపించవు. క్యాన్సర్, గుండె, న్యూరాలజీ, మధుమేహం వంటి కొన్ని రకాల జబ్బులకు సంబంధించిన మందులను ఏసీ, రిఫ్రిజిరేటర్ సదుపాయం ఉన్న చోటనే నిల్వ చేయాలి. హార్మోన్లు, ఎంజైమ్స్కు సంబంధించిన ఔషధాలు సూచించిన ప్రకారం తగిన ఉష్ణోగ్రతలో నిల్వ ఉంచాలి. లేకపోతే మందుల సామర్థ్యం తగ్గిపోతోందని వైద్యులు చెబుతున్నారు. -
గీత దాటితే దుకాణం బంద్!
సంగారెడ్డి క్రైం : జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా నిర్వహించే ఫార్మసీ దుకాణాలు, యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఔషధ నియంత్రణ మండలి జిల్లా అసిస్టెంట్ డెరైక్టర్ సీహెచ్ రాజవర్ధనాచారి హెచ్చరించారు. ఇటీవల ఆయన విజయవాడ నుంచి బదిలీపై సంగారెడ్డికి వచ్చారు. ఈ సందర్భంగా ఆదివారం ‘సాక్షి’తో మాట్లాడారు. ముఖ్యంగా లెసైన్సులు లేని షాపులపై చర్యలు తప్పవన్నారు. జిల్లాలోని సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్లలో డ్రగ్ ఇన్స్పెక్టర్లు ఉన్నారన్నారు. జిల్లా వ్యాప్తంగా తనిఖీలను విస్తృతం చేశామన్నారు. ‘ఇటీవల జహీరాబాద్లోని ఓ మెడికల్ షాప్లో కాలం చెల్లించిన మందులను విక్రయించగా దాడులు నిర్వహించి పట్టుకున్నాం. ఆ దుకాణంపై కేసు నమోదు చేయడంతో పాటు సీజ్ చేశాం. అభ్యంతరకరమైన ప్రకటనలకు సంబంధించి సిద్దిపేటలో ఐదు కేసులు నమోదు చేశాం. జిల్లా వ్యా ప్తంగా మొత్తం 70 ఫార్మసీల్లో తనిఖీలు నిర్వహించి కొన్నింటికి నోటీసులు పంపాం. ఈ నోటీసులకు యజమానులు స్పందించకుంటే చర్యలకు ఉపక్రమిస్తాం. అన్ని మందుల దుకాణాల్లో ఫార్మాసిస్టులు తప్పకుండా అందుబాటులో ఉండాలి. జిల్లాలోని చాలా దుకాణాల్లో ఫార్మాసిస్టులు లేకుండా మం దులు విక్రయిస్తున్నట్టు ఇటీవల చేసిన దాడుల్లో వెల్లడైంది. ఇక నుంచి అలా జరుగకుండా వారికి నోటీసులు జారీ చేశాం. ఏ ఒక్క దుకాణం నిబంధనలకు విరుద్ధంగా నిర్వహించినా కేసులు నమోదు చేసి సీజ్ చేస్తాం. ముఖ్యంగా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉంటేనే మందులు అమ్మాలి’ అని రాజవర్ధన్ చెప్పారు. క్రిమినల్ కేసులకూ వెనకాడం... ‘ఫెన్సిడిల్ వంటి మత్తు మందులను డాక్టర్ సూచించిన వారికి మాత్రమే విక్రయించాలి. కొందరు యువకులు ఇలాంటి మత్తునిచ్చే మందులకు అలవాటు పడి ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. నిబంధనలను ఉల్లంఘించి ఈ తరహా మెడిసిన్స్ విక్రయిస్తే క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తాం. వీటి అమ్మకాలపై గట్టి నిఘా కూడా పెట్టాం. డాక్టర్ సూచించిన ప్రి స్క్రిప్షన్ ఆధారంగానే మందులు విక్రయించాలి. అలాగే వినియోగదారులకు తప్పకుండా రశీదు ఇవ్వాలి. రశీదు ఇవ్వడానికి ఎక్కువ బిల్లు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటాం. అలాగే ఆర్ఎంపీ వైద్యులు సైతం తమ ఫార్మసీ విక్రయాల కోసం లెసైన్సులు రెన్యూవల్ చేసుకోవాలి. ఎక్కడైనా ఫిజీషియన్ శాంపిల్స్ను విక్రయించినట్లు తమకు ఫిర్యాదులు వస్తే సదరు వైద్యులు, క్లినిక్లపై కూడా కేసులు నమోదు చేస్తాం. వైద్యులు తమ క్లినిక్లలో కూడా మందులను నిబంధనల మేరకే విక్రయించాలి. ఫార్మసీలు నిబంధనలకు విరుద్ధంగా కొనసాగినా, మరే ఇతర ఇబ్బందులు ఎదురైనా వినియోగదారులు మాకు నేరుగానైనా లేదా 08455-276548 ఫోన్ నంబర్కు అయినా కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు’ అని రాజవర్ధనాచారి సూచించారు.


