breaking news
payscale
-
కొత్త పే స్కేలు.. ఉద్యోగ భద్రత
సాక్షి, అమరావతి: రెండేళ్ల క్రితం రికార్డు స్థాయిలో ఒకేసారి ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు అందుకున్న లక్ష మందికిపైగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల మరో కల కూడా నెరవేరబోతుంది. అప్పట్లో ఉద్యోగాలు పొందిన వారికి ఈ ఏడాది జూన్ 30లోగా ప్రొబేషనరీ ప్రకటించి పే స్కేల్ వర్తింపజేస్తామంటూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన ప్రకటనపై హర్షం వ్యక్తమవుతోంది. ప్రొబేషనరీ పూర్తి చేసుకున్నట్లు ప్రకటన తర్వాత ప్రస్తుతం రూ.15 వేల చొప్పున నెల వారీ జీతం అందుకుంటున్న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు నిర్ణీత పే స్కేలు పరిధిలోకి వస్తారు. దీనికి తోడు వారంతా ప్రభుత్వ ఉద్యోగులకు ఉండే పూర్తి స్థాయి ఉద్యోగ భద్రతను పొందడంతో కొత్తగా ప్రభుత్వ ఉద్యోగుల మెడికల్ ఇన్సూరెన్స్ పరిధిలోకి వస్తారని అధికార వర్గాలు వివరించాయి. విధి నిర్వహణలో ఉద్యోగి మరణించిన పక్షంలో ఆ కుటుంబంలో మరొకరికి ఉద్యోగం దక్కే అవకాశం కూడా ఉంటుంది. నాలుగు నెలల్లో 1.34 లక్షల ఉద్యోగాలు.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రోజునే వైఎస్ జగన్మోహన్రెడ్డి గ్రామ, వార్డు సచివాలయాల్లో నియామకాలపై ప్రకటన చేశారు. ప్రమాణ స్వీకార సభలో ప్రకటించిన విధంగా అప్పటికప్పుడు 1.34 లక్షల కొత్త ప్రభుత్వ ఉద్యోగాలను స్పష్టించారు. జూలైలో నోటిఫికేషన్.. సెప్టెంబర్ మొదటి వారం నుంచి రాత పరీక్షలు... 20 రోజుల్లో ఫలితాల ప్రకటన.. ఆ తరువాత మరో వారం రోజుల్లో ఎంపికైన వారికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేయడం కూడా పూర్తయింది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే దాదాపు లక్ష మంది నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలు దక్కాయి. మొదటి విడతలో మిగిలిపోయిన ఉద్యోగాల భర్తీకి 2020 ఆరంభంలో తిరిగి నోటిఫికేషన్ జారీ చేసి ఆ ఏడాది చివరి కల్లా రెండో దశ నియామక ప్రక్రియను కూడా పూర్తి చేశారు. అప్పట్లో ఉద్యోగాలు పొందిన వారు తాజాగా ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చేసిన ప్రకటన మేరకు జూన్ నెలాఖరు కల్లా ప్రొబేషనరీని కూడా పూర్తి చేసుకోబోతున్నారు. -
కాంట్రాక్ట్ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ఏపీ సర్కార్
-
తిర‘కాసు’ వేతనం
అనంతపురం విద్య: కీలకమైన పదవిలో ఉన్న ఓ రిజిస్ట్రార్ బాధ్యాతారాహిత్యంగా వ్యవహరించి అడ్డంగా దొరికిపోయారు. ఆశ్రిత పక్షపాతంతో అడ్డగోలుగా ఆదేశాలు జారీ చేశారు. అయిన వారికి అందినకాడికి దోచుకునే అవకాశం కల్పించారు. అనుమతులు లేకపోయినా.. ఉన్నట్లు సృష్టించి భారీగా లబ్ధి చేకూర్చారు. ఏకంగా రివైజ్డ్ పేస్కేల్ మంజూరయ్యేలా తతంగం నడిపించడం గమనార్హం. జీఓ ఏం చెబుతోందంటే.. ►గతేడాది ఫిబ్రవరి 13న రాష్ట్ర ప్రభుత్వం జీఓ నెంబర్ 14ను జారీ చేసింది. ఇందులో అర్హులైన వారికి రివైజ్డ్ పేస్కేల్–2016 మంజూరు చేయాలని పేర్కొంది. ►మార్చి 20, 2019న ఎస్కేయూ పాలకమండలి సమావేశం(నెంబర్–163) జరిగింది. ఇందులో ఏ–4 అంశంగా ఆర్.పీ.ఎస్–2016ను ఎజెండాగా పేర్కొన్నారు. అయితే కేవలం ప్రొఫెసర్లు, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, లైబ్రేరియన్లు, ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగంలో పనిచేసే డైరెక్టర్లకు మాత్రమే ఆర్పీఎస్ వర్తిస్తుందని పాలకమండలి తీర్మానం చేసింది. ఏం చేశారంటే.. ►ఏప్రిల్ 16, 2019లో అప్పటి ఎస్కేయూ వీసీ ప్రొఫెసర్ రహంతుల్లా ఆడిట్కు సిఫార్సు చేశారు. ►మే 5, 2019లో ఆడిట్ నివేదికకు అనుగుణంగా వీసీ ప్రొసీడింగ్స్ ఇచ్చారు. కేవలం ప్రొఫెసర్లు, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, లైబ్రేరియన్లు, ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్లకు ఆర్పీసీ వర్తిస్తుందని.. వెంటనే మంజూరు చేయమని రిజి్రస్టార్కు ఆదేశాలు ఇచ్చారు. ►ఏప్రిల్ 16, 2019లో వైస్ ఛాన్స్లర్ ప్రొసీడింగ్స్ లేకుండా, నేరుగా రిజి్రస్టార్.. అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్కు లబ్ధి చేకూరేలా ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్, తాజా మాజీ రిజి్రస్టార్ వ్యవహార శైలి మొదటి నుంచీ వివాదాస్పదమే. గత ప్రభుత్వ హయాంలో అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్కు రెండింతల పదోన్నతులను అక్రమంగా కట్టబెట్టారు. ఇందులోనూ నిబంధనలను పక్కనపెట్టడం చర్చనీయాంశమవుతోంది. ఇంతటితో ఆగకుండా ఏకంగా రివైజ్డ్ పేస్కేలు(2016)ను ఎవరి అనుమతి లేకుండానే మాజీ రిజిస్ట్రార్ మంజూరు చేశారు. వాస్తవానికి రివైజ్డ్ పేస్కేల్కు అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ అనర్హుడు. పాలకమండలిలో ఆమోదం పొందలేదు.. వైస్ ఛాన్స్లర్ ప్రొసీడింగ్స్ ఇవ్వలేదు.. అయినప్పటికీ ఫైలు మీద రిజి్రస్టార్ సంతకం పెట్టి ఎస్టాబ్లిష్మెంట్ సెక్షన్కు అనుమతులు ఇచ్చేశారు. అనుకున్నదే తడవుగా ఎస్టాబ్లి‹Ùమెంట్ అప్పటి డిప్యూటీ రిజి్రస్టార్ రాజభక్తిని ప్రదర్శించి రివైజ్డ్ పేస్కేలు మంజూరు చేశారు. బయటపడిందిలా.. ►వాస్తవానికి ఎలాంటి ఉత్తర్వు అయినా వీసీ ప్రొసీడింగ్స్ లేకుండా రిజి్రస్టార్ ఉత్తర్వులు ఇవ్వడానికి వీల్లేదు. వీసీ ప్రొసీడింగ్స్ లేకపోయినా ఉత్తర్వులు ఇవ్వడం చట్టరీత్యా నేరమని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. అలా ఇచ్చే ఉత్తర్వులు చెల్లవు. ►వీసీ ప్రొసీడింగ్స్ ఉన్నాయా? లేవా? అని ఎస్టాబ్లిష్మెంట్ డిప్యూటీ రిజిస్ట్రార్, అసిస్టెంట్ రిజి్రస్టార్, సూపరింటెండెంట్ క్షుణ్ణంగా పరిశీలించాలి. కానీ ఉద్దేశపూర్వకంగానే ఆర్పీఎస్–2016ను మంజూరు చేసినట్లు స్పష్టమవుతోంది. ►గతేడాది మే చివర్లో నూతన ప్రభుత్వం ఏర్పడటంతో.. జూలైలో ఇంక్రిమెంట్కు దరఖాస్తు చేసుకుంటే తతంగం బయటపడుతుందనే ఉద్దేశంతో దరఖాస్తు చేసుకోలేదని తెలుస్తోంది. ►తాజాగా ఈ ఏడాది జూన్ 24న ఇంక్రిమెంట్కు దరఖాస్తు చేసుకున్న సమయంలో ఎస్టాబ్లిష్మెంట్ విభాగం పరిశీలించడంతో వెలుగులోకి వచ్చింది. చర్యలు తప్పవు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవు. వీసీ ప్రొసీడింగ్స్ లేకుండా ఆర్పీసీ మంజూరు చేసిన విషయం నా దృష్టికి రాలేదు. ఎస్టాబ్లిష్మెంట్ విభాగం నుంచి రికార్డులు తెప్పించుకుని పరిశీలిస్తాం. అక్రమాలు వీసీ దృష్టికి తీసుకెళ్లి ఆయన ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం. – ప్రొఫెసర్ ఎ.మల్లిఖార్జున రెడ్డి, రిజిస్ట్రార్, ఎస్కేయూ -
అందరికీ ‘సకల’ వేతనం ఇవ్వాలి
ౖయెటింక్లయిన్కాలనీ : ఎలాంటి కొర్రీలు పెట్టకుండా సకలజనుల సమ్మె వేతనాలు అత్యవసర సిబ్బందితో సహా అందరికీ ఇవ్వాలని హెచ్ఎంఎస్ ఆర్జీ–2 ఉపాధ్యక్షుడు నాచగోని దశరథంగౌడ్ డిమాండ్ చేశారు. స్థానిక ప్రెస్భవన్లో ఆదివారం మాట్లాడారు. సకలజనుల సమ్మె వేతనాల్లో సకల కొర్రీలు పెట్టి ఇచ్చేందుకు యాజమాన్యం కుట్రపన్నుతోందని దీన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత గుర్తింపు యూనియన్పై ఉందన్నారు. తామే ఇప్పిచ్చామని పేర్కొంటున్న గుర్తింపు సంఘం నాయకులు కొర్రీలకు వారే బాధ్యత వహిస్తారా అని ప్రశ్నించారు. ఇప్పటికై గుర్తింపు సంఘం బాధ్యతాయుతంగా ముందుకు సాగి సకలజనుల సమ్మె వేతనాలు అందరికీ వర్తింపజేసేలా చూడాలని కోరారు. లేని పక్షంలో ప్రాతినిధ్య సంఘాలను కలుపుకుని ముందుకు వెళ్లి అందరికీ న్యాయం జరిగేలా చూడాలన్నారు. ఏదిఏమైనా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కీలకపాత్ర వహించిన సింగరేణి కార్మికులకు సకలజనుల సమ్మెవేతనాలు చెల్లించడం సంతోషకరమన్నారు. కొంత ఆలస్యమైనా ముఖ్యమంత్రి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో జమీల్, ప్రతాప్రావు, వీరస్వామి, సోమయాజులు తదితరులు పాల్గొన్నారు.