breaking news
panchayathi secretary
-
ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి
-
ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి
రాయికల్ (కరీంనగర్): లంచం తీసుకుంటుండగా ఓ పంచాయతీ కార్యదర్శిని ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ సంఘటన రాయికల్ మండలంలో బుధవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. ఇంటిని మార్పిడి చేయాడనికి పర్మిషన్ కావాలంటూ వచ్చిన వ్యక్తి వద్ద నుంచి రాయికల్ మండలంలోని పంచాయతీ కార్యదర్శి మనోహర్ రెడ్డి 5 వేలు లంచం తీసుకుండగా ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ పట్టుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
నేడే ‘పంచాయతీ’ పరీక్ష
ఏర్పాట్లు చేసిన అధికారులు ఉదయం 10:00 గంటలకు మొదటి పేపర్ మధ్యాహ్నం 2 గంటలకు రెండవ పేపర్ హాజరుకానున్న అభ్యర్థులు 23,418 మంది సెంటర్ల వద్ద 144 సెక్షన్ అమలు ఇందూరు, న్యూస్లైన్ : ఏపీపీఎస్సీ ద్వారా జిల్లాకు మం జూరైన 66 పంచాయతీ కార్యదర్శి పో స్టులకు సంబంధించి పరీక్ష ఆదివారం జరగనుంది. మొదటి పేపర్ ఉదయం 10:00 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12:30 గంటలకు ముగుస్తుంది. రెండవ పేపర్ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమై సాయంత్రం 4.30గంటలకు ముగుస్తుం ది. మొత్తం 23,418 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. జిల్లాలో కేంద్రంలో తొమ్మిది రూ ట్లుగా విభజించి మొత్తం 51 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఒక్కో కేంద్రంలో 250 మంది నుంచి 800 మంది వరకు పరీక్ష రాసేవీలుంది. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే అభ్యర్థుల సౌకర్యార్థం ఆర్టీసీ ఉదయం పూట అదనపు బస్సులను నడుపుతుంది. పరీక్ష నిర్వహణ కోసం 1,100 మంది ఇన్విజిలేటర్లను, ప్రతి సెంటర్కు ఒకరు చొప్పున మొత్తం 51మంది చీఫ్ సూపరింటెండెంట్లను, ప్రతి మూడు సెంటర్లకు ఒకరు చొప్పున మొత్తం 18 మంది లైజన్ అధికారులను, మరో 54 మంది అసిస్టెంట్ లైజన్ అధికారులను అధికార యంత్రాంగం నియమించింది. జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న, జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర రావు, ఏజేసీ శేషాద్రిలతో పాటు ఆర్డీఓలు, ఇతర ఉన్నతాధికారులు పరీక్ష కేంద్రాలను పర్యవేక్షిస్తారు. పరీక్ష జరిగే కేంద్రానికి సంబంధించిన విద్యా సంస్థల యాజమాన్యం, సిబ్బంది, ఇతర వ్యక్తులు ఎవరిని కూడా లోనికి అనుమతించడంలేదని అధికార వర్గాలు స్పష్టం చేశాయి. పరీక్షల నిర్వహణ కోసం ప్రభుత్వం జిల్లాకు రూ. 6 లక్షలను కేటాయించింది.అదే విధంగా పరీక్ష కేంద్రాల వద్ద పోలీసు శాఖ పటిష్ట బందోబస్తు నిర్వహిస్తోంది.144 సెక్షన్ విధించడంతో పాటు చుట్టు పక్కల జిరాక్స్ సెంటర్లను మూసి వేయాలని ఇది వరకే ఆదేశాలు జారీ చేశారు. ఒక్కో సెంటర్ వద్ద ఇద్దరు నుంచి ముగ్గురు పోలీసులు విధులు నిర్వహిస్తా రు. ఎస్సైలు, సీఐలు తమ పరిధిలోని కేంద్రాలను పర్యవేక్షిస్తారు. డీఎస్పీలు, జిల్లా ఎస్పీ పరీక్ష కేంద్రాలను పరిశీలిస్తారు. సమస్యాత్మక ప్రాం తాల్లో పోలీసు పికెట్లను ఏర్పాటు చేయనున్నారు. ప్రత్యేక బస్సులు నిజామాబాద్ నాగారం : పంచాయతీ కార్యదర్శి పరీక్ష రాసే అభ్యర్థుల సౌకర్యార్థం ఆదివారం 40 బస్సులను అదనంగా నడుపుతున్నట్లు ఆర్టీసీ ఆర్ఎం కృష్ణకాంత్ తెలిపారు. 36 మండలాలకు ఒక్కో బస్సును కేటాయించామని, అవసరమైన చోట మరో నాలుగు బస్సులు నడుపుతామన్నారు. ఐదు నిమిషాల వరకు అనుమతి పంచాయతీ కార్యదర్శి పరీక్ష రాసే అభ్యర్థులు గంట ముందుగానే సంబంధిత పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని జిల్లా పంచాయతీ అధికారి సురేశ్బా బు సూచించారు. పరీక్ష ప్రారంభమైన తర్వాత ఐదు నిమిషాల వరకు ఎవరైనా ఆలస్యంగా వస్తే లోనికి అనుమతిస్తామన్నారు. ఆ తర్వాత ఎవరికీ లోనికి అనుమతి ఉండదన్నారు. అభ్యర్థులకు పలు సూచనలు... ఓఎంఆర్ షీట్పై అనవసర రాతలు రాయవద్దు. మరో షీట్ ఇవ్వబడదు. పరీక్ష కేంద్రంలోకి సెల్ఫోన్, కాలుక్యులేటర్ ఇతర ఎలాంటి ఎలాక్ట్రానిక్ వస్తువులు తీసుకెళ్లరాదు. పరీక్ష రాసేందుకు బ్లూ, బ్లాక్ బాల్ పాయింట్ పెన్ మాత్రమే వాడాలి. జెల్ పెన్ గానీ పెన్సిల్ గాని ఉపయోగించరాదు. జవాబు పత్రంలో సైడ్-1లో ఇచ్చిన స్థలంలో అభ్యర్థి సంతకం చేయాలి. మాస్ కాపీయింగ్కు పాల్పడిన వారిపై కేసు నమోదు చేస్తారు. -
త్వరలో జీపీ కార్యదర్శుల నియామకం
జిల్లాకు 350 పోస్టులు విడుదలైన నోటిఫికేషన్ పాలమూరు, న్యూస్లైన్ : నిరుద్యోగులకు కొత్త సంవత్సరం కానుకగా ఉద్యోగాల భర్తీకి సిద్ధమవుతోంది. అందులో భాగంగానే ప్రభుత్వం గ్రామ పంచాయతీ కార్యదర్శుల నియామకానికి నోటిఫికేషన్ జారీ చేసింది. రా ష్ట్ర వ్యాప్తంగా 2,677 పోస్టులను నిర్ణయించగా అందులో మహబూబ్నగర్ జి ల్లాకు 350 జీపీ కార్యదర్శుల పోస్టులను కేటాయించింది. డిగ్రీ విద్యార్హతతో చేపట్టనున్న ఈ నియామకాలకోసం జిల్లా వ్యాప్తంగా దాదాపు 40 వేల మంది నిరుద్యోగులు ఆశగా ఎదురు చూస్తున్నారు. సోమవారం ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శుల నియామకాని కి నోటిఫికేషన్ జారీ కావడంతో ప్రభుత్వ ఉద్యోగాలకోసం అభ్యర్థుల ఎదురు చూ పులకు తెరపడింది. వచ్చేనెల 4వ తేది నుంచి 22 వరకు దరఖాస్తుల స్వీకరణ చేపట్టనున్నారు. దరఖాస్తుదారులు జనవరి 20వ తేది లోపు రూ.100 రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఉద్యోగార్ధు ల వయసు 18 నుంచి 36 ఏళ్లుగా నిర్ధారించారు. వేత నం స్కేల్ రూ.7,520 నుంచి రూ.22,430 గా నిర్ణయిం చారు. పంచాయతీ కార్యదర్శుల నియామకానికి దరఖాస్తు చేసుకున్న వారికి పరీక్ష విధానం ద్వారా ఎంపిక చేయనున్నారు. పేపర్-1 పరీక్షలో జనరల్ స్టడీస్ అం శాలు, పేపర్-2లో గ్రామీణాభివృద్ధి, గ్రామాల్లో నెల కొన్న సమస్యలు, మన రాష్ట్రంలోని అంశాలను ప్రత్యేక ఉదాహరణలతో వివరించే విధంగా ప్రశ్నాపత్రం ఉం టుంది. పేపర్-1, పేపర్-2 పరీక్షలు ప్రతీ పేపర్ గం టన్నర కేటాయిస్తారు. ఒక్కో ప్రశ్న పత్రంలో 150 ప్రశ్నలకు గాను 150 మార్కులు ఉంటాయి. పంచాయతీ కా ర్యదర్శుల నియామకానికి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయడంతో నిరుద్యోగుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. కేటగిరీల వారిగా పోస్టుల వివరాలిలా...