-
అమ్మ కోసం ఆస్పత్రి గోడెక్కి కిటికీ దగ్గరే జపం
ఈస్ట్ జెరూసలేం: పేరు తెలిసిన వారికి కరోనా సోకితేనే అయ్యో, పాపం అని సానుభూతి చూపిస్తాం. అదే కుటుంబ సభ్యులకే పాజిటివ్ అని తెలిస్తే ఎప్పుడు ఏమవుతుందోనని భయంతో బతుకుతాం. ఈ భయమే పాలస్తీనాలోని ఓ వ్యక్తిని వెంటాడింది. వెస్ట్ బ్యాంక్కు చెందిన జిహాద్ అల్ సువైతీ అనే వ్యక్తి తల్లి రష్మీ సువైతీ(73)కి కరోనా సోకింది. అప్పటి నుంచి అతని మనసు మనసులో లేదు. అమ్మే ప్రాణంగా బతుకుతున్న ఆ వ్యక్తి వెంటనే తల్లిని ఆస్పత్రిలో చేర్పించాడు. అప్పటికే ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయితే ఆమె ఎలా ఉందో చూడాలని ఒకటే తహతహలాడిపోయేవాడు. దగ్గరికి వెళ్తే కరోనా సోకుతుందన్న భయం, అమ్మను చూడకుండా ఉండలేని నిస్సహాయత.. వెరసి ఒక ఆలోచన చేశాడు. ఆస్పత్రి గోడెక్కి కిటికీ దగ్గర కూర్చుండి, అక్కడి నుంచి ఆమె తల్లిని కళ్లారా చూసుకునేవాడు. (కరోనా బాధితురాలిని ఇంటికి రానివ్వని అత్త) ఇలా ప్రతీరోజు జరుగుతూ ఉండేది. ఇంతలో హఠాత్తుగా ఆమె తల్లిని కరోనా కబళించింది. మంగళవారం సాయంత్రం కొడుకును తనివితీరా చూసుకున్న కొద్దిసేపటికే ఆ తల్లి ప్రాణాలు విడిచింది. ఈ విషయాన్నంతటినీ సామాజిక కార్యకర్త మొహమ్మద్ సఫా సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. తల్లి కోసం తల్లడిల్లిన వ్యక్తి ఫొటోను సైతం పంచుకున్నారు. ప్రస్తుతం ఈ పోస్టు వైరల్గా మారింది. "కంట నీళ్లు ఆగడం లేదు", "మాటలు రావడం లేదు, కన్నీళ్లు మాత్రం జలజలా రాలుతున్నాయి", "నిజంగా ఎంత గొప్ప కొడుకు, ఇది చదువుతుంటే నాకు తెలీకుండానే కళ్లల్లో నీళ్లు సుడులు తిరుగుతున్నాయి" అంటూ నెటిజన్లు భావోద్వేగానికి లోనవుతున్నారు. కాగా పాలస్తీనాలో ఇప్పటివరకు మొత్తం 8 వేల కేసులు నమోదవగా 60 మంది మరణించారు. (ఇంకోసారి కనిపిస్తే, దాని పీడ వదిలించుకుంటా) -
విషాదం.. 69 మంది పిల్లలకు జన్మను ఇచ్చి..
గాజా: పాలస్తీనాకు చెందిన 40 ఏళ్ల మహిళ 69 మంది పిల్లలకు జన్మనిచ్చి మరణించింది. ఆమెకు ప్రతికాన్పులో కవల పిల్లలే పుట్టారు. ఆమె ఇంతకుముందు 16 సార్లు కవలలకు (ఇద్దరు) జన్మను ఇచ్చింది. ఏడు కాన్పుల్లో ముగ్గురేసి పిల్లలు, మరో నాలుగుసార్లు నలుగురు చొప్పున పిల్లలు జన్మించారు. ఇలా మొత్తం 69 మంది జన్మించారు. గత ఆదివారం గాజాలో ఆమె ప్రసవ సమయంలో మరణించింది. ఆమె ఎవరు, పేరు, భర్త వివరాలు తెలియరాలేదు. కాగా గిన్నిస్ బుక్ రికార్డుల ప్రకారం ఇంతమంది పిల్లలను కనడం ఇదే తొలిసారి కాదు. రష్యాకు చెందిన వాసిల్వేయా అనే మహిళ 69 మంది పిల్లలకు జన్మను ఇచ్చింది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
లక్నోను చిత్తు చేసిన కేకేఆర్.. 98 పరుగుల తేడాతో ఘన విజయం
IPL 2024: చరిత్ర సృష్టించిన జడేజా.. ధోని రికార్డు బద్దలు
జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement