breaking news
Orchid The International School
-
కామాంధుడు జైలు పాలు
ఆర్కిడ్ ది ఇంటర్నేషనల్ స్కూల్ కేసులో.. ఆరు రోజుల పోలీస్ కస్టడీకి గుండప్ప నేటి నుంచి స్కూల్ ప్రారంభం... గట్టి నిఘా బెంగళూరు : ఇక్కడి జాలహళ్లి మెయిన్ రోడ్డులోని ఆర్కిడ్ ది ఇంటర్నేషనల్ స్కూల్లో ఎల్కేజీ చదువుతున్న మూడున్నర సంవత్సరాల చిన్నారిపై అత్యాచారం చేసిన కేసులో గుండప్ప అలియాస్ గుండన్న (45)జైలు పాలు అయ్యాడు. అతన్ని బెంగళూరు సీసీబీ పోలీసులు ఇక్కడి ఎంఎస్ రామయ్య ఆస్పత్రికి ఆదివారం తీసుకు వెళ్లి వైద్య పరీక్షలు చేయించారు. సాయంత్రం కోరమంగలలో నివాసం ఉంటున్న 51వ ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి శోభా గౌడర్ ముందు హాజరు పరిచారు. నిందితుడిని పూర్తి విచారణ చేసి మరిన్ని వివరాలు సేకరించడానికి సమయం కావాలని, మరికొన్ని రోజులు తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు మనవి చేశారు. దీంతో గుండన్నను ఆరు రోజులు కస్టడీకి తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. దీంతో పోలీసులు గుండప్పను జాలహళ్ళి పోలీస్ స్టేషన్కు తీసుకు వెళ్లి విచారణ చేస్తున్నారు. కాగా, గుండప్ప తన కుటుంబ సభ్యులతో కలిసి ఇక్కడి ఏకే కాలనీలో నివాసముంటున్నాడు. ఇతను రెండు సంవత్సరాల నుంచి ఆర్కిడ్ స్కూల్లో అటెండర్గా పని చేస్తున్నాడు. నేరాన్ని అంగీకరించాడు.. బెంగళూరు నగర పోలీసు కమిషనర్ ఎం.ఎన్. రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. గుండప్ప నేరం చేసినట్లు స్వయంగా అంగీకరించడంతో శనివారం సాయంత్రం అరెస్ట్ చేశామన్నారు. ఈ కేసు డీసీపీ సురేష్ నేతృత్వంలో మల్లేశ్వరం ఏసీపీ ఫాతిమా ఆధ్వర్యంలో దర్యాప్తు చేయిస్తున్నట్లు తెలిపారు. గుర్తు పట్టిన బాలిక... ఆర్కిడ్ స్కూల్లో పని చేస్తున్న 11 మంది టీచర్లతో పాటు అక్కడ పని చేస్తున్న వారి ఫొటోలు సేకరించిన పోలీసులు.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలికకు చూపించారు. గుండప్ప పొటోను చూసిన ఆ బాలిక ‘ ఈ అంకుల్ నన్ను కొట్టాడు..... ఎన్ని సార్లు చెప్పాలి..’ అంటూ హిందీలో చెప్పింది. కాగా, స్కూల్ ట్రస్ట్ అధికారులు ఇప్పటికీ అజ్ఞాతంలోనే ఉన్నారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. బాలికపై అత్యాచారం జరగడంతో ఐదు రోజుల నుంచి మూతపడిన ఆర్కిడ్ ది ఇంటర్నేషనల్ స్కూల్ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. -
అటెండరే దోషి!
ఆర్కిడ్ ది ఇంటర్నేషనల్ స్కూల్ కేసు .. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు ? నేడు అధికారికంగా ప్రకటించనున్న పోలీసులు బెంగళూరు : ఇక్కడి జాలహళ్లి మెయిన్ రోడ్డులోని ఆర్కిడ్ ది ఇంటర్నేషనల్ స్కూల్లో చిన్నారిపై అత్యాచారం చేసిన వ్యక్తిని బెంగళూరు సీసీబీ పోలీసులు శనివారం రాత్రి అరెస్ట్ చేసినట్లు సమాచారం. ఆ స్కూల్లో అటెండర్గా పని చేస్తున్న గుండన్న అలియాస్ గుండప్పను పోలీసులు దోషిగా గుర్తించినట్లు తెల్సింది. గత మంగళవారం ఆర్కిడ్ స్కూల్లో ఎల్కేజీ చదువుతున్న మూడున్నర సంవత్సరాల చిన్నారిపై అత్యాచారం జరిగిందని పోలీసులు బుధవారం కేసు నమోదు చేసిన విషయం తెల్సిందే. ఆ కేసుకు సంబంధించి ఆర్కిడ్ స్కూల్లో పని చేస్తున్న అందరినీ పోలీసులు విచారణ చేశారు. గుండన్నను గురువారం రాత్రి సీసీబీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనికి వైద్య పరీక్షలు నిర్వహించారు. శనివారం సాయంత్రం వైద్య నివేదికలు అందడంతో గుండన్నను అరెస్ట్ చేసినట్లు సమాచారం. ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. నేటి నుంచి స్కూల్ .. ఆ స్కూల్లో బెంగళూరు నగర పోలీసు కమిషనర్ ఎంఎన్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పోలీసు అధికారులు అలోక్కుమార్, అభిషేక్ ఘోయల్, సురేష్, ఆర్కిడ్ స్కూల్ చైర్మన్ వెంకటనారాయణరెడ్డి, విద్యార్థుల కుటుంబ సభ్యులతో ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ సభ్యులు (14 మంది), కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. సోమవారం నుంచి స్కూల్ ప్రారంభించాలని పలువురు విద్యార్థుల కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. లేకుంటే తమ పిల్లల భవిష్యత్ దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం నుంచి స్కూల్ ప్రారంభించడానికి స్కూల్ యాజమాన్యం, విద్యార్థుల కుటుంబ సభ్యులు నిర్ణయించారు. విద్యార్థుల పూర్తి భ ద్రతకు యాజమాన్యం బాధ్యత వహించాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. ఎం.ఎన్. రెడ్డి మాట్లాడుతూ.. స్కూల్లో పలు చోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, ప్రతి స్కూల్ వ్యాన్లో మహిళా టీచర్ లేదా ఆయాను పెట్టాలని సూచించామని అన్నారు. అనుమతి లేదు.. నర్సరీ, ఎల్కేజీ, యుకేజీ, ఆరు, ఏడో తరగతుల నిర్వహణకు విద్యాశాఖ అధికారి బీఈఓ నుంచి ఈ స్కూల్ యాజమాన్యం ఎలాంటి అనుమతి తీసుకోలేదని వెలుగు చూసింది. అర్కిల్ స్కూల్ విద్యాభ్యాసం చేస్తున్న 952 మంది విద్యార్థుల కుటుంబ సభ్యులను మోసం చేశారని ఆరోపిస్తూ కేఆర్కే రెడ్డి, పాఠశాల హెడ్మాస్టర్ కే దుర్గా, స్కూల్ ఉపాధ్యక్షురాలు వై శిల్ప, ప్రధాన కార్యదర్శి సురేంద్రబాబుపై కేసులు నమోదు చేశామని డీసీసీ సురేష్ కుమార్ తెలిపారు. తెలంగాణ రాజధాని హైదరాబాద్కు చెందిన ఆర్కిడ్ స్కూల్ యాజమాన్యం శ్రీ గౌతమ్ అకాడమి ఆఫ్ జనరల్ అండ్ టెక్నాలజి ఎడ్యుకేషన్ సొసైటీ పేరుతో ఈ విద్యా సంస్థను నిర్వహిన్నారని తెలిపారు.