breaking news
Operation Smile-3
-
ఆపరేషన్ స్మైల్
తప్పిపోయిన పిల్లలు తల్లిదండ్రుల చెంతకు.. • బాల కార్మికులకు విముక్తి • స్పెషల్ డ్రైవ్లో 103 మంది గుర్తింపు తప్పిపోయిన పిల్లలు బాలకార్మికులుగా మారిపోతున్నారు. వారిని గుర్తించి తల్లిదండ్రుల వద్దకు చేర్చడమే లక్ష్యంగా ఆపరేషన్ స్మైల్–3 నిర్వహిస్తున్నారు. కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ నెల 1 నుంచి 31వ తేదీ వరకు కార్యాచరణ రూపొందించి అమలు చేస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 103 మంది బాలకార్మికులను గుర్తించారు. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు బాలకార్మికులు, తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించి ఇళ్లకు చేర్చుతున్నారు. కొందరిని చైల్డ్ వెల్ఫేర్ సెంటర్కు తీసుకెళ్తున్నారు. – సత్తుపల్లి హెల్ప్లైన్కు సమాచారమివ్వాలి ఆపరేషన్ స్మైల్–3తో అనాథ పిల్లలు, వీధి బాలలకు పునరావాసం కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చి వారి పిల్లలు చదువుకునేలా ప్రోత్సహిస్తున్నాం. చదువు లేనివారికి వృత్తి నైపుణ్యం పెంపొందించే కోర్సులు నేర్పిస్తున్నాం. ఎవరైనా బాలకార్మికులను గుర్తిస్తే చైల్డ్ హెల్ప్లైన్ నంబర్ 1098కు సమాచారం ఇవ్వాలి. –టి.విష్ణువందన , జిల్లా బాలల సంరక్షణాధికారిణి సత్తుపల్లి: బస్టాండ్లు.. రైల్వేస్టేషన్లు.. వీధుల్లో 18 సంవత్సరాలలోపు వయసు కలిగిన పిల్లలు యాచక వృత్తిలో ఉన్నా.. పనుల్లో ఉన్నా.. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ప్రత్యేక డ్రైవ్ చేపట్టి గుర్తించి కౌన్సెలింగ్ ఇస్తోంది. తల్లిదండ్రులు ఉన్నప్పటికీ కొందరు పిల్లలు వీధుల్లో అల్లరిచిల్లరగా తిరుగుతుండటం.. ఇళ్లల్లో పని చేస్తుండటం ప్రత్యేక బృందాల దృష్టికి వస్తున్నాయి. ఈ క్రమంలో కమిటీ సభ్యులు బాలల తల్లిదండ్రులను కలిసి కౌన్సెలింగ్ కూడా నిర్వహిస్తున్నారు. ఖమ్మం చైల్డ్ వెల్ఫేర్ సెంటర్ ద్వారా 18 ఏళ్ల వయసు వచ్చే వరకు చదివించటం, భోజన సదుపాయంతో పాటు వసతి కల్పిస్తామని, నిరుపేద తల్లిదండ్రులు తమ పిల్లలను వీధుల్లోకి వదిలేయకుండా ఈ కేంద్రానికి తరలించాలని ప్రత్యేక బృందాలు చెబుతున్నాయి. పనుల్లో ఉన్న బాలబాలికలను.. రాజస్థాన్, ఒడిశా, బిహార్, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి వచ్చి జిల్లాలో వివిధ పనులు చేస్తున్న బాలబాలికలను గుర్తించారు. వారి సొంత ప్రాంతాలను గుర్తించి తల్లిదండ్రుల వద్దకు చేర్చేందుకు అధికారులు ప్రయత్నాలు చేపట్టారు. సత్తుపల్లి డివిజన్లో సత్తుపల్లిలో 22 మంది, పెనుబల్లిలో 63 మంది బడిబయట పిల్లలు ఉన్నట్లు గుర్తించారు. బడిబయట పిల్లలకు ఎంఈఓ, క్లస్టర్ రిసోర్స్ పర్సన్ సహకారంతో కౌన్సెలింగ్ చేపడుతున్నారు. జువైనల్ జస్టిస్ చట్టం ప్రకారం.. మొదటివారంలో జిల్లాలో అనాథ పిల్లలతో అనాథాశ్రమాలు నడుపుతున్న కేంద్రాలను చైల్డ్వెల్ఫేర్ కమిటీ సభ్యులు పరిశీలించారు. రెండో వారంలో వీధి బాలలను గుర్తించి తల్లిదండ్రులతో కౌన్సెలింగ్ నిర్వహించారు. ఇక మూడో వారంలో 14 ఏళ్లలోపు బాలబాలికలు షాపుల్లో ఎక్కడైన పని చేస్తున్నట్లయితే.. యజమానులపై కార్మిక శాఖ అధికారి ద్వారా కేసు నమోదు చేస్తారు. నాలుగో వారంలో యాచక వృత్తిలో ఉన్న పిల్లలను గుర్తిస్తారు. పసిపిల్లలను జోలెలో వేసుకుని తిరుగుతూ యాచన చేస్తున్న వారిపై జువైనల్ జస్టిస్ యాక్ట్ కింద కేసు నమోదు చేస్తారు. సబ్ డివిజన్కో ప్రత్యేక బృందం.. జిల్లాలోని మూడు పోలీస్ సబ్ డివిజన్లకు ఒక్కో స్పెషల్ టీంను నియమించారు. ఈ ప్రత్యేక బృందాల్లో ఒక ఎస్ఐ, పోలీస్ సిబ్బంది, ఐసీడీఎస్ అధికారులు, మైనార్టీ సంక్షేమశాఖ, కార్మికశాఖ, విద్యాశాఖల అధికారులు ఉంటారు. ఆపరేషన్ స్మైల్–3 విజయవంతం కోసం ఈ బృందాలు సబ్డివిజన్ వారీగా పర్యవేక్షిస్తున్నాయి. ప్రత్యేక బృందాలు సబ్డివిజన్ వారీగా గస్తీ తిరుగుతూ వీధి బాలలను గుర్తించే పనిలో నిమగ్నమయ్యాయి. షాపులు, హోటళ్లు, రెస్టారెంట్లు, వ్యాపార సంస్థల్లో పనిచేస్తున్న బాల కార్మికులను గుర్తించి విముక్తి కల్పించేందుకు ఈ బృందాలు కృషి చేస్తున్నాయి. మేం సహకరిస్తున్నాం.. బాలకార్మికుల వ్యవస్థను నిర్మూలించేందుకు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి సంపూర్ణ సహకారం అందిస్తున్నాం. సత్తుపల్లి డివిజన్లో 37 మంది బాలురు, ఏడుగురు బాలికలను గుర్తించాం. పిల్లలను పనిలో పెట్టుకోవటం చట్టరీత్యానేరం. ఈ టీమ్లో పోలీస్శాఖ నుంచి ఒక ఎస్ఐ , కానిస్టేబుళ్లు ఉంటారన్నారు. –బల్లా రాజేష్, డీఎస్పీ, సత్తుపల్లి -
48 మంది బాలకార్మికులకు విముక్తి
కోదాడఅర్బన్ : దేశంలో బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించేందుకు, తప్పిపోయిన పిల్లలను గుర్తించేందుకు, అనాథ పిల్లలకు రక్షణ కల్పించేందుకు నిర్వహిస్తున్న ఆపరేషన్ స్మైల్–3లో భాగంగా ఇప్పటివరకు 48మంది బాలకార్మికులకు విముక్తి కల్పించినట్లు కోదాడ డీఎస్పీ ఎ.రమణారెడ్డి తెలిపారు. బుధవారం కోదాడ పట్టణంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కోదాడ సబ్డివిజన్ పరిధిలో చేపట్టిన ఆపరేషన్ స్మైల్–3 కార్యక్రమ వివరాలను వెల్లడించారు. పోలీస్, రెవెన్యూ, కార్మిక, ఐసీడీఎస్ సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 1నుంచి 31వ తేదీ వరకు నిర్వహించే ఈ కార్యక్రమంలో పోలీస్శాఖ తరపున నేరేడుచర్ల ఎస్ఐతో పాటు ఒక మహిళా కానిస్టేబుల్, ముగ్గురు కానిస్టేబుళ్లు పాల్గొంటున్నట్లు తెలిపారు. కోదాడ సబ్డివిజన్ పరిధిలోని కోదాడ పట్టణ, రూరల్, హుజూర్నగర్, నేరేడేచర్ల, మునగాల పోలీస్స్టేషన్ల పరిధిలో మొత్తం 48 మంది బాల కార్మికులను గుర్తించినట్లు తెలిపారు. వీరిలో 35మంది ఇటుకబట్టీల్లో పనిచేస్తున్నారని తెలిపారు. బాలకార్మిక వ్యవస్థ నుండి విముక్తి కల్పించిన తరువాత వారిని శిశుసంక్షే మ కమిటీ ఎదుట హాజరుపరిచి పాఠశాలకు పంపేలా చర్య లు తీసుకుంటామన్నారు. అనాథ విద్యార్థులను గుర్తించి వా రి రక్షణ, సంక్షేమానికి చర్యలు చేపడతామన్నారు. బాలకార్మికుల సమాచారం తెలిసినవారు 94407 00085 నంబర్కు గా నీ, 1098 హెల్ఫ్లైన్ నంబర్లో కానీ ఆ వివరాలను తెలి యపర్చాలని కోరారు. అదేవిధంగా తన మొబైల్ నంబర్ 83329 02421కు కూడా వివరాలు తెలియజేయవచ్చన్నారు. సమావేశంలో సీఐలు రజితారెడ్డి, మధుసూదన్రెడ్డి, నర్సింహారెడ్డి, ఆపరేషన్ స్మైల్ ఇన్చార్జ్ ఎస్ఐ గోపి ఉన్నారు. పీఏపల్లిలో ముగ్గురు.. పెద్దఅడిశర్లపల్లి : ఆపరేషన్ స్మైల్లో భాగంగా ఇటుకల బట్టిలో పనిచేస్తున్న ముగ్గురు బాల కార్మికులకు గుడిపల్లి పోలీసులు విముక్తి కల్పించారు. గుడిపల్లి ఎస్ఐ రాఘవేందర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. పీఏపల్లి మండలంలోని అంగడిపేట ఎక్స్ రోడ్డు వద్ద ఇటుకల బట్టిలో పని చేస్తున్న ముగ్గురు బాల కార్మికులు రంజిత్, రాజేశ్, రజితను గుర్తించి విముక్తులను చేసి నిర్వాహకుడి అరెస్ట్ చేశామని తెలిపారు. ఎస్ఐ వెంట సిబ్బంది ఉన్నారు.