-
అయ్యా! బతికే ఉన్నాను అని వేడుకుంటున్న వృద్ధుడు: వీడియో వైరల్
ఒక వృద్ధుడికి తాను బతికే ఉన్నానని నిరూపించకోవాల్సిన దుస్థితి వచ్చింది. అందుకోసం ఏకంగా పెళ్లికొడుకులా రథంలో ఊరేగుతూ వచ్చి తాను బతికే ఉన్నానని చెప్పుకొంటున్నాడు. ఈ ఘటన హర్యానాలో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే....హర్యానాలోని 102 ఏళ్ల వృద్ధుడు ప్రభ్తత్వ రికార్డులో చనిపోయినట్లు ఉంది. అతను రోహ్తక్ జిల్లాలోని గాంధ్రా గ్రామానికి చెందిన దులిచంద్ అనే వృద్ధుడు. ఆ వృద్ధుడు ప్లకార్డులు పట్టుకుని, మెడలో కరెన్సీ దండను ధరించి మానసరోవర్ నుంచి కెనాల్ రెస్ట్ హౌస్కి రథంపై ఊరేగుతూ....బతికే ఉన్నానని చెబుతున్నాడు. తాను మార్చిలో చివరిసారిగా వృద్ధాప్య ఫించన్ను తీసుకున్నట్లు తెలిపారు. ప్రభుత్వ రికార్డుల్లో చనిపోయి ఉండటంతో తన ఫెన్షన్ ఆగిపోయిందని చెప్పుకొచ్చారు. తన మనవడు ఈ విషయమై ప్రభుత్వ అధికారులకు ఫిర్యాదులు చేసిన ప్రయోజనం కనిపించలేదని వాపోయాడు. ఆ వృద్ధుడు తాను బతికే ఉన్నానంటూ ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ స్టేట్మెంట్లతో సహా ఇతర గుర్తింపు పత్రాలను చూపిస్తున్నాడు. అతను హర్యానా ఆమ్ఆద్మీ పార్టీ(ఆప్) మాజీ అధ్యక్షుడు నవీన్ జైహింద్ని కలిని తన గోడును వినిపించారు. ఆయన ఆ వృద్ధుడికి తిరిగి ఫెన్షన్ పొందేలా చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఇలా వృద్ధుల ఫించన్ని నిలిపి ఇబ్బందులకు గురి చేయడం దురదృష్టకరమని అన్నారు. తాను సీఎంకి ఈ విషయమై ఫిర్యాదు చేసినప్పటికి ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెప్పారు. అంతేకాదు నవీన్ జైహింద్ ఆ వృద్ధుడిని తీసుకుని బీజేపీ నాయకుడు మనీష గ్రోవర్ని కలిసి అతనికి రావాల్సిన ఫించన్ని ఇప్పించవలిసిందిగా కోరారు. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. हरियाणवी फिल्म, थारा फूफा जिन्दा है अभिनेता -दुलीचंद ज़िंदा ( 102 वर्षीय ) निर्माता निर्देशक, नवीन जयहिंद गीत संगीत, बेरोजगार बैंड पार्टी रोहतक कहानी-हरियाणा सरकार के कुछ अधिकारी जिन्होंने ज़िंदा दुलीचंद को मृत बता काट दी बुढ़ापा पेंशन @NaveenJaihind @DeependerSHooda pic.twitter.com/EtZVA4qvMh — Puspendra Singh Rajput हरियाणा अब तक (@psrajput75) September 8, 2022 (చదవండి: వాసనను బట్టి వ్యాధిని చెప్పేస్తున్న వైద్యురాలు... ఆశ్చర్యపోతున్న వైద్యులు) -
పింఛన్ల పునరుద్ధరణకు హైకోర్టు ఆదేశం
ఎచ్చెర్ల : తొలగించిన పింఛన్లు పునరుద్ధరించాలని కోరుతూ హైకోర్టును ఆశ్రరుుంచిన బాధితులకు న్యాయం జరిగింది. వివరాల్లోకి వెళ్తే... తమ పింఛన్లను జన్మభూమి- మా ఊరు కమిటీలు అకారణంగా తొలగించాయని, అర్హత ఉన్నా రాజకీయ కక్ష నేపథ్యంలో తమ జీవనాధారాన్ని దెబ్బ తీశారని ఫరీదుపేట గ్రామానికి చెందిన ఆరుగురు హైకోర్టును ఆశ్రయించారు. తాము జనవరి 21న కోర్టును ఆశ్రరుుంచగా అనుకూలంగా కోర్టు ఉత్తర్వుల ప్రతి బుధవారం అందిందని వారు చెప్పారు. తమలో పైడి అప్పారావు, కొత్తకోట చెల్లన్నలకు వృద్ధాప్య పింఛన్, కొత్తకోట పద్మావతికి వికలాంగ పింఛన్ పునరుద్దరించాలని ఉత్వర్వుల్లో పేర్కొన్నట్టు తెలిపారు. కొత్తకోట అమ్మాయమ్మ, కొత్తకోట సూర్యనారాయణ(అర్జెంట్ నోటీస్)లకు ఎందుకు కొత్త పింఛన్లు అందజేయడం లేదో చెప్పాలని, సూర లక్ష్మీనర్సమ్మ అర్హతను ఎందుకు పరిగణనలోకి తీసుకోవడం లేదో చెప్పాలని కోర్టు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నట్టు చెప్పారు. బాధితులు ఎంపీడీఓ, గ్రామ, మండల జన్మభూమి కమిటీలు, గ్రామ కార్యదర్శి, డీఆర్డీఏ పీడీ, కలెక్టర్, రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ కార్యనిర్వహణ అధికారులను పార్టీలుగా చేర్చారు. -
కలెక్టర్గారు ‘కరుణ’ చూపరూ..
ములుగు : కూలీ పనులు చేసేందుకు సత్తువలేని తనకు వృద్ధాప్య పింఛన్ అందించి ఆదుకోవాలని మండల కేంద్రానికి చెందిన బత్తిని సంజీవులు కలెక్టర్ను కోరుతున్నారు. వివరాలిలా ఉన్నారుు. మం డల కేంద్రంలోని కోర్టు ఎదురుగా నివాసముం టున్న సంజీవులకు 65 ఏళ్ల వయస్సు ఉంటుంది. అరుుతే అతడికి ఇద్దరు కుమారులు ఉండగా.. స్థానికంగా ఉపాధి లేకపోవడంతో వారు హైదరాబాద్ పట్టణానికి కొన్ని నెలల క్రితం వలస వెళ్లారు. కాగా, భార్య మూడేళ్ల క్రితం చనిపోరుుంది. అరుుతే ప్రస్తుతం కొడుకులు దగ్గర లేకపోవడంతో సంజీవులు కోర్టు ఎదురుగా ఉన్న తన ఇంట్లో ఒం టరిగా ఉంటున్నాడు. కాగా, నిరుపేద కుటుంబాని కి చెందిన సంజీవులకు ప్రభుత్వ నిభందనల ప్రకారం వృద్ధాప్య పింఛన్, రేషన్ సరుకులు అం దాల్సి ఉంది. అరుుతే అధికారుల నిర్లక్ష్యంతో ఇప్పటివరకు ఆయనకు ఎలాంటి పథకాలు అందడంలేదు. పింఛన్, ఆహార భద్రత కార్డు కోసం ఇప్పటివరకు మూడుసార్లు దరఖాస్తు చేస్తుకున్న తిరస్కరణకు గురయ్యూయని సంజీవులు ‘సాక్షి’ ఎదుట వాపోయూరు. కాగా, ఆకలిమంటను తట్టుకోలేక, అయిన వాళ్లు అందుబాటులో లేక ఏంచేయాలో తోచని స్థితిలో పట్టణంలోని పలు ఇళ్లల్లో భిక్షాటన చేస్తూ జీవిస్తున్నట్లు ఆయన కన్నీటి పర్యంతమయ్యూడు. కలెక్టర్ ప్రత్యేక చొరవచూపి తనకు పిం ఛన్, ఆహార భద్రత కార్డులు అందించేందుకు కృషి చేయూలని ఆయన విజ్ఞప్తి చేస్తున్నాడు. -
బేషరతుగా వృద్ధాప్య ఫించను
తెలంగాణ రాష్ట్రంలో వృద్ధాప్య పెన్షన్లు రద్దుకావడంతోనో, మం జూరు కాలేదనే బెంగతోనో వృద్ధులు పెద్ద సంఖ్యలో మరణిస్తున్నారని వార్తలు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏమాత్రం జాగు చేయ కుండా, కనీసం 58 ఏళ్లు పైబడిన వృద్ధులందరకు బేషరతుగా వృద్ధాప్య పింఛన్లను మంజూరు చేయాలి. ఒక ఇంట్లో ఒకరికంటే ఎక్కువ పెన్షన్లు ఉండరాదనే షరతును తొలగించాలి. వృద్ధులు, వితంతువులు ఒక ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఉన్న సందర్భాలు అనేకం ఉన్నాయి. వీరందరికీ బేషరతుగా పెన్షన్లు ఇవ్వాలి. అలాగే అప్పుల భారంతో మరణించిన రైతుల విషయంలో ఆయా ప్రాంతాల్లో అఖిలపక్ష నాయకుల ద్వారా సమాచారం సేకరించి వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం కనీసం రూ.3 లక్షలకు తగ్గకుండా సహాయం చేయాలి. ప్రభుత్వ హామీల ను, వాగ్దానాలను నెరవేర్చడానికి ప్రభుత్వ స్థలాలను, భూములను అమ్మాలనే తలంపును విరమించుకోవాలి. తాత్కాలిక అవసరాల కోసం స్థిరాస్తులను అమ్మడం అసమంజసం. రాబోయే కాలాల్లో భూసేకరణ అసాధ్యం కావచ్చు. నిధుల సేకరణ కోసం ఇతర మార్గాలను అన్వేషించాలి. ప్రజలను భారీగా పొదుపు చేసే విధానాలను చేపట్టి వారిని ప్రోత్సహించి భాగస్వాములను చేయాలి. ఆస్తులను తెగనమ్మి అభివృద్ధి చేయడాన్ని ప్రజలు హర్షించరు. - కొండవీటి దామోదర్ రెడ్డి, నల్లగొండ -
బతికుండగానే చంపేశారు !
సర్వే సిబ్బంది వింతలీలలు వీఆర్పురం: ఈ ఫొటోలో కనిపిస్తున్న వృద్ధుడి పేరు పుల్లెందుల పుల్లయ్య. వయస్సు 80 ఏళ్లు. వీఆర్పురం మండలం వడ్డిగూడెం గ్రామం. ఇతడికి కొన్ని సంవత్సరాలుగా నెలకు రూ.200 వృద్ధాప్య పింఛన్ వస్తోంది. ఈ పింఛన్ను నెలకు రూ.వెయ్యికి పెంచుతున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించగానే తనకు ఐదు రెట్లు అదనంగా డబ్బులొస్తాయని సంతోషించాడు. అయితే సర్వే అధికారుల నిర్వాకంతో అతడి ఆశలన్నీ అడియాశలయ్యాయి. నాలుగు రోజుల క్రితం గ్రామానికి వచ్చిన పింఛన్ సిబ్బందికి తన కార్డు చూపించి పెన్షన్ ఇవ్వమని కోరగా.. ‘నీవు చనిపోయినట్లు జాబితాలో ఉందని, అందుకే నీకు పింఛన్ మంజూరు కాలేద’ని సమాధానం ఇవ్వడంతో పుల్లయ్య కంగుతిన్నాడు. తాను పేదవాడినని, ఆదుకునేందుకు కూడా ఎవరూ లేరని, ఎలాగైనా తన పింఛన్ ఇప్పించాలని కోరుతున్నాడు. దీనిపై ఎంపీడీవో లక్ష్మీభాయిని వివరణ కోరగా, సర్వే జాబితాలో పుల్లయ్య చనిపోయినట్లుగా కోడ్ 11 వేసి ఉందని, ఆ జాబితా ఆధారంగానే లబ్ధిదారుల పేర్లు అప్లోడ్ చేస్తామని చెప్పారు. పుల్లయ్య బతికే ఉన్నట్లు ప్రస్తుత విచారణలో తేలిందని, అతడికి పింఛన్ మంజూరయ్యేలా ప్రత్యేక దృష్టి సారిస్తానని తెలిపారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బాబు, లోకేష్ కు నోటీసులు..?
స్టార్ ప్రొడ్యూసర్ పరువు తీసిన కామెడీ షో.. ఇన్ స్టా పోస్ట్ వైరల్
చిరంజీవి గురించి నేను ఏనాడూ మాట్లాడలేదు: ముద్రగడ
అప్పుడు భాషాలా.. ఇప్పుడు దావూద్ ఇబ్రహీంలా..
ప్రచారంలో దూసుకుపోతున్న జగన్
‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
అందుకేనా అమిత్ షా అలా మాట్లాడింది!
ఎండగంట పడకుండా..
పోలింగ్ నిబంధనలు పాటించాల్సిందే..
తస్మాత్ జాగ్రత్త
తప్పక చదవండి
- ఐపీఎల్లో నేడు (మే 6) మరో బిగ్ మ్యాచ్
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- గుండె ఘోష విన్నారు..
- ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేశ్
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- ఇలాగేనా మాట్లాడేది?
- జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
Advertisement