Nuwan Thusahara
-
ఆర్సీబీకి షాక్.. కేసు వెనక్కు తీసుకున్న బౌలర్
శ్రీలంక ఆటగాడు నువాన్ తుషార వ్యవహారం ప్రస్తుత ఐపీఎల్ ఛాంపియన్ ఆర్సీబీకి పెద్ద తలనొప్పిగా మారింది. ఐపీఎల్ 2026లో పాల్గొనేందుకు తుషారకు అతని సొంత దేశ క్రికెట్ బోర్డు (శ్రీలంక క్రికెట్) అనుమతి నిరాకరించింది. ఫిట్నెస్ లేని కారణంగా తుషారకు ఎన్వోసీ జారీ చేయలేమని తెలిపింది.ఈ విషయమై కోర్టును ఆశ్రయించిన తుషార.. అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. అకస్మాత్తుగా కేసును వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. దీంతో కోర్టు శ్రీలంక క్రికెట్ బోర్డుకు అనుకూలంగా తీర్పునిచ్చింది. ఈ పరిణామం తర్వాత తుషార ఇక ఐపీఎల్ ఆడటం కష్టమేనని తేలిపోయింది.తుషార వ్యవహారంలో కోర్టు తీర్పు ఆర్సీబీని ఇరకాటంలో పడేసింది. ఆ జట్టు ఈ సీజన్లో తుషారపై ఆశలు పెట్టుకుంది. ఎందుకంటే, గత సీజన్లో అతను హాజిల్వుడ్ గైర్హాజరీలో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అతని యార్కర్లు, స్లో బంతులు డెత్ ఓవర్లలో ఆర్సీబీకి కీలకంగా మారే అవకాశం ఉండింది.ప్రస్తుతం ఆర్సీబీకి హాజిల్వుడ్, డఫీ, ఎంగిడి వంటి విదేశీ పేస్ బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నప్పటికీ.. తుషార లాంటి డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ ఉంటే అదనపు బలంగా మారే అవకాశం ఉండింది. మొత్తంగా తుషార న్యాయపోరాటం చేస్తూ మధ్యలోనే యూ-టర్న్ తీసుకోవడం ఆర్సీబీకి వ్యూహాత్మక నష్టంగా పరిగణించాలి. ప్లే ఆఫ్స్ రేసులో పోటీ తీవ్రంగా ఉన్న దశలో ఇలాంటి మార్పులు జట్టు సమతుల్యతను దెబ్బతీస్తాయి.కాగా, తుషార లేకపోయినా ఆర్సీబీ డిఫెండింగ్ ఛాంపియన్ హోదాకు తగ్గట్టుగానే రాణిస్తుంది. ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్ల్లో 4 విజయాలు, 2 అపజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతుంది. ఏప్రిల్ 24న జరిగే తదుపరి మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్తో తలపడనుంది. -
ఆర్సీబీ స్టార్ సంచలన నిర్ణయం!
శ్రీలంక పేసర్ నువాన్ తుషార సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. శ్రీలంక క్రికెట్ బోర్డు (SLC) తీరుపై అసంతృప్తితో అతడు కోర్టుకెక్కినట్లు సమాచారం. రైటార్మ్ పేసర్ అయిన 31 ఏళ్ల తుషార.. శ్రీలంక తరఫున ఇప్పటికి 30 టీ20 మ్యాచ్లు ఆడి 36 వికెట్లు కూల్చాడు.తొలి టైటిల్ఇంతవరకు అతడు టెస్టు, వన్డేల్లో అరంగేట్రం చేయనేలేదు. అయితే, టీ20లో మంచి గుర్తింపు పొందిన తుషారను ఐపీఎల్-2025 మెగా వేలంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) రూ. 1.6 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ సీజన్లో అతడు ఒక్క మ్యాచే ఆడినప్పటికీ జట్టు టైటిల్ గెలవడంతో సంతోషంలో మునిగిపోయాడు.NOC ఇవ్వలేదని..ఈ క్రమంలో ఐపీఎల్-2026 సీజన్కు గానూ ఆర్సీబీ నువాన్ తుషారను అట్టిపెట్టుకుంది. అయితే, ఆర్సీబీతో చేరేందుకు శ్రీలంక బోర్డు అతడికి ఇంత వరకు నిరభ్యంతర పత్రం (NOC) ఇవ్వలేదు. ఫిట్నెస్ పరీక్షలో ప్రమాణాలకు తగినవిధంగా లేడనే కారణంగా అతడికి NOC ఇవ్వలేదని సమాచారం.అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై?అయితే, స్థానిక మీడియా కథనాల ప్రకారం.. తాను పూర్తి ఫిట్గా ఉన్నానని తుషార బోర్డుకు చెప్పినట్లు తెలుస్తోంది. అంతేకాదు.. మార్చి 31తో తన సెంట్రల్ కాంట్రాక్టు ముగిసిపోయినందున.. కాంట్రాక్టును పునరుద్ధరించాల్సిన అవసరం లేదని లేఖ రాసినట్లు సమాచారం. అంతర్జాతీయ స్థాయిలో తాను జట్టు మారే యోచనలో ఉన్నందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కథనాలు వస్తున్నాయి.కోర్టుకెక్కిన తుషారకానీ బోర్డు తన అభ్యర్థనను పట్టించుకోకపోవడం, ఐపీఎల్లో ఆడేందుకు NOC ఇవ్వకపోవడంతో తుషార న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్లు తెలుస్తోంది. శ్రీలంక బోర్డు అధ్యక్షుడు షమ్మీ సిల్వ, కార్యదర్శి బందులా దిస్సానాయకే, కోశాధికారి సుజీవ గొడలియాడ, సీఈఓ ఆష్లే డి సిల్వలను ప్రతివాదులుగా చేరుస్తూ కొలంబో జిల్లా కోర్టులో తుషార పిటిషన్ దాఖలు చేశాడు. ఈ కేసుకు సంబంధించి ఏప్రిల్ 9న విచారణ జరుగనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఆర్సీబీ ఐపీఎల్-2026ను ఘనంగా ఆరంభించింది. తొలి మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించి జయకేతనం ఎగురవేసింది.చదవండి: అక్కడున్న ప్రతి క్షణం ద్వేషమే.. అందుకే తప్పుకొన్నా: ఇంగ్లండ్ దిగ్గజ పేసర్ -
IPL 2026: ఆర్సీబీకి ఓ గుడ్ న్యూస్, ఓ బ్యాడ్ న్యూస్
ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందు ఆర్సీబీకి ఓ గుడ్ న్యూస్, ఓ బ్యాడ్ న్యూస్ అందుతుంది. స్టార్ పేసర్ జోష్ హాజిల్వుడ్ సీజన్ ప్రారంభానికి ముందే జట్టుతో చేరాడు. హాజిల్వుడ్ ఈ సీజన్ ప్రారంభ మ్యాచ్లకు అందుబాటులో ఉండడని తొలుత ప్రచారం జరిగింది. అయితే అతను సీజన్ ప్రారంభానికి ముందే జట్టుతో కలిసి ఆర్సీబీ అభిమానుల్లో జోష్ నింపాడు. తమ బౌలింగ్ యూనిట్కు బ్యాక్ బోన్ అయిన హాజిల్వుడ్ జట్టులో చేరడంతో ఆర్సీబీ టైటిల్ నిలబెట్టుకోగలమన్న ధీమా వ్యక్తం చేస్తుంది. గత ఎడిషన్లో ఆర్సీబీ టైటిల్ గెలవడంలో హాజిల్ కీలకపాత్ర పోషించాడు. అందుకే ఈ సీజన్లో అతనిపై భారీ అంచనాలు ఉన్నాయి. గాయాల కారణంగా గత కొంతకాలంగా ఆటకు దూరంగా ఉన్న హాజిల్వుడ్, ఎట్టకేలకు జట్టులో చేరడంతో ఆర్సీబీ వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి. హాజిల్వుడ్ను ఆర్సీబీ రూ. 12.5 కోట్లకు రీటైన్ చేసుకున్న విషయం తెలిసిందే.బ్యాడ్ న్యూస్ ఏంటంటే.. రూ. 1.6 కోట్లకు రీటైన్ చేసుకోబడిన నువాన్ తుషార (శ్రీలంక) ఈ సీజన్ మొత్తానికే దూరమయ్యాడు. ఫిట్నెస్ కారణాల చేత లంక క్రికెట్ బోర్డు అతనికి ఎన్ఓసీ మంజూరు చేయలేదు. దీంతో అతను ఐపీఎల్ 2026లో పాల్గొనడానికి అనర్హుడయ్యాడు. తుషారపై ఆర్సీబీ భారీ అంచనాలు పెట్టుకొని ఉండింది. డెత్ ఓవర్లలో అతని వైవిధ్యం జట్టుకు ఉపయోగపుడుతుందని భావించింది. అయితే చివరి నిమిషంలో ఇలా జరగడంతో ఆర్సీబీ ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు.తుషార అంశం బయటికి రాక ముందే ఆర్సీబీ పేస్ బౌలింగ్ విభాగానికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. వ్యక్తిగత కారణాల చేత లెఫ్ట్ ఆర్మ్ పేసర్ యశ్ దయాల్ సీజన్ మొత్తానికే దూరమయ్యాడు.ఈ సీజన్లో ఆర్సీబీ ఆరంభ మ్యాచ్తోనే తమ ప్రయాణాన్ని మొదలుపెడుతుంది. ఢిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో మార్చి 28న జరిగే మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్తో తలపడనుంది. ఈ మ్యాచ్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరుగనుంది. ఈ సీజన్లోనూ ఆర్సీబీ రజత్ పాటిదార్ నేతృత్వంలోనే తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. గత సీజన్తో పోలిస్తే, ఆర్సీబీలో పెద్ద మార్పులు జరగలేదు. విరాట్ కోహ్లి, టిమ్ డేవిడ్, జేకబ్ బేతెల్, కృనాల్ పాండ్యా, దేవ్దత్ పడిక్కల్, ఫిల్ సాల్ట్, రొమారియో షెపర్డ్, జితేశ్ శర్మ, భువనేశ్వర్ కుమార్, హాజిల్వుడ్, సుయాశ్ శర్మ తదితర ఆటగాళ్లు జట్టులో కొనసాగుతున్నారు. -
టీమిండియాతో టీ20 సిరీస్.. శ్రీలంకకు మరో ఊహించని షాక్
స్వదేశంలో టీమిండియాతో టీ20 సిరీస్కు ముందు శ్రీలంకకు ఊహించని షాక్ తగిలింది. ఆ జట్టు యువ నువాన్ తుషార గాయం కారణంగా భారత్తో టీ20 సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. నెట్స్లో బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా తుషార చేతి వేలికి గాయమైంది. అనంతరం స్కానింగ్ తరలించగా చేతి వేలు విరిగినట్లు నిర్ధారణైంది.ఈ క్రమంలోనే సిరీస్కు తుషార దూరమయ్యాడు. ఈ విషయాన్ని లంక టీమ్ మేనేజర్ మహింద హలంగోడ పైతం ధ్రువీకరించాడు. తుషార ప్రస్తుతం తమ వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నట్లు హలంగోడ తెలిపాడు. ఈ క్రమంలో తుషార స్ధానాన్ని మరో ఫాస్ట్ బౌలర్ దిల్షాన్ మధుశంకతో శ్రీలంక క్రికెట్ భర్తీ చేసింది.కాగా ఇప్పటికే స్టార్ పేసర్ దష్మంత చమీర సైతం భారత్తో టీ20 సిరీస్కు దూరమయ్యాడు. ఇప్పుడు తుషార కూడా గాయం కారణంగా తప్పుకోవడంతో లంకకు గట్టి ఎదురుదెబ్బ అనే చెప్పుకోవాలి. కాగా ఈ సిరీస్ జూలై 27న పల్లెకలె వేదికగా జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. భారత జట్టు ఇప్పటికే లంకగడ్డపై అడుగుపెట్టింది.భారత్తో టీ20 సిరీస్కు శ్రీలంక జట్టు: చరిత్ అసలంక (కెప్టెన్), పాతుమ్ నిస్సాంక, కుసల్ పెరీరా, అవిష్క ఫెర్నాండో, కుసాల్ మెండిస్, దినేష్ చండిమాల్, కమిందు మెండిస్, దాసున్ షనక, వనిందు హసరంగా, దునిత్ వెల్లాగే, మహేశ్ తీక్షణ, చమిందు విక్రమసింఘే, మతీషా పతిరన, మధుశంక, బినుర ఫెర్నాండో -
బంగ్లాదేశ్ను చిత్తు చేసిన శ్రీలంక.. సిరీస్ సొంతం
సెల్హాట్ వేదికగా బంగ్లాదేశ్తో జరిగిన మూడో టీ20లో 28 పరుగుల తేడాతో శ్రీలంక ఘన విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ను 2-1 తేడాతో శ్రీలంక సొంతం చేసుకుంది. 175 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 19.4 ఓవర్లలో 146 పరుగులకే ఆలౌటైంది. లంక పేసర్ నువాన్ తుషారా 5 వికెట్లతో బంగ్లాదేశ్ను దెబ్బతీశాడు. తన 4 ఓవర్ల కోటాలో కేవలం 20 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. అందులో ఓ హ్యాట్రిక్ కూడా ఉంది. అతడితో పాటు కెప్టెన్ హసరంగా రెండు, షనక, తీక్షణ తలా వికెట్ సాధించారు. బంగ్లా బ్యాటర్లలో రిసాద్ హొస్సేన్(53) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. లంక బ్యాటర్లలో ఓపెనర్ కుశాల్ మెండీస్(86) పరుగులతో అదరగొట్టాడు. అతడి ఇన్నింగ్స్లో 6 ఫోర్లు, 6 సిక్స్లు ఉన్నాయి. బంగ్లా బౌలర్లలో రిసాద్ హొస్సేన్, టాస్కిన్ ఆహ్మద్ తలా వికెట్ సాధించారు.


