breaking news
Nushrratt Bharuccha
-
షూ విప్పడం కూడా రాదా? ఇంకేం యోగా చేస్తావ్?
బాలీవుడ్ హీరోయిన్ నుష్రత్ బరుచ (Nushrratt Bharuccha) విమర్శలపాలైంది. యోగా ఈవెంట్కు వెళ్లి ఆమె చేసిన పనికి అందరూ ఆమెను తిట్టిపోస్తున్నారు. అసలేం జరిగిందంటే.. శనివారం నాడు ముంబైలో జరిగిన యోగా ఉత్సవాల్లో నుష్రత్ పాల్గొంది. తెలుపు దుస్తుల్లో అక్కడికి హాజరైన ఆమెకు సొంతంగా షూలు విడిచేందుకు కూడా కష్టమైంది. అక్కడున్న మహిళా వాలంటీర్ల సాయం తీసుకుంది. అమ్మాయి కింద కూర్చుని హీరోయిన్ కాలు పట్టుకుని ఆమె షూ లేస్ తీసింది.. ఇంతలో నుష్రత్.. మరో కాలి షూ కూడా తీసేయమని వేలు పెట్టి చూపించింది. దీంతో ఆమె మరో కాలి షూ కూడా తీసేసింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.అది కూడా చేతకాదా?'నీ చేతులతో నువ్వు షూ లేస్ తీసేసి పక్కన విడిచిపెట్టలేవా?', 'నీ కాలికున్న షూలు తీసుకోలేవు కానీ యోగా చేస్తున్నావా?', 'నువ్వింకా చిన్న పిల్ల అనుకుంటున్నావా? డబ్బు, పాపులారిటీ చూశాక గర్వం తలకెక్కినట్లుంది' అని నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. నుష్రత్.. చివరగా చోరీ 2 సినిమాలో కనిపించింది. విశాల్ ఫ్యురియా దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ ఏప్రిల్ 11న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈమె తెలుగులో శివాజీ తాజ్మహల్ (2010) మూవీలో హీరోయిన్గా నటించింది. View this post on Instagram A post shared by TCX.official (@tellychakkar) చదవండి: న్యూజిలాండ్లో 7000 ఎకరాలు కొన్నాం: మోహన్బాబు -
ఆ నిర్ణయంతో బాధపడ్డాను
‘‘నేను హీరోయిన్గా నటించిన ‘డ్రీమ్ గర్ల్’ చిత్రానికి సీక్వెల్గా ‘డ్రీమ్ గర్ల్ 2’ రూపొందింది. సీక్వెల్లోనూ నన్నే కథానాయికగా తీసుకుంటారని ఎంతో నమ్మకం పెట్టుకున్నాను. అయితే, నన్ను కాదని అనన్యా పాండేను హీరోయిన్గా తీసుకున్నారు. వారి నిర్ణయంతో బాధపడ్డాను’’ అని బాలీవుడ్ బ్యూటీ నుష్రత్ బరుచా తెలిపారు. ఆయుష్మాన్ ఖురానా, నుష్రత్ బరుచా జోడీగా రాజ్ శాండిల్య దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘డ్రీమ్ గర్ల్’. 2019 సెప్టెంబరు 13న విడుదలైన ఈ మూవీ బాలీవుడ్లో హిట్గా నిలిచింది. ఈ మూవీకి సీక్వెల్గా ‘డ్రీమ్ గర్ల్ 2’ రూపొందింది.సీక్వెల్లోనూ ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటించిగా రాజ్ శాండిల్యనే దర్శకత్వం వహించారు. అయితే హీరోయిన్గా అనన్యా పాండేను తీసుకున్నారు. 2023 ఆగస్టు 24న విడుదలైన ఈ చిత్రం కూడా మంచి విజయం అందుకుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నుష్రత్ బరుచా మాట్లాడుతూ– ‘‘డ్రీమ్ గర్ల్’లోని నటీనటులందరూ ‘డ్రీమ్ గర్ల్ 2’లోనూ నటించారు. అయితే హీరోయిన్ పాత్రలో నాకు బదులు అనన్యా పాండేని తీసుకున్నారు.యూనిట్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని జీర్ణించుకోలేకపోయాను. కానీ ఈ విషయంపై నేను యూనిట్లోని వారితో మాట్లాడలేదు. ఎందుకంటే అవతలి వారి నిర్ణయాలను మనం కంట్రోల్ చేయలేం కదా? తమ సినిమాలో ఎవర్ని తీసుకోవాలి? అనేది మేకర్స్పై ఆధారపడి ఉంటుంది. వాళ్ల ఇష్టాన్ని మనం ప్రశ్నించడానికి లేదు. అందుకే బాధపడటం తప్ప ఏమీ చేయలేకపోయాను’’ అని పేర్కొన్నారు. ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం బాలీవుడ్లో వైరల్గా మారాయి. -
ఛత్రపతి మూవీ హీరోయిన్.. తెలుగులో ఆ ఒక్క సినిమాతోనే!