-
మదర్కు నోబెల్ శాంతి బహుమతి
ఆ నేడు 1979 అక్టోబర్ 17 నార్వేలో గల నోబెల్ కమిటీ మదర్ థెరిస్సాకు శాంతి బహుమతిని ప్రకటించింది. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఈ బహుమతిని జాతి, కుల, మత, లింగ, వర్ణ, వర్గ వివక్షలు లేకుండా అవసరమైన వారికి ఆపన్న హస్తం అందిస్తూ, ప్రజలందరి మధ్యా, శాంతి, సుహృద్భావనలకు బాటలు వేస్తూ మదర్ థెరిస్సా అందిస్తున్న సేవలకు గుర్తింపుగా ఆమెను ఈ బహుమతికి ఎంపిక చేసినట్లు నోబెల్ కమిటీ ప్రకటించింది. సమాజంలో అట్టడుగున అణగారిన బలహీన వర్గాల వారికి, నిర్భాగ్యులకు నిరుపమానమైన సేవలు అందిస్తూ, అందరినీ అమ్మలా ఆదరిస్తూ విశ్వశాంతికి తోడ్పడుతున్న ఈ విశ్వమాతను ఈ పురస్కారానికి ఎంపిక చేయడం తమ అదృష్టంగా భావిస్తున్నట్లు కమిటీ ప్రకటించింది. -
‘నోబెల్’ సందేశం గ్రహించారా?
తొమ్మిది రోజులుగా గర్జించిన పాక్ శతఘు్నలు ఇప్పుడు మూగపోయాయి. అది ఆశావహమైన నోబెల్ కమిటీ సదుద్దేశాల ఫలితమేనని దానికి ధన్యవాదాలు తెలపాల్సిన పనేమీ లేదు. పాక్కు తగ్గట్టుగానే ఇంతకింత అన్న తీరుగా భారత్ బదులు చెప్పడమే కాదు, ఇంకాస్త ఎక్కువగానే ముట్టజెప్పింది. పాక్ ప్రభుత్వం మరింతగా ఈ ఘర్షణలను తీవ్రతరం చేస్తుందని ఊహాగానాలు సాగాయి. పాక్ సైనికాధికారుల సరికొత్త వ్యూహాత్మక లక్ష్యం దీర్ఘకాలిక శతృత్వ స్థితి అయితే తప్ప అలా జరిగే సూచనలేవీ లేవు. వారు అటల్ బిహారీ వాజ్పేయిని పరీక్షించి చూసినట్టుగా మోదీని కూడా పరీక్షించాలనుకుంటున్నారా? అలా చేస్తే అంతకు మించిన మూర్ఖత్వం ఉండదు. ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతికి ఢిల్లీకి చెందిన గాంధేయవాది కైలాష్ సత్యార్థిని, ప్రవాసంలో గడుపుతున్న అసాధారణ పాకిస్థాన్ సాహస బాలిక మలాలా యూసఫ్ జాయ్లను ఎంపిక చేశారు. వారి ఎంపిక ద్వారా నార్వే నోబెల్ కమిటీ... ప్రపంచం మెచ్చేది సంక్షేమ మంత్రాన్నే గానీ యుద్ధ తంత్రాన్ని కాదనే శక్తివంతమైన సందేశాన్ని పంపింది. పాకిస్థాన్ యుద్ధ సైనిక వ్యవస్థలో ఉన్నవారెవరైనాగానీ కాస్త చెవులకు పట్టిన తుప్పును వదలించుకుని ఆ సందేశాన్ని వినడం మొదలెట్టాలి. అదేదో నిరాకారమైన మానవాళి ఉద్ధరణ కోసమనో లేక సంఘర్షణలో చిక్కుపడి ఉన్న ఉపఖండం మంచి కోసమనో గాక పాకిస్థాన్ బాగు కోసమేనని భావించి మరీ వినాలి. ఇంతవరకు ఇద్దరు పాకిస్థానీలకు నోబెల్ బహుమతి లభించింది. 1979లో భౌతిక శాస్త్రవేత్త అబ్దుస్ సలామ్కు, ఇప్పుడు మలాలాకు. సలామ్ దైవ భక్తి గలిగిన ధర్మ నిష్టాపరుడే. అయినాగానీ ఆయన హత్యకు గురవుతానే మోనన్న భయంతో పాక్లో అడుగు పెట్టలేరు. కారణం ఆయన ఖాదీయానీ (అహ్మదీ ముస్లిం) శాఖకు, మత భ్రష్టమైనదిగా ముద్రవేసిన శాఖకు చెందినవాడు. ఉగ్రవాదాన్ని దుందుడుకు తిరోగమనవాద సామాజిక అజెండాతో కలగలిపిన ఆటవిక ఉగ్రవాదులకు బాలికల విద్యలో విశ్వాసంలేదు. కాబట్టి మలాలా వారికి లక్ష్యంగా మారింది. భారత్, అఫ్ఘానిస్థాన్లకు వ్యతిరేకంగా సాగు తున్న ముసుగు యుద్ధంలో అగ్రశ్రేణిలో నిలవడానికి ఆత్మాహత్యా సదృశమైన ఉత్సాహాన్ని ప్రదర్శించే పాక్ ‘రాజ్యంలోని రాజ్యం’ ఆ ఉగ్రవాద ముఠాలకు రక్షణను కల్పిస్తోంది. తొమ్మిది రోజులుగా వైషమ్యంతో గర్జించిన పాక్ శతఘు్నలు ఇప్పుడు మూగపోయాయి. అది ఆశావహ మైన నోబెల్ కమిటీ సదుద్దేశాల ఫలితమేనని దానికి ధన్య వాదాలు తెలపాల్సిన పనేమీ లేదు. పాక్కు తగినట్టుగానే ఇంత కింత అన్న తీరుగా భారత్ బదులు చెప్పడమే కాదు, ఇంకాస్త ఎక్కువగానే ముట్టజెప్పింది. పాక్ ప్రభుత్వం మరింత ప్రమాదకరంగా ఈ ఘర్షణలను తీవ్రతరం చేస్తుందని ఊహాగానాలు సాగాయి. పాక్ సైనికాధికారుల సరికొత్త వ్యూహాత్మక లక్ష్యం దీర్ఘకాలిక శతృత్వ స్థితి అయితే తప్ప అలా జరిగే సూచనలేవీ లేవు. వారు అటల్ బిహారీ వాజ్పేయిని పరీక్షించి చూసినట్టుగా నరేంద్ర మోదీని కూడా పరీక్షించాలనుకుంటున్నారా? అలా చేస్తే అంతకు మించిన మూర్ఖత్వం ఉందడు. ఒత్తిడికి లొంగి పోవడానికి ఆయనేమీ బలహీనుైడైన నేత కారు. రాహుల్ గాంధీ తిరిగి తనకే బెడిసి కొట్టగుండా తుపాకీని పేల్చడం అతి అరుదు. పాక్ ఒత్తిడికి మోదీ, రక్షణ మంత్రి అరుణ్ై జెట్లీలు లొంగిపోతున్నారని ఆయన శాసన సభ ఎన్నికల ప్రచారంలో అన్నారు. అలా అని ఆయన కాంగ్రెస్ ఓట్లు మరింత క్షీణించి పోయేలా చేశారు. క్విక్జోట్లాగా రాహుల్ ఇలా గాలి మరలపైకి తిరిగారో లేదో, 48 గంటలు గడిచేలోగానే పాక్ వెనక్కు తగ్గింది. పాక్ దౌత్య, సైనిక అధికారులు టీవీల్లో లేదా సమా వేశాల్లో కనిపించినప్పుడల్లా ఇదంతా ముందుగా ప్రారంభించినది భారత దేశమేనంటూ ఒకే ఒక్క సుపరిచితమైన ఆధారాన్ని చూపుతుంటారు. ఇతర రంగాల్లో, ప్రత్యేకించి దేశంలోపలే పలు అంతర్గత యుద్ధాల్లో పాక్ సైన్యం పెద్ద ఎత్తున మునిగి ఉండగా భారత్తో ఘర్షణకు దిగడానికి తగు కారణమేదీ లేదని వివరణ ఇస్తుంది. ఇదో కుత్సితం. హేతుబద్ధత మాటున పాక్ హేతువిరుద్ధమైనదాన్ని దాచి పెట్టే ప్రయత్నం చేస్తోంది. భారత్పై యుద్ధానికి దిగడానికి హేతుబద్ధమైన కార ణం ఏదైనాగానీ ఉండాల్సిన అవసరం ఉన్నదని పాక్కు ఎప్పుడూ అనిపించలేదు. శాంతియుతంగా చర్చలతో సాధించుకోగల దాన్ని యుద్ధంతో చేజిక్కిం చుకోవాలనే దే స్వాతంత్య్రం తర్వాత అది తీసుకున్న మొట్టమొదటి ముఖ్య నిర్ణయం. అటు పాక్లోగానీ, ఇటు భారత్లో గానీ విలీనం కాకుండా ఉన్న కాశ్మీర్ కోసం అది అక్టోబర్ 1947లోనే తిరుగు బాటు దార్లను, ఉగ్రవాదులను ప్రయోగించి దురాక్రమణను ప్రారం భించింది. ఏ మాత్రం సాధారణ ఇంగితం మార్గ దర్శకత్వంలోనైనా పాక్ విధానం సాగి ఉంటే 1948 వసంతం లేదా వేసవి నాటికే (అప్పటికి మనకు లభిం చినది అధినివేశ ప్రతిపత్తి మాత్రమే) బ్రిటిష్వారి అజమాయిిషీ కిందనే కాశ్మీర్ సమస్య శాంతి యుతంగా పరిష్కారమై ఉండేది. పాక్ ప్రభుత్వం ఉగ్రవాదం, ముసుగు యుద్ధం, సాధారణ సంఘర్షణలను కలగలిపి 1965లో భారత్పై యుద్ధానికి దిగింది. సాధారణ యుద్ధం ద్వారా కాశ్మీర్ను జయించడం ఎన్నటికీ సాధ్యంకాదని అది 1965, 1971 యుద్ధాల తదుపరి గ్రహించింది. దీంతో అది ఉగ్రవాదం, మంద్ర స్థాయి రెచ్చగొట్టే చర్యలు, సరిహద్దు ఉద్రిక్తతల ఎత్తుగడలను కలగలిపి కాశ్మీర్ సమస్యను సజీవంగా ఉంచగలిగే ఏకైక ఆధరువుగా మార్చింది. తద్విరుద్ధంగా, 1949 జనవరిలో కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిన ప్పటి నుండి భారత్ ఎన్నడూ కాశ్మీర్లో తన భూభాగాన్ని విస్తరింపజేసుకోవాలని కోరుకోలేదు. 1971 యుద్ధంలో ఢాకాలో దాని 90 వేల బలగాలు మనకు లొంగిపోయిన దుస్థితిలో పాక్ ఉన్నప్పుడు కూడా మన దేశం ఆ ప్రయత్నం చేయలేదు. అలా అని దాడికి గురైనప్పుడు భారత్ బల గాలు చేతులు ముడుచుకు కూచుంటాయని కాదు. దశాబ్దిగా ఎన్నడూ ఎరుగని స్థాయి లలో పాక్ గత వారంలో హింసను రేకెత్తించగా మన బలగాలు మోదీ నాయకత్వంలో గట్టిగా బదులు చెప్పాయి. అసలు ఇప్పడు ఎందుకీ సరిహద్దు కాల్పులు? అనే ప్రశ్న మనకింకా మిగిలే ఉంటుంది. సమాధానంలోని కొంత భాగం ప్రధాని నరేంద్ర మోదీ, అధ్యక్షుడు బరాక్ ఒబామాలు వాషింగ్టన్లో విడుదల చేసిన కీలకమైన సంయుక్త ప్రకటనలో ఉన్నదేమోనని ఆశ్చర్యం కలుగుతోంది. అమెరికా మొట్టమొదటిసారిగా పాక్ అభ్యం తరాలను పక్కన పెట్టి పాక్ భూభాగంపై ఉన్న ఉగ్రవాద స్థావరాలకు వ్యతిరేకంగా సాగే యుద్ధంలో భారత్ నిర్వహించాల్సిన సమంజసమైన పాత్ర ఉన్నదని అంగీకరించింది. తప్పుడు వ్యాఖ్యానాలకు గురికాకుం డటం కోసం నిర్దిష్టంగా ఆ ప్రకటన లష్కరే తోయిబా, జైషే మొహ్మద్, అల్కాయిదా, హక్కానీ నెట్ వర్క్ (అఫ్ఘానిస్థాన్లో పనిచేసేది), దావూద్ ఇబ్రహీం ‘డి’ కంపెనీ, ఇరాక్ ఇస్లామిక్ రాజ్యం వంటి సంస్థల పేర్లను పేర్కొనలేదు. ఇది భారత్, అమెరికా వ్యూహాత్మక సంబంధాన్ని అత్యంత ప్రమాదకరమైన యుద్ధ ప్రాంతంలోకి విస్తరింపజేసి, ఈ యుద్ధంలో భారత్ను అమెరికాకు ముఖ్య మిత్రునిగా మారుస్తుంది. అమెరికా రక్షణశాఖ పెంటగాన్తో వ్యవహరించేట్పపుడు అమెరికా రక్షణ దుర్గంగానూ, జిహాదిస్టులతో వ్యవహరించేటప్పుడు ఉగ్రవాద స్థావరంగాగానూ పాక్ ద్విపాత్రాభి నయం చేస్తోంది. ఆ ద్విపాత్రాభినయం ఇప్పడు పూర్తిగా బహిర్గతం కాకపోయినా మునుపెన్నడూ ఎరుగని విధంగా ఇబ్బందుల్లో పడింది.పాక్ సైన్యాధికారులు తమ సాయుధ శక్తిని తూర్పు రంగానికి మరలుస్తున్నామని భారత్, అమెరికా లకు సంకేతం పంపుతున్నారా? (వ్యాసకర్త సీనియర్ సంపాదకులు) - ఎం.జె. అక్బర్ -
‘శాంతి’ సార్థకం!
మన దేశానికి చెందిన బాలల హక్కుల ఉద్యమకారుడు కైలాస్ సత్యార్థి... బాలికల చదువుకునే హక్కు కోసం పాకిస్థాన్లోని స్వాత్ లోయలో ఉగ్రవాదులతో పోరాడి మృత్యువు అంచులవరకూ వెళ్లొచ్చిన మలాలా యూసఫ్జాయ్లను ప్రపంచ శాంతి బహుమతికి ఎంపికచేసి ఈసారి నోబెల్ కమిటీ అందరి మన్ననలనూ పొందింది. భారత్, పాకిస్థాన్ సరిహద్దులు కాల్పుల మోతతో దద్దరిల్లుతూ ఉద్రిక్త వాతావరణం అలుముకొని ఉండగా ఈ శాంతి బహుమతిని రెండు దేశాలకూ చెందిన ఇద్దరికి ప్రకటించడం యాదృచ్ఛికమే కావొచ్చుగానీ ఆసక్తికరమైన అంశం. వీరిలో ఒకరు హిందూ, మరొకరు ముస్లిం. ఒకరు భారతీయుడు, ఇంకొకరు పాకిస్థానీ. ఒకరు అనుభవంతో తలపండిన 60 యేళ్ల వ్యక్తి. మరొకరు టీనేజ్ ఇంకా దాటని పదిహేడేళ్ల బాలిక. ఇద్దరినీ ఒకటిగా చూసే అంశాలూ ఉన్నాయి. ఇద్దరికిద్దరూ అసాధారణ వ్యక్తులు. గతంలోనే నోబెల్ శాంతి బహుమతి పరిశీలనకొచ్చినవారు. ఇద్దరూ భారత ఉపఖండం పౌరులు. కొన్ని దశాబ్దాలక్రితం ఒకే దేశంగా మనుగడ సాగించిన గడ్డపై జన్మించినవారు. అంతేకాదు... తాము నమ్మిన సత్యం కోసం పట్టుదలతో, దృఢ చిత్తంతో పోరాడిన వారు. ఈ క్రమంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ప్రాణాలకే ముప్పు ముంచుకొచ్చినా వాటన్నిటినీ తృణప్రాయంగా భావించి అధిగమించినవారు. పిల్లలనూ, చదువుకోవడానికి వారికుండే హక్కునూ అణిచేస్తున్న ధోరణులపై ఇద్దరూ అలుపెరగని పోరాటం చేశారని నోబెల్ కమిటీ చెప్పిన ప్రశంసావాక్యాలు అక్షర సత్యాలు. అయితే, ఇద్దరూ తమ తమ దేశాల్లోని పాలకులనుంచి ఇంత వరకూ ఎలాంటి గుర్తింపూ పొందనివారు. సత్యార్థికి ఇంతవరకూ పద్మశ్రీ కూడా రాలేదు. మలాలా అయితే అక్కడివారి దృష్టిలో విద్రోహి! కైలాస్ సత్యార్థి మూడు దశాబ్దాలక్రితం బచ్పన్ బచావో ఆందోళన్ (బీబీఏ) సంస్థను స్థాపించి అత్యంత అమానుషమైన, దుర్మార్గమైన పని పరిస్థితుల్లో బతుకులీడుస్తున్న వేలాది మంది బాలబాలికలను కాపాడిన అరుదైన వ్యక్తి. చదివింది ఇంజనీరింగే అయినా ప్రపంచం మొత్తంలో అంతవరకూ ఎవరికీ పట్టని బాల కార్మిక వ్యవస్థపై దృష్టిసారించాడాయన. అదే తన కార్యక్షేత్రమనుకున్నాడు. అది రణరంగమని తెలిసినా, అక్కడ తన పోరాటానికి ఆసరాగా నిలబడేవారు అరుదని అర్ధమైనా... కావాలని ఏరికోరి ఎంచుకున్నాడు. ఆరేళ్ల లేలేత ప్రాయం లోని పిల్లలతో కూడా గంటల తరబడి పనులు చేయిస్తూ వారి రెక్కల కష్టాన్ని దిగమింగి తెగబలుస్తున్న రాబందులపై శరసంధానం చేశాడు. మైకా గనుల్లో, రగ్గుల తయారీ, జరీ పరిశ్రమల్లో...ఇంకా అనేకానేక కర్మాగారాల్లో వెట్టిచాకిరీలో మగ్గిపోతున్న వేలాదిమంది జీవితాలకు వెలుగుపంచాడు. వారితో పలకా బలపం పట్టించాడు. వారిని డాక్టర్లుగా, ఇంజనీర్లుగా తయారుచేసి చూపాడు. పేదరికంవల్ల మాత్రమే పిల్లలు కార్మికులుగా మారవలసి వస్తున్నదన్న వాదనలోని డొల్లతనాన్ని ఎత్తిచూపాడు. నిజానికి బాల్యం వెట్టిచాకిరీలో మగ్గుతున్న కారణంగా మాత్రమే పేదరికం తరంనుంచి తరానికి వారసత్వంగా వస్తున్నదని, అది వారిని పీల్చిపిప్పి చేస్తున్నదని ఎలుగెత్తిచాటాడు. ప్రపంచాన 17 కోట్లమంది బాలలు వెట్టిచాకిరీలో మగ్గుతుంటే...పని చేయగలిగే సత్తా ఉన్న 20 కోట్లమంది అర్హులైన యువతీ యువకులకు ఉపాధి దొరకడంలేదని గణాంకాలతో వివరించాడు. దేశంలో 5 కోట్లమంది బాలకార్మికుల శ్రమతో ఏటా 1.2 లక్షల కోట్ల రూపాయల నల్లధనం పోగుపడుతున్నదని హెచ్చరించాడు. బాలల శ్రమతో తయారయ్యే ఉత్పత్తులను విక్రయించబోమని, వినియోగించబోమని ప్రకటించే చైతన్యాన్ని కలిగించాడు. ఇంతవరకూ 80,000 మంది పిల్లలను వెట్టిచాకిరీనుంచి, దాంతోపాటు లైంగిక వేధింపులనుంచి కూడా రక్షించాడు. ఆ క్రమంలో బీబీఏ కార్యకర్తలిద్దరిని దుండగులు పొట్టనబెట్టుకున్నారు. స్వాత్ లోయ అంతటా బాలికా విద్యను నిషేధించి, బడికొస్తే కాల్చేస్తామని ఉగ్రవాదులు రెచ్చిపోతున్న వేళ ‘నా చదువును చిదిమేందుకు మీరెవర’ని నిలబడిన ధీర మలాలా. చిత్రమేమంటే తనకు నోబెల్ ప్రకటించారని తెలిశాక ఇంటర్వ్యూ చేయడానికొచ్చిన మీడియాకు కూడా తన తొలి ప్రాధాన్యం చదువేనని చాటింది. ‘స్కూల్ అయ్యాకే మీతో మాట్లాడతాన’ని కబురంపింది. తుపాకుల భాష తప్ప మరేమీ రాని క్షుద్ర మూకకు భయపడొద్దని తోటి బాలికలకు ధైర్యం నూరిపోసి, వారితోపాటు స్కూల్ బస్సులో వెళ్తుండగా మలాలా 2009లో ఉగ్రవాదుల దాడికి లోనైంది. ‘మలాలా ఎవరు?’ అన్న ప్రశ్నకు నేనేనని జవాబివ్వబోతుండగానే తుపాకి గుళ్లు ఆమె తలలోకి దూసుకెళ్లాయి. అప్పటికామె వయసు పన్నెండేళ్లు. రోజుల తరబడి ఆస్పత్రిలో కోమాలో ఉండి కోలుకున్నా ఆమెలోని దృఢ సంకల్పం చెదిరిపోలేదు. తనను ఆరోజు మాట్లాడనివ్వని ఉగ్రవా దులకు జవాబుగా ‘అవును... నేనే మలాలా’ అంటూ గ్రంథం వెలువరించింది. వేర్వేరు రూపాల్లోనే కావొచ్చుగానీ... చదువుకునేందుకు నిత్యం ఎన్నెన్నో అవరోధా లను ఎదుర్కొంటున్న లక్షలమంది బాలికలకు ఆమె స్ఫూర్తి ప్రదాత. ఉగ్రవాదుల గురించి అంతర్జాతీయ వేదికలపై ఎంతో మాట్లాడిన మలాలా... పాక్-అఫ్ఘాన్ సరిహద్దు ప్రాంతాల్లో ద్రోన్ దాడులతో మారణకాండ సాగిస్తున్న పాశ్చాత్య దేశాల ఆగడాలను ప్రశ్నించదేమని కొందరు అంటున్నారు. కానీ, ఆ వయసు బాలిక నుంచి ఇంత పెద్ద బాధ్యతను ఆశించడం కూడా సరైనది కాదు. ఇప్పుడు నోబెల్ శాంతి బహుమతి ప్రకటన ద్వారా మలాలా, సత్యార్థి చేసిన పోరాటాలకూ, ఆ క్రమంలో వారు పెంపొందించిన విలువలకూ అంతర్జాతీయంగా గుర్తింపు లభించింది. ఇప్పటికీ అధ్వాన్నస్థితిలో మగ్గుతున్న లక్షలమంది బాలబాలికలపై అందరి దృష్టీ పడటానికి, వారిని కాపాడటానికి ఇది నిస్సందేహంగా తోడ్పడు తుంది. ఈ ప్రకటన ద్వారా నోబెల్ కమిటీ తన స్థాయిని పెంచుకుంది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఎన్నికల వేళ కలకలం.. బీజేపీ మంత్రిని చంపేస్తామని బెదిరింపులు!
సంజయ్లీలా భన్సాలీ 'హీరామండి' వెబ్ సిరీస్ ఎలా ఉంది..?
నాడు మోదీకి వంట వండిన దీపక్.. ఇప్పుడేం చేస్తున్నారు?
కాన్వాయ్ స్లో చేసి అంబులెన్స్కు దారిచ్చిన సీఎం జగన్ (ఫొటోలు)
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
ఎల్లో శారీలో హీరామండి హీరోయిన్ సంజీదా షేక్ లుక్స్.. ఫోటోలు
ఇంటింటి ఎన్నికల ప్రచారంలో వైఎస్ భారతి (ఫొటోలు)
జగన్ పాటకే భయపడ్డారు!
‘ప్రియాంక గాంధీ కాంగ్రెస్కు రెబల్గా మారనుంది’
భారీ ఆఫర్ను రిజెక్ట్ చేసిన శ్రీలీల.. కారణం ఇదేనట
తప్పక చదవండి
- కెనడాలో మనవడిని చూడ్డానికి వెళ్లి...మనవడితో సహా దుర్మరణం
- Banjara Hills: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం.. నిండు ప్రాణం బలి
- తెలంగాణలో భానుడి భగభగలు..!
- అందుకే ఓడిపోయాం.. అయినా సరే: హార్దిక్ పాండ్యా
- తాతా.. నీకు టాటా..
- రోహిత్ వేముల ఆత్మహత్య కేసు మళ్లీ దర్యాప్తు చేస్తాం
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
- తిరుమలలో వడగళ్ల వర్షం (ఫొటోలు)
- కందికుంట అడ్డంగా దొరికినా..
- నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?
Advertisement