breaking news
Nasic
-
టీఎంసీ సరిహద్దుల పెంపునకు యూడీడీ పచ్చజెండా
నాసిక్: త్రయంబకేశ్వర్ మున్సిపాలిటీ సరిహద్దు పరిధి పెంపునకు పట్టణ అభివృద్ధి విభాగం (యూడీడీ) ఆమోదం తెలిపింది. కుంభమేళా సమీపిస్తున్న నేపథ్యంలో ఇక్కడికి వచ్చే భక్తులకు మౌలిక వసతులు కల్పించేందుకు, తగు సేవలు అందించేందుకుగాను సరిహద్దుల పెంపునకు అనుమతించాలని కోరుతూ త్రయంబకేశ్వర్ మున్సిపల్ కౌన్సిల్ (టీఎంసీ) కొద్దిరోజుల క్రితం ఓ ప్రతిపాదనను పట్టణ అభివృద్ధి విభాగం (యూడీడీ)కి పంపిన సంగతి విదితమే. ఇందుకు ఆమోదం తెలిపిన యూడీడీ దానిని న్యాయమంత్రిత్వ శాఖకు పంపించింది. న్యాయమంత్రిత్వ శాఖ ఆమోదం లభించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం లాంఛనంగా ఓ ప్రకటన చేయనుంది. ఈ విషయమై టీఎంసీకి చెందిన ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ అపెక్స్ కమిటీలో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కుంభమేళాకు సంబంధించి 90 శాతం పనులను పూర్తిచేశామన్నారు. తమ ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోదం తెలిపితే టీఎంసీ సరిహద్దు పరిధి 1.89 కిలోమీటర్లనుంచి 11.794 కిలోమీటర్లకు పెరుగుతుందన్నారు. ప్రణాళికాబద్ధంగా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయొ చ్చన్నారు. టీఎంసీ చుట్టుపక్కల గ్రామాలు రెవె న్యూ విభాగం పరిధిలో ఉన్నాయని, ఏ గ్రామపంచాయితీ పరిధిలో లేవన్నారు. అందువల్ల ప్రతి చిన్నపనికీ కలెక ్టర్ కార్యాలయాన్ని సంప్రదించాల్సి ఉంటుందన్నారు. అయితే తమ ప్రతిపాదనకు ఆమోదం లభిస్తే ప్రజలు కలెక్టర్ కార్యాలయాన్ని సంప్రదించాల్సిన అవసరం ఉండదన్నారు. వారు తమను నేరుగా సంప్రదించే వెసులుబాటు లభిస్తుంది. ఈ ప్రతిపాదనకు ఆమోదం లభిస్తే ఈ పరిస్థితి మారిపోతుందన్నారు. -
రెండింతలైన ఉల్లిసాగు
నాసిక్: సామాన్యులకే కాదు అధికారంలో ఉన్న పెద్దలకు దడపుట్టిస్తున్న ఉల్లి ధర మరికొద్ది రోజుల్లో చుక్కల్లోంచి నేలకు దిగిరావచ్చంటున్నారు రాష్ట్ర వ్యవసాయ అధికారులు. ఉల్లిపంటకు పుట్టిల్ల్లయిన నాసిక్ ప్రాంతంలో ఈ సంవత్సరం ఖరీఫ్, లేట్ ఖరీఫ్లో పంట విస్తీరణం రెట్టింపయింది. గత ఖరీఫ్ కాలంలో 6,626 హెక్టార్లలో పంటసాగుకాగా, ఈ సంవత్సరం అది 17,473 హెక్టార్లకు చేరింది. ‘‘పంట విస్తీర్ణం పెరిగిన దృష్ట్యా దిగుబడులు కూడా బాగా పెరిగే అవకాశం ఉంది. ఈ సంవత్సరం 3,49,460 లక్షల టన్నుల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉంది’’ అని జిల్లా వ్యవసాయ అధికారి ఎస్ఆర్ బొంబే తెలిపారు. ‘‘ఖరీఫ్ తర్వాత ఆలస్యంగా సాగు చేసేవారివల్ల కూడా పంటసాగు బాగా పెరిగింది. ఈ సంవత్సరం 31,197 హెక్టార్ల విస్తీర్ణంలో సాగయింది. లేట్ ఖరీఫ్కు సంబంధించిన పంట దిగుబడులు కూడా 5,92,743 టన్నులకు పెరిగే అవకాశం ఉంది. డిసెంబర్-జనవరి మాసాల్లో రాష్ట్ర ఉల్లి మార్కెట్లను ముంచెత్తనుందని అధికారులంటున్నారు. దిగుబడులు బాగా పెరగడంతో ధరలు పడిపోయే అవకాశం ఉంది. ఇది రైతులకు సమస్యలు సృష్టించే అవకాశం ఉంది’’ అని వ్యవసాయ అధికారి వివరించారు. ఈ సంవత్సరం వర్షాలు కూడా చాలనన్ని ఉండి వాతావరణం ఉల్లిసాగుకు అనుకూలంగానే ఉంది. అయితే నాసిక్ ప్రాంతంలో ఖరీఫ్లో ఆలస్యంగా సాగుకు వినియోగించే ఉల్లి రకాల నిల్వ కాలం చాలా తక్కువ. దీంతో రైతులు తప్పనిసరిగా వ్యాపారుల కోరిన ధరలకే ఇవ్వాల్సి రావొచ్చు. నవంబర్ నుంచి ధరలు కొంత నిలకడగా మారినా డిసెంబర్ నాటికి పరిస్థితి రైతులకు వ్యతిరేకంగా మారే అవకాశం ఉందని వ్యవసాయ అధికారులంటున్నారు. వ్యాపారులు కూడా కొనుగోలు చేసిన సరుకును రబీ సరుకులా నిల్వచేసుకొనే అవకాశం లేనందున మార్కెట్ ధరలపై బాగానే ప్రభావం చూపుతుంది. వ్యాపారులు సరుకును ఇబ్బడిముబ్బడిగా నిల్వ చేసుకొనే అవకాశం లేదు. రబీ పంట నిల్వ ఎక్కువ కాలం ఉంటుంది. ఉల్లికి మద్ధతు ధర కోరుతూ మహారాష్ట్ర షేత్కారీ సంఘటన్ మార్చిలో భారీ ఆందోళన నిర్వహించింది. ఈ సంవత్సరం 90 శాతం సగటు దిగుబడులు సాధించే అవకాశ ఉందని అధికారులంటున్నారు.