breaking news
nallapu reddy
-
అరంగేట్రంలో అదుర్స్.. ఇంగ్లండ్కు చుక్కలు చూపించిన కడప అమ్మాయి
భారత యువ స్పిన్నర్ నల్లపురెడ్డి శ్రీ చరణి తన అంతర్జాతీయ టీ20 కెరీర్ను ఘనంగా ఆరంభించింది. కడపకు చెందిన నల్లపురెడ్డి శ్రీచరణి.. శనివారం ఇంగ్లండ్తో జరిగిన తొలి టీ20లో భారత తరపున అరంగేట్రం చేసింది. ఇప్పటికే వన్డేల్లో తన సత్తాను నిరూపించుకున్న ఈ తెలుగు అమ్మాయి..ఇప్పుడు టీ20ల్లో కూడా తన మార్క్ చూపింది.నాటింగ్హామ్ వేదికగా ఇంగ్లండ్తో మొదటి టీ20లో చరణి అద్బుతమైన ప్రదర్శన కనబరిచింది. తన స్పిన్ మయాజాలంతో ఇంగ్లండ్ బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టింది. ఈ మ్యాచ్లో 3.5 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చసిన చరణి.. కేవలం 12 పరుగులిచ్చి 4 వికెట్లను తన ఖాతాలో వేసుకుంది. తద్వారా 212 పరుగుల భారీ లక్ష్య చేధనలో ప్రత్యర్ధి జట్టు కేవలం 113 పరుగులకే కుప్పకూలింది. ఈ క్రమంలో శ్రీ చరణి ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకుంది.రెండో ప్లేయర్గా..అంతర్జాతీయ అరంగేట్రంలో భారత మహిళల జట్టు తరపున రెండువ అత్యత్తుమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన ప్లేయర్గా చరణి నిలిచింది. ఈ జాబితాలో అగ్రస్ధానంలో స్రవంతి నాయుడు ఉంది. 2014లో కాక్స్ బజార్ వేదికగా బంగ్లాదేశ్పై తన డెబ్యూ మ్యాచ్లో స్రవంతి తన 4 ఓవర్ల కోటాలో కేవలం 9 పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు సాధించింది. వీరిద్దరి తర్వాతి స్ధానంలో పూనమ్ యాదవ్ ఉంది. 2013లో వడోదర వేదికగా బంగ్లాదేశ్పై పూనమ్ తన అరంగేట్ర మ్యాచ్లో 21 పరుగులిచ్చి మూడో ప్లేయర్గా నిలిచింది. కాగా ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ను భారత మహిళల జట్టు 97 పరుగులతో చిత్తు చేసింది.చదవండి: 86 సెంచరీలు, 185 హాఫ్ సెంచరీలు చేసిన లెజెండ్ కన్ను మూత -
వైఎస్ జగన్పై హత్యయత్నంపై డీజీపీ వ్యాఖ్యలు సరికావు
-
ఫిరాయింపు ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి..
సాక్షి, నెల్లూరు : ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకహోదా కోసం వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్తశుద్ధితో రాజీలేని పోరాటం చేస్తున్నారని వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అన్నారు. ఆయన బుధవారం మాట్లాడుతూ.. హోదా విషయంలో ముందు నుంచి పోరాడుతున్న ఏకైక పార్టీ వైఎస్సార్ సీపీ మాత్రమేనన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం నాలుగు సంవత్సరాల నుంచి డ్రామాలు ఆడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. రాష్ట్రంలో నాలుగేళ్ల టీడీపీ ప్రభుత్వ పరిపాలన యథా చంద్రబాబు.. తథా ఎమ్మెల్యేలు అన్నట్లుగా సాగుతోందని, పైన ముఖ్యమంత్రి అడ్డగోలుగా అవినీతికి పాల్పడుతుంటే కింద ఆయన పార్టీ ఎమ్మెల్యేలు దొరికినంత మేరకు దోచుకుంటూ దుర్మార్గాలకు పాల్పడుతున్నారని నల్లపురెడ్డి ఆరోపించారు. ఈ నాలుగేళ్లలో ఎన్నో దారుణాలు, మోసాలు చేస్తూ.. అబద్ధాలు చెబుతున్న వ్యక్తి ముఖ్యమంత్రి స్థానంలో ఉండటం మన దురదృష్టకరమని ఆయన విమర్శించారు. నిజంగా చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే పార్టీ మారిన 23 మంది ఎమ్మెలేలతో వెంటనే రాజీనామ చేయించాలని నల్లపురెడ్డి డిమాండ్ చేశారు. -
'టీడీపీ వలస పార్టీగా మారింది'
నెల్లూరు: తెలుగుదేశం పార్టీ వలసల పార్టీగా మారిందని రాష్ట్ర వైఎస్ఆర్ సీపీ ప్రధాన కార్యదర్శి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి విమర్శించారు. అధికార పార్టీ నేతలు ఎన్టీఆర్ ఆశయాలను తుంగలో తొక్కారని ఆయన అన్నారు. విపక్ష పార్టీల ఎమ్మెల్యేలను అవినీతి డబ్బుతో ప్రలోభపెడుతున్నారని ఆయన మండిపడ్డారు. నెల్లూరు జెడ్పీ సమావేశం ఆదివారం రసాభాసగా మారింది. జిల్లాలోని అక్రమ ఖనిజ తవ్వకాలపై అధికారులు పట్టించుకోవటం లేదని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే పాశం సునిల్ కుమార్ సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేశారు.