breaking news
nagaram village
-
Pensions: ప్రతినెలా ఇదే తంతు.. సర్వర్ మొరాయింపు
కీసర(మేడ్చల్ జిల్లా): ఆసరా పింఛన్ల పంపిణీ ప్రహాసనంగా మారింది. పింఛన్ల సోమ్ము తీసుకునేందుకు వృద్ధులకు ఆగచాట్లు తప్పడం లేదు. సర్వర్లు మొరాయించడంతో వేలిముద్రలు తీసుకోవడం ఆలస్యం అవుతుండటంతో వృద్ధులు గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. దీంతో పింఛను పంపిణీ కేంద్రాల వద్ద లబ్ధిదారులు బారులుతీరుతున్నారు. ఒక్కోసారి రోజుల తరబడి తిరగాల్సి వస్తోందని లబ్ధిదారులు వాపోతున్నారు. ప్రతినెలా ఇదే తంతు నడుస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండలో నిలబడాల్సి వస్తోందని వాపోతున్నారు. రోజంతా పింఛన్ కేంద్రం వద్ద ఉన్నా పింఛన్ డబ్బులు తీసుకుంటామన్న నమ్మకం లేదని లబ్ధిదారులు పేర్కొంటున్నారు. తిప్పలు తప్పాలంటే నేరుగా ఖాతాలోకి వేయాలి రెండు, మూడు రోజులుగా పింఛన్ల కోసం తిరుగుతున్నా సర్వర్ సమస్యతో డబ్బులు తీసుకోలేకపోతున్నానని ఎస్వీనగర్కు చెందిన మోహన్రావు వాపోయారు. మరికొందరు ఉదయం 7 గంటలకు టిఫిన్ తీసుకొని వచ్చి పింఛన్ల డబ్బుల కోసం మధ్యాహ్నం వరకు అక్కడే ఉంటున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఈ తిప్పలు తప్పాలంటే తమకు బ్యాంకు ఖాతాల్లో జమ చేసేలా చూడాలని ఉన్నతాధికారులను లబ్ధిదారులు కోరుతున్నారు. జిహెచ్ఎంసీ పరిధిలో చాలా ప్రాంతాల్లో ఫించన్ డబ్బులను నేరుగా లబ్ధిదారుల ఖాతాలో వేస్తున్నారని మున్సిపాలిటీల్లోనూ ఇది అమలు చేస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైన సంబంధిత అధికారులు స్పందించి సమస్యకు పరిష్కారం చూపాలని కోరుతున్నారు. -
నగరం గ్రామంలో విషాదచాయలు
-
వ్యవసాయాన్ని పండుగ చేస్తాం
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి బాన్సువాడరూరల్ : గత పాలకులు వ్యవసాయమే దండుగ అన్నారని, కానీ తమ ప్రభుత్వం మాత్రం రైతన్నకు అండగా ఉండి వ్యవసాయాన్ని పండుగగా మారుస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. సోమవారం ఆయన జిల్లా ఇన్చార్జి కలెక్టర్ వెంకటేశ్వరావు, పశుసంవర్ధకశాఖ డెరైక్టర్ వెంకటేశ్వర్లుతో కలిసి మండలంలోని నాగారం గ్రామంలో గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందుల పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించి మా ట్లాడారు. రైతులు సాంప్రదాయ సాగుకు స్వస్తిపలికి శాస్త్రసాంకేతిక రంగాల్లో వస్తున్న మార్పులను సద్వినియోగం చేసుకుంటూ అత్యధిక లాభాలు గడించాలని సూచించారు. తెలంగాణ వ్యాప్తంగా జూ లై, జనవరి మాసాల్లో రెండువిడతలుగా 8కోట్లతో నట్టల నివారణ మందులు పంపిణీ చేస్తున్నామన్నారు. మరో నాలు గు కోట్లతో ఏప్రిల్మాసంలోనూ మూడోవిడత పంపిణీకి సన్నాహాలు చేస్తున్నామన్నా రు. రాష్ట్రంలో పాల ఉత్పత్తిని గణనీయంగా పెంచడానికి చర్యలు తీసుకుంటున్నా మన్నా రు. అనంతరం గొర్రెలు, మేకల పెంపకందార్లు, పశుసంవర్థక శాఖ అధికారులు మంత్రి పోచారంను ఘనంగా సన్మానించారు. గొంగళి కప్పి గొర్రెను బహుమానంగా ఇచ్చారు. పశుసంవర్థక శాఖ జేడిఏ ఎల్లన్న పాల్గొన్నారు. రైతు గుండెచప్పుడు తెలిసిన వ్యక్తి పోచారం రైతు గుండె శబ్ధం తెలిసిన వ్యక్తి, తెలంగాణ తొలి వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి అని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ వెంకటేశ్వరావు అన్నారు. ఇటీవల అకాల వర్షాలు పడి ధాన్యం రాశులు ఎక్కడి కక్కడ నిలిచి పోయిన సందర్భంలో వాటిని రైస్ మిల్లులకు తరలించడంలో ఎమ్మెల్యేగా ఆయన పడిన తపనను తా ను స్వయంగా చూశానని గుర్తుచేసుకున్నారు. రాష్ట్ర వ్యవసాయ శా ఖ మంత్రిగా ఆయన తెలంగాణ ప్రజలకు చక్కటి సేవలు అందిస్తారని ఆకాక్షించారు.