breaking news
nad kotha road
-
రాజకీయాలతో ముడిపెట్టొద్దు: బొత్స
సాక్షి, విశాఖ : ప్రభుత్వ భూముల విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. సీతమ్మధారలో మాజీ మేయర్ సబ్బం హరి ఆక్రమించిన ప్రభుత్వ స్థలాన్ని తిరిగి అధికారులు స్వాధీనం చేసుకోవడం తప్పు లేదన్నారు. అధికారులు చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడానికి రాజకీయం చేయడం తగదని మంత్రి బొత్స హితవు పలికారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టిలో అందరూ సమానులే అని, ప్రభుత్వ భూముల్లో ఆక్రమణల తొలగింపును రాజకీయాలతో ముడి పెట్టడం సరికాదని అన్నారు. (చిత్తగించండి.. ఇదిగో ‘హరి’ చిట్టా..) మంత్రులు బొత్స సత్యనారాయణ, అవంతి శ్రీనివాసరావు ఆదివారం ఉదయం ఎన్ఏడీ ఫ్లై ఓవర్ పనులను పరిశీలించారు. గత నెల ఫ్లై ఓవర్ తొలి దశ పనుల్లో భాగంగా విమానాశ్రయం నుంచి విశాఖ సిటీలోకి వెళ్లే రోడ్డు ప్రారంభమైంది. తాజాగా తాటిచెట్ల పాలెం నుంచి గోపాలపట్నం వైపు వెళ్లే రోడ్డు పనులను మంత్రి బొత్స ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రాఫిక్ సమస్యకు కేరాఫ్గా మారిన ఎన్ఏడీలో రెండు వైపులా రోడ్లు ప్రారంభం కావడంతో చాలా వరకు సమస్య పరిష్కారమైందన్నారు. ఏడాది చివరికల్లా ఫ్లైఓవర్ పనులు పూర్తవుతాయని తెలిపారు. త్వరితగతిన ఫ్లై ఓవర్ను ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. ఈ కార్యక్రమంలో విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, నగర దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్, గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, జీవీఎంసీ కమిషనర్ సృజన తదితరులు పాల్గొన్నారు. (ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా ఏపీ పర్యాటకం) -
సీఎం జగన్ దృష్టిలో అందరూ సమానులే
-
విశాఖ జిల్లాలో వైఎస్ఆర్ సీపీ రహదారుల దిగ్బంధం
-
విశాఖ జిల్లాలో వైఎస్ఆర్ సీపీ రహదారుల దిగ్బంధం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రహదారుల దిగ్బంధం కార్యక్రమానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో నగరంలోని ఎన్ఏడీ కొత్త రోడ్డు జంక్షన్లో పసుపులేటి ఉషాకిరణ్, పక్కి దివాకర్ ఆధ్వర్యంలో బుధవారం జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. దాంతో జాతీయ రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. అలాగే పెందుర్తి జంక్షన్లో ఆ పార్టీ కన్వీనర్ గండి బాబ్జి నేతృత్వంలో రోడ్ల దిగ్బంధించారు. దాంతో బైపాస్ రోడ్డుపై భారీగా ట్రాఫిక్ ఏర్పడింది. గాజువాక జంక్షన్లో ఆ పార్టీ నేత నాగిరెడ్డి ఆధ్వర్యంలో రహదారి దిగ్బంధించారు. అలాగే విశాఖపట్నం నగర కన్వీనర్ వంశీకృష్ణ ఆధ్వర్యంలో హనుమంతవాక, మద్దెలపాలెం, ఇసుక తోట పరిసరాల్లో జాతీయ రహదారిపై వైఎస్ఆర్ సీపీ శ్రేణులు ధర్నా నిర్వహించాయి. కాగా విశాఖ జిల్లాలోని అరకులో మాజీ ఎమ్మెల్యే కుంభా రవిబాబు ఆధ్వర్యంలో అంతరాష్ట్ర ఒరిస్సా రహదారిపై ధర్నా నిర్వహించారు. అలాగే భీమిలి నియోజకవర్గ పరిధిలోని కోరాడ రాజబాబు ఆధ్వర్యంలో జాతీయరహదారిని దిగ్బంధించారు.