breaking news
MVV Builders
-
ఇవెక్కడి దుర్మార్గపు రాతలు రామోజీ!
రామోజీరావు దందా ఎలా ఉందంటే.... ఎంవీవీ వ్యవహారం 2012లో మొదలై 2018లో ముగిసింది. దీన్ని కూడా వైఎస్సార్సీపీకి అంటగట్టేశారు. ఎంవీవీ, భూ యజమానుల మధ్య అగ్రిమెంట్ 2018 జనవరి 8న జరిగిందని ఆయనే రాశారు. అప్పటికి ఎంవీవీ సత్యనారాయణ పార్లమెంటు సభ్యుడేమీ కాదు. కనీసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడు కూడా కాదు. ఎందుకంటే ఆయన పార్టీలో చేరిందే 2018 మేలో. పైపెచ్చు ఇది పూర్తిగా కొందరు ప్రయివేటు వ్యక్తుల మధ్య జరిగిన ఒప్పందం. ఒక వ్యాపారిగా ఆ ప్రయివేటు వ్యక్తులందరితోనూ ఒప్పందాలు చేసుకుని, వివాదాన్ని పరిష్కరించుకుని ఆయన నిర్మాణం మొదలెట్టారు. విచిత్రమేంటంటే వాళ్లతో అగ్రిమెంట్లు జరిగేటపుడు అధికారంలో ఉన్నది తెలుగుదేశం పార్టీయే. ఈ భవనానికి జీవీఎంసీ అనుమతులిచ్చింది 2019 మార్చిలో. నాడు కూడా అధికారంలో ఉన్నది చంద్రబాబే. కానీ ‘ఈనాడు’ ఈ విషయాలేమీ రాయదు. అప్పటికాయన ఎంపీ కాదని గానీ... ఇవన్నీ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నపుడే జరిగాయని గానీ నిజాలు చెప్పదు. ఇంత దారుణంగా దిగజారిపోయి రామోజీరావు రాసిన రాతలపై ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ వాస్తవాలను వివరించారు. అవి... వాస్తవాలు ఇవీ....! ► కూర్మన్నపాలెంలో10.57 ఎకరాలకు సంబంధించి 1982 నుంచి దీర్ఘకాలంగా వివాదం నడుస్తోంది. గొట్టిపల్లి శోభారాణి కుటుంబీకులు, 160 మంది డాక్ లేబర్ బోర్డు (డీఎల్బీ) ఉద్యోగులతో పాటు కొప్పిశెట్టి శ్రీనివాస్ల మధ్య 1982 నుంచీ వివాదం ఉంది. వివాదాన్ని పరిష్కరించేలా చూడాలని బిల్డర్గా ఉన్న ఎంవీవీ సత్యనారాయణను 2012లో డీఎల్బీ ఉద్యోగులు ఆశ్రయించారు. ► ఆ 160 మంది ఉద్యోగులకూ ఒక్కొక్కరికీ ఒక్కో ఫ్లాట్ చొప్పున మొత్తం 160 ఫ్లాట్లను ఇస్తానని ఎంవీవీ చెప్పటంతో... వారు తమ వాటాను ఆయనకు 2012లోనే అగ్రిమెంట్ చేశారు. ► ఆ తరవాత కొప్పిశెట్టి శ్రీనివాస్తో ఎంవీవీ సంప్రతింపులు మొదలెట్టారు. 2012లో మొదలైన ఈ ప్రక్రియ... చివరకు 2017లో ముగిసింది. వారికి 30వేల చదరపు అడుగులను ఇచ్చేలా 2017లో ఎంవోయు కుదిరింది. ► ఇక మిగిలిన గొట్టిపల్లి శోభారాణి, ఆమె కుటుంబీకులకు 14,400 చదరపు అడుగులిచ్చేలా వారితో 2018 జనవరిలో ఒప్పందం చేసుకున్నారు. ఇవన్నీ ప్రయివేటు వ్యక్తుల మధ్య జరిగిన ఒప్పందాలు. వీటికి ప్రభుత్వంతో ఒక్క శాతం కూడా సంబంధం లేదు. ఈ ఒప్పందాలతో పాటు వివిధ పక్షాలకు రూ.8 కోట్ల నుంచి రూ.10 కోట్లు చెల్లింపులు కూడా చేశారు. ► ఇవన్నీ పూర్తయ్యాక 15 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో భవంతులను నిర్మించుకునేందుకు 2019 మార్చి 11న జీవీఎంసీ ప్లాన్ను ఆమోదించింది. అప్పడూ అధికారంలో ఉంది టీడీపీయే. ► అక్కడ ధర చదరపు అడుగు రూ.4 వేల మేర ఉన్నా... ఇందులో కొన్న సుమారు 1800 మందికి చ.అ. రూ.2,500కే ఇచ్చామని, గేటెడ్ కమ్యూనిటీ సదుపాయాలున్న ఈ ప్రాజెక్టులో ఒక్కో ఫ్లాటు రూ. 30 లక్షలలోపు ధరకే అందించామని, ఇదంతా పూర్తిగా ప్రై వేటు వ్యవహారమని చెప్పారు ఎంవీవీ. -
టాలీవుడ్ నిర్మాత అరెస్ట్
విశాఖపట్నం: భూ ఆక్రమణకు పాల్పడ్డారన్న ఆరోపణలపై ప్రముఖ గృహ నిర్మాణ సంస్థ ఎంవీవీ బిల్డర్స్ అధినేత, టాలీవుడ్ సినీ నిర్మాత ఎంవీవీ సత్యనారాయణను పీఎం పాలెం పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు డీసీసీ సీహెచ్ వెంకటేశ్వరరావు స్థానిక పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. క్రికెట్ స్టేడియం ఎదురుగా ఉన్న సర్వే నెంబర్ 357/1, 357/2 మధురవాడలో గతంలో పంచాయతీ అనుమతి పొందిన లే అవుట్లో ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన 88 మందికి స్థలాలున్నాయి. అందులో 38 మంది నుంచి స్థలాలు సేకరించి ఎంవీవీ అధినేత సత్యనారాయణ ‘విశాఖపట్నం సీటీ’ పేరిట గృహనిర్మాణ ప్రాజెక్ట్ను భారీ ఎత్తున ప్రారంభించారు. ఇందుకోసం భారీ ఎత్తున ప్రకటన బోర్డులు, హోర్డింగ్లేర్పాటు చేసి ప్రకటనలు గుప్పించారు. ఈ క్రమంలో లే-అవుట్లో ఉన్న ఇతరుల భూముల్ని కూడా ఆక్రమించి రోడ్డు నిర్మించారన్నది ఆరోపణ. ఆక్రమించిన భూముల్లో వివిధ నిర్మాణాలు చేపట్టారు. అయితే తమ స్థలాన్ని ఎంవీవీ బిల్డర్ ఆక్రమించారని ఆరోపిస్తూ శ్రీకాకుళం జిల్లా రాజాంకు చెందిన జడ్డు విష్ణుమూర్తి పీఎంపాలెం పోలీసులకు ఫిర్యాదు చేసారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన సీఐ లక్ష్మణమూర్తి ప్రాథమికంగా ఆరోపణ రుజువు కావడంతో శుక్రవారం ఎంవీవీ బిల్డర్ను లాసన్స్బే కాలనీలోని ఆయన నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. కాగా గతంలో కూడా పలు ఆక్రమణలకు సంబంధించి ఎంవీవీ అధినేతపై కేసు నమోదైందని డీసీపీ స్పష్టం చేశారు. కాగా, ఎంవీవీ అధినేత అరెస్ట్ నేపథ్యంలో పోలీసుల తీరుపై విమర్శలొస్తున్నాయి. కాగా తనకు గుండె నెప్పిగా ఉందని బిల్డర్ చెప్పడంతో చికిత్స నిమిత్తం ఆయన్ను కేజీహెచ్కు తరలించామని పీఎం పాలెం పోలీసులు స్పష్టం చేశారు. కళా వెంకటరావు కుట్ర నిందితుడు ఎంవీవీ సత్యనారాయణ విలేకరులతో మాట్లాడుతూ ఇదంతా టీడీపీ నాయకుడు కళా వెంకటరావు, కుటుంబ సభ్యుల కుట్రగా ఆరోపించారు. తనపై లేని పోని నిందలు మోపి తనను అభాసుపాలు చేయడానికి ప్రయత్నించారని విమర్శించారు. నిబంధనల ప్రకారమే తాను విశాఖ సిటీ ప్రాజెక్ట్ పనులు ప్రారింభించానన్నారు. రౌడీషీట్ తెరుస్తాం మధురవాడ ప్రాంతంలో గతం కంటే ప్రస్తుతం భూ ఆక్రమణ కేసులు తగ్గాయని, ఆక్రమణలకు సంబంధించి ఫిర్యాదులొస్తే కఠినంగా వ్యవహరిస్తున్నామని డీసీపీ స్పష్టం చేశారు. ఆక్రమణలపై ఫిర్యాదులొస్తే రౌడీ షీట్లు తెరవడానికైనా వెనుకాడేది లేదని చెప్పారు.