breaking news
Motor Amendment bill
-
189 చలానాలు.. బైక్ మీరే తీసుకొండి
చండీగఢ్: కొత్త మోటారు వాహన చట్టం అమల్లోకి వచ్చిన నాటి నుంచి ట్రాఫిక్ చలానా అంటే చాలు జనాలు దడుచుకుంటున్నారు. కొత్త రూల్స్ ప్రకారం ఒకటి, రెండు చలానాలు వస్తే.. చాలు.. ఆ సొమ్ము చెల్లించడానికి ఏకంగా వాహనాన్ని అమ్మల్సిన పరిస్థితి. ఈ క్రమంలో ఓ బైక్ మీద ఏకంగా 189 చలానాలు ఉండటం ఒక ఎత్తయితే.. దీని గురించి సదరు బైక్ యజమానికి ఎలాంటి సమాచారం లేకపోవడం ఇక్కడ ఆశ్చర్యకరమైన అంశం. వివరాలు.. చండీగఢ్కు చెందిన సంజీవ్ ఇన్సూరెన్స్ ఏజెంట్గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం సెక్టార్ 33 ప్రాంతంలో రాంగ్ డైరెక్షన్లో యూ టర్న్ తీసుకున్నాడు. దాంతో ట్రాఫిక్ సిబ్బంది అతనికి రూ.300 చలానా విధించి.. జిల్లా కోర్టుకు పంపించారు. అక్కడ సంజీవ్కు దిమ్మతిరిగిపోయే విషయం తెలిసింది. 2017-19 మధ్య కాలంలో సంజీవ్ మీద 189 ట్రాఫిక్ చలానా నమోదయ్యాయనే విషయం వెలుగు చూసింది. దాంతో ఆశ్చర్యపోవడం సంజీవ్ వంతయ్యింది. దీని గురించి సంజీవ్ మాట్లాడుతూ.. ‘పని ఒత్తిడి కారణంగా అప్పుడప్పుడు నేను ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తూ ఉంటాను. కానీ మరి ఇంత భారీ సంఖ్యలో నా మీద చలానాలు నమోదైన సంగతి నిజంగా నాకు తెలీదు. దీని గురించి ట్రాఫిక్ సిబ్బంది కూడా నాకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు’ అని తెలిపాడు. అంతేకాక ‘కొత్త చట్టం అమల్లోకి వచ్చిన నాటి నుంచి జాగ్రత్తగానే ఉంటున్నాను. కానీ ఇన్ని చలానాలున్నాయని నిజంగానే నాకు తెలీదు. ఇప్పుడు చలానాలను చెల్లించడం కంటే బైక్ను ఇక్కడే వదిలేసి వెళ్లడం మంచిది’ అంటూ వాపోయాడు. గతంలో ఓ పాల వ్యాపారి బైక్ మీద కూడా 36 చలానాలున్నాయంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. -
ట్రాఫిక్ ఉల్లంఘనులపై కొరడా
-
ట్రాఫిక్ ఉల్లంఘనులపై కొరడా
► మోటారు సవరణ బిల్లుకు కేబినెట్ ఆమోదం ► హిట్ అండ్ రన్ కేసుల్లో రూ. 2 లక్షలు ► డ్రంకెన్ డ్రైవింగ్కు రూ.10 వేలు ► సీటు బెల్టు పెట్టుకోకుంటే రూ. వెయ్యి... ► హెల్మెట్ లేకుంటే రూ. 2 వేలు, మూడు నెలలు లైసెన్స్ రద్దు ► మోటారు సవరణ బిల్లుకు ► కేంద్ర కేబినెట్ ఆమోదం న్యూఢిల్లీ: దేశంలో రోడ్డు భద్రత, రవాణా రంగంలో భారీ సంస్కరణలకు కేంద్రం తెరలేపింది. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వారికి భారీ జరిమానాలు విధిస్తూ రూపొందించిన మోటారు వాహనాల (సవరణ) బిల్లు-2016కు ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. డ్రంకెన్ డ్రైవింగ్ కేసుల్లో రూ.10 వేలు, హిట్ అండ్ రన్ కేసుల్లో రూ. 2 లక్షల జరిమానాను ప్రతిపాదించారు. 18 రాష్ట్రాల రవాణా మంత్రుల సిఫార్సుల మేరకు ఈ బిల్లును రూపొందించినట్లు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కారీ చెప్పారు. గతంలో రాష్ట్రాలు అభ్యంతరాలు వ్యక్తంచేయడంతో ఈ బిల్లు ఎంతో కాలంగా పెండింగ్లో ఉండింది. బిల్లులోని ముఖ్యాంశాలు ఓవర్ స్పీడ్కు రూ.1,000-4,000 వరకు జరిమానా ఇన్సూరెన్స్ లేకుండా వాహనం నడిపితే రూ.2 వేలు పెనాల్టీ, 3 నెలల జైలు హెల్మెట్ లేకుండా వాహనం నడిపితే రూ. 2వేల జరిమానా, 3 నెలలపాటు లెసైన్స్ రద్దు జువెనైల్స్ అతిక్రమణకు వారి సంరక్షకుడు/యజమానికి రూ.25వేల జరిమానా, మూడేళ్ల జైలు. ఆ వాహన రిజిస్ట్రేషన్ రద్దు. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనకు జరిమానా రూ.100 నుంచి రూ.500కు పెంపు. అధికారుల ఆదేశాలను బేఖాతరుచేస్తే కనీస జరిమానా రూ. 2వేలు. లెసైన్స్ లేకుండా వాహనాన్ని నడిపితే రూ.5వేల జరిమానా. అర్హత లేకుండా వాహనం నడిపితే కనీస జరిమానా రూ.10 వేలు ప్రమాదకర డ్రైవింగ్కు జరిమానా రూ.1,000 నుంచి రూ.5వేలకు పెంపు తాగి వాహనం నడిపితే రూ.10 వేల జరిమానా లెసైన్స్ నిబంధనలను ఉల్లంఘించే క్యాబ్ లాంటి వాహనాల వారికి రూ. లక్ష వరకు జరిమానా ఎక్కువ లోడ్తో వెళ్లే వాహనాలకు రూ.20వేలు సీటు బెల్ట్ పెట్టుకోకుంటే రూ.వెయ్యి హిట్ అండ్ రన్ కేసుల్లో జరిమానా రూ.25వేల నుంచి రూ.2 లక్షలకు పెంపు. ప్రమాద మృతులకు రూ.10 లక్షల వరకు పరిహారమివ్వాలి. అక్టోబర్ 1, 2018 నుంచి వాహనాలకు ఆటోమేటెడ్ ఫిట్నెస్ పరీక్ష నిర్వహించాలి. దేశవ్యాప్తంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఏకరూపత తెచ్చేందుకు వాహన్, సారథి వేదికల ద్వారా జాతీయ డ్రైవింగ్ లెసైన్స్ రిజిష్టర్ను, జాతీయ వాహనాల రిజిస్ట్రేషన్ను తీసుకురావాలి. దివ్యాంగులకు రవాణాలో ఉన్న ప్రతిబంధకాలకు ఈ బిల్లులో పరిష్కారాలను చూపారు. డ్రైవింగ్ లెసైన్స్ జారీ, వారికి అనువుగా వాహనాల మార్పునకు అనుమతి. మోటారు వాహనాల చట్టంలో 68 సెక్షన్లకు సవరణలు ప్రతిపాదించారు. కొత్తగా 28 సెక్షన్లు చేర్చాలని సూచించారు. రోడ్డు ప్రమాదాలను 50% తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి గడ్కారీ చెప్పారు.