breaking news
mla ramesh
-
ప్రధాని మోదీ రాష్ట్ర ప్రభుత్వంపై కక్షగట్టారు
రాయచోటి అర్బన్ : విభజన హామీలను అమలుపర్చాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నామన్న ఉద్దేశంతో ప్రధాని నరేంద్రమోదీ రాష్ట్రప్రభుత్వంపై కక్ష గట్టారని మాజీ ఎమ్మెల్యే రమేష్ కుమార్రెడ్డి ఆరోపిం చారు. శనివారం స్థానిక మార్కెట్ యార్డు ఆవరణంలో 1, 2, 31 వార్డుల్లో 4వ విడత నవనిర్మాణదీక్ష సభను నిర్వహించారు. గతంలో జరిగిన తిరుపతి సభలో వేంకటేశ్వరస్వామి సాక్షిగా విభజన హామీలన్ని నెరవేరుస్తానంటూ ప్రధాని ప్రమాణం చేశారన్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ గాజుల ఖాదర్బాష, వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ దేవర మురళి, ప్రభుత్వ న్యాయవాది జక్రియాబాష, కమిషనర్ శ్రీనివాసులు, డీఈఈ సుబ్రమణ్యం, హౌసింగ్ ఏఈ హరి పాల్గొన్నారు. రామాపురం : నవనిర్మాణ దీక్షల నిర్వహణ సమయాల్లో మార్పుచేసినట్టు మండల ప్రత్యేకాధికారి చంద్రశేఖర్రెడ్డి తెలిపారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో శనివారం నవనిర్మాణ దీక్ష నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. మధ్యాహ్నం నుంచి కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. తహసీల్దార్ అనూరాధ, ఎంపీడీఓ విజయరావు, ఎంపీడీఓ సూపరింటెండెంట్ అబ్దుల్రహీం పాల్గొన్నారు. నవనిర్మాణ దీక్షా.. పింఛన్ల పంపిణీనా ? సంబేపల్లె : నవనిర్మాణ దీక్షా.. పింఛన్లు పంపిణీ కార్యక్రమా అని పింఛన్దారులు వాపోతున్నారు. దీక్షలకు జనాలు రాక పోవడంతో కొత్తగా పింఛన్లు ఇస్తామంటూ అధికార పార్టీ నాయకులు, అధికారులు ప్రజలను మభ్యపెడుతున్నారని పలువురు పేర్కొంటున్నారు. శనివారం నాల్గో విడత నవనిర్మాణ దీక్ష కార్యక్రమాన్ని ప్రారంభించారు. లక్కిరెడ్డిపల్లె: నవనిర్మాణ దీక్షలో అందరూ భాగస్వాములు కావాలని మండల ప్రత్యేకాధికారి శివప్రసాద్ పేర్కొన్నారు. స్థానిక పంచాయతీ కార్యాలయంలో నవనిర్మాణ దీక్ష కార్యక్రమం నిర్వహించారు. ఎంపీడీఓ రవికుమార్ రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ శ్రీరాములు నాయక్, సూపరింటెండెంట్ హైదర్ వల్లీ పాల్గొన్నారు. -
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
పర్వతగిరి : రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యే యమని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్, డీసీసీబీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి అన్నారు. గురువారం మండలంలోని కల్లెడలో పీఏసీఎస్ నూతన కార్యాలయ భవనాన్ని వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రమేష్ మాట్లాడుతూ రై తు సంక్షేమమం కోసం సీఎం కేసీఆర్ పెద్ద ఎత్తున సాగునీటి ప్రాజెక్టులను కడుతున్న ట్లు తెలిపారు. రైతులకు ఉదయం 9 గంట ల కరెంట్ ఇస్తున్నట్లు తెలిపారు. డీసీసీబీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి మాట్లాడుతూ పీఏసీఎస్ల ద్వారా చిన్న, సన్నకారు రైతులకు అనేక ప్రయోజనాలను కల్పిస్తున్నట్లు తెలిపారు. అనంతరం పీఎసీఎస్ ఆవరణ లో మెుక్కలను నాటారు. అలాగే కల్లెడ బీసీకాలనీలో సీసీ రోడ్లకు శంకుస్థాపన చే శారు. కార్యక్రమంలో ఎర్రబెల్లి రామ్మోహన్రావు, ఎంపీపీ రంగు రజితకుమార్, జెడ్పీటీసీ సభ్యురాలు మాదాసి శైలజా సు« దాకర్, సర్పంచ్ చినపాక శ్రీనివాస్, చైర్మన్ అశోక్రావు తదితరులు ఉన్నారు.