breaking news
MLA kausar
-
‘రూ. 50 లక్షలు ఇవ్వకుంటే నీ కొడుకును కిడ్నాప్ చేస్తాం’
బంజారాహిల్స్: కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొయినుద్దీన్ను గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ కాల్ చేసి బెదిరించారు. రూ.50 లక్షలు ఇవ్వకపోతే నీ కొడుకును కిడ్నాప్ చేస్తామంటూ చెప్పడంతో ఆందోళన చెందిన ఎమ్మెల్యే బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యా దు చేశారు. టోలీచౌకీ సమీపంలోని హకీంపేట్లో నివసించే ఎమ్మెల్యే కౌసర్ గత నెల 28వ తేదీన హైదరాబాద్ నుంచి సిద్దిపేటకు వెళుతున్నాడు. అదే సమయంలో 9102563387 నెంబర్ నుంచి ఆయనకు ఫోన్కాల్ వచ్చింది. రూ.50 లక్షలు ఇవ్వాలని, లేకపోతే చిన్నకొడుకు జాఫర్ను కిడ్నాప్ చేస్తామంటూ హెచ్చరించి నిందితుడు ఫోన్ డిస్కనెక్ట్ చేశాడు. ఆందోళన చెందిన ఎమ్మెల్యే వెనక్కి తిరిగి వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: ప్రేమకు నో చెప్పిందని టెకీపై కత్తితో దాడి) -
ప్రహరీ కూల్చివేత.. అడ్డుకున్న ఎమ్మెల్యే!
- రోడ్డుకు అడ్డంగా ఉండటంతో పడగొట్టిన జీహెచ్ఎంసీ - అధికారులను నిలదీసిన ఎమ్మెల్యే కౌసర్... ఉద్రిక్తత - హైదరాబాద్లోని బంజారాహిల్స్లో ఘటన హైదరాబాద్: నగరంలోని బంజారాహిల్స్ రోడ్ నం.3లో రోడ్డుకు అడ్డుగా నిర్మించిన ప్రహరీ కూల్చివేత... ఎమ్మెల్యే జోక్యంతో ఉద్రిక్తంగా మారింది. సోమవారం జీహెచ్ఎంసీ సర్కిల్-10(బి) టౌన్ప్లానింగ్ ఏసీపీ జగన్మోహన్రావు ఆధ్వర్యంలో సిబ్బంది గోడను పడగొడుతుండగా... కార్వాన్ ఎమ్మె ల్యే కౌసర్, మాజీ మేయర్ మాజిద్హుసేన్ అక్కడకు వచ్చి అడ్డుకున్నారు. ఇది పబ్లిక్ రోడ్డు కాదని, అలాంటప్పుడు ప్రహరీని ఎలా కూలుస్తారంటూ ఎమ్మెల్యే అధికారులను నిలదీశారు. అక్కడున్న కొందరు ఆయనకు మద్దతు పలికారు. దీంతో దాదాపు రెండు గంటల పాటు వాదోపవాదాలతో పరిస్థితి ఉద్రిక్తంగా మారి, పనులు నిలిచిపోయాయి. చివరకు జీహెచ్ఎంసీ అధికారులు... భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి గోడను నేలమట్టం చేశారు. పబ్లిక్ రోడ్డు.. అందుకే కూల్చేశాం: ఏసీపీ జగన్మోహన్రావు ఇది పబ్లిక్ రోడ్డని, ముందుగా నోటీసులు ఇచ్చిన తరువాతనే ప్రహరీ కూల్చామని ఏసీపీ జగన్మోహన్రావు తెలిపారు. గతంలో గ్రూప్ హౌసింగ్ కింద ఇంటర్నల్ కాంపౌండ్ వాల్ కట్టబోమనే షరతుతో అనుమతి తీసుకు న్నారని, అనంతరం ఎవరికి వారే వ్యక్తిగత నివాసాలకు ప్రహరీ నిర్మించుకున్నారని చెప్పారు. ఇది గేటెడ్ కమ్యూనిటీ నిబంధనలను ఉల్లంఘించడమేనన్నారు. వెనుక ఉన్న స్థలం యజమాని ఇంటి అనుమతి ప్లాన్లో ఇది అప్రోచ్రోడ్గా ఉన్నందున, ఈ ప్రహరీని కూల్చివేసి అప్రోచ్ రోడ్డు వసతి కల్పించామని తెలిపారు. మా ఇంటికి దారి చూపించాలి కదా.. 2010లో బంజారాహిల్స్ రోడ్ నంబర్ృ3లో ఆరు వేల గజాల స్థలాన్ని నా భార్య ఝాన్సీ పేరిట కొన్నాం. అప్పటి సేల్ డీడ్లోనూ ఇది పబ్లిక్ రోడ్డనే ఉంది. 2012లో ఇంటి నిర్మాణం కోసం జీహెచ్ఎంసీ అనుమతి తీసుకున్నాం. వారు కూడా దీన్ని పబ్లిక్ రోడ్డుగానే నిర్ధారించారు. కాలనీవాసులను గోడ తియ్యమని ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోకపోవడంతో జీహెచ్ఎంసీని సంప్రదించాం. ఇటీవల అక్కడ విల్లాలు కూడా కట్టడంతో మాకు దారి లేకుండా పోయి ఇంటి నిర్మాణం ఆగిపోయింది. - పొట్లూరి వరప్రసాద్ (సినీ నిర్మాత, పీవీపీ వెంచర్స్ అధినేత), లోపలున్న స్థల యజమాని స్థలం కొన్నప్పుడే ఆ గోడ ఉంది... 1984ృ85లో ఐదుగురం కలిసి 7,200 గజాల స్థలాన్ని కొన్నాం. అప్పుడే ఈ గోడ ఉంది. గ్రూప్ హౌసింగ్ కింద 1987లో జీహెచ్ఎంసీకి దరఖాస్తు చేశాం. 30 ఫీట్ల ఇంటర్నల్ ప్రైవేట్ రోడ్డు అని చూపించి అనుమతులు తీసుకున్నాం. పర్మిషన్ కాపీలో కూడా ఈ గోడ ఉంది. గ్రూప్ హౌసింగ్ కింద అనుమతులు తీసుకున్నాక.. 1994ృ95లో జీహెచ్ఎంసీ సర్కిల్ ఆఫీసులో రివైజ్డ్ ప్లాన్ దరఖాస్తు చేసిన మాట నిజమే. కానీ రివైజ్డ్ ప్లాన్లో కాలనీ రోడ్డు ఉందని ప్రస్తావించాం తప్ప, దాన్ని పబ్లిక్ రోడ్డుగా చూపించలేదు. - బెజవాడ కృష్ణారెడ్డి, సునీల్ చంద్రారెడ్డి, కాలనీలోని స్థల యజమానులు -
ఐదంతస్తుల అక్రమకట్టడం కూల్చివేత
అక్రమ కట్టడాల కూల్చివేతలో భాగంగా గ్రేటర్ అధికారులు ఐదంతస్తుల భవనాన్ని నేలమట్టం చేశారు. టోలిచౌకి ప్రాంతం బృందావన్ కాలనీలో ఒక ఐదంతస్తుల భవనాన్ని ఆక్రమిత స్థలంలో నిర్మించినట్లు గుర్తించిన జీహెచ్ఎంసీ అధికారులు అక్కడికి జేసీబీలతో చేరుకున్నారు. ఆ భవనాన్ని నేలమట్టం చేయటంపై సమాచారం అందుకున్న ఎమ్మెల్యే కౌసర్ అక్కడికి చేరుకుని, అధికారులతో వాగ్వాదానికి దిగారు. భవనం కూల్చివేతను ఆపాలని గట్టిగా కోరారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. అయితే, అధికారులు ససేమిరా మాట వినకపోవటంతో అక్కడి నుంచి ఆగ్రహంతో వెళ్లిపోయారు. సిబ్బంది కూల్చివేతను కొనసాగిస్తున్నారు.