breaking news
misrepresentation
-
న్యాయమూర్తులపై దుష్ప్రచారం.. కొత్త ట్రెండ్
న్యూఢిల్లీ: న్యాయమూర్తులపై ప్రభుత్వాలే దుష్ప్రచారం సాగిస్తుండడం దురదృష్టకరం, ఇదొక కొత్త ట్రెండ్ అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. ఇష్టంలేని తీర్పులు వెలువరించిన న్యాయమూర్తులపై తప్పుడు ప్రచారం సాగిస్తున్నారని ఆక్షేపించింది. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన మాజీ ఐఏఎస్ అధికారి అమన్కుమార్ సింగ్పై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను కొట్టివేస్తూ చత్తీస్గఢ్ హైకోర్టు ఆదేశాలిచ్చింది. ఈ ఆదేశాలు సవాలు చేస్తూ చత్తీస్గఢ్ ప్రభుత్వం, ఓ సామాజిక కార్యకర్త సుప్రీంకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడుతూ.. ‘‘మీ పోరాటం మీరు చేసుకోండి. కానీ కోర్టులను అప్రతిష్టపాలు చేయడానికి ప్రయత్నించొద్దు. సుప్రీంకోర్టులో కూడా ఇలాంటివి చూస్తున్నా. జడ్జీలపై ప్రభుత్వాలే దుష్ప్రచారం ప్రారంభిస్తున్నాయి. ఇది చాలా దురదృష్టకరం. ఇదొక కొత్త ట్రెంట్గా మారింది’’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
కేజ్రీవాల్ కు ఢిల్లీ కోర్టు సమన్లు
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు డిల్లీ కోర్టు సమన్లు జారీ చేసింది. ఢిల్లీ ఎన్నికల సందర్భంగా సమర్పించిన అఫిడవిట్ లో తప్పుడు సమాచారం ఇచ్చారనే ఆరోపణలపై ఢిల్లీ పటియాలా హౌస్ కోర్టు ఆయనకు సమన్లు జారీ చేసింది. జులై 30లోగా కోర్టు ఎదుట హాజరుకావాలని కేజ్రీవాల్ను కోర్టు ఆదేశించింది. 2013 తన ఎన్నికల సందర్భంగా కేజ్రీవాల్ తన సరైన చిరునామా ఇవ్వలేదని, ఆస్తులకు సంబంధించి తప్పుడు సమాచారం అందించారని ఆరోపిస్తూ మౌలిక్ భారత్ ట్రస్ట్ అనే స్వచ్ఛంద సంస్థ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ స్నిగ్ధ సర్ వారియా ఈ సమన్లు జారీ చేశారు. ఎన్నికల అఫిడవిట్ లో ముఖ్యమంత్రి తప్పుడు సమాచారం ఇచ్చారని కాంగ్రెస్ విమర్శించిన సంగతి తెలిసిందే.