breaking news
Ministry of Science and Technology
-
కరోనా వ్యాక్సిన్ : ప్రకటనలో గందరగోళం
న్యూఢిల్లీ : కరోనాను అంతం చేయడంలో దేశీయ వ్యాక్సిన్లు ఏ విధంగా పోటీలో ఉన్నాయో తెలుపుతూ కేంద్ర శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటనలో గందగోళం చోటుచేసుకుంది. తొలుత సదరు మంత్రిత్వ శాఖ పేరిట పీఐబీలో ఒక ప్రకటన కనిపించింది. అందులో ‘కోవిడ్-19 వ్యాక్సిన్పై 6 భారతీయ కంపెనీలు పనిచేస్తున్నాయి. భారత్కు చెందిన ‘కోవాక్సిన్’, 'జైకోవ్- డీ'లతోపాటుగా ప్రపంచంలోని 140 వ్యాక్సిన్లలో 11 క్లినికల్ ట్రయల్స్లో ఉన్నాయి. ఇందులో ఏది కూడా 2021 కన్నా ముందుగా ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశం లేదు’ అని పేర్కొన్నారు. అయితే కొద్దిసేపటికే ‘2021 కంటే ముందుగా వ్యాక్సిన్ ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశం లేదు’ అనే లైన్ను తొలగించారు. (చదవండి : కోవిడ్-19 టీకా: ఐసీఎంఆర్ కీలక ప్రకటన) మరోవైపు కరోనా వ్యాక్సిన్కు సంబంధించి భారతీయ వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) చేసిన ప్రకటనపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ప్రపంచంలోని మొదటి కోవిడ్-19 వ్యాక్సిన్ ఆగస్టు 15నాటికి విడుదల చేయాలన్నదే తమ లక్ష్యమని ఐసీఎంఆర్ పేర్కొంది. అయితే దీనిపై వైద్య నిపుణలు, ప్రతిపక్ష పార్టీల నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రాజకీయ లబ్ధి చేకూర్చేందుకు వ్యాక్సిన్కు సంబంధించి తేదీని నిర్ణయించారనే పలువురు ఆరోపించారు. ఈ నేపథ్యంలో తమ ప్రకటనపై ఐసీఎంఆర్ స్పష్టతనిచ్చింది. వ్యాక్సిన్ ప్రీ-క్లినికల్ ట్రయల్స్ విజయవంతంగా పూర్తి చేసుకున్నందునే.. తదుపరి అనుమతులు ఇచ్చినట్టు తెలిపింది.దేశంలో అత్యవసర పరిస్థితిని పరిగణలోకి తీసుకొని వ్యాక్సిన్ను వేగంగా తీసుకురావడంలో భాగంగా అంతర్జాతీయ నిబంధలను అనుగుణంగా ప్రయోగాలు చేపడుతున్నట్టు స్పష్టం చేసింది.(చదవండి : కరోనా ‘కోవాక్సిన్’పై కొత్త గొడవ) భారత్లో కరోనా వ్యాక్సిన్కు సంబంధించి హైదరాబాద్కు చెందిన భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన ‘కోవ్యాక్సిన్’, ఫార్మా సంస్థ జైడస్ తయారు చేసిన ‘జైకోవ్- డి’ ల క్లినికల్ ట్రయల్స్ డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఏ) అనుమతించిన సంగతి తెలిసిందే. క్లినికల్ ట్రయల్స్ తొలి దశలో భద్రతపై దృష్టి సారించగా, రెండో దశలో వ్యాక్సిన్ సమర్ధతను పరీక్షించనున్నారు. అయితే తాజా పరిణామాలు చూస్తుంటే కరోనా వ్యాక్సిన్ ఈ ఏడాది అందుబాటులోకి వచ్చే అవకాశాలపై మరోసారి సందిగ్ధత నెలకొంది. (చదవండి : ‘కోవాక్సిన్’ తీసుకున్న తొలి వ్యక్తి ఈయనేనా?) -
కార్డియో వాస్కులర్కు సూదిమందు
మన శాస్త్రవేత్తలు కనుగొన్నారన్న కేంద్ర శాస్త్ర, సాంకేతిక మంత్రి హర్షవర్థన్ బ్యాక్టీరియాను తట్టుకునే వరి వంగడాన్ని సీసీఎంబీ తయారు చేసినట్లు వెల్లడి సీఎస్ఐఆర్ శాస్త్రవేత్తల కృషితో డీజిల్తో నడిచే చిన్న ట్రాక్టర్ తయారీ రాష్ట్రాల పాత్రికేయులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి ప్రెస్మీట్ సాక్షి, హైదరాబాద్: ప్రాణాంతకమైన కార్డియో వాస్కులర్ వ్యాధులకు సూదిమందు రూపంలో ప్రొటీన్ అందించి ప్రాణాలు కాపాడే ఔషధాన్ని మన శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారని కేంద్ర శాస్త్ర, సాంకేతిక మంత్రి డాక్టర్ హర్షవర్థన్ వెల్లడించారు. సీఎస్ఐఆర్కు చెందిన శాస్త్రవేత్తలు గుండె నాళాల్లోని రక్తపు గడ్డలను తొలగించే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానానికి(క్లాట్లను తొలగించే స్ట్రెప్టోకినేస్) రూపకల్పన చేశారని తెలిపారు. క్లాట్ల ఆధారిత త్రాండోలిటిక్ ఔషధానికి ఇప్పటికే డ్రగ్ కంట్రోలర్ అనుమతి లభించిందని, రెండో దశ క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయన్నారు. క్లాట్లను కరిగించే కొత్త తరానికి చెందిన ఔషధాలనూ తయారుచేశారన్నారు. దేశీయం గా తయారైన ఈ స్ట్రెప్టోకినేస్ అందరికీ అందుబాటు ధరలో ఉంటుందన్నారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల పాత్రికేయులతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి ఢిల్లీ నుంచి మాట్లాడారు. కేంద్రంలో నరేంద్రమోదీ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లయిన సందర్భంగా తన మంత్రిత్వ శాఖ సాధించిన విజయాలను హర్షవర్థన్ వెల్లడించారు. మధుమేహ చికిత్స కోసం వనమూలికలతో తయారైన బీజీఆర్-34 ఫార్ములేషన్కు ఆయుష్ శాఖ అనుమతి లభించిందని, దీన్ని వాణిజ్యపరంగా తయారుచేసేందుకు ఢిల్లీకి చెందిన ఒక కంపెనీకి లెసైన్స్ ఇచ్చామన్నారు. ఒక్కోటి రూ.5 ఉండే ఈ మూలికా ఔషధంతో తయారైన మాత్రలను ఇప్పటికే ఉత్తర భారతంలో కొన్నిచోట్ల విడుదల చేశామన్నారు. అతిసారను నిరోధించి పిల్లల జీవితాలను కాపాడే మరో కీలక ఔషధం రోటావైరస్ వ్యాక్సిన్ దేశీయంగానే తయారైందన్నారు. దీనివల్ల ఏటా ఐదు లక్షల మంది పిల్లల ప్రాణాలు అతిసారానికి బలికాకుండా కాపాడవ చ్చన్నారు. బ్యాక్టీరియాను తట్టుకునే సాంబమసూరి.. సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులార్ బయాలజీ(సీసీఎంబీ), వరి పరిశోధన డెరైక్టరేట్(డీఆర్ఆర్) శాస్త్రవేత్తలు ఉమ్మడిగా బ్యాక్టీరియాను తట్టుకునే వరి వంగడం ‘సాంబమసూరి’ని అభివృద్ధి చేశారని హర్షవర్థన్ తెలిపారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలు సహా కర్ణాటక, తమిళనాడుల్లో 90 వేల హెక్టార్లలో పండిస్తున్నారన్నారు. వివేక్ 9 పేరిట అధిక ప్రొటీన్, అధిక ప్రో విటమిన్ ఏ ఉన్న హైబ్రీడ్ మొక్కజొన్న వంగడాన్ని విడుదల చేశామన్నారు. రూ.2 లక్షల ధరలోనే అందుబాటులో ఉండే 11.2 హెచ్పీ సామర్థ్యం కలిగిన చిన్న డీజిల్ ట్రాక్టర్ను సీఎస్ఐఆర్ శాస్త్రవేత్తలు రూపొందించారన్నారు. వచ్చే మూడేళ్ల కాలాన్ని జనవిజ్ఞాన్ యుగంగా మంత్రి అభివర్ణించారు. ప్రధాని నాయకత్వంలో పలు ప్రాజెక్టులను రూపొందించామన్నారు. దేశంలో 15 వ్యవసాయ వాతావరణ జోన్లలో దశలవారీగా ‘బయోటెక్-కిసాన్’ అమలు చేయబోతున్నామన్నారు. చిన్నసన్నకారు రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి అందుబాటులో ఉన్న శాస్త్ర, సాంకేతిక అంశాలను అనుసంధానం చేస్తూ చేపడుతోన్న ప్రాజెక్టు ఇదన్నారు. 2015 మార్చిలో రూ.4,500 కోట్లతో కేంద్రం సూపర్ కంప్యూటింగ్ మిషన్కు అనుమతిచ్చిందన్నారు. దేశవ్యాప్తంగా 70 అత్యున్నత సామర్థ్యం కలిగిన కంప్యూటింగ్ వసతులు ఏర్పాటు చేయడం ద్వారా విస్తృత కంప్యూటింగ్ గ్రిడ్ను ఏర్పాటు చేయడం దీని లక్ష్యమన్నారు. రెండేళ్లుగా వాతావరణం, తుపాన్ల గుర్తింపు నైపుణ్యాల్లో గణనీయమైన పురోగతి సాధించామన్నారు. హుద్హుద్ తుఫాన్ సమయంలో ఇచ్చిన ప్రమాద హెచ్చరికల వల్ల వర్షపాతం సాంద్రత, తుఫాన్ తీరాన్ని తాకే సమయాన్ని చక్కగా గుర్తించడం వల్ల ఆంధ్రప్రదేశ్లోని ఉత్తర కోస్తా ప్రజల ప్రాణాలు కాపాడగలిగారని హర్షవర్థన్ పేర్కొన్నారు.