breaking news
Miner girl
-
నాపై ఈ అఘాయిత్యం..! నేనేమి చేశాను పాపం..?
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: నాకు ఆరేళ్లు.. అమ్మానాన్న ప్రేమగా చూసుకునేవారు. ఏడు నెలల చెల్లితో బాగా ఆడుకునేదాన్ని. సంతోషంగా గడుస్తున్న జీవితంలో ఒక్కసారిగా ఇలా.. ఎవరికి ఏం కీడు చేశాను? ఇంకా ఎంత మంది చిన్నారులు బలికావాలి? ఏ అమ్మాయికి ఇలాంటి అఘాయిత్యం జరగకుండా చూడండి. ఏం చేస్తే బాగుంటుందో.. ఆలోచించండి. బాలికలను కాపాడండి. నాలాంటి బాధితులు సమాజంలో ఎందరో ఉన్నారు. మీకు తెలిసింది కొందరే. కొన్ని రోజులు బాధపడి వదిలేసే విషయం కాదు. నా వయసు చూడండి.. నాకేం తెలుసని ఇలా చేశారు? నా బాల్యాన్ని ఎందుకు దూరం చేశారు? మీ కూతురిలా.. చెల్లిలా.. కనిపించడం లేదా? సీ్త్రని దేవతగా పూజించే ఈ దేశంలో ఇంత దారుణ పరిస్థితులా? నిర్భయ.. దిశ.. వరంగల్ చిన్నారి.. ఇప్పుడు నేను.. దీనికి ముగింపు ఎప్పుడో? – ‘హత్యా’చారానికి గురైన చిన్నారి ఆత్మఘోషఅప్పటివరకు అమ్మానాన్న ఒడిలో ఆడుకుంటున్న పిల్లలు అకస్మాత్తుగా మాయమై, విగతజీవులుగా మారితే.. అదిచూసిన కన్నోళ్ల పరిస్థితి ఏమిటి? ఆకాశంలో గద్దలు అకస్మాతుగా నేల మీదకు వచ్చి కోడిపిల్లలను తన్నుకుపోయినట్లుగా పొత్తిళ్లలో, తల్లి ఒడిలో నిద్రపోతున్న పసిపిల్లలను ఎత్తకుపోతున్నారు. మద్యం, గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలకు అలవాటుపడినవారు సమాజానికి ము ప్పుగా, పిల్లల పాలిట యమకింకరులుగా త యారయ్యారు.తాజాగా పెద్దపల్లి జిల్లా సుల్తానా బాద్ మండలంలోని కాట్నపల్లిలో గురువారం రాత్రి జరి గిన ఆరేళ్ల చిన్నారి అపహరణ, అత్యాచారం, ఆపై హత్య ఘటన భయానకవాతావరణం సృష్టించింది. ముక్కుపచ్చలారని చిన్నారిని మానవ మృగం చిదిమేసిన తీరుపై స్థానికులు భగ్గుమన్నారు. బడికి వెళ్లిన పిల్లలు క్షేమంగా ఇంటికి వస్తారన్న నమ్మకం లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.‘వలస’ బతుకులు అగమ్యగోచరంవలస కార్మికుల బతుకులు అగమ్యగోచరంగా మారాయి. పనికి తగ్గ వేతనం, పని ప్రదేశాల్లో కనీస వసతులు మృగ్యమయ్యాయి. దీనికితోడు ఎప్పుడు ఎవరి నుంచి ఆపద ముంచుకొస్తుందోనన్న భయం వెంటాడుతోంది. వలస కార్మికులు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎంతమంది ఉన్నారు.. వారి భద్రతకు యాజమాన్యాలు తీసుకుంటున్న చర్యలేంటి.. పని ప్రదేశాల్లో వసతుల కల్పనపై పట్టించుకునేవారు కరువయ్యారు.ఏ అండ లేకపోవడంతో లైగింక వేధింపులకు గురవుతున్నారు. కొన్ని సందర్భాల్లోనే కేసులు నమోదవుతుండగా, చాలావరకు పోలీస్స్టేషన్ మెట్లు ఎక్కకుండానే వారి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని, సెటిల్ చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. తాజాగా కాట్నపల్లి రైస్మిల్లులో పని చేయడానికి వచ్చిన కుటుంబాలకు వేర్వేరుగా వసతి గదులు, వాటికి తలుపులు లేకపోవడం వల్లే సంఘటన జరిగిందన్న చర్చ జరుగుతోంది.మద్యం, గంజాయి మత్తులో..మహిళలు, యువతులు, చిన్నారులపై వేధింపులు, అత్యాచార ఘటనలు ఎక్కువ శాతం మద్యం, గంజాయి మత్తులోనే చోటుచేసుకుంటున్నట్లు నేరాల గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఏ గ్రామంలో చూసినా 24 గంటలు బెల్టుషాపుల్లో మద్యం లభిస్తుండంతోపాటు వలస కార్మికులు ఉన్న ప్రదేశాల్లో కొన్ని ముఠాలు గంజాయిని విచ్చలవిడిగా విక్రయిస్తున్నాయి.గుడ్ టచ్, బ్యాడ్ టచ్ తెలియాలి..పిల్లలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ ఏంటో తెలియాలి. దీనిపై ప్రతీ పాఠశాలలో అవగాహన కల్పిస్తున్నారు. బాలికలతో ఎవరు ఎలా ప్రవర్తిస్తున్నారు అనే విషయమై తల్లిదండ్రులు ఆరా తీస్తుండాలి. చుట్టుపక్కల ఉండేవారిపై ఓ కన్నేసి ఉంచాలి. లైంగిక దాడులు చిన్నారులపై దీర్ఘకాలిక మానసిక దుష్ప్రభావాలు చూపుతాయి. ఇలాంటి పని చేసినవారు వయసులో పెద్దవారు, బంధువు అని చూడకూడదు. ఒకవేళ వదిలేస్తే వారికి అడ్డూఅదుపు లేకుండా పోతుంది.పెద్దపల్లి జిల్లాలో 10 వేల మంది కార్మికులు..కార్మిక శాఖ లెక్కల ప్రకారం పెద్దపల్లి జిల్లాలో 10 వేల మంది వలస కార్మికులు ఉన్నారు. వీరిలో భవన నిర్మాణ కార్మికులు 6 వేల మంది వరకు, రైస్మిల్లుల్లో 2,500 మంది, ఇటుక బట్టీల్లో 1,500 మంది పని చేస్తున్నారు. యజమానులు దళారుల ద్వారా ఆయా రాష్ట్రాల వలస కూలీలకు అడ్వాన్స్ చెల్లించి, పనికి తీసుకువస్తున్నారు. డబ్బులకు ఆశపడి వచ్చిన కార్మికులు ఇక్కడి వాతావరణంలో పని చేయలేక, పని ఒత్తిడి, లైగింక వేధింపులతో ఇబ్బంది పడుతున్నారు.పక్కలో నుంచి ఎత్తుకుపోయి సంపిండు..మేము నెల కింద పని కోసం మిల్లుకు వచ్చాం. ఎప్పటిలాగే మా ఇద్దరు బిడ్డలతో కలిసి రేకుల కింద పడుకున్నం. వర్షం పడుతుండటంతో లోపలికి తీసుకుపోయిన. కరెంట్ పోవడంతో ఉక్కపోస్తోందని బయటకు వచ్చాం. పిల్లలను పడుకోబెట్టిన. రాత్రి 11 గంటలకు చూస్తే పాప కనబడలేదు. పక్కలో నుంచి ఎత్తుకపోయి సంపిండు. వాడిని విడిచిపెట్టొద్దు. – మృతురాలి తల్లి ఆవేదనపరిచయస్తులే నిందితులు..పోక్సో కేసులకు సంబంధించి బాధితుల్లో చాలామంది తమకు పరిచయస్తులు, బంధువుల చేతిలోనే లైంగికదాడులకు గురవుతున్నారు. కుటుంబ పరువు మంటగలుస్తుందని వారు బయటకు రావడం లేదు. ఇదే సమయంలో పరిచయం లేనివారు కూడా ఎక్కడినుంచో వచ్చి, అఘాయిత్యాలకు పాల్పడుతూ ప్రాణాలు తీసి, కన్నవారికి కడుపుకోత మిగులుస్తున్నారు. కాట్నపల్లి ఘటన నిందితుడు మృతురాలి తల్లిదండ్రులు పనిచేసే చోటే పని చేస్తుండటం గమనార్హం.గతంలో జరిగిన కొన్ని సంఘటనలు..2019లో ఎలిగేడు మండలం శివపల్లి పరిసరాల్లోని రైస్మిల్లులో వలస మహిళా కూలీపై అత్యాచారం జరిగింది.2021 నవంబర్లో పెద్దపల్లిలోని రంగాపూర్ ఇటుక బట్టీల్లో వలస కూలీపై అత్యాచారం చేయగా, ఇద్దరు నిర్వాహకులను పోలీసులు అరెస్టు చేశారు.2023 ఆగస్టులో అప్పన్నపేట వద్ద భవన నిర్మాణ పనులు చేసేందుకు వచ్చిన బాలిక రక్తస్రావంతో మృతిచెందింది. మొదట్లో సామూహిక అత్యాచారం చేశారని ప్రచారం జరిగింది. తర్వాత, క్రిమిసంహారక మందు తాగి, ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తేల్చారు.ఉమ్మడి జిల్లాలో పోక్సో కేసులు..కరీంనగర్ జిల్లాలో 2022లో 68, 2023లో 58, 2024లో 27 పోక్సో కేసులు నమోదయ్యాయి. రాజన్న సిరిసిల్లలో 2022లో 62, 2023లో 42, 2024లో 18, జగిత్యాల జిల్లాలో 2022లో 59, 2023లో 84, 2024లో 48, పెద్దపల్లి జిల్లాలో 2022లో 29, 2023లో 20, 2024లో 01 పోక్సో కేసులు నమోదయ్యాయి. -
బాలికపై లైంగికదాడికి యత్నం
సాక్షి, దాచేపల్లి : మండలంలోని పెదగార్లపాడు గ్రామంలో బాలికపై లైంగికదాడి యత్నం జరిగిన సంఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. అత్యాచారయత్నంకు పాల్పడిన వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలికి న్యాయం చేయాలని గ్రామస్తులు భారీ సంఖ్యలో పోలీస్స్టేషన్ వద్దకు చేరుకున్నారు. గ్రామస్తులు, పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. తల్లి చనిపోగా, తండ్రి మరో చోట ఉండటంతో 17 సంవత్సరాల వయస్సున్న మైనార్టీ వర్గానికి చెందిన బాలిక తాతయ్య, నాయనమ్మల వద్ద ఉంటోంది. శనివారం రాత్రి 11 గంటల సమయంలో గ్రామానికి చెందిన కర్పూరపు వెంకటేశ్వర్లు కుమారుడు నాగేశ్వరరావు బాలిక ఉంటున్న ఇంట్లో కరెంట్ మెయిన్ స్విచ్ ఆపి ఇంట్లోకి ప్రవేశించాడు. ఎంత సేపటికి కరెంట్ రాకపోవటంతో ఇంట్లో ఉన్న వృద్ధులు, బాలిక నిద్ర లేచారు. పక్కింట్లో కరెంట్ ఉండి వీరి ఇంట్లో లేకపోవటంతో బోర్డు వైపు చూడగా, కరెంట్ మెయిన్ ఆపి ఉన్నట్టు గమనించి తిరిగి వేశారు. దీంతో కరెంట్ సరఫరా అయింది. ఇంట్లో గదిలో పడుకున్న బాలికపై అప్పటివరకు మంచం కింద దాక్కున్న నాగేశ్వరరావు లేచి లైంగిక దాడి చేయబోయాడు. బాలిక కేకలు వేయటంతో తాత, నాయనమ్మలు లేచి నాగేశ్వరరావును బలవంతంగా బయటకు పంపించారు. బయటకు ఈ విషయం చెప్పొద్దంటూ నాగేశ్వరరావు బెది రించాడు. బాలిక, తాత, నాయనమ్మ ముస్లిం పెద్దలకు చెప్పారు. ఈ నేపథ్యంలో సోమవారం ముస్లింలతో పాటు మహిళలు భారీగా తరలివచ్చి బాలికతో ఫిర్యాదు ఇప్పించారు. అత్యాచార యత్నం చేసిన నాగేశ్వరరావుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ముస్లిం నేతలు డిమాండ్ చేశారు. బాలిక ఫిర్యాదుమేరకు నిందితుడు నాగేశ్వరరావుపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ రఫీ చెప్పారు. -
ప్రేమించట్లేదని.. విద్యార్థినిపై బ్లేడుతో దాడి
సాక్షి, ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లాలో దారుణం వెలుగు చూసింది. తన ప్రేమను నిరాకరించిందని తొమ్మిదో తరగతి విద్యార్థినిపై ఓ యువకుడు బ్లేడుతో దాడి చేశాడు. ఈ సంఘటన ఏలూరు పాత బస్టాండ్లో ఆదివారం చోటుచేసుకుంది. పట్టణానికి చెందిన విజయ్ అనే యువకుడు స్థానికంగా ఉంటున్న తొమ్మిదో తరగతి విద్యార్థిని(14)ని ప్రేమ పేరుతో వేదింపులకు గురిచేస్తున్నాడు. బాలిక అతని ప్రేమను తిరస్కరించడంతో స్నేహితులతో కలిసి ఆమె పై బ్లేడుతో దాడి చేశాడు. ఈ ఘటనలో విద్యార్థిని చేతికి, ముఖానికి గాయాలుకావడంతో స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసుల కేసు నమోదు చేసుకొని పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని బాలిక తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. -
నగ్నఫొటోలతో బెదిరించి.. బాలికలపై అత్యాచారం
సాక్షి, విశాఖపట్నం: జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఇద్దరు మైనర్ బాలికలపై ముగ్గురు యువకులు అత్యాచారం జరిపిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. అరకులోయ మండలం వెన్నెల పంచాయితీకి చెందిన ముగ్గురు యువకులు అదే గ్రామానికి చెందిన బాలికల నగ్న ఫోటోలు తీసి బెదిరించి అత్యాచారం జరిపారు. ఈ విషయం బాలికలు కుటుంబ సభ్యులకు తెలపడంతో వారు అరకులోయ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు యువకులపై కేసు నమోదు చేసి ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన ఇద్దరి కోసం గాలింపు చర్యలు మొదలు పెట్టారు. -
బాలికపై అత్యాచారం
ఆలస్యంగా వెలుగుజూసిన వైనం నిందితుడిపై కేసులు నమోదు వినుకొండ రూరల్(గుంటూరు) : బాలికపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన పట్టణంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలి తల్లి నిందితుడిపై ఫిర్యాదుచేసేందుకు పోలీసుస్టేషన్కు వెళ్లినా సరైన సహకారం అందకపోవడంతో మూడురోజులుగా మానసిక వేదనతో కుంగిపోయింది. స్థానిక మహిళలకు విషయం చెప్పగా వారు ఆమె భుజం తట్టి మేమున్నామంటూ ధైర్యం చెప్పడంతో ఎట్టకేలకు శుక్రవారం నిందితుడిపై కేసు నమోదు చేశారు. మైనర్ బాలిక బుధవారం రాత్రి ఇంటి ఆవరణలో నిద్రిస్తుంది. అదే ఇంట్లో గత ఏడు నెలలుగా అద్దెకు ఉంటున్న విశాల్ బాలిక వద్దకు వచ్చి అర్ధరాత్రి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనుమానం వచ్చి కూతురు నిద్రిస్తున్న మంచం వైపు తల్లి చూసింది. గమనించిన విశాల్ ఒక్కసారిగా అక్కడి నుంచి పరారయ్యాడు. బాలికకు అధిక రక్తస్రావం కావడంతో వినుకొండ ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స నిమిత్తం చేర్పించారు. బాలిక తేరుకోవడంతో స్థానికులు వెంకాయమ్మకు మద్దతుగా నిలిచారు. ఏఎస్సై పూర్ణ చంద్రరావు కేసు నమోదు చేసి సెక్షన్ 307 క్లాస్(2), సెక్షన్ 10తో పాటు మరికొన్ని సెక్షన్లతో విశాల్పై కేసు నమోదు చేశారు. సీఐ శ్రీనివాసరావు కేసు దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.