breaking news
Milk Bank
-
టాలీవుడ్ ప్రిన్స్ గొప్ప మనసు.. మరో రెెండు మహోన్నత సేవలకు శ్రీకారం
టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్లో నటిస్తున్నారు. తొలిసారి వీరిద్దరి కాంబోలో వస్తోన్న చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీని అమెజాన్ అడవుల నేపథ్యంలో యాక్షన్ అడ్వెంచరస్గా ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. ఈ మూవీలో బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా హీరోయిన్గా కనిపించనుంది. ఇటీవలే ఈ మూవీ షూటింగ్కు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరలైన సంగతి తెలిసిందే.అయితే మహేశ్ బాబు సినిమాలతో పాటు సమాజసేవలో తన వంతు పాత్ర పోషిస్తున్నారు. మహేశ్ బాబు ఫౌండేషన్ పేరుతో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పలువురు చిన్నారులకు గుండె శస్త్ర చికిత్సలను ఉచితంగా అందజేస్తున్నారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోని వేలమంది పేదల చిన్నారులకు వైద్య సాయానికి అండగా నిలుస్తున్నారు.తాజాగా మహేశ్ బాబు ఫౌండేషన్ ద్వారా మరో సేవకు సిద్ధమయ్యారు. ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటి సారిగా విజయవాడలోని ఆంధ్రా హాస్పిటల్స్లో మదర్స్ మిల్క్ బ్యాంక్ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మహేశ్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్ హాజరై మిల్క్ బ్యాంక్ను ప్రారంభించారు. అంతేకాకుండా బాలికల కోసం ఉచిత గర్భాశయ క్యాన్సర్ టీకా డ్రైవ్ను కూడా ఏర్పాటు చేశారు. 2025 నాటికి దాదాపు 1,500 మంది బాలికలకు ఉచితంగా టీకాలు వేయడం లక్ష్యమని ఈ సందర్భంగా నమ్రతా శిరోద్కర్ వెల్లడించారు. మదర్స్ మిల్క్ బ్యాంక్ ద్వారా తల్లి పాలు సరిపోని నవజాత శిశువులకు ప్రతి ఏడాదికి దాదాపు 7,200 మందికి ప్రయోజనం చేకూరుతుందని వైద్యులు తెలిపారు. #Namratashirodkar garu inaugurated the Mothers Milk Bank at Andhra Hospitals, Vijayawada to help newborns with maternal milk which benefits 7,200 babies every year associating with @andhrahospital1 Alongside, @MBfoundationorg also initiating a cervical cancer vaccination drive… pic.twitter.com/vaBvDunrPT— Mahesh Babu Space (@SSMBSpace) March 17, 2025 -
తల్లిపాల వారోత్సవాలు: ఆసియాలోనే మొట్టమొదటి తల్లిపాల బ్యాంకు ఏదంటే?
అన్ని దానాల్లోకెల్లా ఉత్తమమైనది అన్నదానం అంటారు. అది పెద్దలకు. మరి చంటి పిల్లలకు? తల్లిపాలు తాగే వీలు లేక పోతపాలు పడక ఆకలితో అల్లాడే చిన్నారి కూనల కోసం తల్లిపాలను దానం ఇవ్వడం ఒక బాధ్యత. తల్లిపాలు పిల్లలకు జీవశక్తి. కాని అవి అందరికీ అందవు. నేటికీ దేశంలో తల్లిపాల బ్యాంకులు అతి తక్కువ ఉన్నాయి. ఆరోగ్యకరమైన బాలింతలు తమ పిల్లలకు సరిపడా పాలు ఇచ్చాక ఇంకా ఎక్కువ ఉంటే అవి దానం చేసే వీలు కొన్నిచోట్ల ఉంది. అక్కడి నుంచి పాలు తెచ్చుకుని తమ పిల్లలకు తాగించే వీలు తల్లులకు ఉంది. ‘తల్లిపాల వారోత్సవాల’ సందర్భంగా తల్లిపాల బ్యాంకుల గురించి ఒక అవగాహన.పుట్టిన వెంటనే పసిబిడ్డకు తల్లిపాలు నోటికి అందితేప్రాణం పుంజుకుంటుంది. కాని కొందరు తల్లులు అనేక కారణాల రీత్యా బిడ్డకు చనుబాలు ఇవ్వరు. ఇలాంటి స్థితి నుంచి తల్లులను సొంత బిడ్డలకు పాలు ఇచ్చేందుకు ప్రోత్సహించే కార్యక్రమాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తూనే ఉన్నాయి. తల్లిపాల గురించి అవగాహన కల్పించడానికి కేంద్రం ‘మదర్స్ అబ్సల్యూట్’ ఎఫెక్షన్ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. అయితే ప్రసవం తర్వాత కొందరు తల్లులకు పాలు పడవు. లేదా అనారోగ్య కారణాల రీత్యా పాలు ఇచ్చే వీలు ఉండదు. కాని పిల్లలు తల్లిపాలు తాగే స్థితిలో ఉంటారు. ఇలాంటి వారి కోసం తల్లిపాల బ్యాంకులు కీలకంగా మారాయి. కాని ఇవి ఉండాల్సినన్ని లేవు. దేశవ్యాప్తంగా ఇప్పటికి కేవలం 90 తల్లిపాల బ్యాంకులు ఉన్నాయి. హైదరాబాద్తో పాటు సిద్ధిపేట, ఖమ్మంలలో ప్రభుత్వ ఆధ్వర్యంలో పాల బ్యాంకులు ఉన్నాయి. పాల బ్యాంకులకు ఇతర రాష్ట్రాల నుంచి తల్లిపాలను పంపడానికి ‘సుదేనా హెల్త్ ΄ûండేషన్’ కృషి చేస్తోంది. హైదరాబాద్లోని కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు కూడా తల్లిపాలను నిల్వ చేసి, శిశువులకు అందజేస్తున్నాయి.ఆసియాలోనే మొట్టమొదటి తల్లిపాల బ్యాంకు..ముంబైలోని సియోన్ హాస్పిటల్లో హ్యూమన్ మిల్క్ బ్యాంక్ను 1989లోప్రారంభించారు. ఇది ఆసియాలో మొట్టమొదటి బ్రెస్ట్ మిల్క్ బ్యాంకు. ఈ ఐదేళ్లలో 43,412 మంది తల్లుల నుండి పాలను విరాళంగా ΄÷ందింది. 10,523 మందికి పైగా నవజాత శిశువులప్రాణాలను రక్షించే పాలను అందించింది. 1989లో నియోనాటాలజీ విభాగం అధిపతి డాక్టర్ జయశ్రీ మోంద్కర్ చొరవతో ఈ పాల బ్యాంక్ను ఏర్పాటు చేశారు. ప్రతియేటా 10 వేల నుండి 12 వేల మంది శిశువులు పుడితే వీరిలో 1,500 నుండి 2,000 మంది బ్యాంకు నుండి పాలు ΄÷ందుతున్నారు. సియోన్ హాస్పిటల్ మిల్క్బ్యాంక్ గుజరాత్, గోవా, మధ్యప్రదేశ్, డామన్, డయ్యూతో పాటు మహారాష్ట్రలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులలోని పాల బ్యాంకుల ఏర్పాటుకు మద్దతు ఇస్తుంది.సంప్రదించి.. పాలు ఇవ్వచ్చు..తల్లికి ఆరోగ్య సమస్యలు ఉంటే వారి పిల్లలకు మరో తల్లి పాలు అవసరం అవుతాయి. వీటిని మేం సేకరించి, పాలను స్టెరిలైజ్ చేసి, ఫ్రీజర్లో నిల్వ ఉంచుతాం. శిశువులకు అవసరం అయినప్పుడు ఫ్రీజర్ నుంచి తీసి, రూమ్ టెంపరేచర్లోకి వచ్చాక ఇస్తాం. హైదరాబాద్ నీలోఫర్ ఆసుపత్రిలో 2017 నుంచి సుషేన హెల్త్ ఫౌండేషన్ నెలల నిండకుండా పుట్టిన శిశువులకు తల్లి పాలను అందజేసే ఆరోగ్య కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. సాధారణంగా ఇక్కడ నెలకు వెయ్యి ప్రసవాలు అవుతుంటాయి. నెలలు నిండకుండా పుట్టినా, తల్లులకు శస్త్రచికిత్స వంటి సమస్యలు ఉంటే ఆ శిశువుకు ఈ పాల బ్యాంక్ నుంచి పాలను అందిస్తాం. ఎవరైనా తల్లులు తమ బిడ్డకు ఇవ్వగా అదనపు పాలను మా బ్యాంక్ను సంప్రదించి, ఇవ్వచ్చు. అందుకు తగిన పరీక్షలు చేసి, పాలను ఎలా సేకరించి, ఇవ్వాలో అవగాహన కల్పిస్తాం.– డా.ఉషారాణి తోట, ప్రొఫెసర్ ఆఫ్ పిడియాట్రిక్స్, నీలోఫర్ హాస్పిటల్బ్లడ్ బ్యాంకులను పోలిన విధంగా! రక్తదానం చేసినట్టుగానే నవజాత శిశువులప్రాణాలను రక్షించడానికి తల్లిపాలను దానం చేయవచ్చు. పాలిచ్చే తల్లులు పంపింగ్ మెషీన్లను ఉపయోగించి లేదా చేతితో అదనపు పాలను సేకరిస్తారు. ఆ తర్వాత వారికి సంబంధం లేని నవజాత శిశువుకు విరాళంగా ఆ పాలను అందిస్తారు.హెచ్ఐవి, హెపటైటిస్, లైంగిక వ్యాధులు లేని తల్లుల నుంచి మాత్రమే టెస్ట్ రిపోర్ట్స్ ఆధారంగా పాల సేకరణ చేస్తారు. అందుకని తల్లులు తమ ఆరోగ్య నివేదికలను ముందుగా పాల బ్యాంకుకు ఇవ్వాలి.ఆరోగ్యకరమైన తల్లులకు తమ పాలు దానంగా ఇవ్వాలని ఉన్నా కుటుంబం అంగీకరించకపోవచ్చు. కుటుంబంప్రోత్సహిస్తే ఎందరో శిశువులకు మేలు జరుగుతుంది.తల్లి పాలను సేకరించి, బ్యాంకుకు ఇచ్చిన తర్వాత, వాటిలో ఏదైనా కలుషితం ఉన్నట్టు తెలిస్తే వెంటనే దాతకు తెలియజేస్తారు. దీని వల్ల ఆ తల్లి ఆరోగ్యస్థితి కూడా మెరుగుపడుతుంది.తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో ధాత్రి మదర్స్ మిల్క్ బ్యాంక్ ఉన్న హాస్పిటల్స్, హైదరాబాద్లోని నీలోఫర్ హాస్పిటల్, గాంధీ హాస్పిటల్, ఇఎస్ఐ హాస్పిటల్, మహబూబ్నగర్లోని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, కాకినాడలోని ప్రభుత్వ హాస్పిటల్, అమలాపురంలోని డిస్ట్రిక్ట్ హాస్పిటల్ని సంప్రదించి తల్లులు తమ పాలను దానంగా ఇవ్వచ్చు. – నిర్మలారెడ్డి -
ఏపీలో మొదలైన మొదటి తల్లిపాల బ్యాంక్
-
తల్లి పాల వారోత్సవం: ప్రాణదాతలకు వందనం
బిడ్డ ఆకలి తల్లికే తెలుస్తుంది. తల్లి మనసు గ్రహించే సూక్ష్మం అది. తల్లిపాలకు నోచుకోని బిడ్డలెందరో? ఆ బిడ్డల తల్లుల మనోవేదనకు అంతే ఉండదు. ఒక తల్లి మనసు మరో తల్లికే అర్థమవుతుంది. తన బిడ్డతోపాటు ఆ తల్లి బిడ్డకూ పాలిస్తుంది. మహోన్నతమైన ఆ తల్లి మనసుకు వందనం! ఒక తల్లి నుంచి మరో తల్లి బిడ్డకు... పాలు అందించే సేవ మహోత్కృష్టం. ఆ సేవలో తరిస్తున్నాయి పాలబ్యాంకులు. బిడ్డకు తల్లిపాలను మించిన ఆహారం మరొకటి ఉండదు. తల్లిపాలు ఆహారం మాత్రమే కాదు ఔషధం కూడా. బిడ్డలో వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. అంటువ్యాధుల బారిన పడకుండా దేహం తనను తాను రక్షించుకునే శక్తిని పెంచుకుంటుంది. జీర్ణాశయ సమస్యలు తలెత్తకుండా బిడ్డ ఆరోగ్యంగా పెరగడానికి దోహదం చేస్తాయి. ఇన్ని మంచి లక్షణాలున్న తల్లిపాలను నిర్లక్ష్యం చేయరాదని దశాబ్దాలుగా చేస్తున్న ప్రచారం మంచి ప్రభావాన్నే చూపిస్తోంది. కొంతమంది తల్లులకు పాలు పడవు. అలాగే కొంతమందికి డెలివరీ సమయంలో ఇతర కారణాల రీత్యా వేరే హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. నెలలు నిండకముందే పుట్టిన బిడ్డలను కొన్ని రోజులు, నెలలపాటు ప్రత్యేక సంరక్షణలో ఉంచాలి. ఇలాంటి బిడ్డల కోసమే తల్లిపాల బ్యాంకులు ఉద్భవించాయి. హైదరాబాద్ నగరంలో ధాత్రి మిల్క్ బ్యాంకు అలాంటిదే. ఈ బ్యాంకు ప్రధానంగా నీలోఫర్ హాస్పిటల్కు సేవలందిస్తోంది. ‘‘అక్కడ డెలివరీల్లో అల్పాదాయ కుటుంబాల వాళ్లే ఎక్కువ. నెలలు నిండక ముందే పుట్టిన పిల్లలు ఫార్ములా మిల్క్ను జీర్ణం చేసుకోలేరు, ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కూడా కష్టమే. అందుకే మా సర్వీస్ ప్రధానంగా ఆ బిడ్డలకే’’ అన్నారు డాక్టర్ భవాని. చైతన్యప్ర‘దాత’లు... రక్తపరీక్ష చేసి హెచ్ఐవీ, హెపటైటిస్ వంటి మరికొన్ని అనారోగ్యాలు లేవని నిర్ధారించుకున్న తర్వాతనే మిల్క్ డొనేషన్ను ప్రోత్సహిస్తారు. డెలివరీ అయి హాస్పిటల్లో ఉన్న తల్లులతోపాటు డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్లిన తల్లుల నుంచి కూడా పాలను సేకరిస్తారు. ఇంట్లో ఉన్న తల్లులకు 250 మి.లీ, 500 మి.లీ. కెపాసిటీ కలిగిన ‘బ్రెస్ట్మిల్క్ స్టోరేజ్ పౌచ్’లను ఇస్తారు. తల్లులు తమ బిడ్డకు ఇవ్వగా మిగులు పాలను స్టెరిలైజ్ చేసిన పాత్రలోకి సేకరించి వాటిని పౌచ్లో పోసి ఇంట్లోనే డీప్ఫ్రీజర్లో పెడతారు. వారం లేదా పది రోజులకొకసారి మిల్క్ బ్యాంకు వాళ్లు వచ్చి ఆ పౌచ్లను కోల్డ్ స్టోరేజ్ బాక్స్లో పెట్టి బ్యాంకుకు చేరుస్తారు. బ్యాంకులో పాలను పాశ్చరైజ్ చేస్తారు. ఇన్ఫెక్షన్ కారకాలైమేనా ఉన్నాయేమోనని పరీక్ష చేస్తారు. ఆ తర్వాత పాలను చల్లబరిచి డీప్ఫ్రీజర్లో మైనస్ 20 డిగ్రీల ఉష్ణోగ్రతలో నిల్వ చేస్తారు. ఇలా మిల్క్ బ్యాంకులో నిల్వ చేసిన పాలను నాలుగు నుంచి ఆరునెలల వరకు ఉపయోగించవచ్చు. ‘పాలను సేకరించడం, మిల్క్ బ్యాంకుకు తరలించడం, ప్రాసెస్ చేయడం, నిల్వ చేయడం, అవసరమైన బిడ్డకు అందించడం’ ఇన్ని దశలుంటాయి. సాధారణంగా బ్లడ్బ్యాంకుల గురించి తెలిసినంతగా మిల్క్ బ్యాంకుల గురించి జనానికి పెద్దగా తెలియదు. కానీ చదువుకున్న మహిళల్లో చైతన్యం బాగా వచ్చిందని, హైదరాబాద్ నగరంలో 18వందలకు పైగా తల్లులు ధాత్రితో అనుసంధానమై పాలదానం చేస్తున్నారని తెలియచేశారు ధాత్రి నిర్వహకులు. పాలదాతలు తల్లి నుంచి పాలను సేకరించిన తర్వాత మామూలుగా నిల్వ ఉంచితే గంట లేదా రెండు గంటల్లో ఉపయోగించాలి. ఫ్రిజ్లో నిల్వ చేస్తే ఆరుగంటల వరకు వాడవచ్చు. ప్రసవం సెలవు పూర్తి చేసుకుని డ్యూటీలకు వెళ్లే తల్లులు ఇదే పద్ధతి పాటిస్తుంటారు. నెలల కొద్దీ నిల్వ ఉండేవి మిల్క్ బ్యాంకులో నిల్వ చేసినవి మాత్రమే. మిల్క్ డోనర్ మదర్లకు మేము పౌచ్ ఇచ్చేటప్పుడు కొన్ని జాగ్రత్తలు చెబుతాం. పౌచ్ను డీప్ ఫ్రీజర్లోనే పెట్టాలి. ఆ ఫ్రీజర్లో మరేదీ పెట్టకూడదు. ఇలా నిల్వ చేసిన పాలను వారం పది రోజుల్లో బ్యాంకుకు తెప్పించుకుంటాం. కరెంట్ పోతే అప్పటి వరకు ఇంట్లో నిల్వ చేసిన పాలను వెంటనే బ్యాంకుకు చేర్చాలి. మిగులు పాలు ఉన్న తల్లులనే ఎంపిక చేసుకుంటాం. కాబట్టి మిల్క్ డోనర్ల బిడ్డల ఆరోగ్యం గురించి ఆందోళన అక్కర్లేదు. ఒక తల్లి తన బిడ్డకు పాలిస్తూనే మరొక బిడ్డకు ప్రాణం పోయవచ్చు. డా. భవాని కలవలపల్లి పీడియాట్రీషియన్ , వైస్ ప్రెసిడెంట్, సుశేన హెల్త్ ఫౌండేషన్ సీఈవో, ఐడియా క్లినిక్స్ ఏడాదికి ఎనిమిది లక్షల మంది శిశువులు తల్లిపాలు లేని కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ మరణాలన్నీ బిడ్డకు ఆరు నెలలు నిండేలోపే సంభవిస్తున్నట్లు డబ్లు్యహెచ్వో లెక్కలు చెబుతున్నాయి. బిడ్డకు పాలివ్వడం ద్వారా తల్లుల ఆరోగ్యం కూడా బాగుంటుంది. భవిష్యత్తులో టైప్ టూ డయాబెటిస్, ఒవేరియన్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, గుండె జబ్బుల బారిన పడే ప్రమాదాన్ని నివారిస్తుంది. తల్లీబిడ్డల ఆరోగ్యానికి దోహదం చేసే బ్రెస్ట్ ఫీడింగ్ పట్ల అవేర్నెస్ కోసం ఏటా ఆగస్టు మొదటి వారం రోజులను కేటాయించింది డబ్లు్యహెచ్వో. ఈ ఏడాది ‘స్టెప్ అప్ ఫర్ బ్రెస్ట్ ఫీడింగ్–ఎడ్యుకేట్ అండ్ సపోర్ట్’ థీమ్తో ముందుకెళ్తోంది. – వాకా మంజులారెడ్డి -
తల్లి పాలు తాగడం పిల్లల హక్కు
సాక్షి,సిటీబ్యూరో: తల్లి పాలు తాగడం పిల్లల హక్కుగా భావించి.. తల్లి పాల బ్యాంకులను ఏర్పాటు చేయాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు అచ్యుతరావు ప్రభుత్వానికి సూచించారు. ప్రపంచ తల్లి పాల వారోత్సవాల సందర్భంగా ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలు ప్రచార ఆర్భాటానికే పరిమితమవుతున్నాయని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పసిబిడ్డలు తల్లి పాలకు ఎందుకు దూరమవుతున్నారనే అంశంపైన, తల్లికి, బిడ్డకు పెరుగుతున్న దూరాన్ని తగ్గించడం పైన శిశు సంక్షేమ సంస్థలు, ఆరోగ్య శాఖ దృష్టి సారించడం లేదన్నారు. దేశంలో ఏటా లక్షన్నరకు పైగా తల్లులు సరైన వైద్య సదుపాయాలు లేక ప్రసవ సమయంలోనే కన్నుమూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలా తల్లులను కోల్పోయిన పిల్లలు పాలకు నోచుకోలేకపోతున్నారని అభిప్రాయపడ్డారు. పౌష్టికాహార లోపంతో 48 శాతం తల్లులు, భయంకరమైన వ్యాధులు, జన్యుపరమైన కారణాల వల్ల 7 శాతం మహిళలు పిల్లలకు పాలు ఇవ్వలేకపోతున్నట్లు తెలిపారు. -
'ఏటీఎం'లో తల్లిపాలు
పుదుచ్చేరి: తక్కువ బరువుతో జన్మించిన శిశువులకు శ్రేష్టమైన తల్లిపాలు అందించేందుకు నగరంలోని జవహర్ లాల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (జేఐఎమ్ఈఆర్) హ్యూమన్ మిల్క్ బ్యాంక్ ను ఏర్పాటుచేసింది. 'అముధమ్ తైప్పల్ మైయం' (ఏటీఎమ్) పేరుతో బుధవారం ఈ బ్యాంకు ప్రారంభమైంది. నెలలో 1,500కు పైగా శిశువులు జేఐఎమ్ఈఆర్ ఆసుపత్రిలో జన్మిస్తుంటారు. వీరిలో 30 శాతం కంటే ఎక్కువ మంది ఉండాల్సిన బరువు కన్నా తక్కువ ఉంటుండటంతో చర్యలు చేపట్టిన ప్రభుత్వం తల్లిపాల ఏటీఎమ్ ను ప్రారంభించింది. నియో నాటల్ ఇన్ టెన్సీవ్ కేర్(ఎన్ఐసీయూ) ఉన్న ప్రతి ఆసుపత్రిలోనూ తల్లిపాలు అందుబాటులో ఉంచుకోవాలని ఆసుపత్రి డైరెక్టర్ ఎస్సీ పరీజా సూచించారు. -
ముద్దుమురిపాలమిల్క్ బ్యాంక్
ఆగస్టు మొదటి వారం తల్లిపాల వారోత్సవాలు రక్తదానం గురించి విన్నారు. అవయవదానాల గురించి చదివారు. ఇప్పుడు ఎన్నో పసిప్రాణాలను నిలిపే ‘తల్లిపాలు’పంచడం గురించీ తెలుసుకోండి. ఇలా అమ్మపాలు నేలపాలు కాకుండా చూసి, పసికడుపులు నింపి ప్రాణాలు నిలబెట్టే ‘తల్లిపాల బ్యాంకు’ గురించి చదవండి. మీరూ పాలు ఊరే తల్లి అయితే... ముద్దుగారే ఎందరో చిన్నారులకు వీలైతే చేతనైనంత చేయండి. ఈ ఆగష్టు మొదటివారం తల్లిపాల వారోత్సవాల సందర్భంగా హైదరాబాద్లోని ఫెర్నాండజ్ హాస్పిటల్లో నెలకొని ఉన్న ఒకే ఒక ‘తల్లి పాల బ్యాంకు’ గురించి తెలుసుకొండి. ఇలాంటి బ్యాంకులు ఇంకెన్నో ఉంటే మరెన్నో ప్రాణాలు కాపాడగలమని గుర్తించండి. ఇలాంటి అనేక పాలబ్యాంకుల స్థాపనకూ, ఆ తర్వాత పాల ప్రదానానికి మీ వంతు సహకారాన్ని అందజేసేలా అవగాహన కల్పించడం కోసమే ఈ ప్రత్యేక కథనం. ఈ ఫొటోలో ఉన్న మాతృమూర్తి పేరు ఎల్. థాపా. ఆమెకు వంశ్రాజ్ అనే చిన్నారి పుట్టాడు. కానీ ఆ బాబుకు పట్టడానికి థాపా దగ్గర పాలు లేవు. ఫార్ములా పాలు పట్టిస్తే బాబుకు ఎన్నో దుష్పరిణామాలు. కడుపులో ఇబ్బందులు. పొట్టలో ఇక్కట్లు. బాబుకు కావాల్సింది మందులే అయితే మార్కెట్లో కొనగలరు. సెలైనే అయితే సెకన్లలో సమకూర్చగలరు. కానీ బాబు బతికి బట్టకట్టాలంటే కావాల్సింది... పాలు... అదీ తల్లిపాలు. అందుకే షిల్లాంగ్ నుంచి తల్లిపాల కోసం ఆ అమ్మ తన బాబును కడుపున కాపాడుకుంటూ హైదరాబాద్కు వచ్చింది. మేఘాలు వర్షించే వర్షపాతం ఎక్కువనే ఆ రాష్ట్రానికి మేఘాలయా అని పేరు. కానీ ఆ తల్లి హర్షానికి కావాల్సింది పాల వర్షం. ఎందరో తల్లులు ఇచ్చే కారుణ్య వర్షం. అది హైదరాబాద్లో కురుస్తుందని ఆ అమ్మకు ఎవరో చెప్పారు. ప్రాణాలు నిలుస్తాయంటే పదహారువందల కిలోమీటర్లు ఒక లెక్కా? ఇప్పుడా బాబు ప్రమాదం నుంచి పూర్తిగా బయటపడ్డాడు. ఎందరో తల్లుల పాల రక్ష, సొంత తల్లి మురిపాల రక్షతో ఇకపై సురక్షితంగా ఉంటాడు. ఎలా ఉంటుందీ తల్లి పాల బ్యాంకు? పాలు సరిగా తల్లులకు వరప్రదాయని లాంటి ఈ బ్యాంకులో అనేక మంది తల్లుల పాలు సేకరిస్తారు. ముందుగా తల్లి పాలను చిన్న చిన్న స్టీల్ గిన్నెల్లో సేకరిస్తారు. (తల్లిపాలలో శరీరానికి అవసరమైన కొవ్వు పదార్థాలు (ఎసెన్షియల్ ఫాటీ యాసిడ్స్)తో పాటు సుదీర్ఘమైన గొలుసుల్లా ఉండే లాంగ్ చైన్ పాలీఆన్శాచ్యురేటెడ్ ఫ్యాటీ ఆసిడ్స్ కూడా ఉంటాయి. అందుకే ప్లాస్టిక్ సీసాల్లో తల్లిపాలు పోసి వాటిని పట్టే సందర్భాల్లో ఆ ప్లాస్టిక్కు ఈ కొవ్వులు అక్కడక్కడా చిక్కుకుని కనిపిస్తుండం చూడవచ్చు. ప్లాస్టిక్కు ఇలా కొవ్వులతో అతుక్కుపోయే గుణం ఉంటుంది. కాబట్టి తల్లిపాల బ్యాంకుల్లో పాల సేకరణ అంతా స్టీల్ గిన్నెల్లోనే జరుగుతుంది). ఈ పాలను సేకరించగానే అందులో ఎలాంటి హానికరమైన బ్యాక్టీరియా లేవనే విషయాన్ని నిర్ధారణ చేసుకోవడం కోసం స్క్రీనింగ్కు పంపుతారు. దీనికి ముందు వాటిని పాశ్చరైజేషన్ ప్రక్రియకు గురిచేస్తారు. (పాశ్చరైజేషన్ అంటే పాలలోని హానికారక సూక్ష్మక్రిములు, బ్యాక్టీరియాను పూర్తిగా నిర్మూలించే ప్రక్రియ). స్క్రీనింగ్కు పంపేముందర అమ్మల నుంచి సేకరించిన వారి వారి పాలను విడివిడిగా ఉంచుతారు. స్క్రీనింగ్ పరీక్షలో పాలలో ఎలాంటి హానికరమైన బ్యాక్టీరియా లేవని తెలిశాక... ఆ పాలను కలిపేసి, వాటిని నిల్వ ఉంచేందుకు ఒక పెద్ద ఫ్రిజ్లాంటి ఉపకరణంలో పెడతారు. ఈ ఫ్రిజ్లో ఎప్పుడూ మైనస్ 20 డిగ్రీల టెంపరేచర్ నిర్వహితమవుతుంటుంది. ఈ స్థితిలో ఉన్న పాలను మూడు నుంచి ఆర్నెల్లు కూడా నిల్వ చేసి ఉంచవచ్చు. బిడ్డకు పాలు పట్టే సమయంలో మళ్లీ వాటిని సాధారణ ఉష్ణోగ్రత వద్దకు జాగ్రత్తగా తెచ్చి బిడ్డకు పడతారు. ఇలా ఫ్రీజ్ అయిన పాలను మామూలు స్థితిలోకి తీసుకురావడాన్ని ‘థా’ అంటారు. ఇలా ‘థా’ చేయాలంటే నేరుగా వేడి చేయడమో లేదా మైక్రోఓవేన్పైన ఉంచడమో సరికాదు. దానికి కొన్ని మార్గదర్శకాలుంటాయి. ఒకసారి ‘థా’ చేశాక... ద్రవరూపంలోకి వచ్చిన ఆ పాలు మళ్లీ 4 నుంచి 6 గంటల పాటు తాగడానికి సురక్షితంగా ఉంటాయి. తల్లి పాల బ్యాంకు చరిత్రను పరికిస్తే... అసలు ముందుగా తల్లిపాల బ్యాంకు అన్న ఆలోచన ఎలా ఆవిర్భవించిందన్న చరిత్రలోకి వెళితే వివరాలు ఆసక్తికరంగా ఉంటాయి. రాజవంశాల్లోని స్త్రీలు తమ పిల్లలకు రొమ్ముపాలు తాగించేవాళ్లు కాదు. వాళ్లకు బదులు ‘దాది’ అని పిలిచే స్త్రీలు... పాలు పట్టేవారు. వాళ్లను అనుకరిస్తూ జమీందార్లు, కులీన స్త్రీలుగా తమను తాము అభివర్ణించుకునే వారు తమ హోదాను ప్రదర్శించుకోవడం కోసం ‘దాదుల’ పాలనే పట్టిస్తుండేవారు. ఆధునిక యుగంలోనూ కొంతకాలం ఇదే ట్రెండ్ కొనసాగింది. విదేశాల్లోనూ కులీన మహిళల పిల్లలకు పాలు పట్టడానికి ‘వెట్ నర్స్’లు ఉండేవారు. అయితే 20వ శతాబ్దం ఆరంభం నాటికి ఈ ‘వెట్ నర్స్’ల సంస్కృతి పూర్తిగా తగ్గిపోయింది. మొట్టమొదటి సారిగా ‘తల్లిపాల బ్యాంకు’ వియన్నాలో 1911లో అధికారికంగా ప్రారంభమైంది. ఆ తర్వాత మరొకటి బోస్టన్లోనూ ఏర్పాటయ్యింది. ఇక 1937లో లండన్లోని క్వీన్ షార్లెట్ హాస్పిటల్ ఆసుపత్రిలో తొలి తల్లిపాల బ్యాంకు రూపొందింది. దీనికి పదేళ్ల తర్వాత 1947లో యూఎస్ఏలో ‘విల్మింగ్టన్ డెలావేర్ తల్లిపాల బ్యాంకు’ మొదలైంది. కానీ రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఎందుకో తల్లిపాల బ్యాంకు అన్న ధోరణి కాస్త మందగించి ‘ఫార్ములా పాలు’ మార్కెట్లో రాజ్యం చేశాయి. పందొమ్మిదివందల డెబ్బయిలు, ఎనభైల పడిలో మళ్లీ తల్లిపాల ప్రాధాన్యాన్ని అందరూ గుర్తెరగడం ప్రారంభించారు. ఈ క్రమంలో 1989 నవంబరు 27న ముంబైలోని ‘సియాన్ హాస్పిటల్’లో డాక్టర్ అర్మిదా ఫెర్నాండజ్ ఆధ్వర్యంలో భారత్లో (ఆసియాలోనే) మొట్టమొదటి తల్లిపాల బ్యాంకు ఏర్పాటైంది. ప్రస్తుతం భారత్లో 10 తల్లిపాల బ్యాంకులు ఉన్నాయి. ఇందులో ఐదు ముంబైలోనే ఉండటం విశేషం. ఏయే పాపలకు లబ్ధి చేకూరుతుంది...? చాలా తక్కువ బరువుతో పుట్టిన పాపలు నెలలు పూర్తిగా నిండకుండానే పుట్టిన చిన్నారులు తల్లులకు ఏవైనా సమస్యలు వచ్చినందు వల్ల ఆమె నుంచి దూరంగా ఉంచాల్సి వచ్చిన చిన్నారులు ఇక కొందరు తల్లులలో రొమ్ము లోపలివైపునకు తిరిగి ఉంటుంది (ఇన్వర్టెడ్ నిపుల్) ఇలాంటి తల్లుల పిల్లలకూ బ్యాంకు నుంచి పాలు అందించవచ్చు ఒక్కోసారి కొందరు కవలలకు / ముగ్గురు పిల్లలకు (ట్రిప్లెట్స్), నలుగురు చిన్నారులకు (క్వాడ్రప్లెట్స్) జన్మనిస్తుంటారు. ఇలాంటి తల్లులకు ఊరే పాలు ఆ మొత్తం చిన్నారులకు సరిపోకపోవచ్చు. అలాంటప్పుడు బ్యాంకు పాలు బాగా ఉపయోగపడతాయి. ఇక ఎన్ఐసీయూ (నియోనేటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్)లో ఉన్న పిల్లలకు ఈ పాలు బాగా ఉపయోగపడతాయి. ఫార్ములా పాలకు బదులు తల్లి పాలనే ఇంతగా సిఫార్సు చేయడానికి కారణాలు... తల్లిపాలపై పెరిగే పిల్లలు మిగతా వారితో పోలిస్తే చాలా ఆరోగ్యంగా ఉంటారు. భౌతికంగా, మానసికంగా ఆరోగ్యంగా ఎదుగుతారు. రోగాలను స్వాభావికంగానే సమర్థంగా ఎదుర్కొంటారు. తల్లిపాలలో లెక్కకు మించి పోషకాలు ఉన్నా... మన అధ్యయనానికి అందేవి సుమారు 400 రకాల వేర్వేరు పోషకాలు ఉంటాయి. వాటన్నింటినీ కృత్రిమంగా తయారు చేయడం అస్సలు సాధ్యం కాదు. కృత్రిమంగా తయారుచేసే ఫార్ములా పాలేవీ తల్లిపాలకు అస్సలు సాటిరావు. ఇలా తల్లిపాలపై పెరిగే పిల్లల్లో రోగనిరోధకశక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. బిడ్డకు ఎన్నో జబ్బులు రావు లేదా డయాబెటిస్ వంటి కొన్ని భవిష్యత్తులో రావాల్సిన జబ్బులు చాలా ఆలస్యమవుతాయి. ఇక తల్లి పాలు తాగే పిల్లలతో పోలిస్తే, తల్లి పాలపై లేని పిల్లల్లో చాలా రకాల జబ్బులు కనిపిస్తాయి. అవి... జీర్ణకోశ సమస్యలు: తల్లిపాలు స్వాభావికంగా ఉండటం వల్ల అవి జీర్ణకోశానికి ఇబ్బంది కలిగించకుండా జీర్ణమవుతాయి. కానీ ఫార్ములా పాలు / పోతపాలు వంటివి జీర్ణకోశ ఇబ్బందులను కలిగిస్తాయి. ఆస్తమా : తల్లిపాలు బిడ్డకు సరిపడకపోవడం అంటూ ఉండదు. కానీ పోతపాలుగా ఇచ్చే యానిమల్ మిల్క్ గానీ లేదా ఫార్ములా మిల్క్గాని చాలావరకు బిడ్డకు సరిపడకపోవడానికి అవకాశాలు ఎక్కువ. అందుకే పోతపాలపై పెరిగే పిల్లల్లో ఆస్తమా వంటి జబ్బులు, ఎగ్జిమా వంటి రుగ్మతలు ఎక్కువగా కనిపిస్తాయి. వీటితో పాటు తల్లిపాలపై పెరిగే బిడ్డలకు శ్వాసకోశ సమస్యలు వచ్చే అవకాశాలు చాలా తక్కువ. బిడ్డకు చెవి ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు తక్కువ. తల్లిపాలపై పెరిగే పిల్లల్లో స్థూలకాయం వచ్చే అవకాశాలు చాలా తక్కువ. పోతపాలపై పెరిగే పిల్లల్లో చిన్నప్పుడే స్థూలకాయం వచ్చే అవకాశాలు ఎక్కువ. తల్లిపాలపై పెరిగే పిల్లల్లో చిన్నప్పుడు క్యాన్సర్లు (చైల్డ్హుడ్ క్యాన్సర్లు) వచ్చే అవకాశాలు చాలా తక్కువ. నెక్రొటైజింగ్ ఎంటెరోకొలైటిస్ వంటి వ్యాధులు వచ్చే అవకాశాలూ తక్కువే. ఒక్కమాటలో చెప్పాలంటే తల్లిపాలపై పెరిగే పిల్లలు చాలా తక్కువగా జబ్బు పడతారు. ఫలితంగా వారి రక్షణ కోసం, వారి ఆరోగ్యం కోసం తల్లిదండ్రులు ఖర్చు చేయాల్సిన డబ్బు చాలా చాలా తక్కువ. పాలు ప్రదానం చేసే తల్లికీ లాభమే... నిజానికి పాలు ఎక్కువగా స్రవిస్తున్న తల్లికి పాలను బ్యాంకుకు ప్రదానం చేయడం విషయంలో కొన్ని అపోహలు కలగవచ్చు. ఉదాహరణకు... తాను పాలను బ్యాంకుకు ఇవ్వడం వల్ల తనకు పడే పాలు తన బిడ్డకే సరిపోకపోవచ్చేమో అనే సందేహం కలగడం చాలా సాధారణం. కానీ ప్రకృతిపరంగా తల్లి నుంచి పాల సేకరణ ఎంత ఎక్కువ జరిగితే పాలు ఊరడం కూడా అంతే ఎక్కువగా జరుగుతుంది. అంటే పాలుగారే పాపాయి పాలు ఊరే తల్లి పాలను ఇస్తున్న కొద్దీ పాల ఊట పెరుగుతుందన్న మాట. ఇలా పాలు పట్టడం వల్ల లేదా ప్రదానం చేయడం వల్ల తల్లికీ ఎన్నో ప్రయోజనాలు చేకూరతాయి. పాలు పట్టడం / ఇంకా మిగిలితే పాలను బ్యాంకుకు ప్రదానం చేయడం వల్ల తల్లికి ఒనగూరే ప్రయోజనాలలో మచ్చుకు కొన్ని... పాలిచ్చే తల్లుల్లో ఆక్సిటోసిస్ అనే రసాయనం స్రవించి అది ప్రసవం తర్వాత అయ్యే రక్తస్రావాన్ని బాగా తగ్గిస్తుంది. పాలు బాగా ఊరే తల్లిలో ప్రసవం తర్వాత గర్భసంచి ఆరోగ్యకరంగా ముడుచుకుపోతుంది. పాలిచ్చే తల్లి స్వాభావిక మార్గంలో బరువు తగ్గుతుంది. అంటే పాలు ఇస్తున్నంత కాలం తల్లులు లావెక్కరు. ఇది వారిలోని సౌందర్యాన్ని ఇనుమడింపజేసే అంశం. ఒక్క సౌందర్యప్రయోజనమేనా... కాదు... ఇలా బరువు పెరగకపోవడం వల్ల స్థూలకాయం రిస్క్ ఫ్యాక్టర్లుగా గల అనేక జబ్బులు రావు. పాలిచ్చే తల్లులకు అనేక రకాల క్యాన్సర్ల నుంచి రక్షణ ఉంటుంది. పాలిచ్చే తల్లులకు డయాబెటిస్ వచ్చే అవకాశాలు తక్కువ. పాలివ్వడం వల్ల ఆస్టియోపోరోసిస్ వచ్చే అవకాశాలు, మానసిక రుగ్మతలకు గురయ్యే అవకాశాలు చాలా తక్కువ. పాలిచ్చే తల్లుల్లో మేను ప్రకాశవంతంగా, ఆకర్షణీయంగా మారుతుంది. తల్లిపాలలో ఉండే కొన్ని ప్రధానమైన అంశాలివి... తల్లిపాలలో ఎక్కువ భాగం నీళ్లే ఉంటాయి. ఇక ప్రోటీన్ల విషయానికి వస్తే 100 మి.లీ పాలలో 1 గ్రాము ప్రోటీన్లు ఉంటాయి. అలాగే 100 ఎంఎల్ పరిమాణంలో 3.5 గ్రాముల కొవ్వులు, ప్రతి 100 ఎంఎల్కూ 7 గ్రాముల ల్యాక్టోజ్ ప్రోటీన్లు ఉంటాయి. అవి చాలా తేలిగ్గా జీర్ణమవుతాయి. ఇక కొవ్వులు కూడా చాలా పొడవైన ఫ్యాటీ యాసిడ్ చైన్ల రూపంలో ఉండి మెదడుకు మేలు చేసే పోషకాలతో ఉంటాయి. ల్యాక్టోజ్లో గెలాక్టొసైడ్ అనే పోషకం మెదడు ఎదుగుదలకు బాగా ఉపయోగపడుతుంది. తల్లిపాలకు దీటుగా ఫార్ములాపాలను తయారు చేయాలంటే అది అసాధ్యం. ఒకవేళ సుసాధ్యం చేయాలన్నా ఒక్క బిడ్డ పెరగడానికి కావాల్సిన పాలకే కొన్ని కోట్లాది రూపాయలు అవసరమవుతాయి. అంతటి విలువైన పాలను ప్రకృతి ఉచితంగా మనకు ప్రసాదిస్తుందన్నమాట. అందుకే వాటిని వృథా చేయకండి. ఈ అవగాహన అందరికీ పెరిగితే సమాజానికి ఎంతో మేలు. తల్లిపాల బ్యాంకు నిర్మాణం/స్వరూపం... ఈ తల్లిపాల బ్యాంకు పిల్లల ఆసుపత్రిలోని ‘నియోనేటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్’కు అనుబంధంగా ఉంటుంది. ఇందులో కేవలం బ్యాంకు వ్యవహారాలను చూసుకోవడం కోసం ప్రత్యేకంగా ల్యాక్టేషన్ మేనేజ్మెంట్ నర్స్లు/ల్యాక్టేషన్ కన్సల్టెంట్స్ ఉంటారు. వీళ్లతో పాటు పాల నాణ్యతను పరీక్షించేందుకు మైక్రోబయాలజిస్ట్, బయోకెమిస్ట్, దీని ప్రాముఖ్యతను పాలు ఎక్కువగా స్రవించే తల్లులకూ, పాలు రాని తల్లులకూ వివరించేందుకు ల్యాక్టేషన్ కౌన్సెలర్స్ ఉంటారు. సాధారణంగా సమాజసేవ చేసే దృక్పథంగా ఉన్న స్వచ్ఛంద సేవకులు ఈ కౌన్సెలింగ్ బాధ్యతను నిర్వహిస్తుంటారు. పాల ప్రదానం కోసం ఎలాంటి తల్లులు అర్హులు పాలు బాగా పడే ఏ తల్లి అయినా పాలను బ్యాంకులో నిల్వచేయవచ్చు. కొందరు తల్లులు తమ బిడ్డే సరిగా పాలు తాగని సందర్భాల్లో తమకు పడే పాలను తీసి నిల్వ ఉంచుతుంటారు. ఇలాంటి సందర్భాల్లో ఏ బిడ్డకు ఆ తల్లి పాలనే ఇస్తుంటారు. ఇంకా ఎక్కువగా పాలు నిల్వ అవుతుంటే వాటిని పాలు రాని తల్లుల బిడ్డలకు ఇస్తుంటారు. సాధారణంగా పాలను ప్రదానం చేసే తల్లులకు హెచ్ఐవీ, హెచ్బీఎస్ఏజీ, ఇతరత్రా జబ్బులేవీ లేకుండా ఉండేలా పరీక్షలు చేస్తుంటారు. అయితే ఇటీవల గర్భం ధరించగానే కాబోయే తల్లులకే ఈ పరీక్షలన్నీ నిర్వహిస్తుంటారు కాబట్టి చాలావరకు తల్లులకు ఎలాంటి సమస్యలూ ఉండవు. ఒకవేళ ముందుగానే కాబోయే తల్లులకు గానీ లేదా పాలను ప్రదానం చేయడానికి ముందుకు వచ్చిన తల్లులకు గానీ ఏవైనా వ్యాధులు ఉన్నట్లు తేలితే... వారికి తదనుగుణంగా చికిత్స చేయడమూ సాధ్యమవుతుంది. పాలు ప్రదానం చేయాల్సిన తల్లికి ఉండాల్సిన ప్రధాన లక్షణాలు తల్లి తన ఇష్టపూర్తిగానే పాలను బ్యాంకుకు ఇవ్వాలి. తల్లి పూర్తిగా ఆరోగ్యకరంగా ఉండాలి. తల్లికి నిర్వహించే రక్తపరీక్షల్లో ఆమెకు హీమోగ్లోబిన్ కనీసం 11 శాతం ఉండాలి. హెచ్ఐవీ/హెచ్బీఎస్ఏజీ/వీడీఆర్ఎల్/టీబీ వంటి వ్యాధులేవీ లేకుండా ఉండాలి. మీరు అర్హులో కాదో తెలియడం ఎలా... కొందరికి పాలు ప్రదానం చేయాలని ఉండవచ్చు. కానీ తమ పాలు తమ బిడ్డకే సరిపోతున్నాయా లేదా అన్న అంశం వాళ్లకు తెలియదు. అలాంటప్పుడు అందుకే వాళ్లు పాలప్రదానం చేయడానికి సందేహిస్తారు. అయితే అది తెలుసుకోవడం చాలా సులభమే. బిడ్డ పాలు తాగాక కూడా రొమ్ము నుంచి ధారగా పాలు స్రవిస్తూ ఉంటే వాళ్లు పాలు ప్రదానం చేయడానికి పూర్తిగా అర్హులు. చాలా హాస్పిటళ్లలో ఇలా పాలు స్రవించే తల్లుల పాలు వృథాగా నేలపాలు అవుతుంటాయి. అవి ఇలా బ్యాంకుకు చేరి, పాలు సరిగా పడని తల్లుల చిన్నారుల కడుపులు నింపితే ఎన్నో మరణాలను నివారించవచ్చు. మనదేశంలో ఇటీవల ఆసుపత్రుల్లో ప్రసవాల తర్వాత శిశుమరణాల రేటు గణనీయంగా తగ్గినా... ఇంకా ప్రతి ఐదుగురు శిశువుల్లో ఒకరు తల్లి పాల లేమితోనే కన్నుమూస్తున్నారు. తక్కువ బరువుతో పుట్టిన వీళ్లకు ఎలాంటి చికిత్సా అవసరం లేదు. కేవలం తల్లిపాలు దొరికితే చాలు... రెండున్నర కిలోల బరువును పుంజుకున్న తర్వాత వాళ్లు మృత్యువు నీడనుంచి పూర్తిగా బయటపడినట్లే. అందుకే తల్లిపాల బ్యాంకుకు పాలను ప్రదానం చేయడం, మరిన్ని తల్లిపాల బ్యాంకులు నెలకొల్పేలా సమాజంలో అవగాహన పెంపొందడం చాలా ముఖ్యమైన విషయాలు. మీ బిడ్డకు మీ పాలే పట్టండి... మీరు పాలు తాగే పసిపాపకు తల్లా? సౌందర్యకాంక్షతో ఆ చిన్నారికి పాలుపట్టడం లేదా? అయితే వెంటనే మీ పాపకు మీ రొమ్ముపాలే పట్టించండి. ఎందుకంటే బిడ్డకు తల్లి పాలు పట్టకపోవడం వల్ల తల్లికీ చాలారకాలుగా అనర్థాలు చేకూరే అవకాశాలున్నాయి. వాటిలో కొన్ని... బిడ్డకు పాలు పట్టని తల్లులకు మూత్రకోశ ఇన్ఫెక్షన్స్ (యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్) వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. మెనోపాజ్ పూర్తయ్యాక (లేదా కొన్ని సందర్భాల్లో మెనోపాజ్ రాకముందే) చాలా రకాల క్యాన్సర్లు, ముఖ్యంగా ఒవేరియన్ క్యాన్సర్కు అవకాశాలు ఎక్కువ. ఎముకలు పెళుసుగా మారి, తేలిగ్గా విరిగిపోయే ఆస్టియోపోరోసిస్ జబ్బు వచ్చేందుకు అవకాశాలు చాలా చాలా ఎక్కువ. భవిష్య ప్రణాళిక... భారత్లోని బ్రెస్ట్ఫీడింగ్ ప్రమోషన్ నెట్వర్క్ సెంట్రల్ కో-ఆర్డినేటర్ అయిన అరుణ్ గుప్తా ఒక కలగంటున్నారు. ఢిల్లీలో నెలకొని ఉన్న ఈ స్వచ్ఛంద సంస్థ అధినేత అయిన ఆయన ప్రణాళిక ఏమిటంటే... బ్రెజిల్లో లాగే (అక్కడ ప్రపంచంలో అతి ఎక్కువగా 212 తల్లిపాల బ్యాంకులు ఉన్నాయి) ఇక్కడ మన దేశంలోనూ ఏర్పడి... సుదూర ప్రాంతంలో ఉన్న తల్లి కూడా పోస్ట్మెన్ ద్వారా కూడా తల్లిపాలను తెప్పించుకునేలా నెట్వర్క్ ఏర్పడాలన్నది ఆయన అభిలాష. పాలిచ్చే తల్లికి కొన్ని సూచనలు మీరు పాలిచ్చే బిడ్డ తల్లా? అయితే ఈ సూచనలు పాటించండి. ఇవి ఇటు తల్లికీ, అటు బిడ్డకూ మేలు చేస్తాయి. బిడ్డకు తల్లిపాలు ఇచ్చే మహిళ బలవర్థకమైన ఆహారాన్ని తీసుకోవాలి. తల్లి రకరకాల కాయధాన్యాలు (హోల్గ్రెయిన్స్), పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు తినాలి. తల్లి తినే ఆహారాన్ని బట్టి బిడ్డకు పట్టే పాల రుచి (ఫ్లేవర్) కూడా మారుతూ కొత్త రుచిని సంతరించుకుంటుంటుంది. అప్పుడు బిడ్డ మరింతగా ఆస్వాదిస్తూ తల్లిపాలను ఇష్టంగా తాగుతుంటాడు. పాలిచ్చే తల్లి ఎక్కువగా నీళ్లు తాగాలి. కానీ చాలామంది పెద్దలు తల్లిని ఎక్కువగా నీళ్లు తాగనివ్వరు. తల్లి నీళ్లు ఎక్కవ తాగితే బిడ్డకు జలుబు చేస్తుందంటూ ఆమెను తక్కువ నీళ్లు తాగేలా కట్టడి చేస్తుంటారు. తల్లి ఎక్కువ నీళ్లు తాగితే బిడ్డకు జలుబు చేస్తుందనడం అపోహ మాత్రమే. తల్లికి ఎక్కువగా పాలు ఊరి, బిడ్డకు సరిపడా పాలు పడాలంటే నీళ్లు ఎక్కువగా తాగాల్సిందే. అందుకే దాహమైనా కాకపోయినా తల్లి నీళ్లు తాగుతుండాలి. తల్లి ఎన్ని నీళ్లు తాగాలంటే... ఆమెకు మూత్రం పసుపు రంగులో రాకుండా ఉండేట్లుగా చూసుకోవాలి. తల్లి పాలలో బిడ్డకు మేలు చేసే ఐరన్ ఎక్కువగా ఉండటానికి బీన్స్, వేరుశెనగ పల్లీలు, అలచందలు, తృణధాన్యాలు, డ్రైఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవాలి. ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని విటమిన్-సితో ఇచ్చే పండ్లతో కలిపి తీసుకోవడం మంచిది. అంటే నిమ్మజాతిపండ్లు, స్ట్రాబెర్రీస్ వంటివి. తల్లి పాలలో ప్రొటీన్లు పుష్కలంగా ఉండటానికి గుడ్లు, పాలు, పాల ఉత్పాదనలు, బఠాణీలు, నట్స్ వంటివి తీసుకోవాలి. క్యాల్షియమ్ బాగా సమకూరేలా బాగా ముదురు ఆకుపచ్చగా ఉండే ఆకుకూరలు, సోయామిల్క్, పెరుగు, టోఫూ వంటి ఆహార పదార్థాలు పుష్కలంగా తీసుకోవాలి. విటమిన్ బి12తో పాటు విటమిన్ డి పుష్కలంగా లభించడానికి వీలుగా పాలు, పాల ఉత్పాదనలతో పాటు మాంసాహారం తీసుకోవాలి. అవి తీసుకోని వారు డాక్టర్ సలహా మేరకు మాత్రమే విటమిన్ బి12, విటమిన్-డి సప్లిమెంట్స్ మాత్రల రూపంలో తీసుకోవాలి. పరిశోధన బిడ్డకు పాలిస్తే... గుండె జబ్బులు దూరం! బిడ్డకు కనీసం మూడు నెలలపాటు తల్లిపాలిస్తే అది బిడ్డకే కాక తల్లికి కూడా మేలు చేస్తుందని మరోసారి రుజువైంది. వాషింగ్టన్ యూనివర్శిటీకి చెందిన ప్రొఫెసర్ మోల్లీ మెట్జర్ నిర్వహించిన తాజా పరిశోధనలో... బిడ్డకు తల్లిపాలివ్వడం వల్ల ఆ తల్లి దీర్ఘకాలం ఆరోగ్యంగా ఉంటుందని తేలింది. వీరికి క్రానిక్ ఇన్ఫ్లమేషన్ కారణంగా వచ్చే మధుమేహం వంటి మెటబాలిజమ్ సమస్యలు దూరంగా ఉంటాయి. అలాగే బిడ్డ పాలు తాగేటప్పుడు విడుదలయ్యే సిఆర్పి (కో-రియాక్టివ్ ప్రొటీన్) రక్తనాళాల్లో కొవ్వు పేరుకోకుండా నిరోధిస్తుంది. గుండె సంబంధ వ్యాధులను నివారిస్తుంది. మోల్లీ పరిశోధన వివరాలు రాయల్ సొసైటీ జర్నల్లో ప్రచురితమయ్యాయి. ఆరోగ్య ‘ఫలాలు’ జామపండులో... జామపండులో కొవ్వు, కేలరీలు తక్కువ, పీచు ఎక్కువ. ‘ఎ, బి కాంప్లెక్స్, సి, ఇ, కె విటమిన్లు, ఖనిజ లవణాలు, యాంటీ ఆక్సిడెంట్లు, పాలీఫెనోలిక్, ఫ్లేవనాయిడ్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఊపిరితిత్తులు, నోటి క్యాన్సర్, పెద్దపేగు క్యాన్సర్లను నివారిస్తాయి. వార్ధక్యాన్ని దూరం చేస్తాయి. జామపండు తింటే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ఇందులోని పీచు జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరిచి పెద్దపేగులోని మ్యూకస్ను కాపాడుతుంది. దేహం విసర్జించాల్సిన వ్యర్థాలను, క్యాన్సర్ కారక రసాయనాలను త్వరగా బయటకు పంపుతుంది వందగ్రాముల జామపండులో ‘సి’ విటమిన్ 228 మి.గ్రా.లు ఉంటుంది అతినీల లోహిత కిరణాల బారి నుంచి చర్మాన్ని కాపాడడంలో తెల్ల జామపండు కంటే గులాబీరంగు జామపండు ఎక్కువగా ఉపయోగపడుతుంది. - ఉషశ్రీ, కేర్ హాస్పిటల్ పాలిచ్చే తల్లి తీసుకోకూడని ఆహారాలు కెఫిన్ ఉండే పదార్థాలు: పాలిచ్చే సమయంలో కెఫిన్ పుష్కలంగా ఉండే కాఫీలు, కూల్డ్రింక్స్ తీసుకోకపోవడమే మంచిది. ఒకవేళ తీసుకోవాలనిపిస్తే మాత్రం చాలా పరిమితంగా రోజూ రెండు కప్పులకు మించనివ్వవద్దు. మసాలాలు: పాలిచ్చే తల్లి మసాలాలను చాలా తక్కువగా తీసుకోవాలి. పుష్కలమైన పాల కోసం మంచి సూచనలు: ఒక్కమాటలో చెప్పాలంటే తల్లి సంపూర్ణంగా పోషకాలు లభించే సంపూర్ణాహారం తీసుకోవాలి. ఇందులో పండ్లు, కూరగాయలు, పప్పులు... ఇవన్నీ ఉండాలి. తల్లికి ఏదైనా పడని ఆహారం ఉంటే దానికి దూరంగా ఉండాలి. ఎందుకంటే అది తల్లిపై ఎలాంటి ప్రభావం చూపుతుందో, బిడ్డలోనూ అలాంటి ప్రభవమే చూపే అవకాశం ఉంది. వెల్లుల్లి వాసన తల్లుల్లో పాలను పుష్కలంగా పడేలా చేస్తుంది. కానీ తల్లులు కేవలం అన్నం, వెల్లుల్లి వంటి వాటికే పరిమితం కాకుండా, అన్ని రకాల ఆహారాలనూ తినాలి. ద్రవాహారాన్ని పుష్కలంగా తీసుకోవాలి. అప్పుడే బిడ్డకూ సరిగా పాలు పడతాయి. - నిర్వహణ: యాసీన్ - మంజులారెడ్డి