breaking news
microcephaly
-
అమెరికాను వణికిస్తున్న వైరస్..
న్యూయార్క్: గత ఏడాది బ్రెజిల్ వాసులను గజగజలాడించిన జికా వైరస్ ప్రస్తుతం అమెరికాలో వ్యాపించింది. ఈ వైరస్ లాటిన్ అమెరికాలో వేగంగా విస్తరించి అక్కడి ప్రజలను వణికిస్తోంది. అమెరికాలోని న్యూయార్క్లోనూ పలు చోట్ల జికా వైరస్ కేసులు నమోదైనట్లు అధికారులు శనివారం వెల్లడించారు. వైరస్ వ్యాప్తితో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. న్యూయార్క్లో నమోదైన మూడు జికా వైరస్ కేసులలో బాధితులు వైరస్ ప్రభావిత ప్రాంతాలకు వెళ్లి వచ్చినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. ముగ్గురిలో ఒకరికి నయంకాగా, మరో ఇద్దరు చికిత్స పొందుతున్నారు. లాటిన్ అమెరికా, కరేబియన్లలో 22 జికా వైరస్ ప్రభావిత ప్రాంతాలకు వెళ్లవద్దని అమెరికా అధికారులు గర్భిణీ స్త్రీలను హెచ్చరించారు. జికా వైరస్ ఎడిస్ ఈజిప్టీ అనే దోమ ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఈ వ్యాధి సోకితే చిన్నారులు అసాధారణంగా చిన్న తలతో జన్మిస్తారు. ఇది చిన్నారుల మెదడుపై ప్రభావం చూపుతుంది. దోమల ద్వారా వ్యాప్తి చెందే ఈ వైరస్ కారణంగా మెదడులో లోపాలతో పిల్లలు పుడతారు. ఈ వ్యాధిని అరికట్టేంత వరకు తమ దేశ మహిళలు గర్భం దాల్చకుండా ఉండడమే ఉత్తమమని అధికారులు పేర్కొన్నారు. కొలంబియాలో దాదాపు13,500 కేసులు, బ్రెజిల్లో 3,800కు పైగా జికా వైరస్ కేసులు నమోదయ్యాయి. దోమల బారిన పడకుండా జాగ్రత్తలు పాటించడంతప్ప, ఈ వైరస్ వ్యాప్తిని ఏవిధంగా అరికట్టాలన్న దానిపై ఇప్పటివరకు వైద్యులకు స్పష్టత లేదు. జికా వైరస్ గా పిలవబడుతున్న వెస్ట్ నిలే వ్యాధి కారకాన్ని 70 ఏళ్ల క్రితం ఆఫ్రికా అడవి కోతుల్లో తొలిసారిగా గుర్తించారు. దీని కారణంగా నాడీ సంబంధ రుగ్మతలు సంభవిస్తాయని, కొన్నిసార్లు మరణం సంభవించే అవకాశముందని అధికారులు వివరించారు. -
బ్రెజిల్ ను వణికిస్తున్న జికా వైరస్
పెర్నాంబుకొ: బ్రెజిల్ వాసులను జికా వైరస్ వణికిస్తోంది. దోమల ద్వారా వ్యాప్తి చెందే ఈ వైరస్ కారణంగా మెదడులో లోపాలతో పుడుతున్న శిశువుల సంఖ్య పెరుగుతుండడంతో ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. జికా వైరస్ గా పిలవబడుతున్న వెస్ట్ నిలే వ్యాధికారకాన్ని 70 ఏళ్ల క్రితం ఆఫ్రికా అడవి కోతుల్లో తొలిసారి గుర్తించారు. దీని కారణంగా నాడీ సంబంధ రుగ్మతలు సంభవిస్తాయని, కొన్నిసార్లు మరణం సంభవించే అవకాశముందని బ్రెజిల్ ఆరోగ్య శాఖ తెలిపింది. శుష్కించిన శిరస్సు(మైక్రోసెఫలే)తో జన్మించిన శిశువుల్లో జికా వైరస్ ను గుర్తించినట్టు వెల్లడించింది. ఇలాంటి శిశువులకు జన్మనిచ్చిన తల్లుల అపరాయు ద్రవంలోనూ ఈ వైరస్ ను కనుగొన్నట్టు తెలిపింది. జికా వైరస్ కారణంగా ప్రపంచ సైన్స్ పరిశోధనా రంగం మునుపెన్నడూ లేని క్లిష్గట పరిస్థితిని ఎదుర్కొంటోందని పేర్కొంది. బ్రెజిల్ లో ఈ ఏడాది ఇప్పటివరకు 2400 మందిపైగా మైక్రోసెఫలే బారిన పడ్డారు. 29 మంది చనిపోయారు. గతేడాది 147 మైక్రోసెఫలే కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా పెర్నాంబుకొ రాష్ట్రంలో ఈ వ్యాధి ఎక్కువగా ఉంది. అయితే జికా వైరస్ వ్యాప్తిని ఏవిధంగా నిరోధించాలనే దానిపై ఇప్పటివరకు స్పష్టత లేదు. అయితే దోమల బారిన పడకుండా జాగ్రత్తలు పాటించాలని విస్తృతంగా ప్రచారం చేస్తోంది. జికా వైరస్ ను వ్యాప్తి చేసే ఎడిస్ ఏజిప్టి దోమలను నియత్రించేందుకు ఇంటింటికీ దోమ నిర్మూలన బృందాలను పంపుతోంది.