breaking news
met palli
-
మెట్పల్లిలో చెరకు రైతుల భారీ ధర్నా
మెట్పల్లి: జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం ముత్యంపేటలోని మూతబడిన చెరకు కర్మాగారాన్ని వెంటనే తెరవాలని డిమాండ్ చేస్తూ మెట్పల్లిలో భారీ ధర్నా జరిగింది. మెట్పల్లి చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన రైతులు పెద్ద సంఖ్యలో ఈ ఆందోళనలో పాల్గొన్నారు. మంగళవారం ఉదయం ముత్యంపేట నుంచి మెట్పల్లి వరకు పాదయాత్రగా తరలివచ్చి పట్టణంలోని చౌరస్తాలో రాస్తారోకో చేపట్టారు. ఈ సీజన్లో చెరకు క్రషింగ్ను ముత్యంపేట కర్మాగారంలోనే చేపట్టాలని ఆందోళనకు దిగిన రైతులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి మాజీ స్పీకర్ సురేష్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు సుదర్శన్రెడ్డి, కొమ్రెడ్డి రాములు మద్దతు తెలిపారు. పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని ట్రాఫిక్ను క్రమబద్ధీకరించేందుకు ప్రయత్నిస్తున్నారు. -
మెట్పల్లిలో భారీ చోరీ
మెట్పల్లి: కరీంనగర్ జిల్లా మెట్పల్లిలో బుధవారం రాత్రి భారీ చోరీ జరిగింది. వివరాలు.. స్థానికంగా పండ్ల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న అసద్అలి రెండు రోజుల కిందట పని నిమిత్తం కుటుంబంతో సహా హైదరాబాద్ వెళ్లారు. ఇది గమనించిన దొంగలు ఇంటి తాళాలు పగలగొట్టి ఇంట్లో ఉన్న 48 తులాల బంగారు ఆభరణాలతో పాటు, రూ.1.35 లక్షల నగదుతో ఉడాయించారు. ఇది గుర్తించిన స్థానికులు అసద్ అలీ కి సమాచారం ఇచ్చారు. భాదితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు క్లూస్టీంతో సహా రంగంలోకి దిగి విచారణ చేపడుతున్నారు.