-
భవిష్యత్తులో కూడా మేలు జరగాలి: సీఎం జగన్
సాక్షి, అమరావతి: కరోనా నేపథ్యంలో ప్రజలకు నిత్యావసరాలను అందుబాటులోకి తీసుకురావడానికి కొన్ని మార్కెట్లను వికేంద్రీకరించామని.. వీటిని పూర్తిస్థాయిలో మ్యాపింగ్ చేసి.. భవిష్యత్తులో కూడా నిర్వహించేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. గురువారం ఆయన వ్యవసాయ మార్కెటింగ్ ఇంటిలిజెన్స్పై అధికారులతో సమీక్షించారు. రైతులను ఆదుకునే వినూత్న వ్యవస్థల కార్యాచరణ ప్రణాళికపై సీఎం చర్చించారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో పూర్తి చేయాల్సిన పనులపై అధికారులకు లక్ష్యాలను నిర్దేశించారు. ప్రస్తుతం గుర్తించిన దుకాణాలకు భవిష్యత్తులో కూడా నిత్యావసరాలు, కూరగాయలు, పండ్లు పంపిణీ చేస్తే.. ప్రజలకు, రైతులకు మేలు జరుగుతుందని సీఎం పేర్కొన్నారు. రైతుల ఉత్పత్తులను ప్రజల ముంగిటకే తీసుకెళ్లడానికి కూడా ఈ విధానం ఉపయోగపడుతుందన్నారు. (పరీక్షల సంఖ్య క్రమంగా పెరగాలి: సీఎం జగన్) కచ్చితంగా అలర్ట్ రావాల్సిందే.. ఎక్కడైనా రైతు పండించిన పంటకు సరైన ధర లభించలేదంటే.. మార్కెట్ ఇంటెలిజెన్స్ ద్వారా కచ్చితంగా అలర్ట్ రావాలని.. అలా అలర్ట్ వచ్చే పరిస్థితి వెబ్సైట్ లో ఉండాలన్నారు. ప్రతిరోజూ అగ్రికల్చర్ అసిస్టెంట్లు నిరంతరం తమ గ్రామాల్లోని పంటలు, ఉత్పత్తులు, వాటి ధరలపై సమాచారాన్ని తమకు ఇచ్చిన ట్యాబ్ ద్వారా నిరంతరం యాప్లో అప్లోడ్ చేయాలని సీఎం సూచించారు. ప్రతి రైతు భరోసా కేంద్రంలో కంటైనర్ వాహనాన్ని ఉంచడం ద్వారా రైతుల ఉత్పత్తులను తరలించడానికి ఉపయోగపడుతుందని.. అలాగే ఏర్పాటు చేయదలుచుకున్న జనతా బజార్లకు కావాల్సిన నిత్యావసరాలు, వస్తువులను తీసుకురావడానికీ కూడా ఉపయోగపడుతుందని సీఎం పేర్కొన్నారు. రైతుల నుంచి సేకరించిన ఉత్పత్తులను వ్యవసాయ మార్కెట్ యార్డుల వద్దే గ్రేడింగ్, ప్యాకేజీ చేసి.. ఇతర మార్కెటింగ్ వ్యవస్థల్లోకి, అలాగే జనతా బజార్లకూ తరలించవచ్చన్నారు. ఈ వ్యవస్థలన్నీకూడా సక్రమంగా నడపడానికి నిర్దిష్టమైన ఎస్ఓపీలను రూపొందించుకోవాలని సీఎం సూచించారు. (ఏపీ: స్కూల్ ఫీజు వసూలుపై కీలక ఆదేశాలు) జూన్ 1 నాటికి రైతు భరోసా కేంద్రాలు ప్రారంభం కావాలి.. ‘‘అగ్రికల్చర్ అసిస్టెంట్ నుంచి సమాచారం రాగానే 24 గంటల్లోగా చర్యలు తీసుకోవాలి. దీనికి సంబంధించి ప్రోటోకాల్ తయారు చేసుకోవాలి. వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలు జూన్ 1 నాటికి ప్రారంభం కావాలి. అప్పటికి ఈ వ్యవస్థకూడా సజావుగా నడిచేలా చూడాలి. జనతాబజార్లు, గ్రామ స్థాయిలో కోల్డ్ స్టోరేజీలు, గోదాములు, కంటైనర్ వాహనం, ఆర్బీకేలు, మార్కెటింగ్ యార్డుల్లో గ్రేడింగ్, ప్యాకింగ్ సదుపాయాలు, కోల్డ్ స్టోరేజీలు, గోదాములు, ఆక్వా ప్రాంతాల్లో ఇండివిడ్యువల్ క్విక్ ఫ్రీజింగ్ సదుపాయాలు ఏర్పాటు కావాలి. వీటిపై వచ్చే ఆర్థిక సంవత్సరంలో దృష్టిపెట్టాలని’ ’ సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు. స్వయం సమృద్ధి సాధించాలి.. రాష్ట్రవ్యాప్తంగా కోల్డ్ స్టోరేజీలు, గోదాముల అంశంలో స్వయం సమృద్ధి సాధించాలి. నిధులు ఎంతైనా ఒకసారి పెట్టి... వ్యవసాయరంగాన్ని పట్టాల మీదకు తీసుకు వచ్చే ప్రయత్నం చేద్దామని సీఎం తెలిపారు. దీంతోపాటు ధరల స్థిరీకరణ నిధి రైతులకు అండగా నిలబడుతుందని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. -
మ్యారేజ్ బ్యూరో పేరిట టోకరా
♦ ఇరు రాష్ట్రాల్లో 150కి పైగా బాధితులు ♦ నిందితురాలి అరెస్టు సాక్షి, హైదరాబాద్: వివిధ కులాల వారికి పెళ్లి సంబంధాలంటూ పత్రికల్లో ప్రకటనలిచ్చి మో సాలకు పాల్పడుతున్న మహిళను సీసీఎస్ ఆధీనంలోని మార్కెటింగ్ ఇంటెలిజెన్స్ యూనిట్ అధికారులు బుధవారం అరెస్టు చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లకు చెందిన 150 మందికి పైగా మోసపోయిన వారు ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. హైదరాబాద్లోని అంబర్పేట్ ప్రాంతానికి చెందిన సరిత స్థానికంగా ‘శ్రీరస్తు మ్యారేజ్ బ్యూరో’ నిర్వహిస్తోంది. వివిధ తెలుగు పత్రికల్లోని ప్రత్యేక ఎడిషన్లలో కులాల వారీగా పెళ్లి సంబంధాలున్నాయంటూ ప్రకటనలు ఇచ్చేది. వీటిలో ఉన్న ఫోన్ నెంబర్లో ఎవరైనా సంప్రదిస్తే... వారి నుంచి రిజిస్ట్రేషన్ ఫీజు కింద రూ.2,000 నుంచి రూ.5,000 వరకు వసూలు చేసేది. ఆపై వారి ఆసక్తిని బట్టి ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసిన ఫొటోలు, నకిలీ ప్రొఫైల్స్ పంపేది. రకరకాల కారణాలు చెప్పి కాలయాపన చేస్తూ చివరకు సదరు వ్యక్తికి వివాహమైందని, మరో ప్రొఫైల్ పంపిస్తున్నానని నమ్మబలికేది. కొన్ని రోజులకు రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాళ్లు విసిగి వదిలేసేవారు. ఈ పంథాలో మోసాలకు పాల్పడుతున్న సరిత వ్యవహారాలపై సమాచారం అందుకున్న మార్కెటింగ్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఇన్స్పెక్టర్ శంకర్ రాజు నేతృత్వంలోని బృందం లోతుగా ఆరా తీసింది. నలుగురు బాధితుల్ని గుర్తించిన మీదట నిందితురాలిని బుధవారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించింది. బాధితుల సంఖ్య 150కి పైగా ఉంటుందని, వారిలో ఎవరైనా ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామని సీసీఎస్ అధికారులు చెప్పారు.
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సేద్యంలో సేవలకు సలాం
అక్రమాల ప్రియ
ప్రజల మనిషి జగన్
బ్యాంకుల్లో రుణవృద్ధి తగ్గుతుందన్న ప్రముఖ సంస్థ
ఆర్థిక కేటుగాళ్లకు టీడీపీ అడ్డా
రేణుక విజృంభణ... భారత్ శుభారంభం
దశాబ్దాల కల నెరవేరిన వేళ...
గంగపుత్రుల జీవితాల్లో మీన రాశులు
హామీలెవరూ నమ్మట్లేదు! గతంలో చెప్పినట్లు ఇవి కూడా అబద్ధాలనుకొని వెళ్లిపోతున్నార్సార్!
చేతులెత్తేసిన ఎల్లో గ్యాంగ్
Bullet List Block
- అరుదైన ఘనత సాధించే పనిలో స్టార్ హీరోయిన్ జ్యోతిక
- కొత్తపల్లి గీతకు డిపాజిట్ దక్కేనా?
- కొత్తపల్లి గీత డిపాజిట్ దక్కేనా?
- హమ్మయ్య బంగారం దిగొచ్చింది! తులం ఎంతంటే..
- శుభకార్యానికి వెళ్తూ అనంతలోకాలకు..
- పెద్దలను ఎదిరించలేక ప్రేమ జంట ఆత్మహత్య
- దాడులు, దౌర్జన్యాలు, దమనకాండే టీడీపీ అజెండా
- ఆందోళనలు ఉద్రిక్తం.. హార్వర్డ్ యూనివర్సిటీలో పాలస్తీనా జెండా
- వెంటనే ముంబైకి.. ‘టీవీ రాముడు’పై కాంగ్రెస్ విమర్శలు
- ముద్దు సీన్ అంత ఈజీ కాదు.. మైండ్లో ఉండేది అదొక్కటే: నటి దివ్య
Advertisement