breaking news
mandalil buddhaprasad
-
రేగుల్లంక వంతెన పూర్తయ్యేనా?
సాక్షి, అవనిగడ్డ: ఎన్నో ఏళ్ల పోరాటం ఫలితంగా సాధించుకున్న రేగుల్లంక వంతెన నిర్మాణ పనులు పిల్లర్ల దశలోనే నిలిచిపోయాయి. వంతెన నిర్మాణం చేపట్టాలని స్థానికులు ప్రజాప్రతినిధులు, అ«ధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకునేవారే కరువయ్యారు. అధికార పార్టీ నేతే అడ్డంకులు కలిగిస్తున్నా ఏమీ అనలేని పరిస్థితి. వంతెన పనులు ప్రారంభించకుంటే ఆందోళన బాట పడతామని స్థానికులు హెచ్చరిస్తున్నారు. ఆది నుంచి వివాదాలే... పులిగడ్డ రేగుల్లంకలో కాలిబాట వంతెన, సీసీ రహదారులు నిర్మించేందుకు రూ.1.10 కోట్ల నిధులు మంజూరు చేశారు. 2016 నవంబర్లో మంత్రి అయ్యన్నపాత్రుడు ఈ పనులకు శంకుస్థాపన చేశారు. గతేడాది ఏప్రిల్లో సీసీ రహదారి పనులు చేపట్టగా నాసిరకమైన మెటీరియల్ వాడటంపై స్థానికులు అభ్యంతరం చెప్పడంతో ఏడు నెలల పాటు పనులు నిలిచిపోయాయి. ఈ ఏడాది ఏప్రిల్లో సిమెంట్ రోడ్లు నిర్మించగా, వంతెన పనులు మాత్రం నిలిచిపోయాయి. ఉపసభాపతి హెచ్చరించినా... వారం క్రితం గాంధీ క్షేత్రంలో జరిగిన నియోజకవర్గస్థాయి అధికారుల సమావేశంలో రేగుల్లంక వంతెన నిర్మాణ విషయమై శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ పంచాయతీరాజ్ డీఈ రమేష్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిధులు మంజూరైనా కాంట్రాక్టర్తో పనులు చేయించలేకపోతున్నారని మండిపడ్డారు. పత్రికల్లో కథనాలు వచ్చినా మీలో చలనం రాలేదని ఆగ్రహించారు. అయినా ఇంతవరకూ పనులు ప్రారంభించేందుకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం విమర్శలకు దారితీస్తుంది. మీరే సమస్య పరిష్కరించుకోవాలి... స్థానికులు పంచాయతీరాజ్ ఏఈ గోపాలరావు దగ్గరకు సోమవారం వెళ్లి వంతెన నిర్మాణ పనులు ప్రారంభించాలని కోరారు. మీరు దగ్గరుండి ఆక్రమణదారుడిని తొలగింపజేస్తే పనులు చేస్తామని ఏఈ చెప్పడంతో వారు నిరాశతో వెనుదిరిగారు. అనంతరం జెడ్పీటీసీ సభ్యుడు కొల్లూరి వెంకటేశ్వరరావు దగ్గరకు వచ్చి తమ గోడు వెళ్లబోసుకోగా పంచాయతీరాజ్ డీఈ రమేష్, ఏఈ గోపాలరావుని పిలిపించి వంతెన నిర్మాణ విషయమై మాట్లాడారు. రెండు, మూడు రోజుల్లో పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా స్థానికులు దోవారి శేషు, బత్తుల శ్రీను మాట్లాడుతూ వంతెన నిర్మాణం గురించి ప్రజాప్రతినిధులు, అధికారుల వద్దకు తిరిగినా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. -
ప్రపంచీకరణతో మాతృభాషలకు ముప్పు
మండలి బుద్ధప్రసాద్ నిరాశజనకంగా ప్రాచీన హోదా ఫలితాలు పిలుపులకే పరిమితమవుతున్న పోరాటాలు చిత్తశుద్ధి లేకపోతే అమ్మభాష కనుమరుగు బెంగళూరు (బనశంకరి) : ప్రపంచీకరణతో మా తృభాషలకు పెనుముప్పు పొంచిఉందని ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని ఐక్యరా జ్య సమితి సైతం హెచ్చరించినట్లు ఆయన గుర్తు చేశారు. బెంగళూరు యూనివర్సిటీ స్వర్ణోత్సవాల సందర్భంగా ‘దక్షిణాది రాష్ట్రాల భా షా సాహిత్యం - తులనాత్మక పరి శీలన’ అనే అంశంపై స్థానిక జ్ఞాన జ్యోతి ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన జాతీయ సదస్సు శుక్రవారం ప్రారంభమైంది. రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సును మండలి బుద్ధప్రసాద్ ప్రారంభించి మాట్లాడారు. తెలుగు, కన్నడం, తమిళం, మళయాలం భాషలు చాలా ప్రాచీణమైనవని తెలిపారు. తెలుగు, కన్నడ భాషలకు అవినాభావ సంబంధముందని అన్నారు. ప్రస్తుత సమాజంలో నాలుగు భాష మనుగడ గురించి ఆలోంచాల్సిన అవసరముందని అన్నారు. ఆంగ్లంతో పాటు మాతృభాషను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. మాతృభాషలకు ముప్పు వాటిల్లుతున్న తరుణంలో అందరూ సమైక్యంగా ఎదుర్కొవాలని పిలుపునిస్తున్నారని, అయితే ఆచరణలో విఫలమవుతున్నారని విమర్శించారు. చిత్తశుద్ధితో ఏకతాటిపై పోరాటం సాగిస్తే తప్పా మాతృభాషను కాపాడుకోలేమని అన్నారు. పోరాటాలతోనే కన్నడ, తెలుగు భాషలకు స్వయం ప్రతిపత్తి, ప్రత్యేక హోదా లభించాయని గుర్తు చేశారు. అయితే హోదా ఫలితాలు ఆశాజనకంగా లేవని ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ ఉన్నప్పుడు ద్రావిడ యూనివర్సిటీని స్థాపించి దాని పటిష్టతకు కృషి చేయడం జరిగిందని తెలిపారు. ఈ వర్సిటీని సామాన్యులకు అందుబాటులో ఉండేలా చూడాలని కోరారు. దక్షిణాది నాలుగు భాషలను గూగుల్ సాయంతో ఇంటర్నెట్లో ప్రవేశపెట్టే ఆలోచన చేయాలన్నారు. ఆచార్య సిద్దలింగయ్య మాట్లాడుతూ.... నాలుగు బాషలపై తులనాత్మక అధ్యయనం చేయడం హర్షణీయమని అన్నారు. తెలుగు, కన్నడను ఏకలిపిగా చేయాలని ఈ సందర్బంగా ఆంధ్ర, తెలంగాణా, కర్ణాటక ప్రభుత్వాలకు సాహితీవేత్తలు మనవి చేయాలని కోరారు. అనంతరం సామాజిక విశ్లేషకుడు తెలకపల్లి రవి మాట్లాడుతూ కర్ణాటక అంటే గుర్తుకు వచ్చేది వీరశైవం, పంప మహాకవి అని అన్నారు. కల్బుర్గి లాంటి సాహితీవేత్తను హత్యచేయడం విషాదకరమన్నారు. దక్షిణాది రాష్ట్రాలకు సుదీర్ఘచరిత్ర ఉందని వీటిని కాపాడుకోవాలసిన బాధ్యత అందరిపై ఉందని గుర్తు చేశారు. అనంతరం ‘దక్షిణాది రాష్ట్రాల భాషాసాహిత్యం - తులనాత్మక పరిశీలన’ సావనీర్ను ఆవిష్కరించారు. సాహితీ వేత్త తంగిరాలసుబ్బారావును మండలిబుద్దప్రసాద్ ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో బెంగళూరు యూనివర్శిటీ వైస్చాన్సలర్ బి.తిమ్మేగౌడ, సెమినార్ డెరైక్టర్ ఆచార్య కె.ఆశాజ్యోతి, కాత్యాయని విదుమహి, కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత రాచపాలెం చంద్రశేఖర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.