breaking news
malli bhattivikramarka
-
అసెంబ్లీలో ప్రజా గొంతుకనవుతా..
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: శాసనసభలో ప్రజా గొంతుకలా వ్యవహరిస్తానని కాంగ్రెస్పార్టీ శాసనసభా పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. సీఎల్పీ నేతగా ఎన్నికైన ఆయనను బుధవారం ఇక్కడ పార్టీ కార్యాలయంలో కార్యకర్తలు, నేతలు సన్మా నించారు. దేశంలో కాంగ్రెస్ గాలి వీస్తోందని, వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన అన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్, దేశంలో బీజేపీలకు పరాభవం తప్పదని జోస్యం చెప్పారు. రాష్ట్రం లో కీలక సాగునీటి ప్రాజెక్టులన్నీ కాంగ్రెస్ ప్రభుత్వమే నిర్మించిందన్నారు. 2014లో టీఆర్ఎస్ ప్రభుత్వానికి తెలంగాణను మిగులు బడ్జెట్తో అప్పగిస్తే.. ఇప్పుడు అప్పుల తెలంగాణ చేసిం దన్నారు. సభలో కాంగ్రెస్నేత బాణోత్ సోమ్లా నాయక్, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్రెడ్డి, ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు, పొదెం వీరయ్య, బాణోతు హరిప్రియ పాల్గొన్నారు. -
కేటీఆర్, హరీశ్లపై భట్టివిక్రమార్క ఫైర్
హైదరాబాద్: పన్నుల రూపంలో ప్రజల నుంచి వసూలుచేసిన డబ్బును ఎందుకు దుబారా చేస్తున్నారని ప్రశ్నించిన దిగ్విజయ్ సింగ్ ను మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులు విమర్శించడాన్ని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క తప్పుపట్టారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం అమలులోకి తెచ్చిన అనేక సంక్షేమ కార్యక్రమాలను నీరుగార్చి, కొత్తగా ప్రకటించిన పథకాలకు నిధులు కేటాయించని టీఆర్ఎస్ మంత్రులు సంక్షేమం గురించి మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. ఆదివారం గాంధీ భవన్ లో విలేకరులతో మాట్లాడిన భట్టి ప్రభుత్వ పథకాల్లోని లొసుగులను ఎకరువుపెట్టారు. (చదవండి: కేసీఆర్.. ఏమిటీ దుబారా?) టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించి, అమలుచేస్తున్నానని చెప్పుకొంటున్న అన్ని పథకాలూ అస్తవ్యస్తంగా మారాయి. 6 లక్షల డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మిస్తామని అంటున్నారు. అన్ని ఇళ్లు కట్టాలంటే కనీసం రూ. 46వేల కోట్లు అవసరం అవుతాయి. కానీ ఇప్పటివరకు ఆ పథకానికి ఒక్క రూపాయి కేటాయించలేదు. మూడు ఎకరాల భూమి కోసం ఏడు లక్షల మంది దళిత కుటుంబాలు ఏళ్లుగా ఎదురు చూస్తున్నాయి. వాళ్లకు పంచేందుకు అవసరమైన 21 లక్షల ఎకరాల భూ సేకరణకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు శూన్యం. కాంగ్రెస్ అమలుచేసిన 'అమ్మ హస్తం' లాంటి పథకాలను ఎత్తేశారు. వాటి స్థానంలో కొత్త పథకాలు తేనేలేదు. ప్రాజెక్టుల రీ డిజైనింగ్ పేరుతొ అంచనాలను భారీగా పెంచి రాష్ట్ర ఖజానా దుబారా చేస్తున్నారు' అని భట్టీ చెప్పుకొచ్చారు.గాంధీ కుటుంబంతో పోల్చుకునే అర్హత టీఆర్ఎస్ నేతలకు లేదని, ప్రధానమంత్రి, కేంద్ర మంత్రి అయ్యే అవకాశం ఉన్నా, సోనియా, రాహుల్ గాంధీలు వాటిని తీసుకోలేదని భట్టీ గుర్తుచేశారు. దిగ్విజయ్ నిబద్ధతగల నాయకుడని, తెలంగాణలో జరుగుతున్న అన్యాయాలను సహించలేకే ప్రభుత్వాన్ని ప్రశ్నించారని, సమాధానాలు చెప్పేంతవరకు ప్రశ్నిస్తూనే ఉంటామని భట్టి అన్నారు. (చదవండి: 'ఆయన నుంచి నేర్చుకోవాల్సిన గతి పట్టలేదు') ప్రభుత్వం తలపెట్టిన హరిత హారం కార్యక్రమాన్ని ప్రతిపక్ష నేత జానారెడ్డి ప్రశ్నంసించడంపై మీడియా ప్రశ్నలకు బదులిస్తూ..'కార్యక్రమం బాగుందన్నంత మాత్రాన అందులో జరుగుతున్న అవినీతిని సమర్థించినట్లుకాదు'అని భట్టి పేర్కొన్నారు. హరితహారం పేరుతో పెద్ద ఎత్తున దోపిడీ జరుగుతోందని భట్టి ఆరోపించడం, జానా మాత్రం ఆ కార్యక్రమాన్ని సమర్థించిన సంగతి తెలిసిందే.