66 రోజుల్లో రూ.9.90 లక్షల ఆదాయం
కడ్తాల: మహబూబ్ నగర్ జిల్లా ఆమనగల్లు మండలం మైసిగండి గ్రామంలో కొలువై ఉన్న శ్రీ మైసిగండి మైసమ్మ తల్లి హుండీ ఆదాయాన్ని గురువారం దేవాదాయ శాఖ అధికారులు లెక్కించారు. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కృష్ణ సమక్షంలో ఈ లెక్కింపు నిర్వహించారు. మొత్తం 66 రోజులకు సంబంధించిన హుండీ ఆదాయాన్ని లెక్కించగా, రూ. 9,90,323 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈఓ రంగారెడ్డి తెలిపారు.
ఈ మొత్తాన్ని కడ్తాల కెనరా బ్యాంకులో డిపాజిట్ చేయనున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఫౌండర్ ట్రస్టీ శిరోలీ, తలకొండపల్లి తహశీల్దార్ జ్యోతి, రమావత్ భాస్కర్నాయక్, మాజీ ఉప సర్పంచ్ పాండునాయక్ ఆలయ, అర్చక సిబ్బంది యాదగిరిస్వామి, కృష్ణ, చంద్రయ్య, దేవేందర్, బోడియా, రాములు, బాలబ్రహ్మచారి, వెంకటేశ్, లక్ష్మీనారాయణ, భక్తులు పాల్గొన్నారు.