-
‘పని’ పెంచుడే..!
సాక్షిప్రతినిధి, ఖమ్మం: ఉపాధిహామీ పనులు కల్పించేందుకు.. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకునేందుకు జిల్లా అధికారులు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. ఆర్థిక సంవత్సరం మరో రెండు నెలల్లో ముగుస్తుండడంతో ఆయా గ్రామాల్లో అడిగిన ప్రతి కూలీకి పని చూపించే విధంగా.. పనులను గుర్తించడంతోపాటు వివిధ కారణాలతో మిగిలిపోయిన పనులను వేగవంతం చేసేందుకు పూనుకున్నారు. ఖరీఫ్ సీజన్, వర్షాల కారణంతో జిల్లాలో ఉపాధిహామీ పనులు మూడు నెలల్లో కొంత మందగించాయి. చేయాల్సిన పనులు ఉన్నప్పటికీ కూలీలు కొన్ని ప్రాంతాల్లో ఆసక్తి చూపకపోవడం.. ఇతర పనుల ద్వారా ఉపాధి పొందడం వంటి కారణాలతో ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలకు చేరుకోలేదు. దీంతో 2018–19లో జిల్లాలో కూలీలకు 58.12 లక్షల పని దినాలు కల్పించే దిశగా ప్రభుత్వం ప్రణాళికలు వేసింది. అందుకు అనుగుణంగా అధికారులు జిల్లాలో పనులను గుర్తించారు. జిల్లాలో 2018–19లో 52.71 లక్షల పని దినాలను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సీఆర్డీఏ కూలీల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని అన్ని జిల్లాల్లో పని దినాల సంఖ్యను పెంచాలని ప్రణాళికలు వేసింది. దీంతో జిల్లాలో 73.33 లక్షల పని దినాలను పూర్తి చేయా లని ఆదేశించింది. అయితే జనవరి 2019 వరకు 58.12 లక్షల పని దినాల లక్ష్యాన్ని అధికారులు నిర్ణయించారు. దీనిని చేరుకునేందుకు అధికారు లు పనులపై ప్రచారం కల్పించారు. జాబ్కార్డు ఉండి.. ఉపాధి పనికి అర్హుడైన ప్రతి కూలీ పథకాన్ని వినియోగించుకుని ఉపాధి పనికి వచ్చేలా చర్యలు చేపట్టారు. దీంతో జిల్లాలో ఇప్పటివరకు 86.74 శాతం పనులు కూలీలకు కల్పించినట్లైంది. 2018–19 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి సీఆర్డీఏ నిర్ణయించిన లక్ష్యాన్ని అందుకునేలా అధికారులు పనులను వేగవంతం చేశారు. ప్రస్తుతం జిల్లాలో వ్యవసాయ పనులు సాగుతుండడంతో ఉపాధిహామీ పథకం ద్వారా చేసే వ్యవ సాయ పనులు ఏమైనా ఉంటే వాటిని చేయించేం దుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. కూలీలు ఉపాధి పనులు కోరితే వెంటనే వారికి పనులు చూపించాలని క్షేత్రస్థాయి సిబ్బందికి జిల్లా అధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నారు. రూ.93.58కోట్లు ఖర్చు.. 2018–19లో జిల్లాలో చేపట్టిన ఉపాధిహామీ పనులకు ప్రభుత్వం రూ.93.58కోట్లు ఖర్చు చేసింది. 2,16,713 మంది కూలీలు 50,41,044 పని దినాలను ఉపయోగించుకున్నారు. వీరికి వేతనంగా రూ.61.46కోట్లను ప్రభుత్వం చెల్లించింది. మెటీరియల్కు రూ.22.06కోట్లు, అధికారులు, సిబ్బంది జీతాల కు రూ.10.05కోట్లు ఖర్చు చేసింది. కూలి దొరకని ప్రతి పేదవాడికి పని కల్పించి.. పనికి సరిపడా వేతనం దక్కేలా ప్రభుత్వం చేపట్టిన చర్యల్లో భాగంగా జిల్లాలో ఉపాధిహామీ పథకాన్ని అధికారులు నిర్వహిస్తున్నారు. పనికి దరఖాస్తు చేసుకున్న వారం పదిరోజుల్లో పని చూపించేలా గ్రామీ ణ ప్రాంతాల్లో పనులను సైతం సిబ్బంది గుర్తిస్తున్నారు. దీంతో ఉపాధిహామీ పథకం జిల్లాలో లక్ష్యానికి చేరువలో నిలిచింది. ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 4,351 మంది కూలీలు ఉపాధిహామీ పథకం కింద వంద రోజుల పని పొందారు. సిద్ధమవుతున్న 2019–20 ప్రణాళిక.. 2019–20లో కూలీలకు ఉపాధిహామీ పథకంలో కల్పించే పనుల ప్రణాళిక రూపొందించేందుకు అధికారులు చర్యలను వేగవంతం చేశారు. ఇప్పటికే ఆయా గ్రామాల్లో పథకం కింద చేపట్టాల్సిన పనులను గుర్తించిన సిబ్బంది.. వాటికయ్యే ఖర్చులకు బడ్జెట్ను రూపొందిస్తున్నారు. జిల్లాలో ఉపాధిహామీ పథకం కింద కూలి అడిగిన ప్రతి ఒక్కరికి పనులు చూపించేందుకు వీలుగా పనులను నమోదు చేస్తున్నారు. ఇప్పటికే హరితహారం పథకం కింద కూలీలకు ఉపాధి చూపిస్తున్న సిబ్బంది.. వ్యవసాయ పనులు, కాల్వల మరమ్మత్తు వంటి పనులను పథకం కింద కూలీలకు చూపించేందుకు ప్రణాళికలు చేస్తున్నారు. లక్ష్యాన్ని అధిగమిస్తాం.. జిల్లాలో ఉపాధిహామీ పథకం పనుల లక్ష్యాన్ని అధిగమిస్తాం. కూలి అడిగిన ప్రతి వ్యక్తికి ఉపాధి పథకంలో పని చూపించేలా చర్యలు చేపట్టాం. ఇప్పటివరకు 86.74 శాతం పని దినాలను పూర్తి చేశాం. మిగిలిన లక్ష్యాన్ని కూడా పూర్తి చేసేలా సిబ్బందికి ఆదేశాలిచ్చాం. గ్రామీణ ప్రాంత కూలీలు ప్రభుత్వం కల్పిస్తున్న ఉపాధిహామీ పనులను సద్వినియోగం చేసుకోవాలని క్షేత్రస్థాయి సిబ్బంది ద్వారా ప్రచారం చేస్తున్నాం. 2019–20 సంవత్సరానికి సంబంధించి పనుల ప్రణాళికలు పూర్తవుతున్నాయి. త్వరలో బడ్జెట్పై ప్రణాళిక కూడా సిద్ధమవుతుంది. – ఇందుమతి, డీఆర్డీఓ -
రికార్డుల్లోనే రికవరీ!
ముత్తారం(మంథని): గ్రామీణ ప్రాంతంలోని కూలీల వలసలను అరికట్టడం కోసం ప్రవేశపెట్టిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం నిర్వీర్యం అవుతోంది. ఈ పథకం ద్వారా చేపట్టిన అభివద్ధి పనుల్లో చోటుచేసుకుంటున్న అక్రమాలను నియంత్రించడం కోసం నిర్వహిస్తున్న సామాజిక తనిఖీలో అనేక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. అక్రమాలకు పాల్పడిన సిబ్బందికి విధించిన రికవరీలు అధికారుల రికార్డులకే పరిమితం అవుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పథకం ప్రవేశపెట్టిన నాటి నుంచి జిల్లాలోని 11 మండలాల్లో ఇప్పటి వరకు 10 విడతలు సామాజిక తనిఖీ నిర్వహించారు. వివిధ విడతలుగా నిర్వహించిన సామాజిక తనిఖీల్లో అరకొరగా విధించిన రికవరీలను ఇప్పటి వరకు సంబధిత అధికారులు పూర్తి స్థాయిలో వసూలు చేయలేకపోయారనే విమర్శలు వినపడుతున్నాయి. అయితే ఇప్పటి వరకు సామాజిక తనిఖీల్లో విధించిన రికవరీల నుంచి0 రూ.1,17,57,621లు మాత్రమే రికవరీ చేశారు. సామాజిక తనిఖీల్లో విధించిన రికవరీల్లో ఇంకా మిగిలిన 28.87 శాతానికి గాను రూ.47,71,222లు రికవరీ చేయాల్సి ఉంది. అయితే జిల్లాలోని ముత్తారం మండలంలో అత్యధికంగా 87.97శాతం రికవరీ చేయగా జిల్లా కేంద్రమైన పెద్దపల్లి మండలంలో అత్యల్పంగా 47.26శాతం మాత్రమే సంబంధిత అధికారులు రికవరీ చేసి చేతులు దులుపుకున్నారనే విమర్శలు వెలువడుతున్నాయి. అక్రమాలకు పాల్పడిని సిబ్బంది నుంచి విధించిన రికవరీల డబ్బులను నెలనెలా కొంత డబ్బులు వేతనాల నుంచి రికవరీ చేస్తామని ప్రకటించిన అధికారులు అందుకోసం ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. దీంతో అక్రమాలకు సంబధించిన రికవరీలు అధికారుల రికార్డులకు మాత్రమే పరిమితం అవుతున్నాయి.. తప్ప కార్యరూపం దాల్చడం లేదని ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన డీఆర్డీఏ ప్రేమ్కుమార్ను సాక్షి వివరణ కోరే ప్రయత్నం చేయగా ఆయన స్పందించలేదు. -
ఉపాధి పెంపునకు సవరణ ఉత్తర్వులు
సాక్షి, హైదరాబాద్: మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో వేతనాలను పెంచుతూ గతేడాది జూలైలో ఇచ్చిన ఉత్తర్వుల (జీవోఎంస్ 3)ను ప్రభుత్వం సవరించింది. వేతనాల పెంపు 2014 ఏప్రిల్ 1నుంచే అమల్లోకి రావాల్సి ఉన్నందున పాత ఉత్తర్వును సవరిస్తూ ప్రభుత్వం సోమవారం వేరొక ఉత్తర్వును జారీచేసింది. కూలీల రోజువారీ వేతనాన్ని రూ.169కి పెంచుతూ జారీచేసిన ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తాయని పేర్కొంది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు కొత్తకోటకు సీఎం రేవంత్ రాక..
‘నీట్’కు ఏర్పాట్లు పూర్తి
ఐదుగురి నామినేషన్లు
పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా రాకేష్రెడ్డి
సుందర మున్నేరే లక్ష్యం..
నిరంతర విద్యుత్ సరఫరాకు చర్యలు
నేడు, రేపు డిప్యూటీ సీఎం భట్టి పర్యటన
పకడ్బందీగా విధులు నిర్వర్తించాలి
బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం
ముగ్గురు మంత్రులం ఉన్నాం..
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement