-
‘పచ్చ’ నేతల కక్ష
తెల్లారి లేస్తే ప్రజాస్వామ్య పరిరక్షణ గురించి, ప్రజాస్వామిక విలువల గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు లెక్చర్లు దంచేస్తూంటారు. అమరావతిలో ఆకాశాన్నంటేలా అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేస్తామని, ఆయన బాటలోనే నడుస్తామని ఆర్భాటాలు చేసేస్తారు. తీరా చూస్తే వల్లె వేస్తున్న ఆదర్శాలకు భిన్నంగా చంద్రబాబు ఆచరణ ఉంటోంది. అదే బాటలో ఆయన పార్టీ నాయకులు కూడా నడుస్తున్నారు. వైఎస్సార్ సీపీ సానుభూతిపరులుగా ఉన్నారన్న కారణంతో ఓ కుటుంబంపై ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఐదేళ్లుగా సామాజిక బహిష్కరణ అమలు చేస్తున్నారు. కోనసీమ కేంద్రమైన అమలాపురం పట్టణంలోనే ఈ దుర్మార్గానికి బరితెగించారు. తూర్పుగోదావరి, అమలాపురం టౌన్: విశ్రాంత బ్యాంక్ అధికారి అయిన టి.పల్లేశ్వరరావు, భార్య లలితాకుమారి, పిల్లలతో కలిసి అమలాపురం దుడ్డివారి అగ్రహారంలో నివసిస్తున్నారు. వైఎస్సార్ సీపీ సానుభూతిపరులైన ఆ కుటుంబ సభ్యులపై స్థానిక టీడీపీ నేతలు కొందరు రాజకీయంగా కక్ష కట్టారు. వివక్ష చూపడం మొదలు పెట్టారు. ఆ ప్రాంతంలో ఎక్కువమంది టీడీపీ వారే ఉండడంతో క్రమంగా ఆ కుటుంబంపై సామాజిక బహిష్కరణ మొదలుపెట్టారు. వారితో చుట్టుపక్కల వారు మాట్లాడరు. ఒకవేళ వీరు మాట్లాడేందుకు ప్రయత్నించిన ముఖం తిప్పుకొని వెళ్లిపోతారే తప్ప పట్టించుకోరు. మంచికీ చెడ్డకీ దేనికీ వారిని పిలవరు. 2014 ఎన్నికల ముందు రగిలిన ఈ ‘వెలి’ కాష్టం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. కొందరు టీడీపీ ప్రజాప్రతినిధులు ఒత్తిళ్లు తేవడంతో అధికారులు కూడా ఆ కుటుంబం పట్ల సహాయ నిరాకరణ ధోరణి చూపారు. ఫలితంగా సాంఘిక వెలితో ఆ కుటుంబం ఐదేళ్లుగా అవస్థలు పడుతూనే ఉంది. మధ్యలో జిల్లా అధికార యంత్రాంగానికి, అమలాపురం ఆర్డీవో, మున్సిపల్ కమిషనర్ వంటి అధికారులకు ఫిర్యాదులు చేసుకున్నా ఫలితం లేకపోయింది. మొత్తం పల్లేశ్వరరావు కుటుంబ సభ్యులందరూ సాంఘిక వెలి బాధితులే. పోలీసు రక్షణతో ఓటు హక్కు వినియోగం సాంఘిక వెలితో అవస్థలు పడుతున్న లలితాకుమారి కుటుంబ సభ్యులు ఈ నెల 11న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసుకోవడమెలా అన్నదానిపై కూడా ఆందోళన చెందారు. తమను ప్రశాంత వాతావరణంలో ఓట్లు వేసుకోనివ్వరని.. వైఎస్సార్ సీపీకే ఓట్లు వేస్తామన్న ఉద్దేశంతో తమను అడ్డుకుంటారని భావించారు. దీంతో ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించారు. తమ కుటుంబ సభ్యులు స్వేచ్ఛగా ఓటు వేసుకునే అవకాశం కల్పించాలని అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గ ఎన్నికల సాధారణ పరిశీలకుడు, సీనియర్ ఐఏఎస్ అధికారి ఎక్కాకు లలితకుమారి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీనికి స్పందించిన ఎక్కా ఆ కుటుంబ సభ్యులతో చర్చించారు. వారి భయాన్ని చూసి, వారి అభియోగాన్ని విన్న ఎక్కా.. ఆ కుటుంబ సభ్యులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆ కుటుంబ సభ్యులను పోలింగ్ బూత్కు పోలీసు బందోబస్తు నడుమ తీసుకువెళ్లి, ఓట్లు వేసిన తరువాత తిరిగి బందోబస్తుతో ఇంటి వద్ద విడిచిపెట్టాలని పట్టణ సీఐ రజనీకుమార్ను ఆదేశించారు. ఈ మేరకు ఆ కుటుంబ సభ్యులను ఎన్నికల రోజున పోలీసు బందోబస్తు నడుమ తీసుకు వెళ్లి ఓటు వేసే అవకాశం కల్పించారు. విముక్తి ఎప్పుడో..! ఈ ఘటనతోనై ఇకపై ఆ కుటుంబానికి సాంఘిక వెలి నుంచి విముక్తి లభిస్తుందా? అనే ప్రశ్నకు ఇంకా పూర్తిస్థాయి సమాధానం దొరకడం లేదని ఫిర్యాదీ, బాధితురాలు లలితాకుమారి అన్నారు. గతంలో ఓ పని మీద మున్సిపల్ కార్యాలయానికి వెళ్తే అక్కడి అధికారులు, సిబ్బంది సహాయ నిరాకరణ చేశారని, ఏవిధంగానూ స్పందించ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందామని చెప్పుకొంటున్న ఈ రోజుల్లో కూడా సాంఘిక వెలి అంటూ ఓ కుటుంబం సమాజంలో స్వేచ్ఛగా బతికే హక్కును కొందరు టీడీపీ నేతలు హరించడం బాధాకరమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. -
ఇండిపెండెంట్ అభ్యర్థిగా లలితకుమారి
బంగారుపాళ్యం/యాదమరి: పూతలపట్టు మాజీ ఎమ్మెల్యే లలితకుమారికి టీడీపీ అధిష్టానం టికెట్ కేటాయించకపోవడంతో ఆమె ఇండిపెండెంట్గా బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నారు. మంత్రి అమరనాథరెడ్డి మంగళవారం అర్ధరాత్రి వరకు మంతనాలు జరిపినా ఆమె, ఆమె వర్గీయులు ససేమిరా అన్నారు. ఈ క్రమంలో ఆ పార్టీ టికెట్ దక్కించుకున్న పూర్ణం ఆందోళనతో అనారోగ్యానికి గురై ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మూడు నెలల క్రితం సీటు నీకేనంటూ పార్టీ అధిష్టానం చెప్పడంతో లలితకుమారి వర్గం ఆశలు పెంచుకుంది. తీరా అధిష్టానం తవణంపల్లె మండలానికి చెందిన పూర్ణంకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. దీంతో ఆమె కన్నీరుమున్నీరయ్యారు. మంత్రి మంతనాలు జరిపినా శాంతించలేదు. పార్టీ తనను నమ్మించి మోసం చేసిందని, ఈ నెల 22న ఇండిపెండెంట్గా నామినేషన్ వేస్తానని లలితకుమారి బుధవారం స్పష్టం చేశారు. పార్టీ కోసం ఎంత కష్టపడినా లాభం లేకపోయిందని ఆమె వాపోయారు. మంత్రి నచ్చచెప్పినా లలితకుమారి వినకపోవడంతో టీడీపీ అభ్యర్థి పూర్ణం ఆందోళనకు గురై చాతినొప్పితో ఆస్పత్రిలో చేరారు. పరీక్షలు చేసిన వైద్యులు ఆయనకు ఎలాంటి ఇబ్బందీ లేదని రాత్రికి రాత్రే ఇంటికి పంపినట్లు సమాచారం. ఇదిలావుండగా గ్రామాల్లో పర్యటించినా ఎవరూ సహకరిం చకపోవడంతో పోటీ నుంచి తప్పుకోవాలని భావించి బుధవారం బీ ఫారం తీసుకోవడానికి కూడా వెళ్లలేదని సమాచారం. దీంతో టీడీపీ అధిష్టానం అభ్యర్థి విషయం మళ్లీ అయోమయంలో పడింది. -
చంద్రబాబుకు షాకిచ్చిన ఎమ్మెల్యే అభ్యర్థి..!
-
పత్తా లేకుండా పోయిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి..!
సాక్షి, చిత్తూరు : టికెట్ల కేటాయింపుల పర్వం ముగిసి నామినేషన్ల ప్రక్రియ మొదలైనా కొందరు టీడీపీ అభ్యర్థులు మాత్రం పోటీకి ససేమిరా అంటున్నారు. పూతల పట్టు నియోజనవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి తెర్లాం పూర్ణం ఆ పార్టీకి షాక్ ఇచ్చారు. టికెట్ కేటాయించి 36 గంటలైనా గడవకముందే పోటీ చేయలేనని ఆయన చేతులెత్తేశారు. తనకు టికెట్ వద్దంటూ పూర్ణం అందుబాటులో లేకుండా పోయారు. రెండు రోజుల క్రితమే ఐవీఆర్ఎస్ సర్వేల ద్వారా తనను ఎంపిక చేశారని అతను వెల్లడించినట్టు సమాచారం. పూతలపట్టు టీడీపీ ఇన్చార్జ్గా ఉన్న మాజీ ఎమ్మెల్యే లలితకుమారికే టికెట్ అని మొదటి నుంచి చెబుతూ వచ్చారు. అందులో భాగంగానే నియోజకవర్గంలో లలితకుమారి ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. సోమవారం రాత్రి ఆమెకు ఒక్కసారిగా షాక్ తగిలింది. టీడీపీ విడుదల చేసిన తుది జాబితాలో పూతలపట్టు టికెట్ను పూర్ణం అనే కొత్త వ్యక్తికి కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇక ఈ స్థానం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎంఎస్ బాబు బరిలోకి దిగుతున్న సంగతి తెలిసిందే. -
ఇంట్లోకి దూసుకెళ్లిన ట్రాక్టర్..మహిళ మృతి
తాడేపల్లి: గుంటూరు జిల్లా తాడేపల్లి పట్టణంలోని మహానాడు కాలనీలో విషాదం చోటు చేసుకుంది. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారు ఒంటి గంట సమయంలో ఓ ట్రాక్టర్ అదుపుతప్పి ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇంట్లో నిద్రిస్తున్న లలిత కుమారి(32) అనే మహిళ అక్కడికక్కడే మృతిచెందగా..మరో చిన్నారికి గాయాలయ్యాయి. గాయపడిన చిన్నారిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరు రాజస్తాన్ నుంచి 30 సంవత్సరాల క్రితం వచ్చి స్థిరపడినట్లు తెలిసింది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు రాష్ట్రానికి అమిత్ షా, రాజ్నాథ్సింగ్ రాక
జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
Jammu and Kashmir: ఉగ్ర ఘాతుకం
తెల్దేవర్పల్లి @ 46.7
బాలసదనాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
బీజేపీది రైతు వ్యతిరేక ప్రభుత్వం
సోషల్ మీడియా ప్రకటనలపై నిఘా : ఎస్పీ
చెరువు శిఖం కబ్జా
ఎన్నికల విధుల కేటాయింపులో ఇష్టారాజ్యం
రిజర్వేషన్లపై మోదీ స్పష్టత ఇచ్చినా.. రేవంత్ గోబెల్స్ ప్రచారం
తప్పక చదవండి
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- అబద్ధాల వసంతం.. గ్రూపు రాజకీయాలే ఆసాంతం
- మహిళలపై టీడీపీ అభ్యర్థి అనుచిత వ్యాఖ్యలు
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- ఐరాసలో జగన్ విజన్
- బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
Advertisement