-
గాలి వాన బీభత్సం
సాక్షి, కొయ్యలగూడెం : గాలివాన బీభత్సానికి కొయ్యలగూడెం గ్రామ ప్రజలు భీతిల్లారు. సోమవారం సాయంత్రం ఒక్కసారిగా భారీ గాలులు, దానికి తోడు వర్షం రావడంతో బీభత్స వాతావరణం నెలకొంది. చేతికి అంది వచ్చిన మామిడికాయలు నేలరాలి పోవడంతో పరిసర ప్రాంతాలకు చెందిన మామిడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అశోక్ నగర్లోని ఆకుల వెంకటేశ్వరరావుకి చెందిన ఇంటిపై తాటిచెట్టు కూలింది. ఆ సమయంలో ఇంట్లోని వారు పక్క గదిలో ఉండటంతో ప్రమాదం తప్పింది. అరగంట వ్యవధిలో భారీ వాన, గాలులకు చెట్లు విరిగి నేలకొరిగాయి. -
ఇంతకీ వాళ్లెవరు !
వ్యాపారి కిడ్నాప్ కేసులో వీడని మిస్టరీ కొయ్యలగూడెం : కొయ్యలగూడెం మండలం కన్నాపురం గ్రామానికి చెందిన వ్యాపారి బొమ్మా హరినాథ్ (24) కిడ్నాప్ వ్యవహారం మిస్టరీగా మారింది. అతడిని జూలై 29న మావోయిస్టులు కిడ్నాప్ చేశారని.. రూ.10 లక్షలు డిమాండ్ చేశారని.. ఆ మొత్తాన్ని సమర్పించుకోవడంతో వదిలేశారని చెబుతున్నప్పటికీ హరినాథ్ ఆచూకీ మాత్రం శుక్రవారం రాత్రి వరకూ వెల్లడి కాలేదు. ఈ వ్యవహారంపై అతని కుటుంబ సభ్యుల్లోను, పోలీసు వర్గాల్లోను అనుమానాలు వ్యక్తమవుతున్నారుు. ఈ నేపథ్యంలో బొమ్మా హరినాథ్ తల్లి, మాజీ ఎంపీటీసీ జానకిరత్నం శుక్రవారం కొయ్యలగూడెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అందులో పేర్కొన్న వివరాలిలా ఉన్నాయి. అవివాహితుడైన బొమ్మా హరినాథ్ తన తండ్రి గంట్లయ్యతో కలిసి ఫోర్ వీలర్స్ ఫైనాన్స్ కంపెనీ నిర్వహిస్తున్నారు. హరినాథ్ జూలై 29న రాత్రి ఖమ్మం జిల్లా మందలపల్లి, దమ్మపేట గ్రామాల్లో బాకీలు వసూలు చేయడానికి కన్నాపురం నుంచి అద్దె కారులో వెళ్లారు. ఆ రోజు రాత్రి 12 గంటలకు దమ్మపేట చేరుకున్న హరినాథ్ బాకీలు వసూలు కాలేదంటూ కారును వెనక్కి పంపించివేశారు. అదేరోజు తెల్లవారుజామున ఖమ్మం జిల్లా ముగలంపల్లిలోని క్వాయిన్ బాక్స్ నుంచి హరినాథ్ ఇంటికి ఫోన్ వచ్చింది. తాము మావోరుుస్టు దళ సభ్యులమని, హరినాథ్ను కిడ్నాప్ చేశామని అవతలి వ్యక్తులు చెప్పారు. రెండు మూడు గంటల వ్యవధిలో పలుమార్లు ఈ తరహా ఫోన్లు వచ్చాయి. అతడి తల్లిదండ్రులు హరినాథ్ సెల్కు ఫోన్ చేయగా, స్విచ్ఆఫ్ చేసి ఉంది. జూలై 30న 99516 39387 నంబర్ నుంచి తల్లిదండ్రులకు మరో ఫోన్ వచ్చింది. ‘మీ అబ్బాయి మా దగ్గరే ఉన్నాడు. రూ.10 లక్షలు ఇస్తే వదిలేస్తాం. ఈ విషయూన్ని ఎవరికైనా చెబితే చంపేస్తా’మంటూ హెచ్చరించారు. ఆ తరువాత ఆగంతకులు హరినాథ్ సెల్నుంచే గంటకోసారి ఫోన్ చేసి బెదిరింపుల్ని కొనసాగించారు. దీంతో భయపడిన హరినాథ్ తండ్రి గంట్లయ్య, అతని బంధువు గ్రంధి శ్రీను జూలై 31న సాయంత్రం 3 గంటలకు రూ.10 లక్షలను బ్యాగ్లో పెట్టుకుని కొయ్యలగూడెం బయలుదేరారు. ఆ తరువాత అవతలి వ్యక్తులు ఫోన్లో చెప్పిన ప్రకారం కొయ్యలగూడెం నుంచి కరాటం వైజంక్షన్కు చేరుకున్నారు. అక్కడకు వెళ్లిన తర్వాత జంగారెడ్డిగూడెం గంగానమ్మ గుడి వద్దకు రమ్మని చెప్పడంతో అక్కడకు చేరుకున్నారు. అనంతరం పద్మా థియేటర్ రావాలని.. అక్కడకు వెళ్లగా పారిజాతగిరి సమీపంలోని ప్రధాన రహదారిపైకి రావాలని ఆగంతకులు కోరారు. వారు పారిజాతగిరి ప్రాంతానికి చేరుకోగా, క్యాష్ బ్యాగ్ను మీ బైక్పై పెట్టి వెళ్లిపోండని సూచించారు. హరినాథ్ను చూపిస్తే గానీ సొమ్ములు ఇచ్చేది లేదని తండ్రి గంట్లయ్య అవతలి వ్యక్తులతో ఫోన్లో చెప్పగా.. ‘మీరు మమ్మల్ని నమ్మాల్సిందే.. మోసం చేసే స్థితిలో మేం లేం’ అని అవతలి వ్యక్తులు అనడంతో చేసేదేమీ లేక జనసంచారం లేని ప్రాంతంలో బైక్ను పార్క్చేసి, దానిపై క్యాష్బ్యాగ్ ఉంచిన హరినాథ్ తండ్రి, బంధువు సుమారు 200 గజాల దూరం వెళ్లి నిలబడ్డారు. కొద్దిసేపటికి ముసుగులు ధరించిన ఇద్దరు వ్యక్తులు వేగంగా ఎర్ర రంగు మోటార్ సైకిల్పై వచ్చి క్యాష్ బ్యాగ్ తీసుకుని అశ్వారావుపేట రోడ్డు వైపు వెళ్లిపోయారు. ఐదు నిమిషాల తర్వాత ఫోన్ చేసిన ఆగంతకులు ‘డబ్బు మాకు చేరింది. మీ కొడుకుని వదిలేస్తున్నాం. మీ కుమారుడికి మాకు ఎటువంటి సంబంధం లేదు. కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేయమనడంతో సుపారి తీసుకుని మీవాణ్ణి కిడ్నాప్ చేశా’మని చెప్పారు. అయితే, హరినాథ్ ఆచూకీ శుక్రవారం రాత్రి వరకూ తెలియలేదు. అతని కోసం తమవాళ్లు అశ్వారావుపేట, మందలపల్లి ప్రాంతాల్లో వెతుకుతున్నట్టు అతని తల్లి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. జంగారెడ్డిగూడెం సీఐ అంబికా ప్రసాద్ పర్యవేక్షణలో ఎస్సై గంగాధర్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. మావోల పనేనా.. హరినాథ్ కిడ్నాప్ వ్యవహారంపై విభిన్న కథనాలు వినిపిస్తున్నాయి. తొలుత ఆగంతకులు హరినాథ్ తల్లిదండ్రులకు చెప్పినట్టు ఇది నిజంగా మావోయిస్టుల పనేనా.. లేక అదే వ్యక్తులు చివరగా చెప్పినట్టు ఇతర వ్యక్తులెవరైనా కావాలని అతణ్ణి కిడ్నాప్ చేయించారా అనేది అంతుచిక్కడం లేదు. ఇది కచ్చితంగా మావోయిస్టుల పనేనని.. హరినాథ్, అతని తండ్రి గంట్లయ్య భారీగా సొమ్ము ఆర్జించిన విషయం మావోయిస్టుల దృష్టికి వెళ్లిందని చెబుతున్నారు. మావోయిస్టులు గతంలో కొన్నిసార్లు పార్టీ ఫండ్ ఇవ్వాల్సిందిగా హరినాథ్ను అడిగారని, అతడు పట్టించుకోకపోవడంతో కిడ్నాప్ చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. మరికొందరు మాత్రం మావోయిస్టుల ప్రమేయూన్ని కొట్టిపారేస్తున్నారు. అవివాహితుడైన హరినాథ్ విలాసంతమైన జీవితానికి అలవాటుపడినట్టు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఖర్చుల విషయమై హరినాథ్ను తల్లిదండ్రులు కట్టడి చేయడంతో డబ్బు కోసం అతడే ఈ డ్రామా ఆడించి ఉంటాడనే అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నారుు. పోలీసులు వివిధ కోణాల్లో కేసును దర్యాప్తు చేస్తున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
సందడిగా వస్త్ర దుకాణం ప్రారంభోత్సవం (ఫొటోలు)
మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
తప్పక చదవండి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement