breaking news
Kistayya
-
పెళ్లి రోజే చివరి రోజు
- ఎస్ఐ పైకి దూసుకెళ్లిన కారు.. అక్కడికక్కడే మృతి... - వాకింగ్ చేస్తుండగా ప్రమాదం.. లంగర్హౌస్లో ఘటన హైదరాబాద్: మార్నింగ్ వాకింగ్కు వెళ్లిన ఎస్ఐ పైకి కారు దూసుకెళ్లడంతో ఆయన అక్కడికక్కడే మృతిచెందారు. పెళ్లి రోజే ఆయన ప్రాణాలు వదలడంతో లంగర్హౌస్లో సోమవారం పెను విషాదం చోటుచేసుకుంది. మహబూబ్నగర్ జిల్లా యెడవల్లి గ్రామానికి చెందిన ఎం.కిష్టయ్య నలభై ఏళ్ల కిందట నగరానికి వచ్చి బాపూ ఘాట్లో నివసిస్తున్నారు. ప్రస్తుతం సెంట్రల్ జోన్ పరిధిలోని స్పెషల్ బ్రాంచ్ విభాగంలో ఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్నారు. రోజూ మాదిరిగానే సోమవారం ఉదయం 5 గంటల ప్రాంతంలో లంగర్హౌస్ టిప్పుఖానా బ్రిడ్జిపై వాకింగ్ చేస్తుండగా... వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు కిష్టయ్యను ఢీకొట్టింది. దీంతో కిష్టయ్య అక్క డిక క్కడే ప్రాణాలు వది లారు. కారు డ్రైవర్ పరారయ్యాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కిష్టయ్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. యజమా నిని అదుపులోకి తీసుకుని విచారించగా, ఆ సమయంలో తన డ్రైవర్ కారు నడిపినట్టు తెలిపారు. దీంతో డ్రైవర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. పెళ్లి రోజు భర్త మరణ వార్త విన్న కిష్టయ్య భార్య లక్ష్మి, కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. -
చెరకుపైరు, మామిడితోటఅగ్నికి ఆహుతి
ప్రమాదవశాత్తు సంభవించిన అగ్నిప్రమాదంలో మామిడి తోట, చెరుకు పైరు దగ్ధమయ్యాయి. ఈ ఘటన మెదక్ మండలంలో చోటుచేసుకుంది. సర్ధన గ్రామానికి చెందిన నారా గౌడ్కు గ్రామ శివారులో 5 ఎకరాల మామిడి తోట ఉంది. పక్కనేగల కొండు కిష్టయ్య 9 ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకుని చెరకు సాగు చేశాడు. బుధవారం మధ్యాహ్నం ప్రమాదవశాత్తు మామిడి తోటలో మంటలు అంటుకుని చెట్లు పూర్తిగా కాలిపోయాయి. ఈ క్రమంలో మంటలు పక్కనే గల చెరుకుతోటలోకి వ్యాపించాయి. దీంతో చెరుకుతోట సైతం పూర్తిగా అగ్నికి ఆహుతైంది. ప్రమాదంలో మామిడి చెట్లు కాలి రూ.10 లక్షల మేర, చెరుకుతోటకు రూ.8 లక్షల నష్టం వాటిల్లిందని బాధితరైతులు తెలిపారు. -
రైతన్నల ఉసురు తీస్తున్న అప్పులు
కష్టాలను తీరుస్తాడన్న వరుణుడు నిలువునా ముంచేశాడు. దీనికితోడు భూగర్భజలాలు ఎండిపోవడంతో సాగు చేసిన పంటలు కళ్లె ఎదుటే ఎండిపోవడంతో ఆ ఇద్దరు రైతులూ తీవ్ర మనోవేదనకు గురయ్యారు. చేసిన అప్పులు ఎలా తీర్చాలో, కుటుంబాన్ని ఎలా పోషించాలో అర్థం కాక ఓ రైతు ఉరేసుకుని ప్రాణాలను వదలగా.. మరో రైతు గుండె పోటుకు గురై పొలంలోనే మృతి చెందాడు. దీంతో బాధిత కుటుంబాల్లో విషాదచాయలు అలుముకున్నాయి. గజ్వేల్ మండలం దాచారం గ్రామానికి చెందిన వల్లపు కిష్టయ్య (35)కు సొంత భూమి పది గుంటలు మాత్రమే ఉండడంతో ఏటా కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈసారి ఖరీఫ్లో ఆరు ఎకరాలకుపైగా భూమిని ఎకరాకు రూ.10 వేల చొప్పున చెల్లించి కౌలుకు తీసుకున్నాడు. ఇందులో పత్తి సాగు చేశాడు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా పంట దెబ్బతింది. రెండ్రోజుల క్రితం సుమారు పది క్వింటాళ్ల పత్తి ఏరి అమ్మాడు కూడా. ఈ విధంగా వచ్చిన డబ్బులు కౌలు కూడా చెల్లించడానికి సరిపోకపోవడం, రెండోసారి తీయడానికి పత్తి లేకపోవడంతో కలత చెందాడు. తన శ్రమంతా వృథా అయ్యిందని మనోవేదన చెందాడు. అప్పటికే కుటుంబ అవసరాల కోసం చేసిన సుమారు రూ.3 లక్షలకుపైగా అప్పులున్నాయి. అప్పులకు పత్తి నష్టం తోడై పుట్టి మునిగే స్థితి వచ్చిందని భావించిన కిష్టయ్య ఆత్యహత్య చేసుకోవాలనే నిర్ణయించాడు. ఈ క్రమంలోనే బుధవారం భార్య, పిల్లలు గాఢ నిద్రలో ఉన్న సమయంలో అర్ధర్రాతి నిద్రలేచి కుటుంబీకులకు పడుకున్న గది పక్కనున్న మరో గదిలో ఉరేసుకున్నాడు. ఈ విషయాన్ని గురువారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో గమనించిన భార్య యాదమ్మ, పిల్లలు సందీప్ (12), సతీష్ (10)లు రోదించారు. సమాచారం అందుకున్న ఏఎస్ఐ రమేష్ గ్రామానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గుండెపోటుతో.. శివ్వంపేట : మండలంలోని నవాబుపేట గ్రామానికి చెందిన చెంది రాములు (55) తనకున్న రెండెకరాల్లో వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇందులో వరి, కూరగాయలు సాగు చేశాడు. నెల రోజుల క్రితం మూడు బోరుబావులు తవ్వించగా చుక్క నీరు పడలేదు. ఈ క్రమంలో ముగ్గురు కూతుళ్ల వివాహాలు చేశాడు. బోర్లు వేసేందుకు, పంటపెట్టుబడులు, కుమార్తెల వివాహాల కోసం సుమారు రూ. 2 లక్షలకు పైగా అప్పు చేశాడు. వ్యవసాయాన్ని నమ్ముకుని అప్పు తీర్చవచ్చని భావించిన రైతు ఆశలు అడి ఆశలయ్యాయి. సాగుచేసేందుకు నీటి వసతి లేకపోవడం, కాలం కలిసి రాకపోవడం చేసిన అప్పుడు తీర్చే పరిస్థితి కనిపించ లేదు. మూడు రోజులుగా ఇదే విషయమై కుటుంబ సభ్యులు, గ్రామస్తులతో చెప్పుకుని మనోవేదనకు గురయ్యాడు. బుధవారం పొలం వద్దకు వెళ్లాడు. అక్కడే గుండె పోటుకు గురయ్యాడు. కాగా రాత్రి అయినా రాములు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెంది పొలం వద్దకు వెళ్లి చూడగా అక్కడ విగతజీవుడై కనిపించాడు. మృతుడి భార్య పోచమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సాపూర్ ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు ఏఎస్ఐ ఇసుబ్ తెలిపారు. రైతు సమస్యలు పట్టని ప్రభుత్వం : డీసీసీ అధ్యక్షురాలు సునీతారెడ్డి నర్సాపూర్ రూరల్ : అప్పులబాధతో మనోవేదనకు గురై గుండె ఆగి మృతి చెందిన శివ్వంపేట మండలం నవాబుపేట గ్రామానికి చెందిన రైతు రాములు మృతదేహాన్ని డీసీసీ అధ్యక్షురాలు సునీతారెడ్డి గురువారం స్థానిక ఆస్పత్రిలో సందర్శించి బాధిత కుటుంబాన్ని ఓదార్చారు. ఈ సందర్భంగాఆమె స్థానిక విలేకరులతో మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపించారు. రుణమాఫీ పథకం ద్వారా రైతులకు ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. కొత్తరుణాలు ఇవ్వకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. దీనికి తోడు ఖరీఫ్ సీజన్ సరైన వర్షాలు పడకపోవడం, తీవ్ర కరెంట్ కోతల కారణంగా వేసిన పంటలు ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. దీంతో అప్పులపాలై, వాటిని తీర్చలేక కొందరు ఆత్మహత్మలకు పాల్పడుతుంటే మరి కొందరు గుండెపోటుకు గురై మృతి చెందుతున్నారని తెలిపారు.రైతులతో పాటు ఇతర అర్హులైన పింఛన్దారుల సమస్యల కోసం తాము ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.