తొలగించిన ఐటీ ఉద్యోగులకు ఉపాధి
ఫోరమ్ ఆఫ్ ఐటీ ప్రొఫెషనల్స్ ఫౌండేషన్ సభ్యుల డిమాండ్
హైదరాబాద్: అక్రమంగా తొలగించిన ఐటీ ఉద్యోగులందరికీ ఉపాధి కల్పించాలని ఫోరమ్ ఆఫ్ ఐటీ ప్రొఫెషనల్స్ వ్యవస్థాపక సభ్యుడు కిరణ్ చంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం నగరంలోని కార్మికశాఖ కార్యాలయం ఎదుట ఫోరమ్ ఆఫ్ ఐటీ ప్రొఫెషనల్స్ ఫౌండేషన్ సభ్యులతో పాటు మాజీ ఐటీ ఉద్యోగులు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా కిరణ్ చంద్ర మాట్లాడుతూ విప్రో, టెక్మహేంద్ర యాజమాన్యాలు ఉద్యోగులను అక్రమంగా తొలగించడం వల్ల వందలాది ఉద్యోగులు రోడ్డున పడ్డారన్నారు.
మూడు నెలల్లో 20 వేల మందిని తొలగించారని తెలిపారు. ఐటీ సంస్థల యాజమాన్యాలు కార్మిక చట్టాలను ఉల్లఘిం చకుండా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకు ని ఐటీ ఉద్యోగులను ఆదుకోవాల న్నారు. ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా జోన్ జేసీఎ ల్ చంద్రశేఖరంకు ఫోరమ్ ఆఫ్ ఐటీ ప్రొఫెష నల్స్ ఫౌండేషన్ సభ్యులు వినతిపత్రం సమర్పించారు. ఈ సమస్యల ను పరిష్క రించేందుకు కృషి చేస్తానని చంద్రశేఖరం చెప్పారని ఆయన తెలిపారు. ఈ ఆందోళన కార్యక్రమంలో ఐటీ ఫోరం సభ్యులు లోకేశ్, సత్య, ఐటీ బాధితులు పాల్గొన్నారు.