kind
-
Moral Story: ఆ పక్షులు నవ్వాయి.. పెద్దల మాట వినాలి!
అనగా అనగా ఒక అడవిలో పక్కపక్కనే రెండు రావిచెట్లు ఉండేవి. వాటి మీద పక్షులు గూళ్లు కట్టుకొని నివసిస్తున్నాయి. వాటిల్లో ఒక గుడ్లగూబ కూడా ఉండేది. అక్కడున్న పక్షుల్లో అదే పెద్ద వయసున్న పక్షి కావడంతో అప్పుడప్పుడూ మిగిలినవాటికి సలహాలు, సూచనలు ఇచ్చేది. ఆ మాటల్ని కొన్ని పక్షులు వినేవి. మరికొన్ని మాత్రం లక్ష్యపెట్టేవికావు. రెండు రావిచెట్లు గుబురుగా పెరగడంతో ఒకదాని కొమ్మలు మరొక చెట్టుతో రాసుకుంటూ ఉండేవి. భారీ గాలివానలొచ్చినప్పుడు చెట్లు కూలిపోతాయేమో అన్నంతగా కదిలి΄ోయేవి. ఆ పరిస్థితి చూసిన గుడ్లగూబ ‘ఈ చెట్లు చాలా ఏళ్ల నాటివి. ఎప్పుడైనా ఇవి కూలి΄ోయే ప్రమాదం ఉంది. మనందరం కొత్త చెట్టు చూసుకోవాలి’ అని చెప్పేది. కొన్ని పక్షులు బద్దకంతో ‘తర్వాత చూసుకుందాం’ అన్నాయి. మరికొన్ని పక్షులు ‘నీదంతా చాదస్తం. మరో వందేళ్లయినా ఈ చెట్టుకు ఏమీ కాదు’ అని చెప్పాయి. వానాకాలం మొదలైంది. కొద్దిగా జల్లులు కురుస్తున్న సమయంలో గుడ్లగూబ మరోసారి రెండు చెట్ల మీదున్న పక్షుల వద్దకు వెళ్లి–‘వానలు మొదలయ్యాయి. ఈ రెండు చెట్లు ఇప్పటికే బలహీనంగా తయారయ్యాయి. వాటి వేర్లు భూమిలోనుంచి బయటకు వచ్చేశాయి. వెంటనే మనమంతా మరో చెట్టు చూసుకుందాం’ అని చెప్పింది. కానీ ఎవరూ ఆ మాట లక్ష్యపెట్టలేదు. దీంతో చేసేదిలేక గుడ్లగూబ దగ్గర్లో ఉన్న మరో చెట్టు మీద కొత్తగా గూడు కట్టుకుని అక్కడికి వెళ్లిపోయింది. గుడ్లగూబ కొత్తగూడును చూసి కొన్ని పక్షులు నవ్వుకున్నాయి.మరో నెల రోజుల తర్వాత వానలు ఉధృతంగా కురిశాయి. పక్షులు గూళ్లు వదిలి బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. హోరుగాలికి రావిచెట్లు బలంగా ఊగి, వేర్లతో సహా కూలిపోయాయి. దీంతో చెట్టు మీదున్న పక్షుల గూళ్లన్నీ నీటిలో కొట్టుకుపోయాయి. ఆ కొమ్మల కిందపడి ఎన్నో పక్షులు మరణించాయి. మిగిలిన పక్షులు గూడ్లగూబ ఉన్న చెట్టు మీదకు చేరాయి. ఆ వర్షంలో గూడు కట్టుకునే వీలు లేక వానకు తడుస్తూ ఇబ్బంది పడ్డాయి. ముందే గుడ్లగూబ మాటలు విని ఉంటే తమకు ఈ అవస్థ వచ్చి ఉండేది కాదని, తమ మిత్రులు బతికేవారని అనుకొని బాధపడ్డాయి. -
ట్విట్టర్, ఫేస్ బుక్ లో వదంతులకు మరణశిక్షే..!
ఫేస్బుక్, ట్విట్టర్ లాంటి సోషల్ మీడియాలో వదంతులు సృష్టిస్తే ఏమవుతుందో తెలుసా.. ఇక్కడైతే ఏమో గానీ సౌదీ అరేబియాలో అయితే మాత్రం మరణశిక్ష విధిస్తారట. ఈ విషయాన్ని అక్కడి ప్రభుత్వ వెబ్సైట్లో అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే ప్రభుత్వ వ్యతిరేక ప్రకటనలపై ఎన్నో ఆంక్షలు విధిస్తున్న సౌదీ సర్కారు తాజా ప్రకటన సామాన్య ప్రజల్లో ఆందోళన రేపుతోంది. ఈ ప్రకటన వెనుక.. మొత్తం సోషల్ మీడియానే ఆ దేశంలో నిషేధించాలన్న ప్రయత్నం కనిపిస్తోందని పలువురు అంటున్నారు. కొత్తరాజు సల్మాన్ పాలనలో ఈ మరణ శిక్షల జోరు పెరిగిపోతోంది. సౌదీ రాజు కొత్త నిర్ణయంపై ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కుల సంస్థలు తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నాయి. ఇటీవల హజ్ యాత్రకు వెళ్లి తొక్కిసలాటలో వెయ్యిమంది వరకూ చనిపోవడం... దీనికి కారణం ప్రభుత్వ నిర్వహణ లోపమేనని సోషల్ మీడియాలో రావడంతో... ఆగ్రహానికి గురైన ప్రభత్వం ఈ కొత్త చట్టాన్ని అమల్లోకి తెచ్చిందని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటివరకు చిన్నపాటి తప్పులు చేసినవారికి.. ఖైదు, ప్రయాణ నిషేధం, గృహ నిర్బంధం వంటి శిక్షలు అమలులో ఉన్నాయని, ఇప్పుడు ఓ సామాజిక మాధ్యమంలో వదంతులు సృష్టించేవారికి మరణ శిక్ష విధించేందుకు నిర్ణయం తీసుకోవడం ఇదే మొదటిసారి అని మినిస్ట్రీ ఆఫ్ జస్టిస్ చెప్తోంది. అయితే ఏ రకం వార్తలకు శిక్ష పడుతుందో స్పష్టంగా ధ్రువీకరించలేదని ఓ సీనియర్ న్యాయమూర్తి అంటున్నారు. ఇప్పుడు అందరిలో ఆందోళన కలిగిస్తున్న కొత్త చట్టాన్ని కొన్ని వారాల క్రితం వచ్చిన సౌదీ రాజు ప్రకటించారు. 79 ఏళ్లు కొత్త రాజు సల్మాన్, అతడి కుమారుడు 30 ఏళ్ల మహమ్మద్ బిన్ సల్మాన్ ప్రవేశ పెట్టిన ఈ ప్రకటనకు జనం నుంచి తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. మాస్ మీడియాను సెన్సార్ చేయడం కోసం ఇటువంటి నిర్ణయాన్ని తీసుకున్నారంటూ విమర్శిస్తున్నారు. -
మాయమవుతున్నాడు మనిషన్నవాడు!
-
మాయమవుతున్నాడు మనిషన్నవాడు..!