breaking news
Keti Reddy Jagadisvar Reddy
-
ఏపీలో ఇంధన కొరత..NHRCకి కేతిరెడ్డి ఫిర్యాదు
తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని పలు రాష్ట్రాల్లో ఇంధన కొరతపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తమిళనాడు తెలుగు యువశక్తి వ్యవస్థాపక అధ్యక్షులు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC)కు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదును పరిగణలోకి తీసుకున్న ఎన్హెచ్ఆర్సీ కేంద్ర పెట్రోలియం శాఖ, సుప్రీంకోర్టు లీగల్ సెల్, రాష్ట్ర ప్రభుత్వాలకు వినతిపత్రాలు పంపింది.కేతిరెడ్డి ఎన్హెచ్ఆర్సీ ఫిర్యాదులో దేశంలో ఇంధన కొరత సామాన్యుల్ని తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తోంది. రవాణా అంతరాయం, అత్యవసర సేవలపై ప్రతికూల ప్రభావం ఏర్పడింది. ఈ కొరత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 (జీవన హక్కు), ఆర్టికల్ 14 (సమాన హక్కులు)తో పాటు వినియోగదారుల హక్కులకు భంగం కలిగిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు.తక్షణ చర్యల కోసం నిల్వల పారదర్శకత, ఆకస్మిక తనిఖీలు, అక్రమ నిల్వలపై కఠిన చర్యలు, డిజిటల్ పర్యవేక్షణ, ప్రజా డ్యాష్బోర్డ్, వినియోగదారుల ఫిర్యాదు వ్యవస్థ, రాష్ట్రాలతో సమన్వయం వంటి సూచనలు చేశారు. అలాగే ఐవోసీఎల్,బీపీసీఎల్, హెచ్పీసీఎల్ వంటి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించి, దేశవ్యాప్తంగా అంతరాయం లేకుండా సరఫరా జరిగేలా చూడాలని కోరారు. -
తెలుగు భాష పరిరక్షణ ఉద్యమానికి మద్దతివ్వండి
సీఎం కేసీఆర్కు తమిళనాడు తెలుగు యువశక్తి వినతి సాక్షి, తిరుమల: తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావును బుధవారం తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్రెడ్డి తిరుమలలోని అతిథిగృహంలో కలసి పుష్పగుచ్ఛంతో అభినందనలు తెలిపారు. తెలుగు భాష పరిరక్షణకు తమిళనాడులో తాము చేపట్టిన ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని వినతిపత్రం సమర్పించారు. దీనిపై మాట్లాడేందుకు హైదరాబాద్కు రావాలని కేసీఆర్ తెలిపినట్లు కేతిరెడ్డి మీడియాకు వెల్లడించారు. తమిళనాడులో తెలుగు పరిరక్షణకు ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రుల సహకారం అవసరమన్న విషయాన్ని గుర్తు చేశామన్నారు. తెలంగాణ ఉద్యమం, తమిళనాడులో జల్లికట్టు ఉద్యమం కంటే తెలుగు భాష పరిరక్షణ ఉద్యమం అతి ముఖ్యమైందన్నారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని కేసీఆర్ కుమార్తె ఎంపీ కవిత డిమాండ్ చేయడం వారిలో ఉన్న ఉద్యమ స్ఫూర్తికి నిదర్శనమన్నారు.


