breaking news
Kaundinyapur forest
-
ఎట్టెట్టా?
పలమనేరు: చిత్తూరు జిల్లాలో కుంకీ ఏనుగుల కథ అటకెక్కింది. కుంకీల సంరక్షణ ప్రభుత్వానికి పెను భారంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పుడు టెక్నాలజీ ద్వారా ఏనుగుల మెడకు జీపీఆర్ఎస్ ట్రాకర్స్ను అమర్చనున్నట్టు తెలిపింది. ఇది ఎంతమేరకు సాధ్యమవుతుందో త్వరలో తేలనుంది. ముందస్తు వర్ష సూచనలాగే.. వాతావరణ శాఖ నుంచి మొబైళ్లకు అలెర్ట్ మెసేజీలు వస్తుంటాయి. ఇదే విధంగా ఏనుగుల కదలికల ద్వారా అవి ఏమార్గంలో సంచరిస్తున్నాయే ట్రాక్ ద్వారా పసిగట్టి ఏ గ్రామం వైపు వెళుతున్నాయో ఆ గ్రామస్తుల ఫోన్లకు సందేశాలు పంపేలా అటవీశాఖ ప్లాన్ చేస్తోంది. కాలర్లకు కట్టడం కష్టమే ఇంతకీ అటవీశాఖ భావిస్తున్నట్టు ఏనుగుల మెడకు జీపీఆర్ఆర్ కాలర్లని అమర్చడం అంత సులభం కాదనే మాట వినిపిస్తోంది. గుంపులోని ఏనుగులను నిలువరించడం ఇక్కడున్న కుంకీల నుంచే సాధ్యం కాదని తేలిపోయింది. మరోవైపు మదపుటేనుగులు జోలికెళ్లే కుంకీలను సైతం ఇవి ఎదిరించి దాడులు చేస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఏనుగుల మెడకు జీపీఆర్ టాగ్ను ఎలా వేస్తారనేది వెయ్యి డాలర్ల ప్రశ్నగా మారింది.ఏనుగు మెడకు జీపీఆర్ఎస్ ట్యాగ్!ప్రస్తుతం పలమనేరు ప్రాంతంలో 14, తమిళనాడు సరిహద్దు అడవుల్లో ఆరు, సోమల ప్రాంతంలో మూడు, గుడిపాల వద్ద రెండు ఏనుగులతోపాటు నాలుగు ఒంటరి ఏనుగులు సంచరిస్తున్నాయి. గుంపులోని ఏనుగుల కంటే ఒంటరిగా సంచరిస్తున్న మదపుటేనుల కారణంగానే ఎక్కువగా ప్రజలపై దాడులు, పంటలకు నష్టం జరుగుతోంది. వీటిని అదుపులోకి తీసుకురావడం కుంకీ ఏనుగులతో కాదని ఇప్పటికే ఫారెస్ట్ అధికారులకు తెలిసిపోయింది.దీంతో సాంకేతికంగా కొత్త మార్గంపై ఉన్నతాధికారులు దృష్టి సారించారు. ఏనుగుల గుంపులో ఓ ఏనుగు మెడకు రెండేళ్ల బ్యాటరీతో పనిచేసే జీపీఆర్ఎస్ ట్రాకర్ను తగిలించి.. దాని సంచారం ద్వారా ఏనుగుల గుంపు ప్రాంతాన్ని లొకేషన్ ద్వారా చూస్తూ ఆ ప్రాంతానికి సమీపంలోని రైతులు, ప్రజల మొబైళ్లకు సందేశాలను పంపేలా ప్లాన్ చేస్తున్నట్టు ఇక్కడి ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు. -
అటవీ గ్రామాల్లో తుపాకుల మోత
పోలీసులు జల్లెడ పట్టినా కనిపించని ఫలితం యథేచ్ఛగా వన్యప్రాణుల వేట కొంతమంది చేతివాటమే కారణమంటున్న గ్రామీణులు పలమనేరు, న్యూస్లైన్: పలమనేరు ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని అటవీ ప్రాంత గ్రామాల్లో నాటు తుపాకుల మోత తగ్గడం లేదు. ఎన్నికల నేపథ్యంలో రెండు నెల లుగా పోలీసులు పెద్ద సంఖ్యలో తుపాకులను స్వా ధీనం చేసుకున్నారు. ఇంకా కొన్నిచోట్ల కాల్పులు జరుగుతుండడం అధికారులను కలవరానికి గురిచేస్తోంది. వేటగాళ్లు కౌండిన్య అడవిలో యథేచ్ఛగా వన్యప్రాణుల వేట సాగిస్తున్నట్లు తెలుస్తోంది. పలమనేరు నియోజకవర్గానికి దక్షిణం వైపున కౌండిన్య అడవి విస్తరించి ఉంది. ఈ అడవిలో జింకలు, దుప్పులు, నెమళ్లు, అడవి పందులు, కుందేళ్లు వేల సంఖ్యలో ఉన్నాయి. అందుకే వేటగాళ్ల కన్ను ఈ ప్రాంతంపై పడింది. పల మనేరు, బెరైడ్డిపల్లె, గంగవరం, వి.కోట మండలాల్లోని 40 అటవీ ప్రాంత గ్రామాల్లో 200 మంది నాటు తుపాకులు కలిగిన వేటగాళ్లు ఉన్నట్లు తెలుస్తోంది. వీరు రాత్రిపూట వన్యప్రాణులను వేటాడుతున్నారు. తనిఖీలు చేస్తున్నా ఫలితం శూన్యం రెండు నెలల నుంచి పోలీసులు నాటు తుపాకులను జల్లెడ పడుతున్నారు. పలమనేరు పోలీస్ స్టేషన్ పరిధి లో అత్యధికంగా 53, గంగవరంలో 30, పెద్దపంజాణిలో 20, బెరైడ్డిపల్లెలో 15, వి.కోటలో 7 తుపాకులను సీజ్ చేశారు. అయినప్పటికీ వేటగాళ్లు మాత్రం వేట సాగిస్తున్నారు. వీరికి తుపాకులు ఎక్కడి నుంచి వస్తున్నాయో అర్థంగాక అటవీ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. కొందరు పోలీసుల చేతివాటం వల్లే పోలీసు శాఖలో కొంతమంది చేతివాటం వల్లే తుపాకులు వేటగాళ్ల చేతిలోకి వెళుతున్నాయన్న ఆరోపణలున్నాయి. స్వాధీనం చేసుకుంటున్నా మామూళ్లు ఇచ్చి విడిపించుకుంటున్నట్లు తెలుస్తోంది. పలమనేరు పోలీస్స్టేషన్కు చెందిన ఓ కానిస్టేబుల్ పాత్ర ఇందులో ప్రధానంగా ఉన్నట్లు వినికిడి. ఇప్పటికైనా అటవీ శాఖ, పోలీసులు సంయుక్త సహకారంతో వేటగాళ్ల ఆట కట్టించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


