breaking news
kashmir state
-
ఎట్టకేలకు జాకెట్ ధరించిన రాహుల్..తిట్టిపోస్తున్న ప్రతిపక్షాలు
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా భారత్ జోడో యాత్ర పేరుతో పాదయాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. ఐతే ఇప్పటి వరకు 125 రోజుల ప్రయాణంలో సుమారు 3,400 కిలోమీటర్లు చేసిన పాద యాత్రలో కేవలం తెల్లటి టీషర్ట్ మాత్రమే ధరించి అందర్నీ ఆశ్చర్యచకితులను చేశారు. చలికాలం సమీపించి గజగజలాడిస్తున్న ఆయన తెల్లటి టీ షర్ట్ మాత్రమే ధరించడం అందరిలో ఒకటే ఉత్సుకతను రేకెత్తించాయి. చివరికి మీడియా ముందుకు వచ్చి రాహుల్ని ఈవిషయమై ప్రశ్నించగా..పేదవాళ్లను, కార్మికులను ఈ ప్రశ్న ఎందుకు వేయరు అని ఎదురు ప్రశ్నించారు. తాను ముగ్గురు చిన్నారులన చూశానని వారు చలికి వణకుతూ కనిపించారే గానీ స్వెటర్లు ధరించలేదని, వారే తనకు ఆదర్శం అని చెప్పుకొచ్చారు. అంతేగాదు వారికి చలి అనిపించేంత వరకు తాను ధరించనని, అప్పటి వరకు తనకు కూడా చలిగా అనిపించదంటూ పెద్దపెద్ద మాటలు చెప్పారు. కానీ చివరికి జమ్మూలో యాత్ర ప్రవేశించగానే రాహుల్కి జాకెట్ ధరించక తప్పలేదు. ఈ మేరకు గురువారం రాహుల్ భారత్ జోడో యాత్ర పంజాబ్ నుంచి జమ్మూలోకి ప్రవేశించింది. చలికాలంలో సైతం టీషర్టు ధరించి ఉత్తర భారతదేశం గుండా దిగ్విజయంగా పాదయాత్ర చేసి అందర్నీ షాక్ గురిచేసిన ఆయన ఈరోజు యాత్రలో తోలిసారిగా జాకెట్లో కనిపించారు. ఉదయం నుంచి జమ్మూలోని పలు ప్రాంతాల్లో చినుకులు కురుస్తుండటం వల్ల గాంధీ చివరకు రక్షణ దుస్తులు ధరించక తప్పింది కాదు. దీంతో ఇక ఇదే అవకాశంగా ప్రతిపక్షాలు రాహుల్పై వ్యంగోక్తులు విసరడం, చురకలింటించడం, ప్రారంభించాయి. ఇదిలా ఉండగా, రాహుల్ జనవరి 25న జమ్మూ కాశ్మీర్లోని రాంబన్ జిల్లాలోని బనిహాల్లో జాతీయ జెండాను ఎగరువేస్తారు. ఆ తర్వాత రెండురోజలు అనంతరం జనవరి 27న అనంత్నాగ్ మీదుగా శ్రీనగర్లో ప్రవేశించనున్నారు. అదీగాక భారత్ జోడో యాత్ర సందర్భంగా కాశ్మీర్లోని కొన్ని ప్రాంతాలలో నడవవద్దని భద్రతా సంస్థలు గాంధీకి సూచించినట్లు సమాచారం. ఈ మేరకు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ జమ్మూలో ప్రవేశించగానే అక్కడి అగ్రనేత నేషనల్కాన్ఫరెన్స్ ఫరూక్ అబ్దుల్లా ఘన స్వాగతం పలికారు. పైగా చివరి దశకు చేరుకున్న ఈ యాత్రలో పాల్గొనడానికి వందలాది మంది ప్రజలు తరలివచ్చారు. ఈ యాత్ర జనవరి 30న శ్రీనగర్లో గ్రాండ్ ఫినాలేతో ముగుస్తుంది. (చదవండి: యూత్ ఐకాన్గా రాహుల్ గాంధీ.. ఆ సత్తా ఉంది: శత్రుఘ్న సిన్హా) -
'భారత్ ను ఎదుర్కోగల సామర్థ్యం మాకూ ఉంది'
ఇస్లామాబాద్: భారత్ ను ఎదుర్కోగల సామర్థ్యం తమకూ ఉందంటూ పాకిస్థాన్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసింది. భారత్ ఎలాంటి దుందుడుకు చర్యకు పాల్పడినా ఎదుర్కోగల సామర్థ్యం పాక్ బలగాలకు ఉందని గురువారం సైనిక దళాల అధిపతి రహీల్ షరీఫ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. భారత్ గురించి ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. భారత్ ఎటువంటి చర్యలకు పాల్పడినా తిప్పికొట్టే సామర్థ్యం ఉందన్నారు 1947లో భారత్-పాక్ ల కు సంబంధించిన కశ్మీర్ అంశం నేటికి పరిష్కారం కాలేదని.. అయినా పాకిస్థాన్ -కశ్మీర్ లు విడదీయలేని బంధంగా అభివర్ణించారు. -
'కశ్మీర్ - పాకిస్తాన్ విడదీయలేనివి'
న్యూఢిల్లీ: కశ్మీర్ విభజన ఎప్పటికీ ముగిసిపోని అంకం అని పాక్ ఆర్మీ చీఫ్ రహీల్ షరీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్, పాకిస్తాన్ రెండూ ఎప్పటికీ విడదీయలేనివని ఆయన అన్నారు. ఐక్యరాజ్యసమితి తీర్మానం చేసి కశ్మీర్ను పాక్లో కలిపితే శాంతి పరిఢవిల్లుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ విషయంపై పలువురు కేంద్రమంత్రులు అభ్యంతరం వ్యక్తం చేశారు. రహీల్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలు ఇండియా - పాక్ మధ్య సంబంధాలను దెబ్బతీస్తాయని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ అన్నారు.