breaking news
kashmir people
-
కశ్మీరీలకు రక్షణ ఇవ్వండి: కేంద్రం
న్యూఢిల్లీ: దాడి తర్వాత దేశంలోని వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న కశ్మీర్ ప్రజలు, విద్యార్థులపై దాడుల నేపథ్యంలో వారి రక్షణకు బాధ్యత తీసుకోవాల్సిందిగా కేంద్రం రాష్ట్రాలను కోరింది. తమ ఆస్తులపై దాడులు జరుగుతాయన్న భయంలో ఉత్తరాఖండ్లో కశ్మీరీలకు అద్దెకిచ్చిన వారి గృహ యాజమానులు భయపడి, కశ్మీరీలను ఖాళీచేయిస్తున్నట్టు సమాచారం అందినట్లు హోంమంత్రిత్వ శాఖ తెలిపింది. ఇళ్లు ఖాళీ చేసిన కశ్మీరీలు అంబాలా: గ్రామంలో అద్దెకుంటున్న కశ్మీరీలను వెనక్కి పంపాలని హరియాణాలోని అంబాలా గ్రామపంచాయతీ తమ గ్రామస్తులను ఆదేశించింది. సోషల్ మీడియాలో షేర్ అవుతోన్న ఒక వీడియో ప్రకారం, ములానా గ్రామ సర్పంచ్ నరేశ్ ఒక వీడియో ద్వారా సందేశమిచ్చారు. ‘దాడిలో కొందరు కశ్మీరీల ప్రమేయం ఉంది. 24 గంటల్లోగా అద్దెకుంటున్న కశ్మీరీలను పంపించివేయాలి’ అని వీడియోలో ఉంది. వీడియోను చూసిన కొందరు కశ్మీరీలు ఇళ్లు ఖాళీచేసి యూనివర్సిటీ హాస్టల్కు మకాం మార్చినట్లు సమాచారం. అంబాలాలోని వర్సిటీల్లో దాదాపు 1,200 మంది కశ్మీరీలు చదువుతున్నట్టుగా సమాచారం. -
కశ్మీరీ స్వాతంత్య్రానికి మద్దతు
పాక్ ప్రధాని షరీఫ్ వ్యాఖ్య.. ప్రజలపై దుష్కృత్యాలను ప్రపంచం సమీక్షించాలని వినతి ఇస్లామాబాద్: కశ్మీరీ ప్రజల దుస్థితిని ప్రపంచం పట్టించుకోవాల్సిన అవసరముందని పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ పేర్కొన్నారు. కశ్మీరీ ప్రజల స్వాతంత్య్రోద్యమానికి తమ ప్రభుత్వం నైతిక, దౌత్య, రాజకీయ మద్దతు ఇస్తుందని ప్రకటించారు. త్వరలో పదవీ కాలం ముగియనున్న పాక్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే) అధ్యక్షుడు సర్దార్ ముహమ్మద్ యాకూబ్ఖాన్ మంగళవారం తనను కలసిన సందర్భంగా నవాజ్ పై వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జరిగిన పీవోకే ఎన్నికల్లో నవాజ్షరీఫ్కే చెందిన పాక్ ముస్లిం లీగ్-నవాజ్ పార్టీ గెలిచింది. పీవోకే ప్రధానిగా రాజా ఫరూక్ హైదర్ను, అధ్యక్షుడిగా మసూద్ఖాన్ను నవాజ్ నియమించారు.యాకూబ్తో భేటీలో నవాజ్ మాట్లాడుతూ.. ‘నిరాయుధులైన అమాయక కశ్మీరీలపై తాజాగా జరుగుతున్న క్రూరకృత్యాలను ప్రపంచం సమీక్షించాల్సిన అవసరముంది. కశ్మీరీలు స్వాతంత్య్రమనే తమ అవిభాజ్య హక్కు కోసం భారీ త్యాగాలు చేస్తున్నారు’ అని పేర్కొన్నారు. కశ్మీరీల స్వతంత్ర పోరుకు సంపూర్ణ నైతిక, దౌత్య, రాజకీయ మద్దతు ఇవ్వాలన్న తమ సర్కారు సంకల్పాన్ని పునరుద్ఘాటించారు. భారత ప్రధాని మోదీ తన పంద్రాగస్టు ప్రసంగంలో కశ్మీర్, పీఓకే అంశాలపై పాక్ను విమర్శించిన నేపథ్యంలో షరీఫ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మోదీతో అమెరికా, యూరప్లు గళం కలపాలి: బలూచ్ నేతలు వాషింగ్టన్: బలూచ్ అంశంపై మోదీతో గళం కలపాలని, బలూచ్లో పాక్ సర్కారు అణచివేతకు వ్యతిరేకంగా తమకు మద్దతు ఇవ్వాలని అమెరికా, యూరప్లను బలూచ్ ఉద్యమ నేత లు ఖలీల్ బలూచ్, బ్రహుమ్ బుగ్తీలు కోరారు. హక్కుల ముసుగులో ఉగ్ర చేయూత: అక్బర్ న్యూయార్క్: ఉగ్రవాదులను పెంచి పోషిస్తూ దానికి మానవహక్కుల ముసుగు వేయడం అత్యంత హేయమైనదని విదేశాంగ సహాయ మంత్రి ఎంజే అక్బర్ పాక్ను ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదంతో మానవ హక్కులకు పెను ప్రమాదం ఉందన్నారు. ఇక్కడ జరిగిన 70వ భారత స్వాతంత్య్ర వేడుకల్లో ఆయన ప్రసంగించారు.‘స్వేచ్ఛగా ఓటు వేయడానికే కాదు... భావాన్నీ వ్యక్తం చేసుకోగల స్వాతంత్య్రం ఉండాలి. భారతీయ ముస్లింగా నేను గర్వపడుతున్నా. దేశంలో పధ్నాలుగు వందల ఏళ్లుగా అజాన్(నమాజ్ పిలుపు) వినిపిస్తోంది. భవిష్యత్తులో కూడా వినిపిస్తూనే ఉంటుంది’ అని అన్నారు. కాగా, బలూచ్పై ఆందోళన వ్యక్తం చేసిన ప్రధానుల్లోమోదీయే మొదటి వారు కాదని.. గతంలో మన్మోహన్ కూడా మాట్లాడారని కాంగ్రెస్ పేర్కొంది. పాక్కు వెళ్లటమంటే నరకంలోకి వెళ్లినట్టే: పరీకర్ రేవారి (హరియాణా): పాక్తో సంబంధాలు మరింతగా దిగజారుతున్న నేపథ్యంలో.. ‘పాక్ వెళ్లటమంటే నరకంలోకి వెళ్లటం వంటిదే’ అని రక్షణ మంత్రి మనోహర్ పరీకర్ వ్యాఖ్యానించారు. సోమవారం పలువురు ఉగ్రవాదులు భారత్లోకి చొరబడేందుకు చేసిన ప్రయత్నాన్ని, దానిని భారత సైన్యం తిప్పికొట్టిన విషయాన్ని ప్రస్తావిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ భారత్లో అంతర్భాగమనీ ఉద్ఘాటించారు. బలూచిస్తాన్లో మానవ హక్కుల ఉల్లంఘనను పాక్ ఆపివేయాలన్నారు. ఆయన మంగళవారం రేవారిలో మాట్లాడుతూ.. పాక్ ఎల్లప్పుడూ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని దాని పర్యవసానాలను ఇప్పుడు అనుభవిస్తోందని వ్యాఖ్యానించారు. ప్రతి దాడికీ భారత సైనికులు తగిన సమాధానం ఇస్తారని రక్షణమంత్రి హామీ ఇచ్చారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సోమవారం స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో పీవోకే, గిల్గిత్, బలూచిస్తాన్లలో మానవ హక్కుల ఉల్లంఘనల విషయాన్ని ప్రస్తావిస్తూ పాక్పై విమర్శలు ఎక్కుపెట్టిన విషయం తెలిసిందే. పరీకర్, ప్రణాళికా శాఖ స్వతంత్ర సహాయమంత్రి, పట్టణాభివృద్ధి, గృహనిర్మాణం, పట్టణ పేదరిక నిర్మూలన శాఖ సహాయమంత్రి రావు సింగ్రావు ఇందర్జిత్లు 1857 భారత తిరుగుబాటులో కీలక నేతల్లో ఒకరైన రావు తులారామ్ జన్మస్థలాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఇస్లామాబాద్ సార్క్ సదస్సుకు జైట్లీ వెళ్లరు? న్యూఢిల్లీ: ఈ నెల 25, 26న పాక్ రాజధాని ఇస్లామాబాద్లో జరుగనున్న సార్క్ దేశాల ఆర్థికమంత్రుల సమావేశానికి ఆర్థికమంత్రి అరుణ్జైట్లీ హాజరుకాకపోవచ్చునని ఉన్నతస్థాయి వర్గాలు పేర్కొన్నాయి. ‘రాజకీయ కారణాల వల్లే ఆయన ఈ భేటీకి దూరంగా ఉండొచ్చు. ఇదివరకు ఏం జరిగిందో, ఏం జరుగుతోందో మీకందరికీ తెలుసు’ అని అన్నాయి. ఈ నెల ఆరంభంలో సార్క్ హోంమంత్రుల సమావేశానికి హాజరయ్యేందుకు హోంమంత్రి రాజ్నాథ్సింగ్ ఇస్లామాబాద్ వెళ్లినప్పడు జరిగిన సంఘటనలను ప్రస్తావించాయి. ఆ భేటీలో.. రాజ్నాథ్, పాక్ అంతర్గత మంత్రి చౌదరి నిసార్ లు పరస్పరం విమర్శలు చేసుకున్నారు. పీటీఐ, దూరదర్శన్ సహా భారత మీడియా ప్రతినిధులు ఎవరినీ సార్క్ హోంమంత్రుల సమావేశ వేదికలోకి పాక్ అనుమతించలేదు. సమావేశం అనంతరం తిరిగి వచ్చిన రాజ్నాథ్ పార్లమెంటులో ప్రకటన చేస్తూ.. సార్క్ భేటీకి హాజరైన వారిని నిసార్ మధ్యాహ్య విందుకు ఆహ్వానించి కారులో వెళ్లిపోయారని.. తాను దేశ ప్రతిష్టను దృష్టిలో పెట్టుకుని ఏం చేయాలో అది చేశానన్నారు. -
భారత్-పాక్ మధ్య అణు యుద్ధం తప్పదు!
కరాచీ: కశ్మీర్ కోసం భారత్-పాక్ మధ్య అణు యుద్ధం తప్పదని హిజ్బుల్ ముజాహిద్దీన్ చీఫ్ సయ్యద్ సలాహుద్దీన్ హెచ్చరించారు. ఈ విషయంలో ఇప్పటికే మూడు సార్లు యుద్ధం జరిగిందని, కశ్మీర్ ప్రజలు రాజీ పడేందుకు సిద్ధంగా లేనందున నాలుగోసారీ యుద్ధం జరగొచ్చని చెప్పారు. కశ్మీరీలకు నైతికంగా మద్దతిచేందుకు పాక్ కట్టుబడి ఉందని, పాక్ సహకరిస్తే ఇరు దేశాల మధ్య అణు యుద్ధం జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు. ఆదివారం విలేకరులతో సలాహుద్దీన్ మాట్లాడుతూ.. హిజ్బుల్ ముజాహిద్దీన్ కమాండర్ బుర్హాన్ వాని హత్య.. కశ్మీర్ కోసం జరుగుతున్న పోరాటానికి కొత్త అర్థాన్నిచ్చిందన్నారు. -
వాజ్పేయిలా కశ్మీరీల హృదయాలు గెలుచుకోండి
న్యూఢిల్లీ: రగులుతున్న కశ్మీర్ ప్రజలతో చర్చించి లోయలో సమస్యను పరిష్కరించాలని జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ప్రధాని మోదీని కోరారు. ‘కశ్మీరీలతో మాట్లాడటానికి ఇది సరైన సమయం. ఈ విషయంలో ప్రధాని చొరవ చూపుతారని ఆశిస్తున్నా. నాడు వాజ్పేయిలా నేడు మోదీ కూడా సమస్యను పరిష్కరించి కశ్మీరీల హృదయాలు గెలవాల్సిన అవసరం ఉంది’ అని మెహబూబా అన్నారు. కశ్మీర్లో తాజా పరిస్థితులపై కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్సింగ్ సోమవారం ఇక్కడ సమీక్షించారు. ఇందులో రక్షణ మంత్రి మనోహర్ పరీకర్, జాతీయ భద్రతా సలహాదారు ఏకే దోవల్తో పాటు మెహబూబా పాల్గొన్నారు. లోయలో నెలకు పైగా సాగుతున్న హింసతో 55 మంది పౌరులు మరణించారని, ఎంతో మంది గాయపడ్డారని మెహబూబా ముఫ్తీ ఆవేదన వ్యక్తం చేశారు. భారత్-పాక్లకు తమ రాష్ట్రం ఓ వారధిలా ఉండగలదన్నారు. కశ్మీర్ అల్లర్లపై ప్రధాని ఇంత వరకు నోరు విప్పకపోవడాన్ని రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు గులాంనబీ ఆజాద్ ప్రశ్నించిన నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. -
కశ్మీర్ ప్రజల హక్కులేవి?
జకార్తా: భారత అభ్యంతరాలను తోసిరాజని అంతర్జాతీయ వేదికపై కశ్మీర్ అంశాన్ని పాకిస్తాన్ మరోసారి ప్రస్తావించింది. కశ్మీర్ ప్రజల స్వీయ నిర్ణయాధికారం ఇప్పటికీ నెరవేరకపోవడం విచారకరమని, అది ఆమోదనీయం కాదని వ్యాఖ్యానించింది. ఇండోనేసియాలోని జకార్తాలో జరుగుతున్న ఆసియాన్-ఆఫ్రికన్ సదస్సులో పాక్ ప్రతినిధిగా పాల్గొన్న సర్తాజ్ అజీజ్ ఈ వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా అధ్యక్షతన గురువారం ఈ సదస్సు జరిగింది. అజీజ్ వ్యాఖ్యలపై భారత్ ఇదే సదస్సులో స్పందించింది. కశ్మీర్ ప్రస్తావనను అంతర్జాతీయ వేదికపై లేవనెత్తడం దురదృష్టకరమని విదేశాంగ శాఖ ప్రతినిధి అనిల్ వెంటనే బదులిచ్చారు. -
పాకిస్థాన్ ఉల్లితో కాశ్మీర్ కళకళ