breaking news
Karra Saamu
-
ఖరీదు సాంబయ్య.. కర్రసామే శ్వాస, ధ్యాసగా జీవిస్తూ పతకాల పంట
సాక్షి, గుంటూరు(పెదకాకాని): మన భారతీయ సంస్కృతిలోని ప్రాచీన కళల్లో కర్రసాము ఒకటి. కర్రసామే శ్వాస, ధ్యాసగా జీవిస్తూ పతకాల పంట పండిస్తున్నాడు ఖరీదు సాంబయ్య(చంటి). జాతీయ అంతర్జాతీయ స్థాయిలో జరిగే కర్రసాము పోటీల్లో పాల్గొని అదరకొడుతున్నాడు. దేశవాళీ క్రీడ అయిన కర్రసాములో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక స్థానం ఉండాలని ఆకాంక్షిస్తున్నాడు. ప్రాచీన యుద్ధకళ అంతరించిపోకుండా రక్షించుకుంటూ పది మందికీ నేర్పించాలని తపన పడుతున్నాడు. గుంటూరు జిల్లా ఫిరంగిపురం గ్రామానికి చెందిన ఖరీదు సాంబయ్య వ్యవసాయ కుటుంబానికి చెందిన వాడు. తండ్రి వెంకటేశ్వర్లు, తల్లి నాగేంద్రమ్మ. బీఎస్సీ కంప్యూటర్స్ చదువుకున్న సాంబయ్య పలు ప్రైవేటు కళాశాలల్లో జూనియర్ లెక్చరర్గా పనిచేశారు. కర్రసాముపై ఉన్న మమకారంతో ఉపాధ్యాయవృత్తికి స్వస్తి చెప్పి ఉదయం గోరంట్ల శివార్లలో చెట్ల కింద, సాయంత్రం వెనిగండ్ల పంచాయతీ కార్యాలయం వద్ద పిల్లలకు కర్రసాము శిక్షణ ఇస్తున్నారు. భార్య రాధిక, 11 ఏళ్ల గీతామాధురి, 10 ఏళ్ల కావ్యశ్రీ సంతానం. ఏడాదిన్నర కాలంలోనే దేశ విదేశాలలో జరిగిన కర్రసాము పోటీల్లో పాల్గొని 32 గోల్డ్మెడల్స్, 4 సిల్వర్ మెడల్స్, 3 కాంస్య పతకాలు సాధించాడు. ఏడాదిన్నర కాలంలో సాధించిన కొన్ని విజయాలు.. ►2021 మార్చి 21 నెల్లూరు జిల్లాలో 6వ స్టేట్లెవల్ కర్రసాము పోటీలలో బ్రాంజ్మెడల్, సర్టిఫికెట్ ►2021 ఆగస్టు 10 కర్నూలు జిల్లాలో జరిగిన కిక్ బాక్సింగ్లో భాగమైన మొదటి ఆంధ్రప్రదేశ్ కర్రసాము పోటీలలో బ్రాంజ్మెడల్, సర్టిఫికెట్. నేషనల్ లెవల్లో జరిగే గోవా పోటీలకు అర్హత ►2021 సెప్టెంబరు 5 నెల్లూరు జిల్లా సిలంబం స్టిక్ పెన్సింగ్ అసోసియేషన్ వారు –మేజర్ ధ్యాన్చంద్ సర్టిఫికెట్, యూనివర్సిల్ ఎచీవర్స్ బుక్ ఆఫ్ రికార్డు సర్టిఫికెట్, ట్రోఫీ ►2021 సెప్టెంబరు 26 మద్రాస్ సిలంబం ఆఫ్ ఇండియా అసోసియేషన్ వారు వరల్డ్ రిఫరీగా సెలక్ట్ చేసి సర్టిఫికెట్, షీల్డ్తో సన్మానం ►2021 నవంబరు 14 కృష్టా జిల్లాలో జరిగిన మొదటి స్టేట్ ట్రెడిషనల్ లాఠీ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ వారు నిర్వహించిన కర్రసాము పోటీల్లో గోల్డ్మెడల్. మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో జరిగే నేషనల్ ట్రెడిషనల్ లాఠీ స్పోర్ట్స్ పోటీలకు అర్హత ►2021 డిసెంబరు 25 మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో జరిగిన 2వ నేషనల్ ట్రేడిషనల్ లాఠీ స్పోర్ట్స్ చాంపియన్íÙప్ 2021 పోటీలలో గోల్డ్మెడల్ మెడల్. ►2022 ఫిబ్రవరి 13 ఎక్స్లెంట్ వరల్డ్ రికార్డ్స్ వారు ఉత్తరాఖాండలోని హరిద్వార్లో ద్రోణాచార్యుడి అవార్డు ►2022 మార్చి 27 వైఎంకే 2022 మార్షల్ ఆర్ట్స్ అకాడమీ విజయవాడ వారి ఆధ్వర్యంలో ఫస్ట్ నేషనల్ ఓపెన్ కుంగ్పూ కరాటే చాంపియన్ íÙప్, కర్రసాము పోటీలలో గోల్డ్మెడల్ ► 2022 మే 8 కాకినాడలో జరిగిన రెండవ రాష్ట్రస్థాయి కర్రసాము పోటీలలో కర్ర, రెండు కర్రలు, ఫైటింగ్ విభాగాలలో మూడు గోల్డ్మెడల్స్ ►2022 మే 14 రాజస్థాన్ జైపూర్లో జరిగిన ఆల్ ఇండియా కర్రసాము చాంపియన్షిప్ 2022 నేషనల్ లెవల్ పోటీలలో ఒక కర్ర, రెండు కర్రలు, ఫైటింగ్ విభాగాలలో మూడు గోల్డ్మెడల్స్. నేపాల్లోని ఖాఠ్మాండ్లో జరిగే ఇంటర్నేషనల్ పోటీలకు ఎంపిక ►2022 మే 28న ఖాఠ్మాండ్లో జరిగిన ఇండో–నేపాల్ ఇంటర్ నేషనల్ గేమ్స్ వారు నిర్వహించిన కర్రసాము పోటీలలో ఒక కర్ర, రెండు కర్రలు, ఫైటింగ్ విభాగాలలో మూడు గోల్డ్మెడల్స్. ►2022 జూన్ 26 రాజమండ్రిలో నిర్వహించిన ఫస్ట్ ఇంటర్ స్టేట్ కరాటే చాంపియన్ షిప్ వారు నిర్వహించిన కర్రసాము ఆన్లైన్ పోటీలలో ఒక కర్ర, రెండు కర్రలు, ఫైటింగ్ విభాగాలలో మూడు గోల్డ్మెడల్స్. ►2022 జులై 27 నేపాల్ రాజధాని ఖాఠ్మాండ్లో అంతర్జాతీయ స్థాయిలో జరిగిన సౌత్ ఏషియన్ లాఠీ చాంపియన్ షిప్ కర్రసాము పోటీలలో ఒక కర్ర, రెండు కర్రలు, ఫైటింగ్ విభాగాలలో ఒక గోల్డ్, రెండు సిల్వర్ మెడల్స్ ►2022 సెప్టెంబర్ 2 ఉత్తరప్రదేశ్ నోయిడాలో జరిగిన నేషనల్ లెవల్ కర్రసాము పోటీలలో ఒక గోల్డ్, ఒక బ్రాంజ్ మెడల్. ►2022 నవంబరు 13 తెలంగాణ యూసఫ్గూడలో జరిగిన ఇంటర్నేషనల్ మార్షల్ ఆర్ట్స్ చాంపియన్షిప్ 2022 పోటీలకు 14 మంది శిష్యులతో పాల్గొనగా ఒక కర్ర, రెండు కర్రలు, సురులు, చైన్పంత్, జింక కొమ్ములు, ఫైటింగ్ విభాగాలలో 32 మెడల్స్ వచ్చాయి. వాటిలో గోల్డ్మెడల్స్ 18, సిల్వర్ మెడల్స్ 9, బ్రాంజ్ మెడల్స్ 5 రావడం తనకు ఓవరాల్ చాంపియన్షిప్ కప్ అందజేసి సన్మానించడం మరపురాని గొప్ప అనుభూతిగా ఆయన ఆనందాన్ని తెలియజేశారు. చదవండి: (సీఎం జగన్ ప్రమాణ స్వీకారం వీడియో చూస్తూ ఆపరేషన్) దాతల సహకారం, ప్రభుత్వ ప్రోత్సాహం కావాలి... కర్రసాములో ఇప్పటివరకు నేను సాధించిన విజయాల్లో దాతల సహాయ సహకారాలు ఎన్నటికీ మరవలేను. ప్రస్తుతం గోరంట్లలో చెట్ల కింద, వెనిగండ్లలో తిరుమలరెడ్డి స్థలంలో కర్రసాము శిక్షణ ఇస్తున్నాను. మొదట్లో పిల్లలకు ఉచితంగానే నేరి్పంచా. అద్దె ఇల్లు కుటుంబ పోషణ భారంగా మారింది. దాతల సహకారంతో పాటు ప్రభుత్వ ప్రోత్సాహం ఉంటే బ్యాచ్ల వారీగా బాల బాలికలకు, యువతీ యువకులకు ఉచితంగా కర్రసాము మెలకువలు నేరి్పంచి తీర్చిదిద్దుతా. కర్రసాములో మన రాష్ట్రానికి ప్రత్యేక స్థానం ఉండేలా కృషి చేస్తా. ఇటీవల జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాలరెడ్డిని కలవగా శాప్ ద్వారా ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పారు. – ఖరీదు సాంబయ్య(చంటి), కర్రసాము శిక్షకుడు, గుంటూరు పతకాల పంట కర్రసాముగా పిలుచుకునే ఈ క్రీడను తమిళనాడులో సిలంబం, కేరళలో కలరిపట్టు, మధ్యప్రదేశ్లో ట్రెడిషనల్ లాఠీ వంటి పేర్లతో పిలుస్తున్నారు. కర్రసాముపై ఉన్న ఆసక్తితో తాను నేర్చుకొని పతకాలు సాధించడంతో పాటు మరికొందరికి కర్రసాములో శిక్షణ ఇస్తూ పతకాలు పంట పండిస్తున్నాడు. సాంబయ్య మాస్టార్ 2022 నవంబరు 13న తెలంగాణలోని యూసఫ్గూడలో జరిగిన కర్రసాము పోటీలకు 14 మంది శిష్యులతో వెళ్లాడు. ఒక కర్ర, రెండు కర్రలు, సురులు, చైన్పంత్, జింక కొమ్ములు, ఫైటింగ్ విభాగాలలో మొత్తం 32 మెడల్స్ సాధించారు. వాటిలో 18 గోల్డ్మెడల్స్, 9 సిల్వర్ మెడల్స్, 5 కాంస్యాలు గెలుపొందారు. ఓవరాల్ చాంపియన్ షిప్ కప్పు అందుకోవడంతో పాటు రిఫరీగా, న్యాయ నిర్ణేతగా సర్టిఫికెట్లు అందుకున్నారు. -
కర్రసాముకు పూర్వవైభవం.. చిన్నారుల్లో పెరుగుతున్న ఆసక్తి
విజయవాడ స్పోర్ట్స్: ప్రాచీన యుద్ధ కళ కర్రసాము (సిలంబం)కు పూర్వవైభవం వస్తోంది. విజయవాడ నగరానికి చెందిన చిన్నారులు కర్రసాములో నిష్ణాతులై, క్రీడా వేదికలపై సత్తా చాటుతున్నారు. నిరంతర సాధనతో జాతీయ పతకాలు కైవసం చేసుకుంటున్నారు. అంతరించిపోతున్న కళల జాబితాలో చేరిన విద్యను తాజాగా వెలుగులోకి తీసుకొస్తున్నారు. విశిష్ట చరిత్ర.. క్రీస్తుకు పూర్వమే ఈ కర్రసాము విద్య పుట్టింది. అప్పటి జీవన విధానం, అందుబాటులోని వనరుల ఆధారంగా శత్రువులపై పైచేయి సాధించేందుకు తమిళనాడులో గాడ్ మురుగన్ సంప్రదాయ కర్రసామును ప్రపంచానికి పరిచయం చేశారు. తమిళంలో దీనిని ‘సిలంబం’ అని, తెలుగులో ‘తాలింకానా’ అని పిలిచేవారని చరిత్ర చెబుతోంది. కర్రలతో చేసే సాధనం కావడంతో కొన్నేళ్ల తరువాత ‘కర్రసాము’గా తెలుగులో ప్రసిద్ధి కెక్కింది. కాలక్రమేణా కర్రసాము యుద్ధ ప్రాముఖ్యత తగ్గిపోయినా నేటికీ ఈ కళ కొన్ని గ్రామాల్లో సజీవంగానే ఉంది. అయితే నగర యువతకు ఈ విద్య గురించి పూర్తిగా అవగాహన ఉండదనేది అక్షర సత్యం. ఈ నేపథ్యంలోనే కర్రసాము ఔన్యత్యాన్ని నగర యువతకు చాటేందుకు ‘సంప్రదాయ కర్రసాము(ట్రెడిషనల్ సిలంబం)’ పేరుతో క్రీడా పోటీలను నిర్వహిస్తున్నారు. కర్రసాము సాధనతో ఆత్మరక్షణతో పాటు అధిక బరువు తగ్గడానికి, మడమలు, కీళ్లు, ఎముకల పటుత్వానికి, రక్త ప్రసరణ సజావుగా సాగేందుకు, ఏకాగ్రత పెంచేందుకు ఉపయోగపడుతుందని కోచ్లు వివరిస్తున్నారు. తొమ్మిది విభాగాల్లో పోటీలు.. ట్రెడిషనల్ సిలంబం పోటీలు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్నారు. సింగిల్ స్టిక్, డబుల్ స్టిక్, స్వార్డ్, స్పీయర్, సురుల్వార్, డీర్ఆరమ్స్, మ్యాన్ టు మ్యాన్, డ్యూయల్ ఈవెంట్, గ్రూప్ ఈవెంట్లను నిర్వహిస్తున్నారు. వీటిల్లో మ్యాన్ టు మ్యాన్ విభాగంలో ఎదురెదురుగా ఇద్దరు యుద్ధం చేసినట్లు పోటీ పడతారు. మిగిలిన విభాగాలు కేవలం ప్రదర్శన మాదిరిగానే పోటీలు నిర్వహిస్తారు. పోటీలకు 6 మీటర్ల పొడవు, 6 మీటర్ల వెడల్పుతో ఏర్పాటు చేసిన కోర్టులో 70 సెకన్లలో ప్రదర్శన ముగించాల్సి ఉంటుంది. కర్ర తీప్పే స్పీడ్, స్టయిల్, సౌండ్, స్కిల్ ఆధారంగా మార్కులు వేస్తారు. వ్యక్తి శరీరానికి లేదా నేలకు కర్ర తాకితే నెగిటివ్ మార్కులు ఉంటాయి. జాతీయ క్రీడా వేదికపై.. చెన్నైలో గత నెల 25వ తేదీ నుంచి మూడు రోజుల పాటు జరిగిన జాతీయ స్థాయి ట్రెడిషనల్ సిలంబం పోటీల్లో విజయవాడకు చెందిన క్రీడాకారులు సత్తా చాటారు. అండర్–12 విభాగంలో ఎం.హియాజైన్ స్వర్ణం(డబుల్స్టిక్), ఎన్.యశస్వి స్వర్ణం(సింగిల్స్టిక్), కె.రిషికేష్ కాంస్యం(సింగిల్స్టిక్), అండర్–14 విభాగంలో జి.ఆరుష్ రజతం(సింగిల్ స్టిక్), అండర్–10 విభాగంలో ఎన్.కశ్యప్ రజతం(సింగిల్స్టిక్), పి.శ్రీకారుణ్య రజతం(డబుల్స్టిక్), అండర్–8 విభాగంలో బి.మేఘనా రజతం(సింగిల్స్టిక్), కారుణ్య కాంస్య(సింగిల్స్టిక్) పతకాలు సాధించారు. రెండు చోట్ల శిక్షణ కేంద్రాలు.. విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్ కార్పొరేషన్ స్టేడియం, యనమలకుదురులోని కృష్ణానది వద్ద ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో కఠోర శిక్షణ తీసుకుంటున్నారు. ప్రస్తుతం విజయవాడ నగరంలో సుమారు 200 మంది చిన్నారులు కర్రసాములో శిక్షణ తీసుకుంటున్నట్లు కోచ్లు చెబుతున్నారు. (క్లిక్ చేయండి: అద్భుత శిల్పాలు చెక్కుతూ.. శాండ్ ఆర్టిస్ట్గా అంతర్జాతీయ ఖ్యాతి) అంతర్జాతీయ పతకాలు సాధిస్తాం.. ఇటీవల జరిగిన జాతీయ స్థాయి పోటీలకు దేశంలోని అన్ని రాష్ట్రాలు ప్రాతినిధ్యం వహించాయి. మన జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించిన ప్రతి క్రీడాకారుడు పతకం సాధించాడు. రానున్న రోజుల్లో జరిగే ప్రపంచ స్థాయి పోటీల్లోనూ పతకాలు సాధించేందుకు క్రీడాకారులను తీర్చిదిద్దుతున్నాం. – కె.సత్యశ్రీకాంత్, కోచ్ వచ్చే ఏడాది నుంచి స్కూల్ గేమ్స్లో.. సంప్రదాయ కర్రసాము క్రీడకు గుర్తింపు ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఏన్నో ఏళ్లుగా కోరుతున్నాం. కేంద్ర ప్రభుత్వం వచ్చే ఏడాది (2023) స్కూల్ గేమ్స్లో చేర్చుతున్నట్లు ఇటీవల చేసిన ప్రకటన ఆనందాన్ని కలిగించింది. స్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా(శాయ్) ఈ క్రీడకు గుర్తింపు ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ(శాప్)ను గుర్తింపు ఇవ్వాలని కోరుతున్నాం. – నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ ట్రెడిషనల్ సిలంబం అసోసియేషన్ కార్యదర్శి -
సమంత కొత్త హాబీ..!
పెళ్లి వార్తల తరువాత సోషల్ మీడియాలో యమా యాక్టివ్ అయిన స్టార్ హీరోయిన్ సమంత, మరో ఇంట్రస్టింగ్ వీడియోతో అభిమానులను ఖుషీ చేసింది. ఇప్పటి వరకు సాఫ్ట్ రోల్స్లో మాత్రమే కానిపించిన ఈ బ్యూటీ, కర్రసాము చేస్తున్న వీడియో అభిమానులకు షాక్ ఇచ్చింది. 'నాకు ఛాలెంజ్ అంటే ఇష్టం. అందుకే కొత్త హాబీ సిలంబం (కర్రసాము). త్వరలోనే ఈ విద్యలో ప్రావీణ్యం సంపాధించాలనుంది' అంటూ ట్వీట్ చేసింది. అయితే సమంత హాబీగానే ఈ విద్య నేర్చుకుంటుందా..? లేక ఏదైనా సినిమా కోసమా అన్న అనుమానం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం నాగార్జునతో కలిసి రాజుగారి గది 2తో పాటు రామ్ చరణ్, సుకుమార్ల కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాలోనూ సమంత నటిస్తోంది. ఈ రెండు సినిమాల తరువాత మరో రెండు తమిళ సినిమాలకు ఓకె చెప్పింది. ఈ మధ్యలోనే నాగచైతన్యతో తన పెళ్లితంతును ముంగించేందుకు ప్లాన్ చేసుకుంటుంది. Because I like a challenge