breaking news
karkhana police station
-
ఇన్స్టాలో పరిచయం.. మద్యం తాగించి అఘాయిత్యం
సాక్షి, హైదరాబాద్/రసూల్పుర: ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన బాలికతో ప్రేమాయణం సాగించిన ఓ వ్యక్తి లాడ్జికి పిలిచి, మద్యం తాగించి అత్యాచారం చేశాడు. అంతటితో ఆగకుండా తన ఇద్దరు స్నేహి తులతోనూ అఘాయిత్యం చేయిం చాడు. ఈ వీడియోలు తన వద్ద ఉన్నాయని భయపెట్టి మళ్లీ ఓయో రూమ్కు రప్పించి దారుణానికి పాల్పడ్డాడు. మానసిక వైద్యుడి కౌన్సెలింగ్ ద్వారా విషయం తెలుసుకున్న బాధితురాలి తల్లిదండ్రులు కార్ఖానా పోలీ సులకు ఫిర్యాదు చేశారు. సామూహిక అత్యాచారం కేసు నమోదు చేసిన అధికా రులు నిందితులపై చర్యలు తీసుకున్నారు. ఈ కేసులో అత్యాచారం జరిగిన హోటల్, లాడ్జి యజమానులనూ నిందితులుగా చేర్చారు. ఈ ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రేమ పేరుతో వలవేసి... కార్ఖానా పోలీస్స్టేషన్ పరిధిలో నివసించే పదో తరగతి విద్యార్థిని(బాలిక)కి సైదా బాద్కు చెందిన పదో తరగతి విద్యార్థితో (మైనర్) కొన్నాళ్ల క్రితం ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయమైంది. కొన్ని రోజులు ఆమెతో చాటింగ్ చేసిన ఇతను ప్రేమ పేరుతో బాలికను ముగ్గులోకి దింపాడు. ఈ క్రమంలో మార్చి నెలల్లో కలుద్దామంటూ ప్రతిపాదించాడు. ఇతడి మాటలు నమ్మిన బాలిక అంగీకరించింది. కొత్తపేటలోని సింధూర హోటల్లో రూమ్ బుక్ చేసిన బాలుడు.. ఆమెను అందులోకి తీసుకువెళ్లాడు. బాలికతో మద్యం తాగించి మత్తులో ఉండగా అత్యాచారం చేశాడు. తర్వాత తన స్నేహితుడైన వనస్థలిపురానికి ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థితో (మైనర్) పాటు డిగ్రీ చదువుతున్న రిషిత్ను (19) పిలిపించాడు. స్పృహలేని స్థితిలో ఉన్న బాలికపై వీరిద్దరూ సైతం అత్యాచారం చేశారు. ఆపై బాలికను ఆమె ఇంటి సమీపంలో దింపి వచ్చారు. వీడియోలు ఉన్నాయంటూ మరోసారి రెండు రోజుల తర్వాత టెన్త్ విద్యార్థి బాలికకు మళ్లీ ఫోన్ చేశాడు. ఆ రోజు జరిగినదంతా తన స్నేహితులు వీడియో రికార్డు చేశారని చెప్పి భయపెట్టాడు. అవి డిలీట్ చేయడానికి ఇద్దరం కలిసి మాట్లాడ దామని చెప్పి ఎల్బీనగర్కు రప్పించాడు. అక్కడి ఓయో రాజ్స్టే లాడ్డిలో రూమ్ బుక్ చేసి బాలికను తీసుకువెళ్లాడు. అక్కడ మరో సారి ఆమెకు మద్యం తాగించి అత్యాచారం చేశాడు. మరో ఇద్దరు స్నేహితులైన బీఈఎల్కు చెందిన బీఫార్మసీ విద్యార్థి సాయి చైతన్య (20), బీబీఏ విద్యార్థి శౌర్యలను (20) అక్కడకు పిలిచాడు. మద్యం మత్తులో ఉన్న బాలికపై వీళ్లూ అత్యాచారానికి పాల్పడ్డారు. మరుసటి రోజు తెల్లవారుజామున బాలికను ఆమె ఇంటి సమీపంలో వదిలి వచ్చారు. ఈ ఉదంతం మార్చి 3న చోటు చేసుకుంది. మానసిక వైద్యుడి కౌన్సెలింగ్తో... రెండుసార్లు సామూహిక అత్యాచారానికి గురైన బాలిక తీవ్ర షాక్కు లోనైంది. అర్ధరాత్రి దాటే వరకు బయట ఉండి వచ్చిన ఆమెను తల్లిదండ్రులు మందలించడంతో ముభావంగా ఉంటూ తరచూ భయ పడుతోంది. బాలికలో వచ్చిన మార్పుల్ని గమనించిన తల్లిదండ్రులు ఓ మానసిక వైద్యుడి వద్దకు తీసుకువెళ్లారు. కొన్ని రోజుల పాటు ఆయన కౌన్సెలింగ్ చేయడంతో నోరు విప్పిన బాలిక తనపై జరిగిన అఘాయి త్యాలను బయటపెట్టింది. బాలిక తండ్రి గత నెల 30న కార్ఖానా ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. నిందితులుగా ఆ ఇద్దరూ సైతం... ఈ కేసు దర్యాప్తు చేపట్టిన ఇన్స్పెక్టర్ బి.రవీందర్ నేతృత్వంలోని బృందం ఇద్దరు మైనర్ల సహా ముగ్గురు నిందితులను ఈ నెల 1న పట్టుకున్నారు. మరుసటి రోజు మేజర్లను జైలుకు, మైనర్లను జువెనైల్ హోమ్కు తరలించారు. బాలికను తీసుకెళ్ల డానికి వినియోగించిన రిషిత్ కారును స్వాధీనం చేసుకున్నారు. అలాగే సింధూర హోటల్ యజమాని రాహుల్, ఓయో రాజ్ స్టే యజమాని హరీశ్ను కూడా నిందితు లుగా చేర్చారు. ఈ అత్యాచారాలను పరో క్షంగా ప్రేరేపించినట్లు వారిపై ఆరోపణలు నమోదు చేశామని ఇన్స్పెక్టర్ తెలిపారు. చదవండి: బంధువుతో వివాహేతర సంబంధం.. దీని గురించి మాట్లాడేందుకు భర్త వెళ్లి.. -
పోలీసుల 'లిమిట్' లొల్లి.. నలుగురు మృతి
హైదరాబాద్: పోలీసుల నిర్లక్ష్యం నలుగురు అమాయకుల ప్రాణాలు పోవడానికి కారణమైంది. చావుబతుకుల్లో ఉన్న వారిని కాపాడాల్సిందిపోయి పరిధుల పంచాయతీ పెట్టడంతో ముగ్గురు చిన్నారులతో సహా నలుగురి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. రాజధాని నగరంలోని తిరుమలగిరిలో ఆర్టీఏ ఆఫీసు ఎదురుగా గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాద ఘటనలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. ప్రమాద సమాచారం తెలిసినా పట్టించుకోని పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 40 నిమిషాల దాకా పోలీసులు ఘటనా స్థలానికి రాలేదని మృతుల బంధువులు ఆరోపిస్తున్నారు. ఎవరికి వారు తమ పరిధిలోకి రాదంటూ కార్ఖానా, తిరుమలగిరి పోలీసులు తాత్సారం చేశారని వాపోయారు. 'గురువారం రాత్రి 10.30 గంటల ప్రాంతంలో దుర్ఘటన జరిగింది. ఫోన్ చేస్తే పోలీసులు స్పందించలేదు. పబ్లిక్ కూడా సహాయం చేయలేదు. అటువైపు వచ్చిన మంత్రి కేటీఆర్ తన కాన్వాయ్ లోని వాహనంలో క్షతగాత్రులను సమీపంలోని తరలించార'ని మృతుడి తరపు బంధువొకరు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే తన సోదరుడు ఫోన్ చేసి కాపాడాలని అభ్యర్థించాడని మృతుడు అజార్ సోదరి తెలిపింది. ఫోన్ చేసి చచ్చిపోయాడని కన్నీటిపర్యంతమయింది. సంబంధిత వార్త: నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం -
‘పెళ్లి క్యాన్సిల్ చేసుకుని.. నాతో రా’...
హైదరాబాద్: పెళ్లిని రద్దు చేసుకొని తనతో రావాలని ఓ యువకుడు తన స్నేహితులతో కలిసి యువతి ఇంటి వద్ద హల్చల్ చేశాడు. ఈ సంఘటన కార్ఖానా పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. ఈ సంఘటనకు కారకులైన ముగ్గురు యువకులపై నిర్భయ కేసును నమోదు చేశారు. ఎస్ఐ విజేయందర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గన్రాక్ ప్రాంతానికి చెందిన యువతి(18) ఇంటికి గురువారం రాత్రి అమీర్పేట్ ప్రాంతానికి చెందిన ఆజాద్(23), వంశీ(24) వేణుగోపాల్(23)లు వెళ్లారు. శనివారం జరగబోయే ఆమె వివాహన్ని రద్దు చేసుకుని తనను పెళ్లి చేసుకోవాలని ఆజాద్ తన స్నేహితులతో కలిసి గొడవపడ్డాడు. అడ్డు చెప్పిన కుటుంబ సభ్యులతో ఈ ముగ్గురు వాగ్వివాదానికి దిగారు. భయాందోళనకు గురైన యువతి కుటుంబ సభ్యులు కార్ఖానా పీఎస్లో ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనపై శుక్రవారం నిర్భయ చట్టం కింద కేసును నమోదు చేసుకున్న పోలీసులు ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.