breaking news
karate thiagarajan
-
పార్టీ ఖాయం!
సాక్షి, చెన్నై : తలైవా కొత్త పార్టీ ఖాయం అని, అయితే, ఎన్నికల ముందుగా ఆ ప్రకటన ఉంటుందని కాంగ్రెస్ నేత కరాటే త్యాగరాజన్ వ్యాఖ్యానించారు. కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, సీనియర్ నేత చిదంబరం మద్దతుదారుడిగా ఉన్న కరాటే రజనీ కాంత్తో భేటీ కావడం చర్చకు దారితీసింది. అదే సమయంలో రజనీ రాజకీయ ప్రవేశంపై విమర్శలు వద్దు అని రాజకీయ పక్షాలకు ఆయన హితవు పలకడం గమనార్హం.రాజకీయ ప్రకటన చేసిన ఐదు నెలలు పూర్తి అయినా, ఇంతవరకు పార్టీ ఊసెత్తకుండా ఆధ్యాత్మిక, విదేశీ పర్యటనలు, సినిమా షూటింగ్ల్లో తలైవా రజనీకాంత్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఆయన ప్రజల్లోకి వచ్చినప్పుడలా సంచలన వ్యాఖ్యలు చేసి వెళ్తున్నా, ఆయన పార్టీ రూపు రేఖలు ఎలా ఉంటాయో అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొనింది. ఈ పరిస్థితుల్లో ఆదివారం రజనీ కాంత్తో దక్షిణ చెన్నై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, చిదంబరం మద్దతు నేతగా ముద్రపడ్డ కరాటే త్యా గరాజన్ భేటీ అయ్యారు. దీంతో రజనీ పార్టీలో ఆయన చేరుతారా..? అన్న ప్రచారం ఓ వైపు ఉంటే, మరోవైపు కాంగ్రెస్ వర్గాలతోనూ రజనీకి దగ్గరి సంబంధాలు ఉన్నాయని చాటుకునే ప్రయత్నాలు జరుగుతున్నా యా..? అన్న ప్రశ్న బయలు దేరింది. అయితే, భేటీలో రాజకీయాలూ ఉన్నాయని, తమ సంప్రదింపులు కొత్తేమీ కాదు అని కరాటే త్యాగరాజన్ వ్యాఖ్యానించడం గమనార్హం. సరికొత్తగా రావడం ఖాయం ఉదయం పోయెస్ గార్డెన్లో గంటపాటు రజనీ కాంత్తో కరాటే త్యాగరాజన్ భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, రజనీకాంత్ను తా నేమీ కొత్తగా సంప్రదించలేదన్నారు. పదేపదే ఆయ న్ను కలుస్తున్నానని, రాజకీయాలు చర్చించుకుంటా మని వివరించారు. ముఫ్పై సంవత్సరాలుగా తనకు రజనీకాంత్ తెలుసు అని వ్యాఖ్యానించారు. ఆయన 1996లోనే రాజకీయాల్లోకి వచ్చి ఉండాలన్నారు. అయితే, ఆలస్యంగానైనా ఈ సమయంలో రావడం ఆహ్వానించదగ్గ విషయంగా పేర్కొన్నారు. గతంలో చిదంబరం పుస్తకావిష్కరణ సమయంలో రజనీకాంత్ను రాజకీయాల్లోకి రావాలని స్వయంగా కరుణానిధి వంటి నాయకుడు ఆహ్వానించారన్నారు. దివంగత సీఎం జయలలిత సైతం రజనీకాంత్ సమర్థవంతంగా రాణించగలరని అంగీకరించారని వ్యాఖ్యానించారు. తెలియనివారే విమర్శిస్తారు రజనీకాంత్ గురించి, రాజకీయాల గురించి తెలియ ని వాళ్లంతా ఆయన్ను విమర్శిస్తారని కరాటే త్యాగరాజన్ అన్నారు. జయలలిత మరణం, శశికళ జైలు జీవితం అనంతరమే దినకరన్ లాంటి వాళ్లు రాజకీయాలు చేయడం మొదలెట్టారని ఎద్దేవా చేశారు. దశాబ్దాల తరబడి రాజకీయాలను నిశితంగా పరిశీ లిస్తున్న రజనీకాంత్ ఇక, మున్ముందు రాణిస్తారనే న మ్మకం ఉందన్నారు. సరికొత్త పార్టీతో ఆయన రావ డం ఖాయం అని, అయితే, అది ఎన్నికలకు ఆరు నెలలకు ముందే ప్రకటిస్తారన్నారు. అంతవరకు వేచి చూడాల్సిందేనని త్యాగరాజన్ వ్యాఖ్యానించారు. -
నేనే సిఫారసు చేశా!
చెన్నై: మైలాపూర్ అభ్యర్థిగా కరాటే త్యాగరాజన్ ఎంపికకు తానే సిఫారసు చేసినట్టు కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఖుష్బూ ట్వీట్ చేశారు. డీఎంకే నుంచి కాంగ్రెస్లో చేరిన సినీ నటి కుష్భుకు అధికార ప్రతినిధి పదవి దక్కిన విషయం తెలిసిందే. ఈ సారి ఎన్నికల బరిలో దిగాలని ఖుష్బూ భావించారు. కాంగ్రెస్కు మైలాపూర్ను డీఎంకే కేటాయించడంతో ఆ స్థానం నుంచి పోటీచేయాలని ఆమె భావించినట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఇందుకు తగ్గ ప్రయత్నాల్లో ఉన్నట్టుగా ప్రచారం సాగింది. అయితే, ఆ స్థానం తనకే అన్న దీమాతో ఇప్పటికే ప్రచారంలో కాంగ్రెస్ సీనియర్ నేత పి చిదంబరం మద్దతు ఉన్న నాయకుడు కరాటే త్యాగరాజన్ ఉరకలు తీస్తున్నారు. అదే సమయంలో టీఎన్సీసీ మాజీ అధ్యక్షుడు తంగబాలు సైతం పోటీ పడ్డారు. అయితే, ఆ నియోజకవర్గంలో అన్నాడిఎంకే అభ్యర్థిగా మాజీ డీజీపీ రేసులో ఉండటంతో ఆయన్ను ఢీ కొట్టేందుకు బలమైన వ్యక్తిగా కరాటే త్యాగరాజన్ను కాంగ్రెస్ అధిష్టానం ఎంపిక చేసింది. దీంతో ఖుష్బూ ఢీలా పడ్డట్టుగా సంకేతాలు వెలువడ్డాయి. తనపై వస్తున్న వార్తలపై ఆమె ట్విటర్ ద్వారా స్పందించారు. ఎవరెవరో ఏదెదో అంటున్నారని, తన మదిలో ఉన్నది మాత్రం ఒక్కటే ఎన్నికలకు దూరంగా ఉంటానని ఆమె పేర్కొన్నారు. మైలాపూర్ అభ్యర్థిగా కరాటే త్యాగరాజన్ పేరును సిఫారసు చేసింది తానేనని ఆమె పేర్కొనడం గమనార్హం. ఊహించి ఏదేదో చెప్పేస్తున్నారని, రాసేస్తున్నారని.. మైలాపూర్ సీటుకు కరాటే త్యాగరాజన్ అర్హుడని సీనియర్ నేత తంగబాలు వద్ద పట్టుబట్టి మరీ ఆ పేరును సిఫారసు చేసిన కమిటీలో తానూ ఉన్నట్లు ఆమె వెల్లడించారు. ఇక, తనకు సీటు రావడంతో రాయపురం కాంగ్రెస్ అభ్యర్థి రాయపురం మనో... ఖుష్బూకు కృతజ్ఞత పూర్వకంగా కలిశారు. అలాగే, తన నియోజకవర్గంలో ప్రచారం చేపట్టాలని ఖుష్బూను ఆయన కోరారు.